breaking news
Trading App
-
ఆర్బీఐ అలెర్ట్, పెట్టుబడులు పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఫారెక్స్ ట్రేడింగ్ పేరిట ప్రకటనలు గుప్పిస్తున్న పలు నకిలీ యాప్ల వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ వెల్లడించిన అనుమతి లేని ఇన్వెస్ట్మెంట్ యాప్ల జాబితాలో అల్పరి ఇన్వెస్ట్–ఇన్వెస్ట్మెంట్స్, ఐక్యూ ఫారెక్స్–ఆన్లైన్ ట్రేడింగ్ యాప్, ఓలింప్ ట్రేడ్–ట్రేడింగ్ ఆన్లైన్లు ఉన్నాయి. అనుమతులు లేని యాప్లతో పెట్టుబడి పెట్టి మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. ఆర్బీఐ అనుమతి లేని అలాంటి సంస్థల వివరాలు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్లోగానీ, 1930 టోల్ఫ్రీ నంబర్లోగానీ తెలియజేయాలని కేంద్ర హోంశాఖ అధికారులు సూచించారు. -
Hyderabad: కేటుగాళ్ల వలలో హైదరాబాదీ.. రూ.62 లక్షలు గోవిందా!
గచ్చిబౌలి: మార్కెట్ బాక్స్... అదో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్. ఆ యాప్లో రిజిస్టర్ అయి లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ఉసిగొల్పి అందిన కాడికి దండుకొని బిచాణ ఎత్తేశారు. ఇలా మోసాలకు పాల్పడిన నలుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైంలో దేశంలోనే మొదటిసారిగా రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ స్టీఫెన్ రవీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ముగల్సరాయ్కి చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ (32) మార్కెట్ బాక్స్ అనే ఫేక్ ట్రేడింగ్ యాప్ను రూపొందించాడు. వాట్సాప్, టెలి గ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దేశవ్యాప్తంగా వేలాది మంది రిజిస్టర్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివాసం ఉండే ఓ వ్యక్తి తొలుత రూ.10 లక్షలు ఇందులో పెట్టగా, తిరిగి రూ.14.9 లక్షలు వచ్చా యి. దీంతో ఆయన ఈసారి రూ.62 లక్షలు పెట్టా రు. అయితే, కేవలం రూ.34.7 లక్షలే వచ్చాయి. రూ.27 లక్షలకుపైగా నష్టం వచ్చింది. దీంతో 2021 డిసెంబర్ 4న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేసి యూపీ, రాజస్తాన్కు చెందిన ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలా వేలాది మందిని మోసగించిన అభిషేక్ జైన్తోపాటు కృష్ణ కుమార్ (38), పవన్ కుమార్ ప్రజాపట్ (35), ఆకాశ్రాయ్ (39)లను అరెస్ట్చేశారు. ఉన్నది లేనట్లుగా చూపించి... మార్కెట్ బాక్స్లో మూడువేల మంది రిజిస్టర్ అయ్యారని సీపీ స్టీఫెన్ చెప్పారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లాభాల్లో ఉన్నట్లు కనిపించేలా చూపిస్తారన్నారు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు ఇచ్చి నమ్మకాన్ని చూరగొంటారని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తరువాత డబ్బు లు కాజేస్తారని వివరించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఒకచోట ఉంచారని, యూపీ పోలీసుల సహకారంతో రూ.9.81 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సమావేశంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, ఏడీసీపీ రితురాజ్, ఏసీపీ శ్రీధర్, సీఐలు శ్రీనివాస్, అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
యాప్ ట్రేడింగ్ పై ఎడల్ వైజ్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ట్రేడింగ్పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఎడల్వైజ్ ప్రకటించింది. చాలా సులభంగా ట్రేడింగ్ చేసుకునే విధంగా ఈమధ్యనే అభివృద్ధి చేసిన యాప్కు మంచి డిమాండ్ వస్తోందని ఎడల్వైజ్ గ్లోబల్ హెల్త్ మేనేజమెంట్ రిటైల్ హెడ్ రాహుల్ జైన్ తెలిపారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లో లక్షమంది ఖాతాదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎడల్వైజ్ ఖాతాదారుల సంఖ్య 3 లక్షలుండగా అందులో ఇప్పటి వరకు 30,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మొబైల్ ట్రేడింగ్ పెరుగుతోందని, గత మూడేళ్లుగా మొబైల్ ట్రేడింగ్లో 100% చొప్పున వృద్ధి నమోదైనట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు 13 నుంచి 14% సగటు రాబడులను అందిస్తుందని అంచనా వేస్తున్నట్లు జైన్ తెలిపారు.