-
కూలిన చర్చి స్లాబ్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందంది. కోహీర్లో నిర్మాణంలో ఉన్న ఓ చర్చి కూలిపోయింది. మెథడిస్ట్ చర్చికి స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ చెక్కలు కూలి పోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిధిలల్లో మరో నలుగురు కూలీలు చిక్కుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను సంగారెడ్డిజిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా సమాచారం. చదవండి: సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు -
ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
భారీగా చేరి.. బారులు తీరి..!
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హఫీజ్పేట్(హైదరాబాద్): మియాపూర్ కల్వరి టెంపుల్లో సోమవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్కుమార్ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. -
మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. బాత్రూమ్కు వెళ్లి బయటకు రాని వరుడు!
విశాఖపట్నం: అంతటా సందడి వాతావరణం.. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న ఆ జంటను చూసి ఇరు కుటుంబాల సంతోషానికి అవధుల్లేవు. పాస్టర్లు ప్రార్థనలు చేసి, క్రీస్తు దీవెనలు అందజేశారు. నూతన జంట కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు. ఉంగరాలు మార్చుకునే క్షణం రానేవచ్చింది. ఇంతలో బిగ్ ట్విస్ట్. పెళ్లి కొడుకు బాత్రూమ్కు అని చెప్పి వెళ్లాడు. అక్కడి నుంచి ఎంతకీ రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూమ్ వద్దకు వెళ్లి తలుపులు ఎంత కొట్టినా అతను తెరవలేదు. చివరకు బతిమలాడటంతో బయటకు వచ్చి పెళ్లి ఇష్టం లేదని బాంబు పేల్చాడు. ఏవో కుంటిసాకులు చెప్పుకొచ్చాడు. దీంతో బంధువులు, పెళ్లి పెద్దలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కొడతారేమోనన్న భయంతో వరుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్కు పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె, వారి బంధువులను పిలిపించారు. వరుడు, వధువుకు కౌన్సెలింగ్ ఇచ్చి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అర్థం పర్థం లేని వరుడి తీరును చూసి వధువు, ఆమె బంధువులు వివాహానికి నిరాకరించారు. పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ వివాహం రద్దయింది. ఈ ఘటన బుధవారం పాత గోపాలపట్నంలోని ఓ చర్చిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన అమ్మాయికి, పాత గోపాలపట్నంకు చెందిన అబ్బాయికి మూడు నెలల కిందట పెళ్లి సంబంధం కుదిరింది. కట్నంగా రూ.3 లక్షలు, తులమున్నర చైన్, ద్విచక్రవాహనం లాంఛనంగా ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తరఫు వారు అంగీకరించారు. బుధవారం వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. కొద్ది క్షణాల్లో పెళ్లి తంతు ముగుస్తుందనగా.. వరుడు తీరుతో రద్దయింది. పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఫోన్లో అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదన్న కారణంతో పెళ్లికి వరుడు నిరాకరించినట్లు తెలిసింది. -
కరుణాపురం ‘క్రీస్తుజ్యోతి’కి అంతర్జాతీయ గుర్తింపు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం శివారులోని ‘క్రీస్తుజ్యోతి’ప్రార్థన మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కరుణాపురంలో 40 వేల మంది కూర్చొని ఏకకాలంలో ప్రార్థనలు చేసే అతిపెద్ద చర్చి నిర్మాణం చేపట్టినందుకు డెన్నీ కె.డెవిస్ పీస్ 2023 అవార్డును సాధించింది. అమెరికన్ మల్టీ ఎత్నక్ కోయలిషన్ 7వ కాంగ్రేషనల్ మల్టీ ఎత్నక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సొసైటీ ఆఫ్ క్రైస్ట్ ప్రెసిడెంట్ క్రీస్తుజ్యోతి మినిస్ట్రీ ఫౌండర్ డాక్టర్ సంగాల పాల్సన్కు ఆదివారం ఆ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పాల్సన్ మాట్లాడుతూ..తమను గుర్తించి అవార్డు ఇచి్చన సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ సంస్థ మరింత అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఈ అవార్డు రావడంపై సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ డాక్టర్ జయప్రకాశ్ గోపు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రపంచంలోని టాప్ 10 అందమైన చర్చిలు
-
ఆసియాలో అతిపెద్ద చర్చి కరుణాపురంలో
ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు.. ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. అద్భుత కట్టడంగా.. కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్లోని జున్హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్తో అనుబంధంగా ఉండటం విశేషం. ప్రత్యేకతలు ఇవీ.. ♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్ప్రూఫ్ మెటీరియల్ అద్దారు. ♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. ♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు. ♦ ఎల్ఈడీ స్క్రీన్స్తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు. ♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరళ రోడ్డు రవాణా సంస్థకు చెందిన చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటన పతనంతిట్టా జిల్లాలోని కిజవళ్లూర్ వద్ద శనివారం జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న కారును బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో కారు దూరంగా ఎగిరిపడి రోడ్డు పక్కన ఆగిపోగా.. కారును తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్ను ఎడమ వైపు తిప్పగా.. రోడ్డుకు ఆనుకొని ఉన్న చర్చి గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చర్చి ఆర్చి కుప్పకూలింది. అదే విధంగా పలువురికి గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షపు డ్రైవింగ్యే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. #WATCH | Kerala: A Kerala State Road Transport Corporation bus met with an accident after colliding with a car near Kizhavallor in Pathanamthitta district. Thereafter, the bus rammed into the wall of a church. Injured passengers were rushed to hospital. pic.twitter.com/SiFjOvDLsR — ANI (@ANI) March 11, 2023 -
చికాగోలో సీయోను తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలో అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ మాథ్యూస్ వట్టిప్రోలు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్లు, కారల్ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్లలకు బహుమతులు అందచేశాడు. యేసు ప్రభు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేంలో జన్మించినది స్కిట్గా ఆవిష్కరించిన రీతి ఈ వేడుకలకు హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో ప్రారంభమై ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలతో అమెరికాలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేస్తోందన్నారు. క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది ఎంత అధ్బుతమనేది వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు!
జాగ్రత్తగా చూస్తే ఈ ఫొటోలో కొండశిఖరంపై ఒక కట్టడం కనిపిస్తోంది కదూ! కొండశిఖరంపై వెలసిన ఈ కట్టడం ఒక చర్చి. కొండశిఖరంపైకి ఎక్కి దీనిని చేరుకోవడానికి లోహపు నిచ్చెన మెట్లదారి మాత్రమే దిక్కు. ఇది జార్జియాలో ఉంది. ‘కాటస్కీ పిల్లర్’గా ప్రసిద్ధి పొందింది. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారో ఎలాంటి ఆధారాలు లేవు. తొలిసారిగా పద్దెనిమిదో శతాబ్దిలో జార్జియన్ ప్రిన్స్ వాఖుస్తి తన పుస్తకంలో ఈ నిర్మాణం గురించి ప్రస్తావించాడు. తర్వాత 1944లో అలెగ్జాండర్ జాపారిడ్జ్ అనే పర్వతారోహకుడు తన బృందంతో కలసి ఈ కట్టడాన్ని సందర్శించాడు. చాలాకాలంగా దీనిని ఎవరూ ఉపయోగించకుండా విడిచిపెట్టేశారు. అయితే, 1999 నుంచి వివిధ దేశాలకు చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరుపుతున్నారు. దీని నిర్మాణ శైలిని బట్టి, ఈ చర్చిని పదమూడో శతాబ్దిలో నిర్మించి ఉంటారని వారి అంచనా. -
మేడ్చల్ జిల్లా : అంబేద్కర్ నగర్ చర్చ్ లో మహిళ మృతదేహం
-
చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
నాగోలు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు రూ. లక్ష నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్క్లేవ్లో ఉండే లాలయ్య, మాదాపూర్లో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్పూర్మెట్ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. లాలయ్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, పోలీస్ డాగ్స్తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కోళ్ల చోరికి వచ్చిన యువకుడిపై దాడి) -
