జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆరోగ్య శ్రీ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, సుహాసిని, జిల్లా వైద్యాధికారి ప్రశాంత్తో కలిసి ఆయన ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడారు. పేదలకు ఆర్థిక ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అనంతనం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, ఎంపీపీ మేకల కలింగరాజు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధ, ఆర్టీసీ డీఎం జోత్స్న, ఎకై ్సజ్ జిల్లా సూపరింటెండెంట్ కృష్ణప్రియ, జిల్లా అధికారులు రోజారాణి, జయంతి, నాయకులు ప్రశాంత్రెడ్డి, సుధాకర్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణనాయక్, రాములు, మల్లారెడ్డి, జయ, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో
ప్రారంభించిన కలెక్టర్ శివలింగయ్య