Sakshi News home page

నీరు, నీడ సౌకర్యం కల్పించాలి

Published Tue, Apr 16 2024 12:30 AM

 ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ విద్యాచందన - Sakshi

ఇల్లెందురూరల్‌: ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీరు, నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలను విధిగా కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డీఆర్‌డీఓ పీడీ విద్యాచందన ఆదేశించారు. మండంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీలో సోమవారం ఆమె ఉపాధి పనులను పరిశీలించి మాట్లాడారు. కూలీలు వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుదిమళ్ళ, సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీలలో నర్సరీలను పరిశీలించి, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీఓ ధన్‌సింగ్‌, ఎంపీఓ చిరంజీవి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీఓ శంకర్‌, పంచాయతీ కార్యదర్శులు అజహర్‌, రజినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement