Sakshi News home page

కర్ణాటక మద్యం సీజ్‌.. నిందితుడి అరెస్టు

Published Fri, Nov 17 2023 1:28 AM

-

చిత్తూరు అర్బన్‌: కర్ణాటక మద్యం కలిగి ఉన్న కె. సుందరేష్‌ అనే నిందితుడ్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) చిత్తూరు రూరల్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బంగారుపాళెం మండలం టేకుమంద గ్రామంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పంద్యాలమడు గు చెందిన సుందరేషన్‌ ఓ ద్విచక్రవాహనంలో సంచితో వెళుతుండగా ఆపి, తనిఖీ చేశారు. ఈ సంచిలో 130 కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనం సీజ్‌ చేసి, నిందితుడ్ని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

What’s your opinion

Advertisement