
పీహెచ్సీలను శుభ్రంగా ఉంచాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య
ఎంజీఎం/హసన్పర్తి : జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంతో పాటు లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణం శుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలని సూచించారు. అదేవిధంగా టీబీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు. హసన్పర్తి మండల కేంద్రంలోని దళితవాడ పాఠశాలలో టీబీ టెస్ట్లు నిర్వహించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజాహైదర్, హెల్త్ సూపర్వైజర్ బాబు, ఎంజీఎం సూపర్వైజర్ నర్మద, విప్లవకుమార్, టీబీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు, టెక్నీషియన్ అయ్యుతరావు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్, నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.