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం
70 ఏళ్లపాటు బ్రిటన్ను ఏలిన రాణి ఎలిజబెత్–2కు హైదరాబాద్ మహానగరంతో అనుబంధం ఉంది. చారిత్రక భాగ్యనగరాన్ని ఆమె ఒకసారి సందర్శించి ముగ్ధులయ్యారు. వందల ఏళ్ల నాటి చారి్మనార్, గోల్కొండ కట్టడాలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఎలిజబెత్–2 తన పాలనా కాలంలో మూడుసార్లు భారత్కు వచ్చారు. అందులో భాగంగా 1983 నవంబర్ 20న ఆమె హైదరాబాద్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె బొల్లారంలోని హోలీ ట్రినిటీ చర్చికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. ఆమె నానమ్మకు నానమ్మ అయిన విక్టోరియా మహారాణి తన సొంత డబ్బుతో ఈ చర్చిని కట్టించారు. అందుకే ఎలిజబెత్–2 ప్రత్యేకంగా ట్రినిటీకి విచ్చేశారు. ట్రినిటీ చర్చిని క్వీన్స్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భంగానే ఆమె రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్, గోల్కొండ కుతుబ్షాహీ టూంబ్స్, చార్మినార్, తదితర ప్రాంతాలను సందర్శించారు. ఎలిజబెత్–2తోపాటు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ కూడా ఆమె వెంట ఉన్నారు. అప్పుడు ఆర్కియాలజిస్ట్గా విధులు నిర్వహించిన ఎంఎ ఖయ్యూం వారి వెంట ఉండి నగరంలోని చారిత్రక ప్రదేశాలను పరిచయం చేశారు. చదవండి: ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్ను గిఫ్గ్గా ఇచ్చిన నిజాం నవాబు -
బోన్ చర్చ్.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం
భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్లో కుట్నా హోరాలోని సెడ్లెక్లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు కూడా వచ్చింది. -
ఒంగోలు జేఎంబీ చర్చిలో గొడవలు బాధాకరం: బాలినేని
-
నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
అబూజా: నైజీరియాలోని రివర్స్ రాష్ట్రం హర్కోర్ట్ నగరంలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో చిన్నారులతో సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కింగ్స్ అసెంబ్లీ పెంటెకొస్టల్ చర్చిలో శనివారం ఉదయం 9 గంటలకు పేదలకు పలు వస్తువులను ఉచితంగా అందజేస్తామంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో, ఉదయం 5 గంటలకే భారీ సంఖ్యలో జనం చర్చి వద్ద క్యూ కట్టారు. రద్దీ పెరిగి, చర్చిగేట్లు విరగ్గొట్టారు. ఇది తొక్కిసలాటకు దారితీసి 31 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. నిర్వాహకులు ఉచిత పంపిణీని రద్దు చేశారు. చదవండి: టెక్సాస్ నరమేధం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
భక్తి శ్రద్దలతో ఈస్టర్ (ఫోటోలు)
-
క్యాథడ్రెల్ కేక్!.. ఆ కుటుంబం ఏది చేసినా రిచ్గా ఉంటుంది
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి అందమైన భవనం పక్కన కూర్చుని ఫొటో తీసుకుంది. మనం కూడా ఒక ఫొటో తీసుకుంటే భలే ఉంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది నిజమైన భవనం కాదు. అక్షరాల వంద కేజీల కూల్ కేక్. అవునా! అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. చూడగానే నోట్లో నీళ్లూరించే కేక్ డెకరేషన్లతో కేక్ ఆర్టిస్ట్లు తెగ ఆకట్టుకుంటుంటారు. కేక్ ఆకృతిని చూసి ధరకూడా చూడకుండా కొనేస్తుంటారు కొందరు. కానీ ఈ కేకు వాటన్నింటిలోకి చాలా భిన్నమైనది. అచ్చం ఇలాంటి కేకులు రూపొందించే ఆర్టిస్టే పూనేకు చెందిన ప్రాచీ ధబాల్ దేబ్. వినూత్న ఆలోచనతో ఏకంగా లండన్ వరల్డ్బుక్ ఆఫ్ రికార్డు గుర్తింపును తెచ్చుకుంది. బ్రిటన్ రాయల్ కుటుంబం ఏది చేసినా ఎంతో రిచ్గా ఉంటుంది. వారు నివసించే భవనాల నుంచి ధరించే దుస్తుల వరకు అంతా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా ఎంతో ప్రత్యేకమైన బ్రిటన్కు చెందిన ఓ పురాతన చర్చ్ను వీగన్ కేక్తో రూపొందించింది ప్రాచి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేక్ ఐకాన్ ఎడ్డీస్పెన్స్ మార్గదర్శకత్వంలో రాయల్ ఐసింగ్ కళను నేర్చుకుని 1500ల కేకు ముక్కలతో మిలాన్ క్యాథడ్రెల్ చర్చ్ను నిర్మించింది. గుడ్లను వాడకుండా వీగన్ పదార్థాలతో కేకు ముక్కలను డిజైన్ చేసింది ప్రాచీ. ముక్కలన్నింటిని కలిపి చర్చ్రూపం తీసుకురావడానికి ప్రాచీకి నెలరోజులు పట్టింది. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవైన నిర్మాణమే ఈ రాయల్ ఐసింగ్ కేక్. నాలుగు అడుగుల ఎత్తు, మూడడుగుల పది అంగుళాల వెడల్పుతో తయారు చేసిన ఈ కేకు బరువు వందకేజీలపైనే. ఎంతో సంక్లిష్టమైన నిర్మాణాలను కేక్లుగా రూపొందించడంలో ప్రాచీకి నైపుణ్యం ఉండడంతో.. గతేడాది ఫెమినా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటుదక్కించుకుంది. -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
100 ఎకరాల్లో ఆంగ్లేయులు నిర్మించిన చర్చీ.. తెలంగాణలో రెండో అతి పెద్దది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చర్చీలు క్రిస్మస్ వేడుకల కోసం ముస్తాబయ్యాయి. సంబరాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. యేసు జన్మస్థలంగా భావించే పశువుల పాకలను ఆకట్టుకు నే విధంగా తీర్చిదిద్దారు. ప్రార్థనలు చేసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రాచీన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. సాక్షి, లక్సెట్టిపేట(ఆదిలాబాద్): రాష్ట్రంలో మెదక్ తర్వాత అతిపెద్ద చర్చిగా చెప్పుకునే లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి 86 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ చర్చికి క్రిస్మస్కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. ఆదిలాబాద్లోని చర్చిలో.. బ్రిటీష్ కాలంలో నిర్మాణం.. లక్సెట్టిపేట పట్టణానికి సమీపంలో వందెకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలో ఆంగ్లేయులు ఈ చర్చిని నిర్మించారు. 1920లో ఇంగ్లాండ్కు చెందిన రేవ ఈడబ్ల్యూ లాంట్ లక్సెట్టిపేట పట్టణానికి వచ్చి, ఇక్కడే పదేళ్లపాటు మిషనరీ సంస్థలో పనిచేశాడు. 1930లో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 95 ఫీట్ల వైశాల్యంతో చర్చి నిర్మాణం, 70 ఫీట్ల వైశాల్యంతో ప్రాంగణం, 46 గొలుసులతో ఉన్న దిమ్మెలు, సుమారు 500 మందికి వసతి కల్పించేవిధంగా ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఇంగ్లాండ్ నుంచి ప్లాన్ తెప్పించాడు. నిర్మాణ పనులు చూసే బాధ్యతను రెవ సీజీ అర్లికి అప్పగించారు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, స్థానికంగా ఉన్న గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్ల నుంచి రాళ్లు తెప్పించి, బొట్లకుంటలోని నీటిని చర్చి నిర్మాణానికి ఉపయోగించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించారు. 1935లో రెవ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణం పూర్తి చేయించారు. అనంతరం మిషనరీగా వచ్చిన రేవ ఫాస్పూట్ సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి క్రిస్మస్ రోజున ప్రారంభించారు. అప్పటి నుంచి 1954 వరకు ఆంగ్లేయులే చర్చి ఫాదర్లుగా పనిచేశారు. ఫాదర్ నివాసం ఉండేందుకు రెండస్తుల విశాలమైన భవంతిని నిర్మించారు. ప్రస్తుతం పనిచేస్తున్న చర్చి ఫాదర్లు కూడా అందులోనే ఉంటారు. విద్యుత్కాంతుల్లో విజయనగరం చర్చి విజయనగరం చర్చికి 55 ఏళ్లు కౌటాల(సిర్పూర్): మండలంలోని విజయనగరం గ్రామంలోని కథోలిక చర్చికి ఘన చరిత్ర ఉంది. విజయనగరంలో 1966లో దీనిని స్థాపించారు. విశాలమైన ప్రాంతంలో చర్చితోపాటు ఎయిడైడ్ పాఠశాల, వసతి గృహం ఉన్నాయి. చర్చికి ప్రతి ఆదివారం 250 వరకు భక్తులు వచ్చి, ప్రార్థనలు నిర్వహిస్తారని ఫాదర్ మనోజ్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం పాత భవనాన్ని తొలగించి, అదేస్థలంలో భారీ మందిరాన్ని నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్కాంతులతో చర్చిని ముస్తాబు చేశారు. ఏర్పాట్లు చేస్తున్నాం క్రిస్మస్ రోజు లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చికి భక్తులు అధికంగా వస్తుంటారు. పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలి. – కరుణాకర్రావు, సీఎస్ఐ చర్చి ఫాదర్, లక్సెట్టిపేట కలెక్టర్ చౌక్లో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ ట్రీ ముస్తాబైన యేసు మందిరాలు కైలాస్నగర్(ఆదిలాబాద్): జిల్లాకేంద్రంలోని కలెక్టర్ చౌక్ వద్ద గల హోలీ ఫ్యామిలీ కాథరల్ చర్చిలో యేసు జన్మస్థలం పశువుల పాకను అందంగా తీర్చిదిద్దారు. రాత్రి 12 గంటలకు యేసు జన్మను స్వాగతిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఖానపూర్లో గల ఇండియా మిషన్ చర్చి, రవీందర్నగర్లోని సీఎస్ఐ చర్చి, విద్యానగర్లోని బేస్ సేబా చర్చిలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా అలంకరణ వస్తువులు సాంటా క్లోస్ దుస్తులు, నక్షత్రాలు, రంగురంగుల వస్తువులు కొనుగోళ్లతో షాపింగ్ మాల్లు, జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఆనందంగా గడుపుతాం క్రిస్మస్ రోజు తప్పకుండా అమ్మనాన్నతో కలిసి అందరం చర్చికి వెళ్తాం. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఆనందంగా గడుపుతాం. కొత్త బట్టలు వేసుకుని, ఇంటిని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. – డి.ప్రేక్ష, టీచర్స్కాలనీ -
చర్చికి వెళ్లినంత మాత్రాన.. ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు
సాక్షి, న్యూఢిల్లీ: గోడలకు శిలువ తగిలించుకోవడం, చర్చికి వెళ్లినంత మాత్రాన... వాటిని కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందు పల్లన్ సామాజికవర్గానికి (ఎస్సీ) చెందిన పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకొన్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎం.దురైస్వామిల ధర్మాసనం పక్కనబెట్టింది. ‘‘పిటిషనర్ అయిన మహిళ హిందు పల్లన్ తల్లిదండ్రులకు జన్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు. పిటిషనర్ను ఓ క్రైస్తవుడు వివాహం చేసుకోవడం.. వారి పిల్లలు భర్త మతానికి చెందిన వారుగా గుర్తించడంతో పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు గుర్తించాం. పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె క్లినిక్ను సందర్శించామని గోడలకు క్రాస్ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రాలేం. పిటిషనర్ తన భర్త, పిల్లలతో చర్చికి వెళ్లినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించలేం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. -
ఇండోనేసియా చర్చి వద్ద ఆత్మాహుతి దాడి
మకస్సర్: ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో ఆదివారం ఓ చర్చి వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 20 మంది గాయపడ్డారు. దక్షిణ సులవేసి ప్రావిన్సు రాజధాని మకస్సర్లోని సాక్రెడ్ హార్ట్స్ ఆఫ్ జీసస్ కెథెడ్రల్లోకి ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి లోపలికి ప్రవేశించేందుకు బైక్పై వచ్చిన ఇద్దరు అగంతకులు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డగించారు. సిబ్బందితో వారు వాదులాటకు దిగారు. అదే సమయంలో, అగంతకుల్లో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే తునాతునకలయ్యారు. నలుగురు భద్రతా సిబ్బందితోపాటు చర్చిలో పామ్ సండే సామూహిక ప్రార్థనలు ముగించుకుని వస్తున్న భక్తులు గాయాలపాలయ్యారు. అగంతకుల్లో ఒకరు మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారులెవరో తెలియాల్సి ఉంది. ఇండోనేసియా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వాటికన్ సెయింట్ పీటర్స్ బసిలికాలో పామ్ సండే ప్రార్థనల సందర్భంగా బాధితుల కోసం ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు. (చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!) -
ఫ్రాన్స్లో ఉగ్ర దాడి : ముగ్గురు మృతి
పారిస్ : ఫ్రాన్స్ నగరం నీస్లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో మహిళ సహా ముగ్గురు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తలను నరికేశాడని మరో ఇద్దరు ఈ ఘటనలో మరణించారని అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్యేనని నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి వెల్లడించారు. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ ఘటన జరిగిందని, దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దాడికి తెగబడిన వ్యక్తి ఓ మతానికి సంబంధించి నినాదాలు చేశాడని చెప్పారు. మరణించిన వారిలో ఒకరిని చర్చి వార్డెన్గా భావిస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. బాధితులను కిరాతకంగా చంపారని అన్నారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారని ప్రస్తుతం నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. కాగా, ఈ దాడిలో ముగ్గురు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ ఉగ్రవాద వ్యతిరేక ప్రాసిక్యూషన్ విభాగం దర్యాప్తు చేపట్టనుంది. ఫ్రాన్స్లో ఈ తరహా దాడి ఈ నెలలో ఇది రెండవది కావడం గమనార్హం. ఫ్రెంచ్ మిడిల్ స్కూల్ టీచర్ను ఇటీవల చెచెన్యా సంతతికి చెందిన ఓ వ్యక్తి తలనరికి చంపడం కలకలం రేపింది. చదవండి : ఫ్రాన్స్లో టీచర్ తలనరికిన యువకుడు -
కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement