breaking news
nda candidates
-
సీఏఏను గట్టిగా సమర్థించండి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్లో విపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని ఎన్డీయే పక్ష సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం తప్పేం చేయలేదని, చట్టాన్ని సమర్థిస్తూ గట్టిగా వాదనను విన్పించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీయే పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. సమావేశంలో మోదీ పేర్కొన్న అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ మిత్రపక్ష నేత ఒకరు వెల్లడించారు. ‘సీఏఏ ముస్లింలపై వివక్ష చూపుతుందన్న ప్రతిపక్షాల వాదనను గట్టిగా తిప్పికొట్టండి. ముస్లింలతో పాటు పౌరులంతా మనకు సమానమేనని స్పష్టం చేయండి’ అని ప్రధాని చెప్పారన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించిన ప్రశ్నావళి నుంచి కొన్ని ప్రశ్నలను తొలగించాలని సమావేశంలో మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్పీఆర్ నుంచి తల్లిదండ్రుల వివరాలను కోరే ప్రశ్నలను తొలగించాలని కోరామని, దానికి హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని జేడీయూ ఎంపీ లలన్ సింగ్ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్ కూడా తమ సూచనను సమర్ధించిందన్నారు. తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వడం ఐచ్ఛికమేనని ఇప్పటికే కేంద్రమంత్రి జవదేకర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఫలవంతమవుతాయని, సభ్యులు నాణ్యత కలిగిన చర్చను జరుపుతారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు సభలూ ఆర్థిక సమస్యల గురించి, ప్రపంచ ఆర్థిక మందగమన నేపథ్యంలో భారత్ ఎలా ముందుకు సాగాలో వంటి వాటిపై విస్తృతంగా చర్చించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దశాబ్దానికి గట్టి పునాదులు ఈ బడ్జెట్తోనే ప్రారంభమవ్వాలని చెప్పారు. ఈ సెషన్లో ఆర్థిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. దళితులు, మధ్యతరగతివారు, అణచివేతకు గురైన వారు, మహిళల సాధికారత కోసం ఈ దశాబ్దంలో కూడా తాము కష్టపడతామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ఫిబ్రవరి 11 వరకూ, రెండో దశ సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. విపక్షాల చర్య అప్రజాస్వామికం: జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన విపక్షాల చర్య అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు, 2022 నాటికి కొత్త భారత నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రపతి వివరించారు. దీనిపై సభ్యులంతా హర్షద్వానాలతో స్వాగతించగా, కొందరు ప్రతిపక్ష నాయకులు నలుగురు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలని ప్రయత్నం చేశారు. ఇది అప్రజాస్వామికం. వారంతా క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. -
బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే అంశంపై ఆ రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఎన్నికలకు ముందు వినిపించింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సీఎం పదవికి రేసులో ఉన్న నాయకుల్లో ఆయన పేరు మచ్చుకు కూడా వినిపించడం లేదు. దీనికి కారణం ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే కావచ్చు. రొహతాస్ జిల్లా దినార అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజేంద్రసింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాజేంద్ర సింగ్ ఆరెస్సెస్లో పూర్తికాల కార్యకర్త. ఆయన్ని అప్పుడే 'బిహార్ మనోహర్ లాల్ ఖట్టర్' అని కూడా అనుచరవర్గం పిలుస్తోంది. ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అయిన మనోహర్ లాల్ ప్రస్తుతం హర్యానా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్లో పూర్తికాల కార్యకర్తగా రాజేంద్రసింగ్ పనిచేసినా ఆయన బిహార్ రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా లేరు. ఏబీవీపీ నుంచి పార్టీలోకి వచ్చినా.. ఆయన ఎక్కువకాలం ఉత్తరప్రదేశ్లోనే ఉన్నారు. జార్ఖండ్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా 2013లో ఆయన ఎన్నికయ్యారు. అయితే ఆయనకున్న అడ్డంకి ఒక్కటే. ఆయన తాను పోటీచేసిన దినార నియోజకవర్గం నుంచి గెలుస్తారా అన్నదే. ఎందుకంటే అక్కడ ఆయనపై నితీష్ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న జయ్కుమార్ సింగ్ జేడీయూ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రసింగ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీజేపీ గయ ఎమ్మెల్యే ప్రేమ్కుమార్. ఆయన బిహార్ అసెంబ్లీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కావడంతో పాటు 1990 నుంచి ఇప్పటివరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నడూ ఓడిపోలేదు. బలహీనవర్గాలకు చెందిన ఆయనే కాబోయే ముఖ్యమంత్రంటూ గయ పోలింగ్కు రెండు రోజుల ముందు బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ప్రకటించారు. ఆయనది కూడా రాజేంద్రసింగ్ లాంటి సమస్యే. ఆయనపై కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి ప్రియరంజన్ పోటీచేశారు. బిహార్ ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న నందకిషోర్ యాదవ్ కూడా రేస్లో ఉన్నారు. ప్రేమ్కుమార్లాగే ఆయన కూడా ఓటమి ఎరుగని ధీరుడు. పైగా ఆరెస్సెస్ కార్యకర్త. నరేంద్ర మోదీకి కాస్త సన్నిహితులు. అలాగే మోదీకి సన్నిహితులు, బలహీనవర్గానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ చౌరాసియా పేరు కూడా వినిపిస్తోంది.