‘అల్ఫోర్స్‌’లో మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ టెస్ట్‌ | Sakshi
Sakshi News home page

‘అల్ఫోర్స్‌’లో మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ టెస్ట్‌

Published Mon, Dec 18 2023 12:18 AM

పరీక్షను పర్యవేక్షిస్తున్న విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి - Sakshi

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లోని అల్ఫోర్స్‌ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అల్ఫోర్స్‌ మ్యాఽథ్స్‌ ఒలింపియాడ్‌ టెస్ట్‌కు స్పందన లభించింది. విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ చిత్రపటానికి నివాళి అర్పించి, ప్రశ్నాపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో 6 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షకు 12,600 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. రామానుజన్‌ సేవలు స్ఫూర్తిదాయకమవి, చిన్న వయసులోనే గణిత శాస్త్రంపై పట్టు సాధించి, అనతికాలంలోనే అద్భుతాలు సృష్టించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement