-
ఓటేశారు..
12,41,135 మంది● ఖమ్మం, కొత్తగూడెంలో తక్కువగా పోలింగ్ ● పాలేరులో అత్యధికంగా 83.77 శాతం నమోదుసాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 76.09 శాతం పోలింగ్ నమోదైంది. 7,87,160 మంది పురుషులకు.. 6,05,969 మంది, 8,43,749 మంది మహిళలకు 6,35,099 మంది ఓటు వేశా రు. సంఖ్యాపరంగా మహిళలే ఎక్కు వ మంది ఓటు వేసినా.. శాతంలో లెక్కిస్తే పురుషులు 76.98 శాతం, మహిళలు 75.27 శాతం మంది మాత్రమే ఉండడం గమనార్హం. పాలేరులో అత్యధికంగా.. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,40,806 మంది ఓటర్లకు గాను 2,01,721 మంది ఓటు వేశారు. అంటే 83.77 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే ఖమ్మంలో 62.97 శాతం, కొత్తగూడెంలో 69.47 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం ఖమ్మం 3,24,073 2,04,078 62.97 పాలేరు 2,40,806 2,01,721 83.77 మధిర 2,22,160 1,81,815 81.84 వైరా 1,93,389 1,56,762 81.06 సత్తుపల్లి 2,43,943 1,95,979 80.34 కొత్తగూడెం 2,47,494 1,71,928 69.47 అశ్వారావుపేట 1,59,174 1,28,852 80.95మొత్తం 16,31,039 12,41,135 76.09 -
మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ సక్సెస్
భద్రాచలం/మణుగూరు రూరల్: భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సెక్టార్ల వారీగా అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోమవారం రాత్రి భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపర్చిన పోలింగ్ సామగ్రి రూంను, మణుగూరు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో 176 పోలింగ్ స్టేషన్లలో సెక్టార్ల వారీగా పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగిందన్నారు. మారుమూల సమస్యాత్మక మండలాలైన చర్ల, దుమ్ముగూడెంలలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ప్రత్యేక పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాల సెక్యూరిటీతో పోలింగ్ సామగ్రిని ముందుగానే తరలించినట్లు తెలిపారు. 176 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 25 మంది సెక్టార్ అధికారులు, 120 మంది మైక్రో అబ్జర్వర్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, పోలింగ్ సిబ్బంది.. మొత్తం 844 మంది సమర్థంగా పనిచేశారని పేర్కొన్నారు. మణగూరు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపర్చిన పోలింగ్ సామగ్రిని భద్రత నడుమ మహబూబాబాద్ స్ట్రాంగ్ రూమ్కు చేరవేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ, ఏఆర్ఓ ప్రతీక్జైన్ మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ ముగియగానే పోలింగ్ సామగ్రి స్ట్రాంగ్ రూమ్కు చేర్చినట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని 250 కేంద్రాల్లో పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించామని తెలిపారు. మారుమూల ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాల నుంచి పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ సామగ్రి స్ట్రాంగ్ రూమ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డీఓ దామోదర్రావు, అధికారులు డేవిడ్రాజు, మణెమ్మ, భాస్కర్, సురేష్బాబు, రమణయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, రాఘవరెడ్డి, సిబ్బంది నాగరాజు, కృష్ణ, మహిధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రియాంక ఆల -
తగ్గిన ఓటింగ్..
జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం వివరాలు నియోజకవర్గం అసెంబ్లీ పార్లమెంట్ పినపాక 79.55 69.40 ఇల్లెందు 79.32 70.48 కొత్తగూడెం 76.56 69.47 అశ్వారావుపేట 78.36 80.95 భద్రాచలం 78.66 69.02 మొత్తం 79.00 71.86సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంలో ఓటర్ల ఉత్సాహం తగ్గింది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 79 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అది 71.86 శాతానికే పరిమితమైంది. పేటలో పెరిగింది.. జిల్లాలో కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉండగా, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో పినపాక, భద్రాచలం, ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే అశ్వారావుపేట మినహాయిస్తే మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. పినపాక, ఇల్లెందు, భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంచుమించుగా ప్రతీ నియోజకవర్గంలో తొమ్మిది నుంచి పది శాతం వరకు తక్కువ ఓటింగ్ నమోదైంది. కొత్తగూడెంలో ఆరు శాతం తగ్గింది. అశ్వారావుపేటలో మాత్రం మూడు శాతం వరకు ఓటింగ్ పెరిగింది. ‘కోట’లో తగ్గింది.. మానుకోట స్థానం నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ మినహా మిగిలిన బీఆర్ఎస్, బీజేపీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు భద్రాద్రి జిల్లాలో ఉన్న ఇల్లెందు, పినపాక, భద్రాచలంలో ఆశించిన స్థాయిలో ప్రచారం చేపట్టలేదు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ చుట్టపు చూపు ప్రచారానికే పరిమితమయ్యారు. ఆయన తరఫున ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా భద్రాద్రి జిల్లాలో ప్రచారంపై దృష్టి పెట్టలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత తరఫున కూడా స్టార్ క్యాంపెయినర్లు ఇటువైపు రాలేదు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావే ప్రధానంగా ప్రచార భారాన్ని భుజాలకెత్తుకున్నారు. దీంతో మానుకోట పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఆశించిన స్థాయిలో ఊపు రాలేదు. దాని ప్రభావం వల్లే మానుకోట పరిధిలో ఉన్న మూడు స్థానాల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ తాజా పార్లమెంట్ ఎన్నికల్లో 72 శాతమే.. అశ్వారావుపేట అసెంబ్లీ పరిధిలో పెరుగుదల మహబూబాబాద్ స్థానంలో వెనక్కి తగ్గిన ఓటర్లు ఓటింగ్ శాతంపై కనిపించిన ప్రచార ప్రభావం ఖమ్మంపైనే దృష్టి.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనరల్ స్థానం కింద ఉన్న ఖమ్మంపైనే అన్ని పార్టీల్లోని స్థానిక నాయకత్వం ఎక్కువగా దృష్టి సారించింది. ఫలితంగా మహబూబాబాద్ పరిధిలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాకలలో ఓటింగ్ శాతం తగ్గగా అశ్వారావుపేటలో పోలింగ్ శాతం పెరిగింది. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న కొత్తగూడెంలో పోలింగ్ శాతం తగ్గుదల, మిగిలిన గ్రామీణ నియోజకవర్గాలతో పోల్చితే తక్కువగా నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు రామసహాయం రఘురాంరెడ్డి, నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్రావులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. పైగా వీరి గెలుపు కోసం కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి మొదలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కింది స్థాయి కేడర్ సైతం అహర్నిశలు శ్రమించారు. బీఆర్ఎస్ తరఫున మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ తరఫున జేపీ నడ్డాలు ప్రచారం కూడా నిర్వహించారు. ఇలా అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల పరంగా జోష్ కనిపించింది. దాని ఫలితం బ్యాలెట్లోనూ కనిపించింది. -
‘మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా’
ఖమ్మంవన్టౌన్: ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఓటర్ల చైతన్యం సోమవారం పోలింగ్తో స్పష్టమైందని, 75.19 శాతంతో ఖమ్మం రాష్ట్రంలోనే మేటిగా నిలవడం గొప్ప పరిణామమని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఇందులో తాను భాగస్వామి ని అయినందుకు గర్వపడుతున్నానని, కాంగ్రెస్ పార్టీని అజేయశక్తిగా నిలిపేందుకు శ్రమించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, మాలోత్ రాందాస్నాయక్, కూనంనేని సాంబశివరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, టీడీపీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తనపై కురిపించిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటానని, ఈ ఎన్నికల సాక్షిగా పెనవేసుకున్న బంధాన్ని జీవితకాలం పాటు కొనసాగిస్తానని రఘురాంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
అడవిపంది దాడిలో వ్యక్తికి గాయాలు
గుండాల: తునికాకు కట్టలకు కట్ల(నార) కోసం అడవికి వెళ్లిన ఓ వ్యక్తిపై అడవిపంది దాడిచేసిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. తునికాకు కట్టలు కట్టేందుకు నార అసరం కావడంతో ఆళ్లపల్లి మండలంలోని లొద్దిగూడెం గ్రామానికి చెందిన పాయం లక్ష్మీనారాయణ స్థానికులతో కలిసి అడవికి వెళ్లాడు. ఈక్రమంలో పొదలమాటున ఉన్న పంది అతడిపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని స్థానిక వైద్యుల వద్దకు తీసువచ్చి చికిత్స అందించారు. మహిళ మెడలో గొలుసు చోరీఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్లో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు నరేట్ల ప్రమీల కథనం ప్రకారం.. మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ గిరిజన గురుకుల కళాశాల వీధికి చెందిన ప్రమీల ఉదయం ఏడు గంటల సమయంలో ఆరుబయిట వాకింగ్ చేస్తోంది. అదే సమయంలో ముఖానికి తెల్లటి రుమాలు కట్టుకున్న వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి ఆమె మెడలోని 2.50 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఈ ఘటనతో షాక్కు గురైన మహిళ తేరుకునేలోపు చోరీకి పాల్పడిన వ్యక్తి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతిగుండాల: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. తునికబండల గ్రామానికి చెందిన ఈసం రమ్య (20) ఇటీవలే ఇంటర్ పూర్తి చేయగా మంగళవారం ఉయదం కంప్యూటర్ కోచింగ్ కోసం కొత్తగూడెం వెళ్లాల్సి ఉంది. కాగా కుటుంబ సభ్యులు ఉదయాన్నే రమ్యను నిద్ర లేపుతుండగా నోట్లో నురగ వచ్చి అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆళ్లపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
అధికారులపై చర్య తీసుకోవాలి
ఖమ్మంసహకారనగర్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సజావుగా ఎన్నికల విధులు నిర్వ హించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జీ చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీపీటీఎఫ్ బాధ్యులు వై.అశోక్కుమార్, పి.నాగిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. రాష్ట్రంలో ఒకేవిధంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై పోలీసులు అసహనంగా లాఠీచార్జ్ చేశారన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తారని చెప్పిన అధికారులే ఎన్నికలు ముగిసిన తర్వాత సరైన రెమ్యునరేషన్ ఇవ్వకుండా పోలీసులతో బలప్రయోగం చేయించడం అత్యంత బాధాకరమన్నారు. ఐదు రోజుల రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఈ ఘటనకు బాధ్యులైన ఆర్డీఓ తదితర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సీబీఎస్ఈలో సత్త్తాచాటిన విద్యార్థులు
భద్రాచలంటౌన్: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ఏకలవ్య మోడల్ పాఠశాలల విద్యార్థినులు సత్తా చాటారు. ఈ నెల 13న విడుదలైన టెన్త్ సీబీఎస్ఈ ఫలితాల్లో 415 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 విద్యాలయాలకు (ఖమ్మం–1, భద్రాద్రి కొత్తగూడెం–7)గాను 6 విద్యాలయాలు (ఈఎంఆర్ఎస్, గండుగులపల్లి, చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, టేకులపల్లి, గుండాల) వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఈఎంఆర్ఎస్, సింగరేణి విద్యార్థి భూక్య రామ్చరణ్ 500 మార్కులను గాను 447 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. దీంతో భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా అభినందనలు తెలిపారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఎనిమిది ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీఎస్ఈ సిలబస్ బోధనలో ఇంటర్ మొదటి సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. 2023 – 24 విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈనెల 18వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో బాలికలకు గండుగులపల్లి, పాల్వంచ, గుండాల, బాలురకు టేకులపల్లి, దుమ్ముగూడెం, చర్ల, ములకలపల్లి, సింగరేణి కళాశాలల్లో వివిధ గ్రూపుల్లో సీట్లు ఉన్నాయని వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఎంచుకున్న ఈఎంఆర్ఎస్ విద్యాలయాలలో దరఖాస్తులు అందజేయాలని, పదో తరగతిలో సీజీపీఏ, సీబీఎస్ఈ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకు గాను ఈనెల 22న చర్ల విద్యాలయంలో కౌన్సిలింగ్ ఉంటుందని పీఓ తెలిపారు. వెనుదిరిగిన పోలీస్ బలగాలు చర్ల: పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సరిహద్దు నుంచి పోలీస్ బలగాలు వెనుదిరిగాయి. వారం రోజుల కిందట సరిహద్దు ప్రాంతానికి భారీగా చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించగా, సోమవారం సాయంత్రం పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బలగాలు అడవిని వీడుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలోని పూసుగుప్ప, చెన్నాపురం, ఎర్రంపా డు, బత్తినపల్లి, పులిగుండాల, కుర్నపల్లి, బోదనెల్లి తదితర గ్రామాల సమీపాల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్రాజ్ ఆదేశాల తో ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఓఎస్డీ సాయిమనోహర్ నేతృత్వంలో సరిహద్దులో భారీగా బలగాలు మోహరించాయి. ఆదివాసీలకు ఎన్నికలపై అవగాహన కల్పించి వారిని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసేలా ప్రోత్సహించారు. ఉచితంగా ‘నర్సింగ్’ శిక్షణఇల్లెందు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతుల కోసం ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ, హెచ్ఎస్బీసీ సహకారంతో హైదరాబాద్లోని ప్రథమ్ హెల్త్ కేర్ శిక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రథమ్ ఎడ్యుకేషన్ పౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సరిత సింగు మంగళవారం తెలిపారు. శిక్షణ పూర్తయిన వారికి 100 శాతం ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలకు అర్హత ఆసక్తి గల గ్రామీణ/పట్టణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, నర్సింగ్ అసిస్టెంట్కు రెండు నెలలు కాలం, 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 90002 03952 నంబర్లో సంప్రదించాలని సూచించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి ఖమ్మంఅర్బన్: గుర్తు తెలియ ని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలోని బోనకల్ రోడ్డు.. ధంసలాపురం వంతెనపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వార్డు మాజీ సభ్యు డు, పెయింటర్ గుంటి దేవయ్య (50)కు ఇద్దరు కుమార్తెలుండా వారు హైదరాబాద్లో చదువుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారు సోమవారం రాగా.. మంగళవారం తెల్లవారుజామున వారిని హైదరాబాద్ పంపించేందుకు ద్విచక్రవాహనంపై ఖమ్మం వచ్చాడు. వారిని బస్సు ఎక్కించి తిరిగి రామకృష్ణాపురం వస్తున్న ఆయన ద్విచక్రవాహనం బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆయన్ని ప్రభుత్వాస్పత్రికి త రలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మ ధ్యాహ్నం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మంఅర్బన్ పోలీసులు కేసు నమోదుచేసి ద ర్యాప్తు చేస్తున్నారు. కాగా, కూతుర్లకు టాటా చెప్పి న కొద్ది సమయంలోనే ఆయన మృతిచెందటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
చికిత్స పొందుతున్న వ్యక్తి...
అశ్వారావుపేటరూరల్: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందు తూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. ఏపీ లోని తిరుపతి ప్రాంతానికి చెందిన గుజరాత్ రాహుల్ (35)కు పదిహేనేళ్ల కిందట అశ్వారావుపేట మండల కేంద్రంలోని నందమూరినగర్కు చెందిన శిల్పతో వివాహమైంది. కాగా, మనస్పర్దల కారణంగా భార్య పుట్టింటికి వచ్చింది. దీంతో ఈ నెల 10వ తేదీన రాహుల్ భార్య వద్దకు వచ్చి కాపురానికి రావాలని కో రగా, ఆమె నిరాకరించడంతో బంధువులతో మాట్లాడిన తరువాత స్థానిక ఆర్టీఎస్ చెక్పోస్టు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే. గమనించిన స్థానికులు, కానిస్టేబుల్ మనోజ్ రక్షించి స్థానిక సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్న క్రమంలోనే ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనిపై మృతుడి తమ్ముడు గుజరాత్ వెంకటేశ్వరరావు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు.. ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ పంచాయతీ లలితాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో పూనెం ధన్రాజ్ (38) మంగళవారం మృతిచెందా డు. ఇంట్లో ఫ్యాన్ సరిగా తిరగడం లేదని స్వయంగా వైర్లు తొలగించి స్విచ్ ఆఫ్ చేయకుండానే బిగిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ధన్రాజ్ మృతిచెందాడు. మృతుడి తండ్రి యాదగిరి అతని చిన్నతనంలోనే మృతిచెందగా అంగన్వాడీ పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న తన తల్లి ఆదెమ్మ ఉంది. భర్తను, ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆదెమ్మ రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. ఆదెమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు మృతి
ఇల్లెందు: తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు కొలిశెట్టి రాందాస్ సోమవారం రాత్రి హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఇల్లెందులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాందాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. 1969లో నాన్ ముల్కీ ఉద్యమం, తెలంగాణ జన సమితిని స్థాపించిన సభ్యుల్లో రాందాస్ ఒకరని, మలి దశ ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో చందా చంద్రశేఖర్, ఆడెపు రాంచందర్, రాజిరెడ్డి, సిలివేరు సత్యనారాయణ, జీవీ సాగర్, ఎం.రమేశ్, అబ్దుల్ నబీ, రాచపల్లి శ్రీను, డేరంగుల పోషం, సర్దార్, పీవీ కృష్ణారావు, గిన్నారపు రాజేశ్, పాలడుగు రాజశేఖర్, నిఖిల్, రాము తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
ఖమ్మంఅర్బన్: నగరంలోని ధంసలాపురం పాతకాలనీలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎదురుపడిన పది మందిపై దాడికి దిగి గాయపరిచింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం సాయంత్రం పిచ్చికుక్క కాలనీలో పరుగులు తీస్తూ ఎదురుగా కనపడిన వారిని కరిచింది. వారంతా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామాల్లో, కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముగ్గురిపై కుక్క దాడి కామేపల్లి: మండలంలోని పండితాపురం గ్రామంలో ముగ్గురిపై ఓ కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామానికి చెందిన దుద్దుకూరి నిత్యా, తోటకూరి నాగమణి, నాలుగేళ్ల బాలుడు సురిపిన్ని పిన్నయ్పై కుక్క దాడి చేసి గాయపర్చింది. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, నిత్యం కుక్కల దాడిలో గాయాలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. -
పండితాపురంలో చోరీ
కామేపల్లి: మండలంలోని పండితాపురం గ్రా మంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జల్లి సంజయ్ రోజువారీ ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. రోజు వారీలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చోరబడి బీరువా తాళం తీసి బీరువాలో దాచిన సుమారు రూ.1.10 లక్షల నగదు. రూ.60 వేల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. తెల్లవారుజామున నిద్ర నుంచి లేచి చూడగా ఇంట్లో సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ టీం వచ్చి వేలిముద్రలను సేకరించారు. కాగా, గ్రామానికి చెందిన అంబడిపూడి వెంకటేశ్వర్లు ఇంట్లోనూ ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. కానీ, ఇంట్లో నగదు, ఆభరణాలు ఏమీ దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘ఏకలవ్య’ ప్రతిభ
ములకలపల్లి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలి తాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) 100 శాతం ఫలితాలు సాధించింది. పాఠశాలలో 41 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఏకలవ్య పాఠశాలకు మూకమామిడి ప్రాజెక్ట్ సమీపంలో పక్కా భవనాలు నిర్మిస్తుండగా, మండల పరిధిలో సరిపడా ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో, దమ్మపేట మండలం అంకంపాలెంలో తాత్కాలికంగా పాఠశాల నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రాజేశ్ అభినందించారు. దమ్మపేటలో..దమ్మపేట : మండలంలోని గండుగులపల్లి గ్రామంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉతీర్ణత నమోదైంది. ఈ పాఠశాలలో 58 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉతీర్ణులు కావడం విశేషం. టేకులపల్లిలోనూ 100 శాతం..టేకులపల్లి: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ భద్రయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పాఠశాలలో 57 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారని, మొదటి బ్యాచ్లోనే 100 శాతం ఫలితాలు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో కంట్రోల్ రూమ్ ● పర్యవేక్షించిన ఆర్ఓ, అబ్జర్వర్లు ఖమ్మం సహకారనగర్: ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ను కలెక్టరేట్ నుంచి అధికారులు పర్యవేక్షించారు. నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1,896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు అన్నిచోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. వీటి పుటేజిని కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, పోలీస్ పరిశీలకులు చరణ్జిత్ సింగ్, వ్యయ పరిశీలకులు అరుణ్ప్రసాత్ కృష్ణసామి కేంద్రాల్లో పోలింగ్ తీరును పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఎంపిక చేసిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసి, 7జీపీఏ కంటే ఎక్కువ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ మేరకు అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈనెల 15 నుండి 30వ తేదీ లోపు www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఎయిడెడ్, ఆశ్రమ, ప్రభుత్వ వసతిగృహాలు, కేజీబీవీ పాఠశాలలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, నవోదయ, ఆదర్శ పాఠశాలలు, కేంద్రియ విద్యాలయాలలో పదో తరగతి చదివి ఉత్తీర్ణులు అయిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. -
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై, రాత్రి వాతావరణం చల్లబడుతుంది. 67.29 శాతం పోలింగ్.. జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఖమ్మం పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 67.93 శాతం పోలింగ్ నమోదు కాగా, మహబూబాబాద్ పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 66.83 శాతం నమోదైంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 67.29 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో అత్యధికంగా అశ్వారావుపేట నియోజవర్గ పరిధిలో 76.67 శాతం, అత్యల్పంగా కొత్తగూడెంలో 62.31 శాతం పోలింగ్ నమోదైంది. -
పోలింగ్ కేంద్రాల సందర్శన
సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ/పాల్వంచరూరల్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల పలు పోలింగ్ కేంద్రాలను సోమవారం సందర్శించారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ మహిళా పోలింగ్ స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని, జగన్నాథపురంలో పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించవద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం పాల్వంచలోని సిల్ క్యాంపస్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన స్వీప్ సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. అనంతరం పాల్వంచ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియపై హర్షం.. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల హర్షం వ్యక్తం చేశారు. సుమారు రెండు నెలల పాటు పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ సహకారాలు, భాగస్వామ్యం మరువలేనివని పేర్కొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఓటువేసిన కలెక్టర్.. పాల్వంచ ఎన్ఎండీసీ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని పాఠశాల పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మణుగూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రతీక్జైన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ -
మొరాయించిన ఈవీఎం, వీవీప్యాట్
ఖమ్మంమయూరిసెంటర్: నగరంలోని గాంధీనగర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 300 పోలింగ్ బూత్లో ఈవీఎం, వీవీప్యాట్ మోరాయించాయి. గంట పాటు అవి పని చేయకపోవడంతో అధికారులు మరో మిషన్ను తెప్పించి, ఓటింగ్ను ప్రారంభించారు. ఉదయం 8.15 గంటల నుంచి మిషన్ మోరాయించగా, 9.15 గంటలకు సిబ్బంది మరో మిషన్ను ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్లు గంటకు పైగానే క్యూలైన్లో ఓటు వేసేందుకు వేచి ఉన్నారు. ఈవీఎం సీజ్.. కామేపల్లి : ముచ్చర్ల గ్రామంలోని 235 పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్లోని ఓ బటన్ లోపలికి వెళ్లడంతో ఈవీఎం మరమ్మతులకు గురైంది. దీంతో టెక్నీషియన్ ఈవీఎం మరమ్మతులు చేపట్టినప్పటికీ వినియోగంలోకి రాకపోవడంతో అధికారులు దానిని సీజ్ చేసి మరో ఈవీఎం ఏర్పాటు చేశారు. -
2,500 మందితో బందోబస్తు
● ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడి ● పలు పోలింగ్ కేంద్రాల పరిశీలన కొత్తగూడెంటౌన్/ బూర్గంపాడు : జిల్లాలో 2,500 పోలీస్ సిబ్బందితో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించామని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. మొత్తం 1,105 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి పాఠశాల, సెయింట్ మేరీస్ స్కూల్, రామచంద్ర డిగ్రీ కళాశాల, పాల్వంచ గట్టాయిగూడెం, ఆంజనాపురం, బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం పోలింగ్ కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటు వేసిన ఎస్పీ.. కొత్తగూడెం సమీపంలోని త్రీ ఇంక్లైన్ పంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో ఎస్పీ రోహిత్రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు కరుణాకర్, రమేష్, శివప్రసాద్ తదితరులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామి వారిని ఈ రూపంలో అలంకరించడం ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైభవంగా రామదీక్ష విరమణ.. శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ దీక్ష విరమణ వైభవంగా జరిగింది. తొలుత భద్రుని గుడిలో శ్రీరామ పాదుకలకు అర్చకులు పూజలు చేశారు. పాదుకలను ఆలయ అధికారులు శిరస్సుపై ధరించి మేళతాళాలు, అర్చకుల మంత్రోఛ్చరణలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం మాలధారులు ఇరుముడులు సమర్పించగా ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్ దీక్ష విరమణ గావించారు. అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నికల ఆంక్షల నేపథ్యంలో ఉదయం ప్రదక్షిణ, సాయంత్రం స్వామి వారికి వెండి రథ సేవ ఆలయంలోనే జరిపారు. కాగా, మంగళవారం పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
50 ఏళ్ల వయస్సులో మొదటిసారి...
ఇల్లెందురూరల్: న్యూడెమోక్రసీ దళ సభ్యుడిగా, కమాండర్గా పనిచేసి 35 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు 50 ఏళ్ల వయస్సులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఇల్లెందు మండలం కొమరారంలో సోమవారం ఆయన ఓటు వేశారు. చిన్నతనంలోనే అజ్ఞాత దళ సభ్యుడిగా చేరిన మధు కమాండర్ స్థాయికి ఎదిగాడు. 2000 సంవత్సరంలో మొదటిసారిగా అరెస్ట్ అయిన ఆయన బెయిల్పై బయటకు వచ్చినా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. తిరిగి 2019లో అరెస్ట్ అయి ఏడాది పాటు జైలు జీవితం అనుభవించాడు. 50ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఓటు వేసిన సందర్భంగా ఆయన నిక విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ విధానం ద్వారా రాజ్యాఽధికారాన్ని సాధించలేమని భావించే తాము ఎన్నికలను కేవలం ఎత్తుగడగా మాత్రమే ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగానే లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి న్యూడెమోక్రసీ అభ్యర్థిని బరిలో నిలిపామని చెప్పారు. ఓటుహక్కు వినియోగించుకున్న ఎన్డీ నేత ఆవునూరి మధు -
ఎన్నెస్పీ కాల్వపై వంతెన లేదని..
ఏన్కూరు: ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందరు మారినా సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహించిన ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామానికి చెందిన రైతుల పొలాలు ఎన్నెస్పీ కాల్వలకు అవతలి వైపు ఉండగా, బ్రిడ్జి లేక రెండు కి.మీ. తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఓటు వేసేది లేదని పేర్కొనగా.. తహసీల్దార్ సీహెచ్.శేషగిరిరావు, ఎంపీడీఓ సకినాల రమేష్ చేరుకుని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చచెప్పడంతో వారు ఓటింగ్లో పాల్గొన్నారు. -
ఓటేసిన నేత లు...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన భార్య మల్లు నందిని, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఓటు వేశారు. కల్లూరు మండలం నారాయణపురంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మంలోని గొల్ల గూడెంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మంలోని కవిత పీజీ కళాశాలలో, భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, ఖమ్మం ఎన్నెస్సీ క్యాంప్లోని అంబేద్కర్ కాలేజీ సెంటర్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆయన కుటుంబ సభ్యులు, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఎమ్మెల్సీ తాతా మధు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్, మధిర మండలం కొస్తాలలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, భద్రాలలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు సమితిసింగారంలో, టేకులపల్లి మండలం కోయగూడెంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఓటు వేశారు. ఇక ఖమ్మం హార్వెస్ట్ పాఠశాలలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దంపతులు, సత్తుపల్లి, కూసుమంచి మండలం రాజుపేటలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య దంపతులు, కందాల ఉపేందర్రెడ్డి దంపతులు ఓటు వేశారు. కాగా, కల్లూరు మండలం నారాయణపురంలో బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మేం ఓటు వేసేది లేదు...
● పలుచోట్ల బహిష్కరించిన ప్రజలు ● సమస్యల పరిష్కారంపై హామీ ఇవ్వాలని డిమాండ్ ● ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చచెప్పడంతో ఓటింగ్కు హాజరుకొత్తగూడెంరూరల్: గ్రామంలోని సమస్యలు పరిష్కరించేంతవరకు ఓటు వేయబోమని భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని గొల్లగూడెం వాసులు నిరసన తెలిపారు. సోమవారం ఉదయం గంట పాటు బైఠాయించిన వారు రహదారులు, డ్రెయినేజీలు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఏఎస్పీ విక్రాంత్సింగ్, డీఎస్పీ రెహమాన్, ఎస్ఐ రమణారెడ్డి గొల్లగూడెం చేరుకున్నారు. సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని చెప్పగా.. వారు ఓటింగ్కు బయలుదేరారు. కాగా, గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఓటు వేసేలా కృషి చేసిన ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్సైని ఎస్పీ రోహిత్రాజ్ అభినందించారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో.. గుండాల: గుండాల మండలం పెద్దతోగు గ్రామంలో 81 మంది ఓటర్లు ఉండగా స్థానిక పోలింగ్ కేంద్రంలో 21 మంది, గుండాల పోలింగ్ కేంద్రంలో 60 మందికి కేటాయించారు. దీంతో ఓటర్లు 16 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోంది. తమకు ముత్తాపురం నుంచి ఆరు కి.మీ. మేర రోడ్డు సౌకర్యం లేదని, గ్రామంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాలనే డిమాండ్తో రెండు గంటల పాటు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో గుండాల సీఐ రవీందర్, తహసీల్దార్, ఎంపీడీఓ చేరుకుని వారితో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి నిధులు ఉన్నా అటవీశాఖ అనుమతి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వచ్చే ఎన్నికల నాటికి అందరూ స్థానికంగా ఓటు వేసేలా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించిన గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో గుండాలకు వెళ్లి ఓటేశారు. ఇక ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామస్తులు సైతం కిన్నెరసానిపై వంతెన, బాటన్ననగర్కు రోడ్డు సౌకర్యం కోసం ఎన్నికలను బహిష్కరించగా విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నచ్చచెప్పడంతో వారు ఓటేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే, గ్రామాభివృద్ధి కోసం ఎన్నికలు బహిష్కరిస్తూ పెద్దవెంకటాపురం గ్రామస్తులు తీర్మానం చేయగా వారు సైతం ఎమ్మెల్యే హామీతో ఓటు వేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు పాల్వంచరూరల్ : పశువులను తప్పించబోయి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు గాయపడిన ఘటన పాల్వంచ మండలం జగన్నాథపురం వద్ద సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం వేపలగడ్డకు చెందిన షేక్ సమీర్(22), అతడి మిత్రుడు మడకం సతీష్తో కలిసి కొత్తగూడెంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును చూసేందుకు వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా జగన్నాథపురం శివారులో రహదారిపై పశువులు అడ్గురాగా, వాటిని తప్పించే క్రమంలో బైక్పై నుంచి పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన సమీర్ అక్కడికక్కడే మృతిచెందగా, సతీష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద స్ధలాన్ని ఎస్ఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన సతీష్ను ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్లు ఢీ : నలుగురికి గాయాలుజూలూరుపాడు: మండలంలోని అనంతారం గ్రామంలో రెండు బైక్లు ఢీకొని నలుగురు గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన బండ కాంతారావు బైక్పై చెల్లె హైమావతి, బావ రాంబాబుతోపాటు చిన్నారి లక్ష్మీపార్వతిని ఎక్కించుకొని పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఓటు వేసేందుకు తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో అనంతారం గ్రామానికి చెందిన బచ్చల రామకృష్ణ బైక్పై ఎదురుగా వస్తుండగా ప్రమాదవశాత్తు రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాంతారావుతో పాటు అతడి మేనకోడలు లక్ష్మీపార్వతి తీవ్రంగా గాయపడగా, రాంబాబు, హైమావతికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధులకు పాట్లు.. ఖమ్మంమయూరిసెంటర్: ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు సిబ్బంది తీరుతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఖమ్మం ప్రభుత్వ మహిళా కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లు ఏర్పాటుచేసినా సిబ్బంది పక్కన పెట్టారు. ఇక ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో వీల్ చైర్లు సరిపడా లేక దివ్యాంగులు, వృద్ధులు వేచి చూడాల్సి వచ్చింది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆదివారం కావడంతో భక్తులకు రామాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముగ్గురిపై కేసు నమోదు కొత్తగూడెంఅర్బన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యాన ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారిపై ఆదివారం కేసు నమోదు చేశారు. వన్టౌన్ సీఐ ఎం.కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మధురబస్తీకి చెందిన మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యురాలు దుంపల అనురాధ, ఆమె అనుచరులు రాజశేఖర్, అనిల్కుమార్లు వారి ఏరియాలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకుని వద్ద ఉన్న రూ.18 వేలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. నివాళి.. ఖమ్మం మామిళ్లగూడెం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టి.నర్సింహరావు మృతదేహాన్ని దళితరత్న అవార్డు గ్రహిత, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో నాయకులు సైదులు, రాజేష్, వెంకటేశ్వర్లు, కృష్ణ, నాగేశ్వరరావు, హరీష్రాజు, రామచంద్రయ్య ఉన్నారు. -
నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు (పీఎస్) ఇలా..
నియోజకవర్గం పీఎస్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఖమ్మం 355 1,55,284 1,68,740 49 3,24,073 పాలేరు 290 1,15,717 1,25,081 8 2,40,806 మధిర 268 1,07,111 1,15,039 10 2,22,160 వైరా 252 93,700 99,683 6 1,93,389 సత్తుపల్లి 294 1,18,490 1,25,441 12 2,43,943 కొత్తగూడెం 253 1,19,477 1,27,979 38 2,47,494 అశ్వారావుపేట 184 77,381 81,786 7 1,59,174మొత్తం 1,896 7,87,160 8,43,749 130 16,31,039 -
●బరిలో 35 మంది..
ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు మధ్య పోటీ నెలకొంది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్టుగా ప్రచారం చేశారు. 16 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం ఉపయోగించనుండడంతో 35 మంది అభ్యర్థులు, నోటా గుర్తు కలిపి మూడు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. అవసరమైతే వినియోగించేందుకు వీలుగా అదనంగా మరికొన్ని ఈవీఎంలను అందుబాటులో పెట్టారు. మొత్తం 7,034 బ్యాలెట్ యూనిట్లు, 2,323 కంట్రోల్ యూనిట్లు, 2,634 వీవీ ప్యాట్లను పోలింగ్ స్టేషన్లకు తరలించారు. ●పోలింగ్ శాతం పెరిగేనా.. 2019 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉండగా 11,39,848 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 75.33 శాతం ఓటింగ్ గత ఎన్నికల్లో నమోదైంది. ఈ ఏడాది పోలింగ్ శాతం పెంచేందుకు అధికారం యంత్రాంగం విస్తృత ప్రచారం చేసింది. ప్రతీ అసెంబ్లీ పరిధిలో మహిళలు, దివ్యాంగులు, యువత కోసం ప్రత్యేకంగా మూడు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలతో ప్రచారం చేసింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement