-
ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం
సిరిసిల్ల: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయని.. రేపు కేంద్రంలో ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మక పాత్రను పోషిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామా రావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్లలో ఆయ న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని చెప్పారు. రైతుల రుణాలను మాఫీ చేయకుండా, రూ.500 బోనస్, మహిళలకు రూ. 2,500, పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలు ఏమయ్యాయని నిలదీశారు. జనవరి నెల పెన్షన్లు కూడా ఇవ్వకుండా మింగేశారని ఆరోపించారు. కొ త్త జిల్లాల రద్దు, మేడిగడ్డ కుంగుబాటు, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ అంటూ.. కాంగ్రెస్ ఐదు నెలల పాటు టైంపాస్ పాలన సాగించిందని మండిప డ్డారు. ఈనాడైనా, ఏనాడైనా.. తెలంగాణకు బీఆర్ ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.వారిది ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ..కాంగ్రెస్, బీజేపీ రెండూ ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తమ నేతలను చేర్చుకుని టికెట్లు ఇచ్చాయని.. ఒకదానికితోడుగా మరొకటి లోక్సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను బరిలో దించాయని విమర్శించారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి కరీంనగర్లో పోటీ చేస్తానంటే నిజా మాబాద్ బరిలో దింపారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని చెప్పారు.లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కిషన్రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్రెడ్డి కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ, ఇండియా కూటముల కంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని,. అందులో వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, బీఆర్ఎస్ పార్టీలు భాగస్వాములవుతాయని కేటీఆర్ చెప్పారు.కేసీఆర్ బస్సుయాత్ర ఎన్నికలను మలుపు తిప్పిందిరాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ 17 రోజుల పాటు 30 చోట్ల చేసిన బస్సుయాత్ర, రోడ్ షోలు లోక్సభ ఎన్నికలను మలుపు తిప్పాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాష్ట్రంలో ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి వెళ్లి నా ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. కేసీఆర్ కాలుపెట్టిన ప్రతి చోట ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గులాబీ సైన్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనిపించిందన్నారు. కేసీఆర్ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారని చెప్పారు.రుణమాఫీ చేయని రేవంత్రెడ్డి తారీకులు మార్చుతూ, దేవుళ్లపై ఒట్టు వేస్తూ.. కాంగ్రెస్పై నమ్మ కం లేని పరిస్థితిని తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరెంట్, తాగునీటి సమస్యలు మొదల య్యాయని.. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అనే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి బాగుండదన్నారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మ న్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలే హవా కొనసాగించబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని అన్నారు. రెండు కూటమిలో లేని పార్టీలు.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర, మల్లర పనులు చేస్తూ 5 నెలల టైం పాస్ చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డ, శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఫోకస్ చేసి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మెజార్టీ సీట్లు మేమే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారు. పార్టీ కోసం కష్టపడిన గులాబీ సైకులకు వినయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుంది. ఈనాడైనా ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని ప్రజలకు అర్థమైంది. ఆ రెండు పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి, విమర్శలు చేయడానికి, కేసీఆర్ను దూషించడానికి పరిమితం అయ్యాయి. తెలంగాణకు ఏం చేయకపోయినా అడ్డగోలు విమర్శలు చేశాయి. వీరి వల్ల ఏం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో చేసిన కృషి స్థానిక సంస్థల ఎన్నికలకు పునాది కాబోతుంది అని కేటీఆర్ పేర్కొన్నారురాష్ట్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఆడబిడ్డలు తీవ్ర మనస్థాపంతో ఉన్నారు .కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకులు లేకనే.. మా పార్టీ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టింది. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీల్లా రెండు పార్టీల వ్యవహారముంది. డమ్మీ అభ్యర్హులను పెట్టీ రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికలు చేశాడు. కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా’ అని కేటీఆర్ తెలపారు. -
మళ్లీ జగనే గెలుస్తాడు.. కేటీఆర్
-
సీఎం జగన్ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్లోని నందినగర్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోదరుడిలాంటివాడని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెండో సారి అధికారంలో వస్తారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్ జగన్ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పేర్కొన్నారు.2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం..తెలంగాణ లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ.. గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.పోలింగ్ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రినని గుర్తించాలని, ఆయన ప్రభుత్వ పనితీరుపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి..కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు. భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది.తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు..ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్ .తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను -
తెలంగాణలో ఓటేసిన రాజకీయ ప్రముఖులు (ఫొటోలు)
-
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్.. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాల్ విసిరారు. సీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని, ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.సిరిసిల్లలో శుక్రవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఓడిచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తన వెనక 80శాతం హిందువులున్నారని అన్నారు. 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా అని మండిపడ్డారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ది చెప్పాలని తెలిపారు.'కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చ ర్చకు సిద్ధమా?తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?.చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా.. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?. విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ను ఖండిస్తున్నా’ అని మండిపడ్డారు బండి సంజయ్. -
బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలం!
అల్వాల్/ కంటోన్మెంట్ (హైదరాబాద్)/ నిర్మల్: బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది తామేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీ పాలకుల గల్లాపట్టి నిలదీసే ధైర్యం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని.. అది ఆగాలంటే తెలంగాణ నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంట్లో ఉండాలని చెప్పారు.గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ వీబీఆర్ గార్డెన్లో, కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. నిర్మల్ జిల్లా కేంద్రంలో, భైంసాలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికలు కదా బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని కొందరు అంటున్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళం వినిపించడానికి కేసీఆర్ సైనికులు ఉండాలి. 2004లో ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టిన కేసీఆర్.. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాహుల్ గాంధీని, నరేంద్ర మోదీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టారు. అదే కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. బలమైన లీడర్లు ఉన్నచోట బీజేపీ ఆటలు సాగలేదు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇవ్వాలి.బీజేపీ ముందు తల వంచేది లేదుబీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల, రఘునందన్రావు, సోయం బాపూరావు వంటి బడా లీడర్లను ఓడించింది బీఆర్ఎస్ వాళ్లేనని గుర్తుంచుకోవాలి. మేం తల నరుక్కుంటాం కానీ.. బీజేపీ ముందు తల వంచేది లేదు.రేవంత్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారుకాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చెప్పాం. ఆ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడటం తప్ప మరేమీ జరగలేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి నెలలు, తారీఖులు చెప్తున్నారు. కొడుకుల్లారా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేవాడా? మన ఖర్మకాలి ముఖ్యమంత్రి అయ్యిండు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారింది.బీజేపీ హైదరాబాద్ను యూటీ చేస్తుందిరిజర్వేషన్లను రద్దుచేసి అగ్రవర్ణాలకు మేలు చేసేలా బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలకు గ్యారంటీ ఏముంది? జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. దీంతో కేంద్రం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.అదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నాన్ లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఎంపీగా లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నివేదిత సాయన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.భైంసాలో కేటీఆర్పై ఉల్లిగడ్డలు.. జైశ్రీరాం నినాదాలుభైంసా/ భైంసాటౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం సాయంత్రం కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో.. కొందరు ఉల్లిగడ్డలు, చిన్నపాటి రాళ్లు విసిరారు. కార్నర్ మీటింగ్ నిర్వహించిన ప్రాంతానికి హనుమాన్ స్వాములు, మరికొందరు చేరుకున్నారు. కేటీఆర్ ఖబడ్దార్ అంటూ ముద్రించిన ప్లకార్డులను చూపుతూ.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆయన వాహనంపైకి ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సమ యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారులవైపు దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చాలా కష్టపడి ఇరువర్గాలను అదుపుచేశారు. నిరసనకారులు విసిరిన ఉల్లిగడ్డలు, చిన్నరాళ్లతో ఓ యువకుడి తలకు స్వల్పంగా గాయమైంది.దేవుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?భైంసాలో తనపై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరినవారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యువకులను రెచ్చగొట్టి ఇలా పంపిస్తుంటారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘కేసీఆర్ తెలంగాణలో యాదాద్రి సహా ఎన్నో మందిరాలు నిర్మించారు. ఏమీ చేయనివారే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు.రాముడు ఎంతో ఆదర్శవంతుడు. మేం కూడా జైశ్రీరాం అంటాం. మరి రాముడు ఎదుటివారిపై రాళ్లు విసరాలని చెప్పాడా? మా పని మేం చేసుకుంటున్నాం. మీ పని మీరు చేసుకోండి. కానీ చిల్లర పనులు చేయవద్దు. ఇలాంటి వాటికి భయపడబోం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.‘మత’ ముష్కరులపై పోరాటం కొనసాగుతుంది: ‘ఎక్స్’లో కేటీఆర్‘‘భైంసా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నాపై కొందరు బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన ఘటనతో అనేక మంది ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అడుగుతున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ విషాన్ని చిమ్మే ఈ ముష్కరులపై నాపోరాటం కొనసాగుతుంది’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్వన్గా నిలిపారు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల పాలనలో తెలంగాణ సీఎంగా కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికను చూస్తే తెలంగాణ సాధించిన ప్రగతి కళ్లకు కడుతుందని, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ఏం చేశారన్న మాటలకు ఆర్బీఐ లెక్కలే సమాధానమని అన్నారు. ఈ మేరకు ఆయన ఆర్బీఐ నివేదికను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, వివరాలు వెల్లడించారు. బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడంతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, అభివృద్ధి, పన్ను వసూళ్లు, మహిళా సాధికారత, వైద్యవిద్య మొదలైన రంగాల్లో టాప్గా నిలిపినట్లు వివరించారు. 2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం (ఎన్ఎస్డీపీ) రూ. 3.08 లక్షలకు చేరిందని, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ ముందుందని తెలిపారు. తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లలో 40 శాతం వాటా మహిళలదేనని, జాతీయ సగటు 20 శాతంతో పోల్చితే రెట్టింపుతో మహిళా సాధికారతలోనూ మనమే ముందున్నామన్నారు. వైద్యవిద్య విషయంలో తెలంగాణలో ప్రతి 4,460 మందికి సగటున ఒక ఎంబీబీఎస్ సీటు అందుబాటులో ఉందని, దేశంలో సగటున 12,851 మంది విద్యార్థులకు ఒక సీటు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. పన్ను వసూళ్లలోనూ ఆదర్శంగా నిలిచామని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఎస్జీఎస్టీ పన్ను వసూళ్లు రూ. 7,665గా ఉందని, దేశ సగటు రూ. 4,461 మాత్రమేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ప్రగతిని చూపించే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ వచ్చి పోతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఈ గణాంకాలు చూసి పరిపాలన నేర్చుకోవాలని హితవు పలికారు. ఒక రాజకీయ నాయకుడు తరువాతి ఎన్నికల్లో గెలవటం కోసం మాత్రమే ఆలోచిస్తాడని, కానీ కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు మాత్రమే తరువాత తరం కోసం ఆలోచిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.ఆరు గ్యారంటీలు ఇవే: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఆరు గ్యారంటీలైన ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, కాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు సమకూర్చుకుని నిలువ చేసుకో వాలని నా సహ తెలంగాణ పౌరులను కోరుతున్నా’అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘మోదీ చెప్తున్న ప్రకారం అదానీ, అంబానీ వ్యాన్ల కొద్దీ నోట్ల కట్టలను స్కాంగ్రెస్ (కాంగ్రెస్)కు పంపుతుంటే ఆయన ప్రియమైన భాగస్వాములు ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనేది విఫలమైందని మోదీ అంగీకరిస్తున్నట్లేనా’అని కేటీఆర్ మరో పోస్ట్ చేశారు. -
హైదరాబాద్పై కుట్ర
ముషీరాబాద్, ఉప్పల్, లింగోజిగూడ: విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్పై కుట్ర జరుగుతోందనీ, జూన్ 20 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి లూటీ చేయాలని బీజేపీ యతి్నస్తోందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాడు కేవలం ఐదు ఎంపీ సీట్లతోనే తెలంగాణ సాధించామనీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు కేసీఆర్ చేతిలో పెడితే ఢిల్లీ మెడలు వంచి ఆర్నెల్లు తిరగకుండానే తెలంగాణలో అనూహ్య మార్పులు తీసుకువస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం రాంనగర్ చౌరస్తా సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా జరిగిన రోడ్షోలో, ఉప్పల్ రింగ్ రోడ్డులో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో, అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ఘాట్లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ గ్యారంటీలు అమలయ్యాయా? కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. గ్యారెంటీలు అమలయ్యాయా అంటూ సభకు విచ్చేసిన ప్రజలను అడగగా అమలు కాలేదంటూ జవాబిచ్చారు. హైదరాబాద్లో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా.. అని ఆలోచించుకోవాలని సూచించారు. హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే బీజేపీ ధరలు పెంచుడు తప్ప పదేళ్లల్లో చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ అని అడిగితే గుడి కట్టినం అంటున్నారు.. ఓటు ఎందుకు వేయాలని అడిగితే నమో అని అంటున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు గురించి మాత్రం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.70 రూపాయలు ఉన్న పెట్రోల్ రూ.110 అయిందని ఈసారి బీజేపీని గెలిపిస్తే రూ.400 దాటుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ ధర కూడా తగ్గాలి కానీ రోజురోజుకూ పెట్రోల్ రేటు ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పయితే రాజీనామా చేసి మీ ముఖాన కొట్టి పోతానని సవాల్ చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల తరువాత వారి ఉసే ఉండదన్నారు. రాహుల్ అమాయకుడే రాహుల్ గాంధీ అమాయకుడనీ, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయనకేమీ తెలియదని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం రాసి ఇచ్చింది మాత్రమే చదవుతు న్నారని కేటీఆర్ అన్నారు. నిర్మల్ సభలో రాహుల్ గాం«దీతో మొత్తం అబద్ధాలే చెప్పించారని, అమలు చేయని పథకాలు కూడా అమలు చేసినట్లు అయన తో చెప్పించడం దురదృష్టకరమన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తారన్న పక్కా సమాచారం తనకుందని పేర్కొన్నారు.ఇవాళ మా ఇంట్లో 5 సార్లు కరెంటుపోయింది రాష్ట్రంలో గతంలో ఎప్పుడు కూడా కరెంట్ పోలేదనీ కానీ ఇప్పుడు ఎప్పుడు పడి తే అప్పుడు కరెంట్ పోతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు మాఇంట్లో కూడా 5సార్లు కరెంట్ పోయింది.. ఇదీ పరిస్థితి’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ వచి్చంది కరెంటు పోయింది’’అన్నచందంగా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఏర్పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించగా, కొంత మంది లాంతర్లు పట్టుకుని చూపించారు. -
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: చీరకట్టుకొని జూబ్లీహిల్స్లో బస్ ఎక్కి టికెట్ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్రెడ్డి మాటలకు బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ ఆదివారం(మే5) ట్వీట్ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్ రేవంత్కు చురకలంటించారు. -
చిల్లర మాటలు.. ఉద్దెర పనులు
సిరిసిల్ల/సుభాష్నగర్, రసూల్పుర (హైదరాబాద్): సీఎం రేవంత్రెడ్డి పాలన చిల్లర మాటలు.. ఉద్దెర పనులు అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ‘మోసపోతే గోస పడతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. బతుకమ్మ చీరలు లేవు.. రైతుబంధు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో దరిద్రం అడుగుపెట్టినట్లు అయ్యింది..’ అని ధ్వజమెత్తారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుండి 12 సీట్లు ఇస్తే ఆరు నెలల నుండి సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు వస్తుందని చెప్పారు. కేటీఆర్ శనివారం సిరిసిల్లలో, హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్లోని షాపూర్, నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.హామీలేమో కానీ లూటీలు షురూకేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు లేవని, ప్రస్తుతం హైదరాబాదులో కరెంటు కోతలు ప్రారంభమై ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు కనపడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మోసపు హామీలు ఇచ్చి రేవంత్రెడ్డి ఓట్లు వేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి తేదీలు మార్చుతున్నాడని, ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాడని విమర్శించారు.కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యి లక్ష తులాల బంగారం రేవంత్ బాకీ పడ్డాడని అన్నారు. గ్యారంటీల అమలు పక్కన పెడితే కాంగ్రెసోళ్లు లూటీలు చేయడం చాలూ అయ్యిందని, లూటీ చేయడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కొత్త పరిశ్రమలు తేవడం ఏమో కానీ ఉన్న పరిశ్రమలు గుజరాత్, చెన్నై తరలిపోతున్నాయన్నా రు. ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలిపరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకు న్నామని, కొన్ని జిల్లాలకు జయశంకర్ (భూపాలపల్లి), కొమురంభీం (ఆసిఫాబాద్) లాంటి మహానుభావుల పేర్లు పెట్టుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కొత్త జిల్లాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, 33 జిల్లాల్లో ఏ జిల్లాలను ఉంచుతారో, ఏ జిల్లాలను తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీజేపీని నమ్మి మోసపోవద్దుకొందరు దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ ఆధునిక దేవాలయాలైన జలాశయాలను నిర్మించి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టారని కేటీఆర్ చెప్పారు. యాదాద్రిని కట్టించిన కేసీఆర్ ఏనాడూ దేవుడి పేరును ఓట్లకు వాడుకోలేదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఛోటే భాయ్.. ప్రధాని మోదీ బడే భాయ్ అని ఎద్దేవా చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు.పదేళ్లలో హైదరాబాద్కు రూపాయి ఇవ్వలేని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రజల్లో మతం చిచ్చుపెట్టే బీజేపీని నమ్మి మోసపోవద్దని కోరారు. ‘రాష్ట్రంలో చెయ్యి విరగాలి.. పువ్వు వాడాలి.. కారు జోరు కొనసాగాలి..’ అని కేటీఆర్ కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కంటోన్మెంట్లో ఐదుసార్లు దివంగత ఎమ్మెల్యే సాయన్నను ఆదరించినట్లుగానే ఈసారి జరిగే ఎన్నికల్లో సాయన్న బిడ్డ నివేదితను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఒకే ఏడాదిలో తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నివేదితను గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. -
ఏడాదిలోగా మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తారు
అడ్డగుట్ట, బన్సీలాల్పేట్, నాంపల్లి: లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు బీఆర్ఎస్కు వస్తే ఏడాది లోపే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి పద్మారావుగౌడ్కు మద్దతుగా శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ తుకారాంగేట్లో, సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బన్సీలాల్పేట్ కమాన్ వద్ద, నాంపల్లి నియోజకవర్గం నోబుల్ టాకీస్ చౌరస్తాలో జరిగిన రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, ఇక చేసేది కూడా ఏమీ లేదని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఇక పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ సీట్లు వస్తే మళ్లీ కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు.తెలంగాణకు మోదీ ఏం చేశారుమాయమాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ప్రతీ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తామని, రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని, బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని, నల్లధ నం వెలికితీస్తామని చెప్పిన మోదీని.. ఇప్పుడు అడిగితే తెల్లముఖం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్ చేసిందేంటి?ఐదేళ్లుగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఒకటే ఒక్క పని కుర్కురే ప్యాకెట్లు పంపిణీ చేయడమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు రూపాయి పని కూడా చేయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కరకు రాని చుట్టమని నిందించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా సామాన్య ప్రజలను కష్టాల్లోకి తోసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఇవి తప్పనికిషన్ రెడ్డి రుజువుచేస్తే రేపటికల్లా నా ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.గ్రేటర్ ప్రజలు గ్రేట్గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో తెలివిని ప్రదర్శించి బీఆర్ఎస్కు 16 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని, ఆ ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ప్రజలు అప్పుడే కరెంట్ కోతలు...నీటి కష్టాలతో బాధపడుతున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల తరువాత కచ్చితంగా రేవంత్రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ ఆరోపించారు. ’’రాహుల్ గాంధీ ఏమో మోదీని చౌకీదార్ చోర్ అంటే మోదీ బడే భాయ్ అని రేవంత్రెడ్డి అంటున్నారు.రాహుల్ ఏమో గౌతమ్ అదానీ ఫ్రాడ్ హై అని అంటే... గౌతమ్ అదానీ హమారా ఫ్రెండ్ హై అని రేవంత్ అంటున్నారు. లిక్కర్ స్కామ్ లేదనీ. కేజ్రీవాల్ను అరెస్టు చేయడం సరికాదని రాహుల్ గాంధీ అంటే... కేసీఆర్ కూతురును అరెస్టు చేయడం కరెక్టేనని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ఈ మాటలను బట్టి రేవంత్ తీరు ఏమిటో అర్ధం చేసుకోవచ్చు’’ అని కేటీఆర్ అన్నారు. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
ఏపీ రాజకీయాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు. ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
ప్రాంతీయ శక్తులే..ప్రజాస్వామ్య పరిరక్షకులు
(కల్వల మల్లికార్జున్రెడ్డి) ‘లోక్సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నడుమ కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతోంది. ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకొనే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులే’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్ప 28 రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయ పార్టీలే లేవన్నారు. బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, వైఎస్సార్సీపీ, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేక పోయిందని విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్ను యూటీ చేసే కుట్ర ‘హైదరాబాద్పై పట్టు చేజిక్కించుకోవడంతోపాటు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్సభలో మూడింట రెండొంతుల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తోంది. వీటిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ వంటి సమాఖ్య స్ఫూర్తిగల ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ శక్తులు గట్టిగా గొంతు విప్పితే కేంద్రాన్ని శాసించడంతోపాటు దక్షిణాదిని రక్షించుకోవచ్చు. రూ. వేల కోట్ల స్కాంలు చేసినా బీజేపీలో చేరగానే క్లీన్చిట్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ‘ఉంటే జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’అనేలా వ్యవహరిస్తున్నాయి. జగన్పై కేసులు, జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు. ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకొనేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే.వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ వచ్చింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, అజిత్ పవార్ రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా మోదీతో చేతులు కలిపిన వెంటనే వారికి క్లీన్చిట్ లభించింది.3 వేల మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా? రూ. 100 కోట్ల కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను జైల్లో పెట్టారు. ఇదే ఆరోపణలపై అరెస్టు అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలు అవుతారా? ఈ అరాచకాలను ప్రజాశక్తితోనే ఎదుర్కొంటాం. షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే మోదీ 2014లో, రేవంత్రెడ్డి 2023లో ప్రజలకు రంగుల కల చూపి అధికారంలోకి వచ్చారు. ప్రజలను ఊహల పల్లకిలో కూర్చోబెట్టడంతోపాటు కేసీఆర్ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు అనేక శక్తులను వాడారు. వై.ఎస్. షర్మిలను తెలంగాణలో ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలో కేసీఆర్ను బదనాం చేయడం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులను బీఆర్ఎస్కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ పని కాగానే షర్మిలను ఆంధ్రాలో ప్రయోగిస్తున్నారు. షర్మిలతో అక్కడా అదే ప్రయోగం చేయడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం. కాంగ్రెస్ నేతలే కూల్చుతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అసవరం లేదు. రేవంత్ చుట్టూ కాంగ్రెస్కు చెందిన ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. ప్రజలు 10–12 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ ప్రతిష్ట క్షేత్రస్థాయిలో దిగజా రుతోంది. ‘ఆర్ ట్యాక్స్ కడితేనే భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ఢిల్లీకి డబ్బు సంచులు పంపేందుకు బిల్డర్లు, రైస్మిల్లర్లను బెదిరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత ధోరణి రేవంత్రెడ్డి సీఎం పదవికి తగని చిల్లరగాడు. ఆయనవి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. రేవంత్ ప్రసంగాలను కుటుంబంతో కూర్చుని చూడలేని పరిస్థితి. ప్రజలను చిరకాలం ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని అనుకుంటున్నాడు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన మూడు పిల్లర్లను ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయట్లేదు. కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసేందుకే పంటల ను ఎండబెట్టారు. డిసెంబర్ 3న కేసీఆర్ తిరిగి సీఎం అయ్యుంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలను కాపాడేవారు.కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసిందిఇతర పార్టీల నుంచి చేరిన కొందరిని పూర్తిగా చదవకుండానే పదవులు ఇచ్చాం. కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది. పార్టీని వీడిన కడియం, రంజిత్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, దానం నాగేందర్ వంటి వారిపై బీఆర్ఎస్ కేడర్ కసితో ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ద్రోహులను దగ్గరకు తీయకుండా గుణపాఠం నేర్పుతాం. లోక్సభ ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటించి రిజర్వుడ్ స్థానాల్లోనూ ఉద్దండులను బరిలోకి దించాం. కనీసం 10–12 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉంది.రెఫరెండం ప్రకటనకు కట్టుబడి ఉండాలి మాట ఇచ్చి తప్పడం రేవంత్కు అలవాటు. కొడంగల్లో రాజకీయ సన్యాసమని మల్కాజిగిరిలో పోటీ చేశాడు. లోక్సభ ఎన్నికలు రెఫరెండం అంటున్న రేవంత్ కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు రాకుంటే పదవి నుంచి తప్పుకుంటారా? జిల్లాల సంఖ్య తగ్గిస్తామని రేవంత్ అనడం తుగ్లక్ పని. 33 జిల్లాల్లో ఒక్కటి టచ్ చేసినా తెలంగాణ తిరగబడుతుంది.జగన్ మళ్లీ గెలుస్తారు గుంటూరులో ఇంటర్ చదివా. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న దానిని బట్టి ఏపీలో వై.ఎస్. జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. జగన్ మళ్లీ గెలిచి వస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్ వంటి 13 పార్టీలు కూటముల రూపురేఖలను మార్చేస్తాయి. కాంగ్రెస్ను వెంటాడతాంకేసీఆర్ సీఎంగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ను వెంటాడుతాం. ఏడు పదుల వయసులో మేజర్ సర్జరీ జరిగినా.. కర్ర సాయంతో నడుస్తూ, కూతురు జైల్లో ఉన్నా, ఎర్రటి ఎండలున్నా, నమ్ముకున్న నాయకులు పార్టీని వీడుతున్నా, రేవంత్ పరుషంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూరేలా కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
హైదరాబాద్పై కన్నేశారు.. జాగ్రత్త!
కరీంనగర్/ వేములవాడ: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటీలతో కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్పై కన్నేశారు.. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే ఉంది.వారితో ఒరిగేదేమీ లేదు..2014 నుంచి కేంద్రంలో బడేభాయ్ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్ అమలు చేయలేదు. హైదరాబాద్కు ప్రకటించిన ఐటీఐఆర్ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే, తమను ఎవరెంత కించపరచినా కుంగిపోమని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలతో, లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందని గుర్తు చేశారు. కాగా, నేడు బీఆర్ఎస పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కృషి చేశారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూశారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్ర అభివృద్ది సాధ్యం అని 2014లో ప్రభుత్వం వచ్చింది. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పార్టీ, ప్రభుత్వం రెండు పని చేశాయి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించింది. కానీ, దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యం. ఇప్పుడు ప్రజలు మళ్లీ కేసీఆర్నే కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరెంత కించపరిచినా మేము కుంగిపోము. 24ఏళ్లలో మాకు ఇచ్చిన గౌరవం, అభిమానానికి ధన్యవాదాలు. వందల మంది రాష్ర్ట సాధన కోసం ప్రాణాలు వదిలారు. మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము’ అని వ్యాఖ్యలు చేశారు. -
నేడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కోడ్ దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని శుక్రవారంపిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాలతో పార్టీ యావత్తు పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ భవన్లో కేటీ రామారావు పార్టీ జెండాను శనివారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించనున్నారు. -
మళ్లీ మోసపోతే మనదే తప్పు
సిరిసిల్ల: ఒక్కసారి మోసపోతే.. మోసం చేసిన వాడి ది తప్పు, రెండోసారి మళ్లీ వారి చేతిలోనే మోసపోతే.. తప్పు మనదే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలో మోదీ.. ఇక్కడ కేడీ.. ఇద్దరూ మోసగాళ్లు, వాళ్ల మాయలో పడొద్దు.. ఆలోచించండి’ అని పిలుపునిచ్చారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి మోసం పార్ట్–1 చూపిస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్ట్–2 చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు. రైతుబంధు లేదు, రుణమాఫీ కాలేదు, మహిళలకు రూ.2,500 ఇయ్యలే.. పెన్షన్లు రూ.4వేలకు పెంచలే.. ఇంట్లో ఇద్దరికీ పెన్షన్లు ఇయ్యలే.. కరెంట్ లేదు, నీళ్లకు గోస, కరెంట్ మోటార్లు కాలుడు.. ఇదంతా కాంగ్రెస్ పాలన తీరు.. అని విమర్శించారు. భార్యాపిల్లలపై ఎందుకు ఒట్టేయడం లేదు పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఆగస్టులో రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి దేవుడిపై ఒట్టు పెడుతున్నాడని, అదే ఆయన భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టు పెట్టడం లేదని కేటీఆర్ నిలదీశారు. దేవుడు ఏమీ అనడని మళ్లీ మోసం చేయొచ్చని సీఎం చూ స్తున్నాడని ఆరోపించారు. రైతుబంధు ఇయ్యనోడు, రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తాడా ? అని ప్రశ్నించారు. రైతుబంధుకు రాంరాం.. అంటున్నారని, ఆ డబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామని మో సం చేశారని ఎద్దేవా చేశారు. జనవరి నెల ఆసరా పెన్షన్లను రేవంత్రెడ్డి ఎగ్గొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు అమలుకావాలంటే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే.. వాళ్లకు భయం ఉండాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని కేటీఆర్ అన్నారు. 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే.. కేసీఆర్ మళ్లీ రాజకీయాలను శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్ ఒక్క గుడికి నిధులు తేలేదు.. బడికి నిధులు ఇవ్వ లేదు.. దేవున్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బండి సంజయ్.. అమిత్షా చెప్పులు మోసుడు తప్ప ఐదేళ్లలో ఏం చేయనోడికి మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని కేటీఆర్ నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు సిరిసిల్లలో ఒకే రోజు ఇద్దరు నేతకారి్మకులు ఆత్మహ త్య చేసుకోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆగ్రహించిన కేటీఆర్.. సిరిసిల్లను ఉరిసిల్లగా మా ర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడిన నేతకారి్మక కుటుంబాలను గురువారం రాత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం అందించారు. -
మేం 10 సీట్లు గెలిస్తే పాలిటిక్స్లో మార్పులు: కేటీఆర్
అలంపూర్: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని సంకల్పిస్తే, దురదృష్టవశాత్తు 39 సీట్లలోనే గెలిచామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 14 సీట్లలో వెయ్యి, రెండు, నాలుగు వేల తేడాతో ఓడిపోయామని, ఆ 14 సీట్లు గెలిచి ఉంటే మన దే ప్రభుత్వం ఉండేదని చెప్పారు. లేదా వాటిలో ఆరు సీట్లు గెలిచినా ప్రధాన పాత్ర పోషించేవారమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 10 సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్కు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో, అలంపూర్ చౌరస్తాలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘సీక్వెల్ సినిమాల తరహాలో పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్రెడ్డి సీక్వెల్ మోసంతో రెడీగా ఉన్నారు. రేవంత్రెడ్డి మోసం పార్టు–1లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మీలో ఎవరైనా రుణాలు తీసుకోని వారు ఉంటే పరుగు పరుగునపోయి లోన్లు తీసుకోండి.. అని చెప్పిన ఆయన మే 9 వస్తున్నా రుణమాఫీ చేయలేదు. మోసం పార్ట్–2లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెబుతున్నారు’ అని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అవన్నీ ఇచ్చి మాట్లాడు.. ‘మొగోడివైతే ఒక్క సీటు గెలవమని మన పార్టీ గురించి మాట్లాడుతున్న రేవంత్రెడ్డి భాషలోనే అడుగుతున్నా... నీవు మొగోనివైతే రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. మొగోడివైతే కోటీ 67 లక్షల ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వు. కేసీఆర్ ఒకరికే ఇస్తున్నాడు నేను ముసలవ్వకి ముసలాయనికి ఇద్దరికీ రూ.4వేలు ఇస్తానని చెప్పావు కదా.. మొగోడివైతే 46 లక్షల మందికి ఆసరా పింఛన్ ఇచ్చి మాట్లాడు’ అని కేటీఆర్ అన్నారు. మొన్న మహబూబ్నగర్కు వచ్చి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని ఒక సీఎం మాట్లాడని మాటలు రేవంత్ మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘సూర్యాపేటలో రష్ ఉన్న బస్సులో ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా.. ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు జేబులు వెతికితే కత్తెర దొరికిందని అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయను పట్టుకోండి సార్ అని చెప్పారు’ అని చమత్కరించారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికేమీ లేదు.. బీజేపీ వాళ్లు అక్కడక్కడ ఎగురుతున్నారని, పదేళ్లలో రాష్ట్రానికి మోదీ చేసిందేమి లేదని కేటీఆర్ అన్నారు. బీజేపీ వాళ్లు చెప్పుకోవడానికి ఏవీలేదని, అందుకే జైశ్రీరాం అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. శ్రీరాముడు బీజేపీకి ఒక్కడే దేవుడు కాదని.. ఆయన అందరి వాడన్నారు. దేవుళ్ల పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మి మోసపోవద్దు: కేటీఆర్ రాజేంద్రనగర్ (హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్లో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని ముందుకొస్తోందని... కాంగ్రెస్ దొంగ హమీలతో ప్రజలను మోసం చేసేందుకు మరోసారి వచ్చిందన్నారు. రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించాలని గట్టిగా నమ్మే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అందుకే చేవెళ్ల పార్లమెంటులో మొదటిసారిగా బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాందీ, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. రేవంత్ నిజం చెప్పారు సాక్షి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి గద్దెనెక్కిండు రేవంత్... అయితే తప్పు రేవంత్రెడ్డిది కాదు... ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పిండు ఎన్నికలకు ముందు టీవీ చర్చా వేదికల్లో. ప్రజలు మోసగాళ్లనే నమ్ముతారు... ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు... అందుకే మేం మోసం చేస్తాం అని చెప్పారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరంగల్, హనుమకొండలో మంగళవారం జరిగిన వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తప్పు ఎవరిదన్నా ఉందంటే మనదే తప్ప ఇంకెవరిదీ కాదన్నారు. -
కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మళ్లీ మొదలవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఆయన కలిశారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డిలతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని, శనివారం తన అనుచరులతో కలిసి ఆయన అధికారికంగా పార్టీ లో చేరతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బీజేపీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచి్చన ఆయనకు రేవంత్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీప బంధువు ఎడ్ల రాహుల్రావు కూడా కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సమక్షంలో ఆయనకు రేవంత్రెడ్డి పార్టీ కండువా కప్పారు. ఎన్నికల క్లైమాక్స్లో..: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తనకు టచ్లోకి వచ్చారంటూ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన మరుసటిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చే రేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలోకి చే ర్చుకోవాలనే భావనతో సీఎం రేవంత్ ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్లోకి వెళ్తారనే కోణంలో కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలోనే.. ఆపరేషన్ ఆకర్ష్కు ఆయన పదును పెట్టారని గాం«దీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో జీ హెచ్ఎంసీకి చెందిన మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని, లోక్సభ ఎన్నికలకు ముందే వారు పార్టీలోకి చేరతారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఓ మాజీ మంత్రి కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు వైరా మాజీ ఎమ్మెల్యే గుడ్బై వైరా: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రా ములు నాయక్ శుక్రవారం బీఆర్ఎస్కు రాజీనామా చే శారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ పంపించారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయ న ఆనాటి బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్పై విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరగా, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆయనకు కాకుండా మళ్లీ మదన్లాల్కే టికెట్ కేటాయించింది. మదన్లాల్ ఓడిపోయినా.. వైరా ఇన్చార్జిగా ఆయననే ని యమించడంతో పార్టీలో తనకు సరైన గౌరవం లభించడం లేదని రాములు నాయ క్ సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీలు వద్దిరాజు, నామా తదితరులు రాములు నాయక్ ఇంటికి వెళ్లి తగిన గుర్తింపు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది. -
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
జై శ్రీరామ్ అనడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు
వెంగళరావునగర్ (హైదరాబాద్): బీజేపీ నేతలు మాట్లాడితే జై శ్రీరామ్ అనడం తప్ప వారి వల్ల దేశానికి గాని, ప్రజలకు గాని ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని, ఆ పార్టీ చేసిన పనులు కూడా ఏమీ లేవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. శ్రీరాముడు దేవుడ ని, ఆయనను అందరూ పూజించాలని చెప్పారు. ఆ యనతో ఎవరికీ ఎలాంటి పంచాయితీ లేదన్నారు. కుల, మతాలను గౌరవించలేని పార్టీలను రానున్న ఎన్నికల్లో తొక్కేయాలని వ్యాఖ్యానించారు. దేశంలోని నాయకులంతా ఉంటే మోదీ జేబుల్లో లేదా జైల్లో ఉండాలన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ బీజేపీని విమర్శిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ పార్టీని వెనకేసుకొస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని, ఇదెక్కడి విడ్డూరమని ప్రశ్నించారు. గురువారం రాత్రి యూసుఫ్గూడలోని మహమూద్ ఫంక్షన్ హాల్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి విధేయుడిగా సీఎం రేవంత్ తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా రేవంత్రెడ్డికి సీఎం పదవి దక్కిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, ఒక్కటి కూడా సరిగ్గా చేయడం లేదని అన్నారు. ఏం చేయాలో తెలియక, హామీలను నెరవేర్చే సత్తా లేక ఫోన్ ట్యాపింగ్లంటూ ప్రజలకు పిచ్చి కథలు చెబుతున్నాడని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ విధేయుడిగా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్కు లేదని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే సీటు త్వరలో ఊడుతుందని చెప్పారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement