-
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీనికి తోడుగా రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి బలమైన గాలులు వీస్తు న్నా యి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు నమో దయ్యే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, గాలు లతో కూడిన వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ వారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే నమో దయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమో దైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత నిజామా బాద్లో 41.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.5 డిగ్రీ సెల్సి యస్గా నమోదైంది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతా వరణ శాఖ నిపుణులు తెలిపారు. -
20 వరకు వర్షాలే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు వడగాడ్పులకు విరామం లభించనుంది. ఇప్పటికే ఐదారు రోజుల నుంచి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించడం లేదు. ఫలితంగా వడగాడ్పులు వీయడం లేదు. ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్పటివరకు వడగాడ్పులకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు. 20వ తేదీ తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయంటున్నారు. మరోవైపు దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ద్రోణితో విలీనమైంది. అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న ఐదు రోజులు (20వ తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కాగా.. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు గోగులదిన్నె (ప్రకాశం)లో 4.1, గవరవరం (ఏలూరు)లో 3.9, పైడిమెట్ల (తూర్పు గోదావరి)లో, ఫిరంగిపురం (గుంటూరు)లో 3.4 సెం.మీ. చొప్పున, జీకే వీధి (అల్లూరి సీతారామరాజు) 3, ఆత్మకూరు (నంద్యాల)లో 2.5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
మూడు రోజులు వానలే
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు రాష్ట్రంపైకి దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి రానున్న 3 రోజులపాటు కొనసాగనున్నాయి.ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అదే సమయంలో పిడుగులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు అనపర్తి (తూర్పు గోదావరి)లో 3.1, ఆలమూరు (కోనసీమ) 3, పరవాడ (అనకాపల్లి) 2.6, మంగళగిరి (గుంటూరు)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్టు వాతావరణశాఖ సూచించింది. మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతా ల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండురోజులు ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశముంది.శుక్రవారం ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే నిజామాబాద్లో 41.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 24 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. సోమవారం రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, జీహెచ్ఎంసీ పరిధితోపాటు సమీప జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సూచించింది. ఆ తర్వాత రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది. -
నెల ముందే గరిష్టానికి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే స్థాయిలోని గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలోనే నమోదవుతుండటం గమనార్హం. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లిపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలలో గరిష్ట ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం.దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో చూస్తే.. మహబూబ్నగర్లో సాధారణం కంటే 4.5 డిగ్రీలు, హైదరాబాద్, ఖమ్మంలలో 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాగే అధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పుల తీవ్రత పెరిగే చాన్స్ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచాయని.. ఆది, సోమవారాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఉరుములు, మెరుపుల వానలకు చాన్స్ మరాఠ్వాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది. -
నిప్పుల కొలిమి!
పదేళ్లలో ఇవే అత్యధికంగత పదేళ్ల వేసవి సీజన్ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్నవే అత్యధికమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మే ప్రారంభంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఈసారి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయని అంటున్నారు. ఎప్పుడూ కూడా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అటుఇటుగా నమోదయ్యేవని.. ఇప్పుడు మాత్రం 2 నుంచి 4 డిగ్రీల మేర అధికంగా కొనసాగుతున్నాయని వివరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది.. దంచికొడుతున్న ఎండలతో కుతకుత లాడుతోంది. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కుపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలు కూడా దాటిపోయాయి. బుధవారం అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్లో 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 46.5, సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5, నల్లగొండ జిల్లా చండూరులో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా కొనసాగుతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే ఏకంగా 5 డిగ్రీ లు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నట్టు తెలిపింది.11 జిల్లాలకు రెడ్ అలర్ట్..ఎండలు పెరిగిపోయిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజా మాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యా పేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని.. వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. మొత్తంగా వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీయవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. తక్షణ సహాయక చర్యలు తీసు కునేలా సమాయత్తం కావాలని సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు అక్కడక్కడా తేలికపాటి వానలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. -
వారంపాటు తీవ్ర వడగాడ్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకుతోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నెల 6 వరకు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడా తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రామగుండం.. అగ్నిగుండం.. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఖమ్మంలో సాధారణం కంటే 3.6 డిగ్రీలు, భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లలో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.1, కొల్వాయ్ 46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లోకెల్లా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
రెండ్రోజులు మండే ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవుతోంది. మాడుతున్న నల్లగొండ..: సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోకెల్లా నిజామాబాద్లో 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవగా భద్రాచలం, మహబూబ్నగర్, హైదరాబాద్లలో 2–3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మతూర్లో 45.5 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్లో 45.1 డిగ్రీలు, అదే జిల్లాలోని మాడుగులపల్లిలో 45.0 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలుచోట్ల తీవ్రంగా వడగాడ్పులు రానున్న రెండ్రోజులు పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 30 నుంచి మే 2వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. తక్షణ చర్యలు చేపట్టేలా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
నిప్పులు కక్కుతున్న సూరీడు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే.. ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
అధిక ఉష్ణోగ్రత... ఆపై ఉక్కపోత!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మాడుపగిలే ఎండ, వడగాడ్పులు... మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోత. ఇదీ శనివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణ పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ♦ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రచండ భానుడు.. రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.4, నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 45.3, ములుగు జిల్లా మల్లురులో 45.2 డిగ్రీల సెల్సీయస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే మహబూబ్నగర్లో 43.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.మహబూబ్నగర్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 3.2 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా మిగతా ప్రాంతాల్లో ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్దలు, పిల్లలు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.ఆకు రాల్చిన అభయారణ్యం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల అభయారణ్యం వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అన్ని రకాల జంతువులు, పక్షులకు నిలయమిది. సరస్సు చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం పచ్చదనంతో అన్ని రకాల పక్షుల అలజడితో చూడముచ్చటగా ఉండేది. వేసవిలో మండుతున్న ఎండలతో చెట్లన్నీ ఆకురాలడంతో అటవీ ప్రాంతమంతా బోసిపోయి ఇలా కనిపిస్తోంది. – నర్సంపేట -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
45 డిగ్రీలు దాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా... రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్లో 24.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. -
భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో 44.2 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత నాలుగైదు రోజులుగా కాస్త చల్లబడ్డ గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ వేగంగా పెరిగాయి. మంగళవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా ఉక్కపోత... పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 42.6 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 22.3 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.1 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3 డిగ్రీలు, నల్లగొండతో పాటు పలు ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడం గమనార్హం. పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్ర ప్రణాళిక శాఖ వాతావరణ పరిశీలన కేంద్రాల్లో నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం జిల్లా చుంచుపల్లిలో గరిష్ట ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలో ఇదే అత్యధికం. ఆ తర్వాత నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 43.8 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 43.8డిగ్రీలు, నిజామాబాద్లో 43.3 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంకలో 43.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా మంథనిలో 43.1 డిగ్రీలు, మహబూబా బాద్ జిల్లా మరిపెడలో 43.0 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేటి నుంచి మరింతగా బుధవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. రాష్ట్రానికి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వివరించింది. గరిష్ట ఉష్ణోగ్రతలకు తోడుగా రెండు రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని సూచించింది. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమృద్ధిగా ‘నైరుతి’ వానలు
సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంపై ఐఎండీ సోమవారం ముందస్తు అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చెప్పిన కబురు ఉపశమనం కలిగించింది. గత ఏడాది ఎల్నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అరకొర వర్షాలే కురిశాయి. ఫలితంగా పంటలు దెబ్బతిన్నాయి. రానున్న నైరుతి సీజన్లో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా తెలిపారు. ఈ వానలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి. అన్నదాతలకు ఊరట ఇవ్వనున్నాయి. నైరుతి రాకపై మే నెలలో స్పష్టత ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడనే విషయమై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన కేరళను తాకాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు నెమ్మదిగా విస్తరించాయి. దీంతో వర్షాలు సకాలంలో కురవకపోవడమే కాదు.. సమృద్ధిగాను కురవలేదు. కొనసాగుతున్న వడగాడ్పులు రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40–44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 75 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. రానున్న మూడురోజులు ఇవి మరింతగా ప్రభావం చూపనున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.9 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 43.1, పల్నాడు జిల్లా మాచెర్ల, విజయనగరం జిల్లా రాజాంలలో 42.8, అనకాపల్లి జిల్లా గాదిరాయిలో 42.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 130 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 22, శ్రీకాకుళం 15, పార్వతీపురం మన్యం 13, అనకాపల్లి 4, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 3, తూర్పు గోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో 17, కాకినాడ 16, శ్రీకాకుళం జిల్లాలో 14, ఏలూరు 13, అనకాపల్లి 12, అల్లూరి సీతారామరాజు 11, కోనసీమ 9, కృష్ణా 7, ఎనీ్టఆర్ 7, గుంటూరు 7, విజయనగరం 5, పల్నాడు 4, విశాఖపట్నం 3, పశ్చిమ గోదావరి 3, పార్వతీపురం మన్యం జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. బుధవారం 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 135 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది. -
వేడి నుంచి కాస్త ఊరట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. ఆకాశం మేఘావృతం కావడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత మాత్రం అధికంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 38.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 20.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ప్రస్తుతం మరఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశల వైపుగా గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. వానలతో పాటు వడగండ్లు కూడా పడతాయని హెచ్చరించింది. సాధారణం కంటే తక్కువగా... శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక రామగుండంలో 3 డిగ్రీల కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 16.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్నగర్లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్లో 18.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు కాగా...ఆదిలాబాద్లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఉంటుందని, తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ వివరించింది. -
ఎండలు పెరిగాయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు చిటపటమంటున్నాయి. వేసవి సీజన్ రాకముందే ఎండల తీవ్రత వేగంగా పెరిగింది. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కావడంగమనార్హం. పగటి ఉష్ణోగ్రతలకు తోడుగా రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉషోగ్రత భద్రాచలంలో 36.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్లో 18.2 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఖమ్మంలో 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా.. గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదు కాగా... హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. మిగతా కేంద్రాల్లో 2 డిగ్రీల్లోపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో పగటి పూట ఉక్కపోత పెరిగింది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రత మరింత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
వణికించిన మిచాంగ్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మిచాంగ్ తుపాను తిరుపతి, నెల్లూరు జిల్లాలను కుదిపేసింది. పలు జిల్లాలను వణికించింది. దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అతి తీవ్ర వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఈదురు గాలులకు నెల్లూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, పలు చోట్ల గుడిసెలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలిపోయాయి. అయితే ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్ధరించగలిగారు. కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు. మరోవైపు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వాసులను భయపెడుతున్న మిచాంగ్ తుపాను ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు నైరుతి దిశగా 15 కి.మీల దూరంలో తీవ్ర తుపానుగా తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తీరం దాటడానికి 3 రోజుల ముందు నుంచి బంగాళాఖాతంలో తుపాను 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో బాపట్ల వైపు దూసుకువచ్చింది. మొదట్లో దివిసీమ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కనిపించినా, చివరకు అది తీవ్ర తుపానుగా మారి బాపట్లకు దగ్గరగా వచ్చి ఆ సమీపంలోనే తీరం దాటింది. తీరం దాటిన తర్వాత భూమిపై 11 కిలోమీటర్ల వేగంతో నార్త్ వెస్ట్ వైపు పయనిస్తూ తుపానుగా బలహీనపడింది. మంగళవారం రాత్రి 9 గంటలకు బాపట్లకు 20 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. తీవ్ర తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తిరుపతి జిల్లా చింతవరంలో 42 సెంటీమీటర్ల వర్షం తుపాను ప్రభావంతో మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సగటున 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 8.6 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లాలో 6.4, కృష్ణాలో 5.5, నెల్లూరు జిల్లాలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలో 24 గంటల వ్యవధిలో 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలం చిట్టేడులో 39 సెంటీమీటర్లు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లెలో 37, తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడులో 35, చిల్లకూరులో 33, నాయుడుపేటలో 29, బాలాయపల్లె మండలం చిల్లమన్నూరులో 25, నెల్లూరు జిల్లా సైదాపురంలో 22, వెంకటాచలంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, సత్యవేడు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం, మనుబోలు, వెంకటాచలం, అన్నమయ్య జిల్లా పెనగలూరు, బాపట్ల జిల్లా పర్చూరు, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలాల్లో పలుచోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నమోదైన గరిష్ట వర్షపాతాల్లో అత్యధికంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా తాడువాయిలో 15.9, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 14.5, అనకాపల్లి దార్లపూడిలో 13.6, కొత్తకోటలో 13, బలిఘట్టం 12.6, బాపట్ల జిల్లా అప్పికట్లలో 12.5, అనకాపల్లి కృష్ణాపురంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వాగులు, వంకలు మిచాంగ్ తుపాన్ వల్ల తిరుపతి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. స్వర్ణముఖి, అరణియార్, కాళంగి, కళ్యాణీ డ్యాం, మల్లిమడుగు, సదాశివకోనతో పాటు తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ, గోగర్భం జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 775 చెరువులకు భారీగా వరద నీరు చేరటంతో కలుజులు పొంగి ప్రవహిస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన తిరుపతి జీవకోనకు చెందిన తాత, మేనమామతో కలిసి వెళ్లిన నిఖిల్ (10) వాగులో కొట్టుకుపోయాడు. బాలుడి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ఏర్పేడు మండలం బండారుపల్లి వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. కాళంగి రిజర్వాయర్ నుంచి 38 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయటంతో సూళ్లూరుపేట పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. చెంగాళమ్మ ఆలయం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. చెన్నై– విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కరివేటి కాలువ, కాళంగి నది, పాముల కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాదలూరు, సూళ్లూరుపేట చెరువులకు గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేట– శ్రీకాళహస్తి మధ్య రహదారిపై 3 కి.మీ మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీహరి కోట, పులికాట్కు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్ మత్స్య కేంద్రం నీట మునగటంతో 10 లక్షలకుపైగా చేప పిల్లలు సముద్రంలో కలిసిపోయాయి. వెంకటగిరి పరిధిలో కైవల్యం, పిన్నేరు, మాలేరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వెంకటగిరి–గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలోని కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. చెన్నారెడ్డి కాలనీలోని నివాసం ఒకటి కూలిపోవటంతో పక్కనే ఉన్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద కాలువల్లో పూడికతీత పనులు తీయటం, ప్రజలను అప్రమత్తం చేయటం వంటి పనులు చేపట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్వర్ణముఖి, నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 31 సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వెయ్యికిపైగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 200పైగా ట్రాన్సఫార్మర్లు కాలిపోయాయి. ఫలితంగా 279 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దణ పనుల కోసం 188 బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నీట మునిగిన పంటలు.. ► బాపట్ల జిల్లాలో తుపాన్ తీరం దాటే సమయంలో సముద్రంలో భీకర హోరుతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. చీరాల ప్రాంతంలో 60 మీటర్లు, బాపట్ల, నిజాంపట్నం వద్ద 20–30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం కోతకు గురైంది. తుపాన్ ధాటికి సూర్యలంక ప్రాంతంలో అవుట్పోస్టు దెబ్బతింది. 177 గ్రామాల్లో తుపాన్ ప్రభావం కనిపించింది. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. గాలివానకు 30 విద్యుత్ స్తంభాలు, 100 ఇన్సిలేటర్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పూరిళ్లు, ప్రహరీలు కూలిపోయాయి. అద్దంకి ప్రాంతంలో గుండ్లకమ్మ, నల్లవాగు, పర్చూరు నియోజకవర్గంలో పోలూరు, వింజనంపాడు, ఎద్దనపూడి వాగులు పొంగి పొర్లాయి. ► ప్రకాశం జిల్లాలో 20 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట ముగాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఒంగోలు విద్యుత్ డివిజన్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలనూ మిచాంగ్ తుపాన్ వణికించింది. ఉద్యాన, వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కడప–చెన్నై రహదారిలోని భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం గ్రామం వద్ద చెట్టు విరిగి మీదపడటంతో బైక్పై వెళుతున్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ దుర్మరణం చెందారు. పీలేరు మండలం మేళ్లచెరువులో పాఠశాల ప్రహరీ గోడ కూలి దూడ మృతి చెందింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుంజన నది ఉప్పొంగి ప్రవహించింది. దాదాపు 30 గ్రామాల ప్రజలు బయటి ప్రాంతానికి రాలేకపోయారు. ► కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతాన్ని తుపాను అతలాకుతలం చేసింది. ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాల్లోని తీరంలో మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డు రెండు కిలోమీటర్ల మేర దెబ్బతింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా వచ్చిన సుడిగాలులు కొత్తపల్లి మండలం కొండెవరం, పిఠాపురం మండలం పి దొంతమూరులలో బీభత్సం సృష్టించాయి. రెండు గ్రామాల్లో 180 గృహాలు దెబ్బతిన్నాయి. ► డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 121 మి.మీటర్ల వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మోరి, వి.వి.మెరకలలో సుడిగాలి తీవ్రతకు ఇళ్ల మీద రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిçపడ్డాయి. ► మిచాంగ్ తుపాను నేపథ్యంలో పెద్ద ఎత్తున కెరటాలు, బలమైన ఈదురు గాలులతో భీమిలి నుంచి గుడ్లవానిపాలెం బీచ్ వరకు తీరం అల్లకల్లోలంగా మారింది. మంగమారిపేట, రుషికొండ, సాగర్నగర్ బీచ్ల వద్ద కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడి తీరాన్ని కోతకు గురి చేసింది. రుషికొండ బీచ్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కు, సాగర్నగర్లో కొబ్బరితోట పార్కు నీట మునిగాయి. మంగమారిపేట, ఉప్పాడ, భీమిలి తీర ప్రాంతాల్లో సముద్రం కాస్త ముందుకు చొచ్చుకుని రావడంతో మత్య్సకారులు ఆందోళనకు గురయ్యారు. భీమిలి తీరంలో అలల తీవ్రతకు బోయివీధి గట్టు చాలా వరకు దెబ్బతింది. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రుషికొండ బీచ్లో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. కె.నగరపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో వర్షాలకు వరి పంట నీట మునిగింది. ► ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 417 గ్రామాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. 121.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 గ్రామాల పరిధిలో 3354 హెక్టార్లలో వరి పంట నీట మునింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 172 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోకి వర్షపు నీరు చేరింది. కలెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 93.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వీరవాసరం, నరసాపురం మండలాల్లో సుడిగాలి తాకిడికి వందల కొద్దీ కొబ్బరి చెట్లు, అధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలి దుమారం.. ఇద్దరు దుర్మరణం బుట్టాయగూడెం : సుడిగాలి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరానికి చెందిన వెట్టి గంగరాజు, వెట్టి కన్నపరాజు, ఎస్.కోటేశ్వరరావు, మంగబాబు, జోడే రాముడు అనే వ్యక్తులు జోరుగా గాలి, వాన రావడంతో గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉన్న ఒక పాకలోకి వెళ్లారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ చలిమంట ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా గాలి బీభత్సం సృష్టించడంతో పాక పడిపోవడంతో పాటు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభం గంగరాజు (55) తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో పాకకు మంటలు అంటుకుని జోడే రాముడు (65) బయటికొచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. కన్నపరాజుకు స్వల్ప గాయాలు కాగా.. కోటేశ్వరరావు, మంగరాజు సురక్షితంగా బయటపడ్డారు. -
తీవ్ర తుపానుగా మిచాంగ్
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్ సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది. -
రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారం తీవ్ర వాయగుండంగా మారింది. ఇది గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు–ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ–ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ–ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, మచిలీపట్ననికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతం వద్ద తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 4వ తేదీ తెల్లవారుజాము వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖతం వరకు చేరుకుంటుందని వివరించింది. ఆ తర్వాత, ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదు రు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వానలు కూడా కురిసే అవకాశం ఉన్న ట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీ సెల్సియస్ మేర గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత హన్మకొండలో 33.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 16.0 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. -
కోస్తాంధ్రపై ‘మిచాంగ్’ తుపాను పడగ!
సాక్షి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను కోస్తాంధ్రపై పడగ విప్పనుంది. రాయలసీమలోనూ పెను ప్రభావం చూపనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. తాడేపల్లిలో రాష్ట్ర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శుక్రవారం రాత్రికి నెల్లూరుకు ఆగ్నేయంగా 790, బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 860, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తుపానుగా బలపడుతుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 4వ తేదీకి దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుకుంటుంది. అనంతరం ఉత్తర దిశగా కదులుతూ ఐదో తేదీ ఉదయం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న రెండు రోజులు గంటకు 50 నుంచి 60 కి.మీలు, తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90 కి.మీలు, గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈ నెల ఐదో తేదీ వరకు కొనసాగనుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సçహాయం, వాతావరణ సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని తెలిపారు. -
రాష్ట్రానికి వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ, పరిసర నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా బలపడుతూ ఈనెల 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదిలి 3న నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు వివరించింది. ఆ తర్వాత కూడా వాయవ్య దిశగానే ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలోని చెన్నై, మచిలీపట్నం మధ్య ఈనెల 4వ తేదీ సాయంత్రానికి తీరం దాటుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతుండగా, రానున్న మూడురోజుల్లో 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్లో 17.4 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. -
బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నం కి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుపానుగా మారనుంది. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని దక్షిణ శ్రీలంకపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటరలఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తుపాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఆదేశించారు. ఖరీఫ్ వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పారు. ఆయన గురువారం వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఖరీఫ్లో తక్కువ వర్షపాతం నమోదైనందున క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు. జియో కోఆర్డినేట్లతో కూడిన యాప్లో ప్రైమరీ వర్కర్, పర్యవేక్షక అధికారి, ఇన్సూ్యరెన్స్ కంపెనీ కోఅబ్జర్వర్ల సంతకాలతో పూర్తి స్థాయి సమాచారాన్ని రియల్ టైమ్లో నమోదు చేస్తేనే పంటల బీమాకు అర్హత వస్తుందని తెలిపారు. ఈ క్రాప్ నమోదుకు ఖరీఫ్లో ఇచ్చిన మార్గదర్శకాలే రబీలోనూ వర్తిస్తాయన్నారు. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. వచ్చే 3, 4 రోజుల్లో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని సూచించారు. శనగ విత్తనాల కోసం డిసెంబర్ 15 లోగా ఇండెంట్ పెట్టాలన్నారు. దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలోనే గ్యాప్ సర్టిఫికేషన్ను అమలు చేస్తున్నందున, ఎక్కువ మంది లబ్ధి పొందేలా కృషి చేయాలని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలను పొందిన ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా వివిధ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు సమాచారం అందించాలన్నారు. -
నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పులతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంది. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 18.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బుధ, గురు వారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయంది. గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement