breaking news
Undergraduates
-
ఒక్కొక్కరికి రూ. 2లక్షలు.. 5వేల విద్యార్థులకు అవకాశం - రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి 5,000 అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. దీని కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు 2023 అక్టోబర్ 15లోపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అన్ని బ్రాంచ్లలోని మొదటి సంవత్సరం రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ మెరిట్ ఆధారంగా చేసుకుని అందివ్వడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన ఒక్కో విద్యార్థికి రూ. 2 లక్షల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఇందులో మహిళా విద్యార్థులకు, వికలాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు గురించి ఆందోళన చెందకుండా చదువుకోవాలనే సదుద్దేశ్యంతో రిలయన్స్ సంస్థ ఈ స్కాలర్షిప్లను అందిస్తోంది. 2022 - 23 విద్యాసంవత్సరంలో కూడా సంస్థ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దీని కోసం అప్పుడు లక్ష మంది అప్లై చేసుకున్నారు. ఇందులో ఎంపికైన వారిలో 51 శాతం మహిళలు, 97 మంది వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.20 వేలతో మొదలై ప్రపంచ స్థాయికి.. వావ్ అనిపించే 'వందన' ప్రస్థానం! రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి www.scholarships.reliancefoundation.org వెబ్సైట్ సందర్శించవచ్చు. ఇందులో కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. -
పట్టాలు ఉన్నా.. అందులో కొంత మందికే అదృష్టం
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) లెక్కల ప్రకారం 2019–20లో దేశంలో 6,09,632 మంది ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేస్తే.. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ సర్వే ప్రకారం, అందులో 2 శాతం మంది మాత్రమే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో 4,19,455 మంది అరకొర వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో 47,264 మంది గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్ సహా) పూర్తి చేస్తే... 38,423 మందికి ఉద్యోగాలొచ్చాయి. అయితే, ఉపాధి పొందిన వాళ్ళల్లో దేశంలో 6 వేల మంది, తెలంగాణలో సుమారు వెయ్యి మంది మాత్రమే మంచి వేతనం, బహుళజాతి సంస్థల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. మిగతా వాళ్లంతా కాల్సెంటర్స్.. ఇతర చిన్నా చితక ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. బహుళజాతి సంస్థలు ఫ్రెషర్స్కు తలుపులు బార్లా తెరుస్తున్నాయి. కానీ మార్కెట్ అవసరాలకు తగ్గ మంచి సాంకేతిక నిపుణత మాత్రం వారిలో కన్పించడం లేదు. ఏటా ప్రముఖ కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాల్లో చేరుతున్నవారి సంఖ్యకు నాలుగు రెట్లకు మించి నిపుణులు ప్రస్తుతం అవసరమని కంపెనీలు చెబుతున్నాయి. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ నిపుణులతో పాటు ఇతర మార్కెట్ అవసరాలకు తగ్గ నిపుణులు కావాలని పేర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా 14 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకి వస్తుంటే, వీళ్లలో మంచి కంపెనీల్లో, వారి అర్హతకు తగిన ఉద్యోగాలు పొందుతున్నది మహా అయితే 4 శాతమే కావడం నిపుణత కొరతను స్పష్టం చేస్తోంది. పట్టు లేని పట్టాలే కారణం ‘దశాబ్దకాలంగా సంప్రదాయ డిగ్రీలు, ఇంజనీరింగ్ కోర్సులను విద్యార్థులు ఇష్టపడటం లేదు. కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఆ కోర్సులు చేసిన విద్యార్థుల్లో చాలామంది ఈ తరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పనికి రావడం లేదు. ఉదాహరణకు కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో బహుళజాతి కంపెనీలకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కంపెనీలు ఫ్రెషర్స్ స్కిల్స్ను పరిశీలించాయి. వాళ్ళు కేవలం కంప్యూటర్ బేసిక్ లాంగ్వేజ్, మహా అయితే డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీబీఎంఎస్) గురించే చెబుతున్నారు. అయితే ఆర్టిఫీసియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నో సీక్వెల్ (ఎస్క్యూఎల్)లో అడ్వాన్స్ టాపిక్ తెలిసి ఉన్నవాళ్లే కొత్తగా వచ్చే ప్రాజెక్టులు చేయగలరు. అలాంటప్పుడు కేవలం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళను రిక్రూట్ చేసుకుని ఏం చేయాలి?’అని టీసీఎస్ బిజినెస్ డెవలప్మెంట్ నిపుణులు సతీష్ ప్రశ్నించారు. ‘కేవలం ఐఐటీల్లో చదివిన వారిలోనే మంచి నైపుణ్యం ఉంటోంది. కానీ వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికే ఇష్టపడుతున్నా రు. పోనీ కొత్తవాళ్ళను తీసుకుని ట్రైనింగ్ ఇద్దామన్నా... వాళ్లు అన్నీ తెలుసుకుని నేర్చుకునేలోగా ప్రాజెక్టు గడువు పూర్తవుతుంది. మళ్ళీ కొత్త ప్రాజెక్టు వస్తే అప్పుడు ఏ స్థాయి నైపుణ్యం అవసరం అవుతుందో తెలియదు. ఈ పరిస్థితుల్లోనే ఎంతో కొంత స్పీడ్ ఉన్న వాళ్ళను తీసుకుని ముందుకెళ్తున్నాం. వి దేశీ వర్శిటీల్లో మన ఐఐటీల స్థాయి నైపుణ్యం, మార్కెట్ అవసరాలను చేరుకునే విద్య అందిస్తున్నా రు. ఖర్చు ఎక్కువైనా వీళ్ళను ఉద్యోగాల్లోకి తీసుకోక తప్పడం లేదు..’అని ఆయన వివరించారు. నైపుణ్యం పెంచాలని ఎప్పుడో చెప్పారు రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నియమించిన శ్యాంపిట్రోడా నివేదికే.. దేశంలో 2 శాతానికి మించి సాంకేతిక నైపుణ్యం గల మానవవనరులు లేవని చెప్పింది. అందువల్ల సాంకేతిక విద్యలోనూ సంస్కరణలు జరగాలి. బోధన ప్రణాళిక మార్చాలి. ప్రపంచవ్యాప్తంగా పనికొచ్చే సాంకేతిక నైపుణ్యం పెరిగేలా చదువు సాగాలి. మూస విధానం కాకుండా... ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థను మార్చాలి. సమస్య ఎక్కడంటే.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన దేశంలో తయారయ్యే ఐఐటీ నిపుణులను విదేశాలు ఎక్కువ జీతంతో తీసుకెళ్తుండటంతో సమస్యలు వస్తున్నాయి. – రవీందర్, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాక్టికల్ నాలెడ్జ్తో నైపుణ్యం టీసీఎస్ టీం పూర్తిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్లే విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని చెబుతోంది. మాకు ఇచ్చే శిక్షణలోనూ దీనికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దిశగా అనేక ఉదాహరణలు, కేస్ స్టడీలు ముందుకు తెస్తున్నారు. దీని ఆధారంగా డేటా సైన్స్లో మార్పులు చేస్తున్నాం. – డాక్టర్ భట్టాచార్య (ఉస్మానియా యూనివర్సిటీ డేటా సైన్స్ అధ్యాపకుడు) శిక్షణలో తెలంగాణ ముందడుగు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముందుగా గుర్తించింది. ఈ క్రమంలోనే టీసీఎస్తో ఒప్పందం చేసుకున్నాం. వారి సహకారంతో ముందుగా బోధనా సిబ్బందిని తయారు చేస్తున్నాం. టీసీఎస్ ఐఐటీ ప్రొఫెషనల్స్ బృందం ఇప్పటికే ఫ్యాకల్టీకి ఆన్లైన్ శిక్షణ మొదలెట్టింది. డిగ్రీలో డేటా సైన్స్లో కంప్యూటర్ కోర్సును 10 భాగాలుగా విభజించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అత్యాధునిక సాంకేతికతను అవగతం చేస్తున్నారు. తర్వాత ప్రతి విద్యార్థికి అవరమైన సలహాలు సూచనలు ఇస్తారు. ఇవన్నీ అంతర్జాతీయ సాంకేతిక మార్పులతో అనుసంధానమై ఉంటాయి. వీళ్ళకు టీసీఎస్ ఇతర కంపెనీలతో కలిసి పరీక్ష పెట్టి, సర్టిఫికెట్ ఇస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) కోర్సులు సరే.. ఫ్యాకల్టీ ఏరీ? నిజం చెప్పాలంటే రాష్ట్రంలోని ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బోధించే అధ్యాపకులు తగిన సంఖ్యలో లేరు. ఇప్పటికీ జావా, సీ... సీ ప్లస్.. ఇంకా బేసిక్ లాంగ్వేజ్తోనే బోధనాంశాలు ఉంటున్నాయి. అధ్యాపకులూ దీనికే అలవాటు పడ్డారు. ఐటీలో వస్తున్న సాంకేతిక మార్పులు కేవలం ఐఐటీల్లోనే అంది పుచ్చుకుంటున్నారు. నిజానికి డీప్ లెర్నింగ్ బోధించే స్థాయి ఉన్న అధ్యాపకుడికి బహుళ జాతి సంస్థలు నెలకు రూ. 5 లక్షల వరకు వేతనం ఇస్తాయి. అదే కాలేజీల్లో బోధిస్తే రూ. 50 వేలకు మించి ఇవ్వరు. అందుకే నాణ్యమైన, నేటి తరానికి అవసరమైన బోధించే స్కిల్స్ ఉన్న అధ్యాపకులు కాలేజీల్లో ఉండటం లేదు. – దత్త ప్రసాద్, (గతంలో డేటా సైన్స్ ఫ్యాకల్టీ... ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం) -
పట్టభద్రులు అంతంతే
సాక్షి, మహబూబ్నగర్: పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం అంతంత మాత్రంగానే సాగుతోంది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గతనెల 26వ తేదీ నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఓటరుగా నమోదు కా ర్యక్రమం నెలరోజులుగా సాగుతున్నా.. ఒకసారి గడువు పెంచినప్పటికీ పట్టభద్రుల నుంచి అంతగా స్పందన కనిపిం చడం లేదు. తాజాగా నేటి(మంగళవారం)తో గడువు ముగియనుంది. అయినప్పటికీ జిల్లాలో పట్టభద్రుల నమోదు కార్యక్రమం చాలా పేలవంగా సాగింది. జిల్లాలో ఇప్పటివరకు 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో కేవలం 2,563 మాత్రమే ఓటర్లుగా నమోదయ్యాయి. ఇలా జిల్లాలో 41,674 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా జిల్లాలోనే.. పట్టభద్రుల ఓటరు నమోదులో జిల్లా నుంచే అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ మూడు జిల్లాలకు కలిపి 57,816 దరఖాస్తులు రాగా, అత్యధికంగా హైదరాబాద్ నుంచి 26,376 దరఖాస్తులొచ్చాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 19,754 దరఖాస్తులు వచ్చాయి. ఇక మహబూబ్నగర్ జిల్లా నుంచి కేవలం 11,686 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఏటా జిల్లా నుంచి 10వేల మంది డిగ్రీ చదువును పూర్తిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత లేదన్నా ఓటరు నమోదుకు 30వేలకు తగ్గకుండా దరఖాస్తులు వస్తాయని భావించిన నేపథ్యంలో కేవలం 11వేలు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జిల్లాలో 41,674 మంది మాత్రమే పట్టభద్రులుగా నమోదవడాన్ని బట్టి చూస్తే జిల్లాలో గ్రాడ్యుయేట్లు ఇంతేమందా? అనే సందేహం కలుగుతుంది. అదే విధంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో లక్ష మందికి పైగా పట్టభద్రులుగా నమోదయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్నగర్లో మాత్రం కేవలం 41వేలు మాత్రమే పట్టభద్రులుగా ఉన్నారు. అభ్యర్థుల ప్రచారం ముమ్మరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కార్యక్రమ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతున్నా..అభ్యర్థుల ప్రచారం మాత్రం ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్.రాంచందర్రావు, ఉపాధ్యాయ సంఘాల నుంచి పీఆర్టీయూ అభ్యర్థిగా వెంకట్రెడ్డి, టీపీఆర్టీయూ నుంచి హర్షవర్ధన్రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. తమ అనుమాయులతో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు.