-
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్కప్లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్కప్లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు. -
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్బాల్కు గుడ్బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్గా ఉంటూనే తన క్లబ్ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం ఏమైంది?
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వీడియోలతో విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్రావు ప్రశ్నించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ‘‘సంప్రదాయ ఫార్మాట్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్బాల్ క్రికెట్లో కొనసాగినా.. బ్యాగీ గ్రీన్తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్లో ఎప్పటికైనా హైలైట్గా నిలుస్తుంది’’ అని మాథ్యూ వేడ్ ఉద్వేగపూరిత ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడటం అంతర్జాతీయ కెరీర్లో తనకు అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్లో ఆఖరిదని వేడ్ వెల్లడించాడు. కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. 2021లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అలెక్స్ క్యారీ రాకతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో టీమిండియాతో గాబా మైదానంలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ బరిలో దిగాడు. ఇక కెరీర్లో మొత్తంగా 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్.. 1613 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే.. టీ20 ఫార్మాట్లో ఫినిషర్గా వేడ్ గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. పాకిస్తాన్తో సెమీ ఫైనల్లో కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్కు చేర్చాడు. కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ అది! ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు మాథ్యూ వేడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్లకు మాత్రం అతడు దూరం కానున్నాడు. ఇక టీ20 వరల్డ్కప్-2024లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న మాథ్యూ వేడ్ ఫస్ట్క్లాస్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.
ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. బాజ్బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్కు టీమిండియా సరైన సమాధానమే చెప్పింది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇక క్రికెట్ ఆడలేనని భావించిన రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తానని హిట్మ్యాన్ తెలిపాడు. "నేను క్రికెట్ ఆడేందుకు సరిపోనని భావించిన రోజు నా అంతట నేనే రిటైర్ అవుతాను. కానీ గత 2-3 ఏళ్లలో నా ఆట ఎంతో మెరుగుపడిందని" రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఇటీవలే రోహిత్ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్కు దూకుడుగా ఆడే వయస్సు అయిపోయిందని, అతడు రిటైర్ అయితే బెటర్ అని బాయ్కాట్ విమర్శించాడు. ఈ నేపథ్యంలో బాయ్కాట్ వ్యాఖ్యలకు రోహిత్ కౌంటర్ ఇచ్చినట్లైంది. కాగా ఈ సిరీస్లో రోహిత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో రెండు సెంచరీల సాయంతో 400 పరుగులు చేశాడు. చదవండి: IND Vs ENG: ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 15 ఏళ్ల కెరీర్కు గుడ్బై
ఆఫ్గానిస్తాన్ వెటరన్ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నూర్ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్.. 2019లో స్కాట్లాండ్తో జరిగిన వన్డేతో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్ అఫ్గానిస్తాన్ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన 15 ఏళ్ల కెరీర్లో జద్రాన్ ఓవరాల్గా 1902 పరుగులు అలీ సాధించాడు. అందులో 1216 పరుగులు వన్డే ఫార్మాట్లో సాధించినివే కావడం గమనార్హం. టీ20ల్లో 597 పరుగులు చేశాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లోనూ జద్రాన్ అఫ్గాన్ జట్టులో భాగమయ్యాడు. ఈ ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్లపై హాఫ్ సెంచరీలతో జద్రాన్ చెలరేగాడు. అతడు చివరగా అఫ్గాన్ తరపున ఇటీవల ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆడాడు. అదే విధంగా జద్రాన్ 2010 టీ20 వరల్డ్కప్లో భారత్పై హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్
హైదరాబాద్కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ప్రణీత్ తన కెరీర్లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. View this post on Instagram A post shared by Sai Praneeth (@saipraneeth92) ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్లోని నార్త్ కరోలినా క్లబ్లో అతను కోచ్గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహచరుడు, మిజోరాం రాష్ట్ర జట్టు మాజీ కెప్టెన్ తరువార్ కోహ్లి ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 35 ఏళ్ల తరువార్ ప్రొఫెషనల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. పంజాబ్లోని జలందర్లో పుట్టి పెరిగిన తరువార్.. ఆ రాష్ట్రం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో మిజోరాంకు వలస వెళ్లాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 55 మ్యాచ్లు ఆడిన తరువార్.. 97 ఇన్నింగ్స్ల్లో 53.80 సగటున 4573 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 18 అర్దసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తరువార్ అత్యధిక స్కోర్ 307 నాటౌట్గా ఉంది. తరువార్ ఖాతాలో రెండు ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2008 అండర్-19 వరల్డ్కప్లో విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన తరువార్.. ఆ టోర్నీలో వరుసగా మూడు అర్దసెంచరీలు సాధించి, మూడో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ వేసే తరువార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 74, లిస్ట్ ఏ క్రికెట్లో 41, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ, టీ20ల్లోనూ (బ్యాటింగ్) తరువార్కు మెరుగైన రికార్డే ఉంది. లిస్ట్-ఏలో తరువార్ 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 1913 పరుగులు (72 మ్యాచ్ల్లో) చేయగా.. టీ20ల్లో 7 అర్దసెంచరీల సాయంతో 1057 పరుగులు (57 మ్యాచ్ల్లో) చేశాడు. దేశవాలీ క్రికెట్తో పాటు తరువార్ ఐపీఎల్లోనూ ఆడాడు. 2008, 2009 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్లో నాలుగు మ్యాచ్లు ఆడిన తరువార్.. కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2008 అండర్-19 వరల్డ్కప్లో విరాట్, తరువార్తో పాటు రవీంద్ర జడేజా కూడా యంగ్ ఇండియా టీమ్కు ప్రాతినిథ్యం వహించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్..
టీమిండియా ఓపెనర్, విధర్బ మాజీ కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా నాగ్పూర్ వేదికగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్ అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి ఫైజ్ ఫజల్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫైజ్ ఫజల్ వెల్లడించాడు. "విదర్భ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. గత 21 ఏళ్లగా విదర్భ క్రికెట్తో ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయి. నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ప్రయాణం ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడే ముగించాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు. కానీ నా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ముందుకు వెళ్లడానికి ఇదే సరైన సమయమని భావించాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిని సహచరులు, కోచ్లు, ఫిజియోలు, ఫ్యామిలీ, అభిమానులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఫజల్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఫైజ్ ఫజల్ 2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసాడు. తన అరంగేట్ర మ్యాచ్లోనే జమ్మూ కాశ్మీర్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 137 మ్యాచ్లు ఆడిన ఫజల్.. 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలతో 9,183 పరుగులు చేశాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్లో 113 మ్యాచ్లు ఆడిన అతడు 3,641 పరుగులు చేశాడు. ఇక 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్తో ధోని సారథ్యంలో భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫైజ్.. తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయతే దురదృష్టవశాత్తూ తర్వాత అతడికి జాతీయ జట్టు తరపున ఆడే అవకాశం మళ్లీ రాలేదు. View this post on Instagram A post shared by Faiz Fazal (@faizfazal24) -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2024లో రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్ తనకు చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల వరుణ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన సొంత మైదానమైన కీనన్ స్టేడియంలో (జంషెడ్పూర్) రాజస్థాన్తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. 2010 దశకంలో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వరుణ్.. 2011-15 మధ్యలో 9 టెస్ట్లు, 9 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 52 మ్యాచ్లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. వరుణ్ దేశవాలీ క్రికెట్లో జార్ఖండ్తో పాటు బరోడా జట్టుకు కూడా ఆడాడు. 2014 ఓల్డ్ట్రాఫర్డ్ టెస్ట్లో రాకాసి బౌన్సర్తో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ముక్కు పగలగొట్టడం ద్వారా వరుణ్ వెలుగులోకి వచ్చాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
జార్ఖండ్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారి ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 34 ఏళ్ల తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెడ్పూర్లో ఇవాళ (ఫిబ్రవరి 12) ప్రకటించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్తానం ముగిసిన అనంతరం తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్లో పలు మ్యాచ్లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్లు ఆడాడు. తివారికి హార్డ్ హిట్టర్గా పేరుంది. అతని ఆహార్యం, హెయిర్ స్టయిల్ చూసి అప్పట్లో అందరూ మరో ధోని అనే వారు. 2010 ఐపీఎల్ సీజన్లో తివారి ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో అతను 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే తివారికి టీమిండియాలో ఛాన్స్ దక్కింది. భారత్ తరఫున అతను ఆడిన 3 మ్యాచ్ల్లో 49 పరుగులు చేవాడు. అంతర్జాతీయ స్థాయి తివారి రాణించలేకపోయినా, దేశావాలీ క్రికెట్లో స్టార్గా పేరుంది. అతను జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం. కోహ్లి చొరవతోనే తివారిని ఆర్సీబీ 2011 సీజన్ కోసం భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. జాతీయ జట్టుకు కాని, ఐపీఎల్లో కాని ఆడనప్పుడు క్రికెట్లో కొనసాగడం వేస్ట్ అని రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించే సందర్భంగా తివారి అన్నాడు. -
వెస్టిండీస్కు భారీ షాక్.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు క్రికెటర్లు
వెస్టిండీస్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్, మీడియం పేసర్ షకీరా సెల్మన్, కవలలైన వికెట్కీపర్ కమ్ బ్యాటర్ కైసియ నైట్, మిడిలార్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు విండీస్ టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. WI Women's cricketers Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have confirmed their retirement from International cricket. Read More⬇️ https://t.co/bV88ZNxITw — Windies Cricket (@windiescricket) January 18, 2024 35 ఏళ్ల అనిసా మొహమ్మద్ (ఆఫ్ స్పిన్నర్) 2003-22 మధ్యలో విండీస్ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 34 ఏళ్ల షకీరా సెల్మన్ (మీడియం పేసర్) 2008-22 మధ్యలో విండీస్ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది. 31 ఏళ్ల కైషోనా నైట్ (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) 2013-22 మధ్యలో విండీస్ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్ తీసింది. 31 ఏళ్ల కైసియ నైట్ (వికెట్కీపర్ బ్యాటర్) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్ చేయడంలో భాగమైంది. -
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్లో (బిగ్బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్లో జనవరి 16న సిడ్నీ థండర్స్తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్లో (బిగ్బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్లో మెల్బోర్న్ స్టార్స్పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్రేట్తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్కు స్వయానా అన్న అవుతాడు. -
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ జట్టు వికెట్కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు. టెస్ట్ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని, తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్లకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ ఓ ప్టేట్మెంట్ ద్వారా వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు. 32 ఏళ్ల క్లాసెన్ సౌతాఫ్రికా తరఫున కేవలం నాలుగు టెస్ట్లు మాత్రమే ఆడాడు. 2019లో టెస్ట్ ఫార్మాట్లోకి అడుగుపెట్టినప్పటికీ.. డికాక్ అప్పటికే జట్టులో స్థిరపడిపోయినందున క్లాసెన్కు సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు కూడా సౌతాఫ్రికా సెలెక్టర్లు టెస్ట్ జట్టులోకి క్లాసెన్ను తీసుకోవట్లేదు. విధ్వంసకర ఆటగాడు కావడంతో క్లాసెన్పై లిమిటెడ్ ఓవర్స్ ప్లేయర్గా ముద్ర పడింది. అందుకే అతనికి సరైన అవకాశాలు రాలేదు. పైగా అతనికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 4 టెస్ట్ల్లో క్లాసెన్ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్లు, 2 స్టంపౌట్లు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో క్లాసెన్కు మంచి రికార్డే ఉంది. అతను 85 మ్యాచ్ల్లో 46.09 సగటున పరుగులు చేశాడు. వన్డే, టీ20ల్లో క్లాసెన్కు ఘనమైన రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 40.1 సగటున 1723 పరుగులు చేసిన క్లాసెన్.. 43 టీ20ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 147.6 స్ట్రయిక్రేట్తో 722 పరుగులు చేశాడు. -
Australian cricketer: వన్డేలకు వార్నర్ గుడ్బై
ఆ్రస్టేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వన్డే ఫార్మాట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్లో మెరుపులు, నోటితో తూటాలు పేల్చే అతను పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచాడు. అతని ఖాతాలో సెంచరీలున్నట్లే కెరీర్లో సస్పెన్షన్లు, బాల్ టాంపరింగ్ మరకలూ ఉన్నాయి. ఇప్పుడా ఆట, దూకుడు ఇక మీదట టి20లకే పరిమితం కానున్నాయి. సిడ్నీ: డేవిడ్ వార్నర్ అంటే విజయవంతమైన ఓపెనరే కాదు... వివాదాస్పద క్రికెటర్ కూడా! బ్యాట్తో బాదడం ఎంత బాగా తెలుసో... ‘సై అంటే సై’ అని నోటికి పని చెప్పడం కూడా తెలిసినోడు. విధ్వంసకర బ్యాటర్గా ఎలా గుర్తుండిపోతాడో అంతే స్థాయిలో తెంపరితనం ఉన్న వ్యక్తిగానూ ముద్ర వేసుకున్నాడు. ఇక మన తెలుగు ప్రేక్షకులకైతే సన్రైజర్స్ హైదరాబాద్ (ఇప్పుడు లేడు)తో బాగా కనెక్టయ్యాడు. తెలుగు హీరోల మేనరిజాన్ని, పాటలకు నప్పే స్టెప్పులతో సోషల్ మీడియాలో వినోదం పంచిన ఈ ఆస్ట్రేలియన్ తాజాగా వన్డే క్రికెట్కు సైతం వీడ్కోలు పలికేశాడు. పాకిస్తాన్తో స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న వేళ వన్డేలపై నిర్ణయాన్ని ప్రకటించాడు. సిడ్నీలో 3 నుంచి జరిగే మూడో టెస్టు అనంతరం అతను కేవలం అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్లోనే కొనసాగుతాడు. సోమవారం మీడియా సమావేశంలో 37 ఏళ్ల వార్నర్ మాట్లాడుతూ ‘భారత్లో జరిగిన ప్రపంచకప్ సమయంలోనే రిటైర్మెంట్ గురించి చెప్పాను. విశ్వవిజేత జట్టు సభ్యుడిగా ఎంతో సంతృప్తికరమైన వన్డే కెరీర్కు గుడ్బై చెబుతున్నాను. దీనివల్ల నేను ఫ్రాంచైజీ టి20 లీగ్ను మరింత శ్రద్దపెట్టి ఆడేందుకు వీలవుతుంది. ఈ ఫార్మాట్లో అంతర్జాతీయ కెరీర్నూ కొనసాగిస్తాను. అయితే 2025లో చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫామ్లో ఉంటే, జట్టుకు అవసరమనిపిస్తే అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. సఫారీతో అరంగేట్రం దక్షిణాఫ్రికాతో 2009 జనవరిలో జరిగిన టి20 మ్యాచ్తో 22 ఏళ్ల వార్నర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే నెల అదే ప్రత్యర్థితోనే తొలి వన్డే కూడా ఆడాడు. 15 ఏళ్ల కెరీర్లో 99 టి20 మ్యాచ్ల్లో 2894 పరుగులు చేశాడు. ఒక సెంచరీతోపాటు 24 ఫిఫ్టీలు అతని ఖాతాలో ఉన్నాయి. 161 వన్డేలాడిన వార్నర్ 45.30 సగటుతో 6932 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధసెంచరీలున్నాయి. 111 టెస్టుల్లో 44.58 సగటుతో 8695 పరుగులు చేశాడు. 26 శతకాలు, 36 అర్ధశతకాలు బాదాడు. ఇవీ విజయాలు ► మరకలు పక్కనబెట్టి కేవలం క్రికెట్నే పరిగణిస్తే మాత్రం వార్నర్ పరిపూర్ణ సాఫల్య క్రికెటర్ అని చెప్పొచ్చు. ఆ్రస్టేలియా సాధించిన 2015, 2023 వన్డే ప్రపంచకప్లలో అతను కీలకపాత్ర పోషించాడు. 2021 టి20 వరల్డ్కప్ విజయంలో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్íÙప్ విజేత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. ఇవీ వివాదాలు ► 2013 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో జో రూట్ తో వాగ్వాదానికి దిగడంతో క్రికెట్ ఆ్రస్టేలియా అతనిపై రెండు టెస్టుల నిషేధం విధించింది. దీంతో అతను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్ని ఆడలేకపోయాడు. ► కేప్టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వార్నర్ కెరీర్కే మాయని మచ్చ. దీంతో అతనితో పాటు, స్మిత్ (అప్పటి కెపె్టన్) ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. ఇవి చాలవన్నట్లు అదుపులేని నోటి దురుసుతనంతో జీవితకాలం సారథ్యం చేపట్టకుండా శిక్షకు గురయ్యాడు. -
కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. "టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్పై వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ నేను ఫిట్నెస్గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్లో విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్ వార్నర్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్ భాయ్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్గా తన వన్డే కెరీర్లో 161 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్ కొనసాగుతున్నాడు. -
టీమిండియాతో సిరీస్: టెస్టులకు సౌతాఫ్రికా ఓపెనర్ వీడ్కోలు
Dean Elgar Retirement: సౌతాఫ్రికా వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కీలక ప్రకటన చేశాడు. టీమిండియాతో సిరీస్ తర్వాత తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. సొంతగడ్డపై ఆడనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘క్రికెట్ ఆడాలన్నది నా కల. అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అన్నింటికంటే అత్యుత్తమైన విషయం. నా ఆశయాలను నెరవేర్చుకునే క్రమంలో 12 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఎంతో గర్వంగా ఉంది. నాకిష్టమైన స్టేడియంలోనే.. ఇదొక అసాధారణ ప్రయాణం. ఇలాంటి అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం. సొంతగడ్డపై టీమిండియాతో సిరీస్ నా కెరీర్లో చివరిది కానుంది. అందమైన, అద్భుతమైన ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. కేప్టౌన్లో నా చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాను. ప్రపంచంలోకెల్లా నా అభిమాన స్టేడియం అది. అక్కడే నేను న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా తొలిసారి టెస్టుల్లో పరుగు నమోదు చేశాను. అక్కడే నా చివరి పరుగు కూడా తీయాలనుకుంటున్నాను’’ అని డీన్ ఎల్గర్ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు తన ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, సోదరుడు, జీవిత భాగస్వామి నికోల్, స్పాన్సర్స్, క్రికెట్ సౌతాఫ్రికా.. అన్నింటికీ మించి తనను ఇన్నాళ్లుగా ప్రోత్సహిస్తున్న అభిమానులకు ఎల్గర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా 2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అదే ఏడాది ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఎల్గర్ కెరీర్లో కేవలం 8 అంతర్జాతీయ వన్డేలు ఆడి.. 104 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 84 టెస్టులు ఆడి 5146 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఎల్గర్ అత్యధిక స్కోరు 199. సౌతాఫ్రికా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన 36 ఏళ్ల డీన్ ఎల్గర్.. పలు మ్యాచ్లలో కెప్టెన్గానూ వ్యవహరించాడు. చదవండి: విరాట్ కోహ్లి 3.O.. 2023లో ఎన్నో ఘనతలు! కానీ అదొక్కటే -
స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్ మెంట్
-
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
అందుకే సడన్గా రిటైర్మెంట్ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్
ఏబీ డివిలియర్స్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్.. వరల్డ్క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా భారత్లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్.. 2018లో సడన్గా ఇంటర్ననేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటిలో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది. అయితే తాజాగా తన అకస్మాక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్ వెల్లడించాడు. "నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను. అయితే ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు. -
రైల్వే ఘనకార్యం! మూడు రోజుల్లో రిటైరయ్యే ఉద్యోగి బదిలీ
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ డివిజన్కు చెందిన ఒక సీనియర్ ఇంజనీర్ విషయంలో రైల్వేబోర్డ్ ఘనకార్యం చేసింది. మరో మూడు రోజుల్లో రిటైరవుతున్న కేపీ ఆర్యను ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్కు బదిలీ చేసింది. ఖంగుతిన్న ఆయన బదిలీపై నిరాశను వ్యక్తం చేస్తూ రైల్వే బోర్డు సెక్రటరీకి ఘాటు లేఖ రాశారు. బదిలీ ఆర్డర్ను ఆయన బుద్ధిలేని పనిగా పేర్కొన్నారు. బదిలీ ఉత్తర్వు ప్రకారం కేపీ ఆర్య నవంబర్ 28న హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్పై నార్తర్న్ రైల్వేలో చేరాల్సి ఉంది. అయితే ఆయన పదవీ విరమణ నవంబర్ 30న ఉంది. ఈ ఆర్డర్ పైకి బాగానే మూడు రోజుల్లో రిటైరవుతున్న తనను బదిలీ చేయడంలో పిచ్చితనమే కనిపిస్తోందని ఆర్య అన్నారు. ఇది జీవితమంతా ఇండియన్ రైల్వే సంస్థకు సేవ చేసిన ఒక ఉద్యోగిని పదవీ విరమణ సమయంలో కావాలని బదిలీ చేయడమే తప్ప మరొకటి కాదు అన్నారు. దీని వల్ల పదవీ విరమణ సెటిల్మెంట్కు అంతరాయం ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లో హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ పోస్ట్ ఖాళీగా ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు తనను నార్తర్న్ రైల్వే జోన్లో ఖాళీగా ఉన్న పోస్ట్కు బదిలీ చేసిందని ఆర్య పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. పదవీ విరమణకు ముందు కేవలం మూడు రోజులు తాను న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం రైల్వే శాఖ తనకు దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తుందని, ఇది ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేయడమేనని ఆయన ఆక్షేపించారు. ఇది ప్రమోషనల్ ట్రాన్స్ఫర్గా చెబుతున్నప్పటికీ దీని వల్ల తనకు అదనపు ఆర్థిక ప్రయోజనాలేవీ అందించలేదని ఆర్య పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తనకు ఇప్పటికే ఆర్థిక ప్రయోజనాలకు అర్హత ఉన్నప్పటికీ తన పదోన్నతిని ఆరు నెలలు ఆలస్యం చేశారని ఆరోపించారు. -
నో ఛాన్స్! అంతర్జాతీయ క్రికెట్కు పాక్ ఆల్రౌండర్ గుడ్బై
Imad Wasim announces retirement: పాకిస్తాన్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. చాలా కాలంగా ఈ విషయంపై సమాలోచనలు చేస్తున్నానని.. అయితే రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం కల్పించినందుకు పాక్ క్రికెట్ బోర్డు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటానని ఇమాద్ వసీం ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు. అందరికీ థాంక్స్ అంతర్జాతీయ క్రికెటర్గా తన ఎదుగుదలలో తన కుటుంబానిది కీలక పాత్ర అన్న ఈ స్పిన్ ఆల్రౌండర్.. వారి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇకపై ఇంటర్నేషనల్ ప్లేయర్గా కనిపించకపోయినా.. ఆటను మాత్రం కొనసాగిస్తానని ఇమాద్ వసీం స్పష్టం చేశాడు. అదే విధంగా.. కొత్త కోచ్లు, కొత్త నాయకుల రాకతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా మారుతుందని ఇమాద్ ధీమా వ్యక్తం చేశాడు. పాక్ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. కాగా 34 ఏళ్ల ఇమాద్ వసీం.. పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. 50 ఓవర్ల క్రికెట్లో 986, పొట్టి క్రికెట్లో 486 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 44, 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇమాద్ వసీం.. జట్టులో కీలక సభ్యుడిగా పేరొందాడు. చాంపియన్స్ ట్రోఫీ-2017 గెలిచిన పాక్ జట్టులో అతడు సభ్యుడు. అదే విధంగా టీ20 వరల్డ్కప్-2016, వరల్డ్కప్-2019, టీ20 వరల్డ్కప్-2021 ఈవెంట్లలో కూడా పాల్గొన్నాడు. pic.twitter.com/RdEesK9qsl — Imad Wasim (@simadwasim) November 24, 2023 కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మెరుగ్గా ఆడిన ఇమాద్.. స్పిన్ విభాగంలో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. వన్డే వరల్డ్కప్-2023 జట్టులో దక్కని చోటు అయితే... అప్పటి చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం.. ఇమాద్ చాలా కాలంగా వన్డేలు ఆడటం లేదు కాబట్టి అతడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తేనే ఎవరికైనా ఛాన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇమాద్ వసీం ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. అతడు చివరగా ఈ ఏడాది ఏప్రిల్లో న్యూజిలాండ్తో టీ20 సందర్భంగా పాక్ తరఫున మైదానంలో దిగాడు. చదవండి: ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్ రన్నర్.. గర్ల్ఫ్రెండ్ను హత్యచేసి.. ఇలా.. -
భారతీయుల్లో పదవి విరమణపై పెరిగిన అవగాహన..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement