breaking news
one india
-
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
‘వన్ ఇండియా’ అంటే ఇదా?
ఆలోచనం గోవధ నిషేధం వంటి నిరంకుశ చట్టాలతో సామాన్య ప్రజల వృత్తులపై వేటు వేసి వాటిపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం ‘వన్ ఎకనామిక్ ఇండియా’ కిందికే వస్తుందా? ‘‘ఎక్కడ మనసు నిర్భ యంగా ఉంటుందో /ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో / ఎక్కడ జ్ఞానం విరి విగా వెలుస్తుందో /ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవ కుండా ఉంటుందో...’’ ఇవి టాగూర్ ప్రఖ్యాతిగాంచిన ‘వేర్ ది మైండ్ ఈస్ వితౌట్ ఫియర్’ కవితలోని మొదటి నాలుగు పంక్తులు. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే, ‘ఎవరి తాహతును బట్టి వారికి ఏదో కొంత అను భూతిని అందించగలగడం’ అంటారు చలం గీతాంజ లికి రాసిన ముందుమాటలో. భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఈ ఏడాది వెలువరించిన ‘ఎకనామిక్ సర్వే’లో జీఎస్టీకి "One Economic India: For goods and in the Eyes of the Constitution" పేరుతో ఒక అధ్యాయాన్ని కేటాయిం చారు. దీనిని ‘ఎక్కడ ప్రపంచం దేశమనే ఇరుకు గోడల మధ్య ముక్కలవకుండా ఉంటుందో..’ అంటూ ఉదా త్తంగా ప్రారంభించారు. ఈ అధ్యాయం చదువుతున్న పుడు నాకు గొప్ప కవిత గురించి చలం రాసిన పంక్తులు పదే పదే మనసులో కదలాడాయి. చలం పేర్కొన్న తాహతు అనే పదం కొత్త వెలుగులో కనిపించింది. జీఎస్టీ బిల్లును పన్నుల సంస్కరణగా పేర్కొంటూ ‘వన్ ఇండియా, వన్ ట్యాక్స్’ అనీ, ‘వన్ ఎకనామిక్ ఇండియా’ అనీ గొప్ప ఉత్సాహంతో బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. వారు చెప్తున్న ప్రకారం పరోక్ష పన్ను లకు సంబంధించిన జీఎస్టీ ఇంతవరకు ఉన్న అంచెల పన్ను విధానాన్ని రద్దు చేయబోతోంది, జీఎస్టీ వలన జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం తగ్గు తుంది. వ్యాపారుల మీద అధికారుల నియంత్రణను అదుపు చేస్తుంది. కానీ దీనివలన పేదవాడికి ఎంత ఒరుగుతుందనేది ఎవరూ నొక్కి వక్కాణించడం లేదు. ఈ జీఎస్టీ అనే పరోక్ష పన్ను ఒక తిరోగామి పన్ను. జైట్లీ చెప్పిన ప్రకారం బెంజి కారుకు, హవాయి చెప్పు లకు వేర్వేరు జీఎస్టీ రేట్లు ఉండొచ్చు కానీ, హవాయి చెప్పులు అంబానీ కొన్నా, రైతు కూలీ అచ్చెమ్మ కొన్నా ఇద్దరూ దానిపై ఉన్న పన్నును ఒకే రకంగా కట్టాల్సి వస్తుంది. పరోక్ష పన్నుకి రైతుకూలీ అచ్చెమ్మ పేదరాలు అనే ఇంగితం ఉండదు. మన దేశం ట్యాక్స్ జీడీపీ రేషియో 16.6% మాత్రమే. ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకుంటే ఇది చాలాతక్కువ. ఇప్పుడు ప్రభుత్వం జీఎస్టీ ద్వారా పన్నుల జీడీపీని పెంచుతానని అంటుంది. జేఎన్యూ అధ్యాపకుడు సురజిత్ దాస్ ప్రకారం ‘జీఎస్టీ ద్వారా ట్యాక్స్ జీడీపీ పెంచాలనుకునే ప్రయత్నం.. ఇప్పటికే lతీవ్ర ఆర్థిక అసమతౌల్యాలను ఎదుర్కొంటున్న భారత దేశంలో మరిన్ని ఆర్థిక అస మానతలకు తావియ్యడానికి కారణమవుతుంది’. ఒక పన్ను సంస్కరణ సందర్భానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన నినాదాన్ని ఇచ్చింది. ఏమని? వన్ ఇండియా, వన్ ఎకనామిక్ ఇండియా అని. కానీ ఈ దేశం ఏ రోజైనా ’వన్ ఎకనామిక్ ఇండియా’గా ఉందా? భూసంస్కరణలు, ఆర్థిక అస మానతలు తగ్గించడం వంటి అసలు విషయాల జోలికి వెళ్లకుండా ‘వన్ ఎకనామిక్ ఇండియా’ని వ్యాపారం అనే పరిమిత అర్థంలో చూసినా ఇక్కడ ఒక్క ఘనత వహించిన స్త్రీ వ్యాపారవేత్త లేదు, ముస్లింలో, అణచి వేతకు గురైన వర్గాలవారో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం లేదు. బీజేపీతో సహా ఏ పార్టీ ఆ అసమా నతలను పోగొట్టే దిశగా ప్రయత్నించడం లేదు. పైగా ఈ దేశంలో మత, కులపరంగా పారంపర్యమవుతున్న కొన్ని వ్యాపారాలను బీజేపీ దెబ్బతీస్తోంది. వారి చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బకొడుతూ ‘వన్ ఎకనామిక్ ఇండియా’లో వారు భాగస్వామ్యం కాకుండా చేస్తోంది. గోవధ నిషేధం పేరుతో చేస్తున్న చట్టాలు, మాంసం ఎగుమతిపై విధిస్తున్న నిషేధాలు ఈ నిరంకుశత్వంలో భాగమే. ఒక్క యూపీలోనే మాంసం ఎగుమతిని నిషే ధించడం వలన ఆ రాష్ట్రానికి సాలుకు రూ. 11,350 కోట్లు నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కలకత్తా లెదర్ ఎక్స్పోర్టర్ జియా నఫీస్ మాటలలోనే చెప్పా లంటే ‘ఇక్కడి తోళ్ల పరిశ్రమ విలువ ప్రస్తుతం 12 బిలి యన్లు, అది 24 బిలియన్ల దిశగా నడుస్తున్నపుడు సప్లై రావటం ఆగిపోతే మేక్ ఇన్ ఇండియా ఎలా సాధ్యం’? అదే విధంగా ఘనత వహించిన కొల్హాపూర్ చెప్పుల పరిశ్రమ తోళ్ల లోటుతో వెలవెలపోతూ ఉంది. అట్లా వారి వారి వృత్తులపై వేటు వేసి దానిపై ఆధార పడి జీవిస్తున్న వారి జీవితాలను అల్లకల్లోలం చేయడం వన్ ఎకనామిక్ ఇండియా కిందికే వస్తుందా? అసలైన అస మానత ఏమిటంటే, అసమంగా ఉన్న విషయాలను సమం చేయడానికి ప్రయత్నించడమే అంటాడు అరిస్టా టిల్. బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఒకవైపు తమ కున్న అనేకానేక ‘‘మెంటల్ రిజర్వేషన్స్’’ను దేశంపైన రుద్దుతూ, మరోవైపు అడ్డుగోడలు తొలగిపోయి దేశ మంతా ఒక్కటి కావాలని కవిత్వాలు ఉటంకించడం, స్లోగన్లు ఇవ్వడం అతి పెద్ద విరోధాభాస. వీటన్నిటిని చూశాక నా తాహతు బట్టి టాగోర్ కవి తను నేను అర్థం చేసుకున్న దానిని బట్టి అందులోంచి తీసుకున్న కొన్ని లైన్లతో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ‘‘ఎక్కడయితే నిర్జీవమయిన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గా నికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు’’. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966