నందలూరు(రాజంపేట): బుధవారం విడుదలైన ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్టు సర్వీసెస్) ఫలితాల్లో నందలూరు మండల నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలోని గొల్లపల్లెకు చెందిన గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ జాతీయ స్థాయిలో 52వ ర్యాంకు సాధించారు. రెండు వారాల క్రితం విడుదలైన సివిల్స్లో కూడా శ్రీవాస్తవ 444వ ర్యాంకు సాధించాడు. 2023లో గ్రూప్–1లో జిల్లా రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు.
భార్యపై భర్త కత్తితో దాడి
మదనపల్లె : భార్యపై భర్త కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. ప్రకాశం జిల్లా, పామూరు, బట్లగూడూరుకు చెందిన పి.శిరీష(25)కు నెల్లూరు గరిమానుపెంటకు చెందిన మధుతో పదేళ్ల కిందట వివాహమైంది. ఏడేళ్ల కిందట మదనపల్లె పట్టణానికి వచ్చి పప్పిరెడ్డిగారిపల్లెలోని షటిల్ కోర్ట్ సమీపంలో నివాసముంటున్నారు. మధు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండగా శిరీష కూలి పనులకు వెళుతుంది.వీరికి నవదీప్(7), నందకుమార్(6) సంతానం. ఇటీవల భార్యపై అనుమానంతో మధు తగొడవపడేవారు. బుధవారం మధు పనులకు వెళ్లి అనంతరం ఇంటికి రాగా, భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించి ఆగ్రహానికి లోనై ఆమైపె కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరొకరితో సన్నిహితంగా ఉన్నందునే దాడి చేసినట్లు నస్థానికులు పోలీసులకు తెలిపారు.