మంచికే పట్టం | Sakshi
Sakshi News home page

మంచికే పట్టం

Published Thu, Mar 28 2024 1:35 AM

- - Sakshi

రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్య మంత్రులుగా పాలన అందించారు. పుట్టిన పాపాయి నుంచి పండుటాకుల వరకు మంచి చేసిన, చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు మనకు అవసరం. విద్య, వైద్యం, ఉపాధి, ఇంటి వద్దకే పాలన అందించడం చాలా ముఖ్యం. అలాంటి వారినే మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం.

– పి.సుజనిత, మచిలీపట్నం

వారే అధికారంలోకి రావాలి

విద్య, ఉపాధితో పాటు సంక్షేమ పథకాల అమలును యువత కోరుకుటోంది. ఎన్నికల ముందు మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన నాయకులను నమ్మలేం. ఏదైనా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, తప్పకుండా ఆచరించిన వారే మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కచ్చితంగా బాగుపడుతుంది.

– గొరిపర్తి లోకేష్‌ కుమార్‌,

మచిలీపట్నం

Advertisement
Advertisement