28న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకే.. | Sakshi
Sakshi News home page

28న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకే..

Published Tue, Mar 26 2024 1:05 AM

-

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి 2021లో ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కల్వకుర్తి శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి.. గెలుపొందడంతో కసిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉపఎన్నిక రాగా.. ఈ నెల 28న పోలింగ్‌ జరగనుంది. అప్పటివరకు ఓటర్లు గోవా, ఊటీ, కొడైకెనాల్‌, ఏపీ, కర్ణాటకలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లోనే ఉండనున్నారు. 27వ తేదీ రాత్రి వీరిని క్యాంప్‌ల నుంచి బయలు దేరి.. 28న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా ఆయా పార్టీలు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement