విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానుల కేరింతల ముందు సాగర ఘోష చిన్నబోయింది. వాంఖడే మైదానంలో సిక్సర్లు, ఫోర్ల మోత మోగుతుంటే.. తీరంలో అభిమానుల కోలాహలం అంబరాన్ని తాకింది. క్రికెట్ అభిమానులతో విశాఖ తీరం జనసంద్రంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ను చివరి వరకు తనివితీరా ఆస్వాదించారు. భారత్–న్యూజిలాండ్ల మధ్య బుధవారం జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ను ఆర్కే బీచ్లో ఆంధ్రా క్రికెట్ సంఘం భారీ స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం చేసింది. తొలిసారిగా అభిమానుల ప్రాంగణం పేరిట ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఫ్లడ్లైట్లతో పాటు అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక టెంట్లు, ఫుడ్కోర్టులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కేరళ సంప్రదాయ వాయిద్య బృందాలను ఏర్పాటు చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఇంతమంది మధ్య మ్యాచ్ చూస్తే.. మైదానంలో మ్యాచ్ను చూసిన ఫీల్ కలిగిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ 50వ శతకం పూర్తి చేసిన సందర్భంలో అయితే కింగ్ కోహ్లీ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. భారత్ జట్టు అఖండ విజయం సాధించి ఫైనల్కు చేరడంతో విశాఖ నగర ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఎగసిన అభిమానం
Published Thu, Nov 16 2023 1:02 AM
1/2
2/2
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement