Sakshi News home page

న్యాయమూర్తి నీరజకు సన్మానం

Published Thu, Nov 16 2023 12:36 AM

జ్జడి నీలిమ, ఏఓ అనితను సన్మానిస్తున్న ప్రధాన న్యాయమూర్తి వసంత్‌, న్యాయవాదులు, ఉద్యోగులు - Sakshi

కొత్తగూడెంటౌన్‌: అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తూ పదోన్నతిపై కరీంనగర్‌కు జిల్లా జడ్జిగా వెళ్తున్న ఏ.నీరజను కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌వసంత్‌ ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. జడ్జి నీరజ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ మక్కడ్‌, సంయుక్త కార్యదర్శి కాసాని రమేష్‌, ప్రధాన కార్యదర్శి రావిలాల రామారావు, ఉపాధ్యక్షుడు దుండ్ర రమేష్‌, కోశాధికారి సాహూ సంతోష్‌లాల్‌, మహిళా ప్రతినిధి ఏ.మనోరమ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీడీ లక్ష్మి, లావణ్య, న్యాయవాదులు అనుబ్రోలు రాంప్రసాద్‌, లక్కినేని సత్యనారాయణ, జి.శాంత, జి.కాంతయ్య, ఎ.మహాలక్ష్మి, నల్లమల్ల ప్రతిభ, జి.శిరీష, రామస్వేత, సాహితి రాజు పాల్గొన్నారు.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు..

బదిలీపై వెళ్తున్న కొత్తగూడెం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గడ్డం అనితావాణిని న్యాయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్‌ వసంత్‌, న్యాయమూర్తులు జి.భానుమతి, ఎ.సుచరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాంశెట్టి రమేష్‌, ప్రధాన కార్యదర్శి డీకొండ రవికుమార్‌, కోశాధికారి లగడపాటి సురేష్‌, నిమ్మల మల్లికార్జున్‌, మీనాకుమారి, ప్రమీల, శ్రీరంగం రామకృష్ణ, సత్యనారాయణ, రాజేందర్‌ , మహేష్‌, న్యాయవాదుల గుమాస్తాల సంఘం అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement