breaking news
Sanaga Seeds
-
శనగ ఎన్బీఈజీ–452 విత్తనం విడుదల
నంద్యాల(అర్బన్): శనగలో ఎన్బీఈజీ–452 అనే కొత్త రకం విత్తనం విడుదలైందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. స్థానిక పరిశోధన స్థానం కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జేజీ–11కు ప్రత్యామ్నాయంగా ఎన్బీఈజీ–452 రకాన్ని విడుదల చేశామని చెప్పారు. ఈ రకం ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందన్నారు. ఎండు తెగులును తట్టుకుంటుందన్నారు. ఇది గింజ నాణ్యతలో జేజీ–11ను పోలి ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన ఫౌండేషన్, టీఎల్ విత్తనాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పొందవచ్చని ఆమె తెలిపారు. టీఎల్ విత్తనం ధర కిలో రూ.95 ఉండగా, ఫౌండేషన్ విత్తనం కిలో రూ.100 చొప్పున లభిస్తుందని చెప్పారు. విత్తనాల కోసం రామరాజు (9866884486), లోకేశ్వరరెడ్డి (9996477936)ని సంప్రదించాలని సూచించారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
విత్తనాల కోసం తొక్కిసలాట
–పోలీసుల పహారా మధ్య కూపన్ల పంపిణీ ముద్దనూరు: స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద శనివారం జరిగిన శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక ఎస్ఐ నరసింహారెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. మహిళలు, పురుషులకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేయించారు. దీంతో కూపన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగింది. చివరి వరకు పోలీసుల పహారా మధ్యనే కూపన్ల అందజేశారు. మండలంలోని నల్లబల్లె, చిన్నదుద్యాల గ్రామాలకు చెందిన రైతులు కూపన్లు అందకపోవడంతో వెనుతిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.