breaking news
guru gobind singh
-
Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల ధైర్యసాహసాలు, త్యాగానికి గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 6న వీర్ బాల్దివస్ నిర్వహిస్తుంటారు.మతం, మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ వయసు తొమ్మిదేళ్లు, సాహిబ్జాదా ఫతే సింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషం. 2022లో జనవరి 9న గురుగోవింద్ సింగ్(Guru Gobind Singh) ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బాలవీరుల త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్బాల్ దివస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొఘలుల పాలనలో..సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్కు అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. 1699లో గోవింద్ సింగ్ ఖాల్సా పంత్ను స్థాపించారు. 1705లో పంజాబ్ మొఘలుల పాలనలో ఉంది. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్ను పట్టుకునేందుకు మొఘలులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయితే గురు గోవింద్ వారికి చిక్కలేదు. అతని భార్య మాతా గుజ్రీతో పాటు వారి కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్లో ఒక రహస్య ప్రదేశం(Secret place)లో దాక్కున్నారు. అయితే వారింటిలోని వంటవాడు గంగు వారి గురించి సిర్హింద్ నవాబ్ వజీర్ ఖాన్కు తెలియజేశాడు. అప్పటికే గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్ మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.చిన్నారుల బలిదానంనవాబ్ వజీర్ ఖాన్ గురుగోవింద్ సింగ్ భార్య గుజ్రీని, కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లను హింసించాడు. మతం మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తరువాత వజీర్ ఖాన్ సాహిబ్జాదాస్ చిన్నారులిద్దరినీ గోడలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి గుజ్రీ ప్రాణత్యాగం చేశారు. ఆ చిన్నారుల బలిదానాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2022లో ప్రతీయేటా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్(Veer Bal Diwas)గా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్లు 1705, డిసెంబర్ 26న అమరులయ్యారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని, రాబోయే తరాలకు సత్యధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ప్రదాని మోదీ గతంలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
నేడు ‘వీర్ బాల్ దివస్’.. పాల్గొననున్న ప్రధాని, కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: సిక్కుల పదవ గురువైన గురుగోవింద్ సింగ్ ఇద్దరు చిన్న కుమారులైన (సాహెబ్జాదేలు) బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగల్ ధైర్య, సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ.. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న ‘వీర బాల్ దివస్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా.. నేడు (డిసెంబర్ 26 , సోమవారం) ఢిల్లీలో.. వీర బాల్ దివస్ ను పురస్కరించుకుని ఘనంగా ‘షాబాద్ కీర్తన్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాదాపు 3 వందల మంది బాల కీర్తనీలు ‘షాబాద్ కీర్తన్’ను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం దాదాపు 3వేల మంది చిన్నారుల ఆధ్వర్యంలో జరిగే మార్చ్ పాస్ట్ ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.షాహెబ్జాదేల ధైర్య సాహసాలను, త్యాగాలను గుర్తుచేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా, విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాల్లో డిజిటిల్ ప్రదర్శనలను ఏర్పాటుచేయనున్నారు. ఇక 2022 జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1704వ సంవత్సరంలో మొగలు నవాబ్ అయిన వజీర్ ఖాన్.. మతం మారాలంటూ ఇద్దరు షహజాదేలను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతేసింగ్ నిరాకరించారు. 1704 డిసెంబర్ 26న వీరిద్దరు బలిదానం చెందారు. వీరి త్యాగాన్ని, ధైర్య, సాహసాలను స్మరించుకుంటూ కేంద్రం ఈ ఏడాది నుంచి డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించనుంది. చదవండి: Roundup 2022: మెరుపులు..మరకలు -
వీర్బాల్ దివస్గా డిసెంబర్ 26
న్యూఢిల్లీ: సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్ 26వ తేదీన ఏటా ఇకపై వీర్బాల్ దివస్గా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతేహ్ సింగ్ మొఘల్ పాలకులు వారిని బంధించి గోడ కట్టడంతో వీరమరణం పొందారు. నమ్ముకున్న ధర్మానికి కట్టుబడి ప్రాణాలను సైతం వారు త్యజించారు’అని పేర్కొన్నారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీపై ఆగ్రహంతో ఉన్న సిక్కు వర్గాన్ని మంచి చేసుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
రూ.350 నాణెం.. త్వరలో
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది. నోట్ల రద్దు తరువాత పెద్ద నాణేలను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.350 నాణేలను తీసుకురానుంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త రూ.350 నాణెం స్పెషికేషన్స్ పై అంచనాలు ఇలా ఉన్నాయి. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత సిల్వర్ మిశ్రమ లోహాలు 50 శాతం, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, జింక్ లోహాల మిశ్రమంతో దీన్ని రూపొందించింది. ముందు భాగంలో అశోక స్తంభం, మధ్యలో "సత్యమేవ జయతే" నినాదాన్ని పొందుపర్చగా, ఎడమవైపున దేవనాగరి లిపిలో "భారత్", వెనుక భాగంలో ఇండియా అని ఆంగ్లంలో ఉంటుంది. అలాగే నాణెం వెనుక దేవనాగరి లిపిలోని "శ్రీ గురు గోబింద్ సింగ్జీ 350వ ప్రకాశ ఉత్సవ్’’ అని కాయిన్కి పైభాగాన, దిగువన ఆంగ్లంలో "తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ -1666-2016" చిత్రాన్ని అమర్చినట్టు తెలుస్తోంది. నాణెం బరువు సుమారు 35.35 గ్రాములు ఉంటుందని అంచనా. ఎంత విలువ మేరకు ఈ నాణేలను విడుదల చేస్తోంది స్పష్టం చేయలేదు. కానీ పరిమితంగానే వీటిని తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. -
మతంలో విప్లవ పతాకం
కొత్త కోణం ప్రతివారూ అక్షరాస్యులు కావాలన్న గొప్ప ఆచారం కనిపిస్తుంది. పరాన్నజీవులుగా బతికే లక్షణం వీరికి లేదు. ఉపాధి కోసం ఏదో పనిచేసుకుంటూనే మత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేతప్ప మత బోధనల కోసం ప్రత్యేక వర్గం ఉండదు. గురుద్వారాలలో, వ్యాపార పారిశ్రామిక రంగాలలో, వ్యవసాయరంగంలో–ఎక్కడైనా అధికారి, ఆసామి అనే ఆధిపత్య సంకేతాలు మచ్చుకైనా కనిపించవు. యుద్ధ సంప్రదాయాల నుంచి ఉద్భవించిన సిక్కు మతం అనుయాయులకు బాల్యం నుంచే ఆరోగ్యవంత మైన అలవాట్లను నూరిపోస్తుంది. మనిషి నిత్యాన్వేషి. మనుగడ, అవసరాల కోసం మార్గాలను వెతుకుతూనే ఉంటాడు. కష్టాలను అధిగమించే వ్యూహాలను రచిస్తూనే ఉంటాడు. అటు వంటి అనుభవాలు చరిత్రలో ఎన్నో. అయితే కొన్ని మాత్రమే సమాజాన్ని సమూలంగా మార్చగలుగుతాయి. చిరకాలం ప్రభావితం చేస్తాయి. ఆ తాత్విక ఆలోచనలు శతాబ్దాల పాటు మార్గనిర్దేశనం చేస్తాయి. అటువంటి ఒక సామాజిక, సాంస్కృతిక జీవనధారే సిక్కిజం, లేదా సిక్కు మతం. గురునానక్ వేసిన తాత్విక పునాదులు ఉత్తర భారతాన్ని, ముఖ్యంగా పశ్చిమ భాగంలో ఉన్న విశాల భూభాగాన్ని చైతన్యవంతం చేశాయి. క్రీస్తుశకం 1469 సంవ త్సరంలో ఏప్రిల్ 15న జన్మించిన నానక్ ఆనాటి సామాజిక పరిస్థితులకు చలించి, సరికొత్త సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు. వందల ఏళ్లు భారత దేశం మీద జరిగిన దురాక్రమణలకు, దాడులకు, యుద్ధాలకు పశ్చిమ భారత దేశం బలౌతూ వచ్చింది. దురాక్రమణదారులు సునాయాసంగా జయించారు కూడా. దురాక్రమణదారులు కేవలం భూభాగంపై పెత్తనం కోసమే కాక, తమ మతాల వ్యాప్తికీ యత్నించారు. మొఘలుల దాడులను అందులో భాగం గానే అర్థం చేసుకోవాలి. గురు నానక్ జీవించిన కాలంలో రాజులు, రాజ ప్రతినిధులు ప్రధా నంగా ముస్లింలు. కింది స్థాయిలో వ్యాపారస్థులు, రైతులు, వృత్తి పనివారు హిందువులు. కులవ్యవస్థ హిందువుల ఐక్యతకు అవరోధంగా ఉంటూ, దురా క్రమణలను ఎదుర్కోవడానికి అడ్డంకిగా మారింది. అంతిమంగా కుల వ్యవస్థలోని కింది స్థాయి కులాలు మరింత దౌర్జన్యాలకూ, వివక్షలకూ బలయ్యేవి. వీటిని దగ్గరగా చూసిన నానక్ పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నించాడు. హిందూమతంలో ఉన్న మూఢ నమ్మకాలను, వివక్షలను, అసమానతలను నిరసించి సమానత్వ ప్రాతిపదిక మీద సిక్కిజాన్ని స్థాపించాడు. కవి, యుద్ధవీరుడు, తాత్వికుడు సిక్కిజంను ప్రారంభించిన ఘనత గురు నానక్కు దక్కినప్పటికీ, ఆ మతాన్ని నిర్మాణాత్మకమైన వ్యవస్థగా తీర్చిదిద్దినవారు పదవ గురువు గురు గోవింద్ సింగ్. పాట్నాలో డిసెంబర్ 22, 1666న గురుతేజ్ బహదూర్, మాతా గుజ్రి లకు గురు గోవింద్సింగ్ జన్మించారు. ఆయనను మొదట గోవింద్రాయ్ అని పిలిచేవారు. గురు గోవింద్సింగ్ హిందీ, పర్షియన్, పంజాబీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన మత గురువు మాత్రమే కాదు. కవి, తత్వవేత్త. ఒక యుద్ధవీరుడు. సిక్కుల 9వ గురువు, గురు గోవింద్సింగ్ తండ్రి గురు తేజ్బహదూర్ను ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు ఉరితీశారు. ఆ నేపథ్యంలో తొమ్మిదేళ్లlగోవింద్రాయ్ సిక్కుల పదవ మత గురువుగా బాధ్యతలు స్వీక రించాడు. సిక్కు మతానికి కొత్తరూపు ఇస్తూ గురు గోవింద్సింగ్ 1699లో స్థాపించినదే ఖాల్సా. అంటే అన్ని రకాల రుగ్మతలు, చెడుల నుంచి దూరంగా ఉంచే స్వచ్ఛమైన ప్రవర్తన. సిక్కు మతస్థులలో పురుషులు పేరు చివర ‘సింగ్’ అని, స్త్రీలు ‘కౌర్’ అని చేర్చుకోవాలని ఆయన ఆదేశించాడు. సింగ్ అంటే సింహమనీ, కౌర్ అంటే మహారాణీ అని అర్థం. ప్రతి సిక్కు ఐదు చిహ్నాలను ధరించాలని కూడా నిర్దేశించాడాయన. మొదటిది తలవెంట్రుకలను కత్తిరించ కూడదు, రెండవది ఎప్పుడూ దువ్వెన కలిగి ఉండాలి, అనుక్షణం ఖడ్గధారి అయి ఉండాలి, పొట్టి నిక్కర్, చేతికి లోహపు కడియం కూడా తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. వీటినే పంచ ‘క’కారా లని అంటారు. ఇంకా తన రచనల ద్వారా అనేక విషయాలను సులభ శైలిలో వివరించే ప్రయత్నం చేశాడు. నానక్ బోధలకు గురు గోవింద్ సింగ్ మరింత శక్తిని జోడించి, ఆ మతాన్ని మరింత విస్తృతం చేశాడు. కుటుంబం వీరమరణం హిందూమతం చెప్పే చాలా విషయాలను సిక్కుమతం తిరస్కరించింది. బహు దేవతారా«ధన పేరుతో డబ్బును, సమయాన్ని వృథా చేస్తోన్న పద్ధతిని తిరస్కరిస్తూ దేవుడు ఒక్కడేనని ప్రకటించింది. భగవంతుడు నిరామయుడు, నిరాకారుడు, నిర్గుణుడు అని విశ్వసిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించింది. సిక్కులు ధరించే ఖడ్గం ఆత్మరక్షణకు మాత్రమేనని, పగలకూ, ప్రతీకారా లకూ వాడకూడదని నిర్దేశించింది. మొఘలుల దాడులను ప్రతిఘటించడానికి గురు గోవింద్సింగ్ సైన్యాన్ని తయారుచేశాడు. అందులో సైనికులుగా చేరిన ఆయనlకుమారులు యుద్ధంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయినా చెక్కు చెదరని ధైర్యంతో ఒక వైపు మతబోధనలనూ, రెండోవైపు యుద్ధాన్నీ కొన సాగించాడు గురు గోవింద్సింగ్. చివరికి మొఘలాయి కుట్రదారులు పన్నిన కుట్రతో నాందేడ్ సమీపంలో గోదారి ఒడ్డున వీరమరణం పొందాడు. సిక్కుల చివరి గురువుగా కూడా పేర్గాంచిన గురు గోవింద్సింగ్ జీవితం ఆ వర్గాన్నే కాకుండా, పశ్చిమ భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసింది. గురు నానక్తో ప్రారంభమై, గురు గోవింద్సింగ్ త్యాగంతో ఉన్నత స్థాయికి ఎదిగిన సిక్కుమతం భారత సామాజిక చరిత్రలో ఒక విప్లవం. ఆ మతం ప్రతిపాదించిన విషయాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా హిందూమతం లోని అవాంఛనీయతను అది తిరస్కరించింది. ‘నీ సామాజిక హోదాను చూసి గర్వపడరాదు. పరువు, ప్రతిష్టల వల్ల ఉపయోగం లేదు. దేవుడి ముందు అందరూ సమానులే’ అంటూ; ‘కులమనే సామాజిక హోదా మను షుల మధ్య అంతరాలను సృష్టించే అగాధం కారాద’ని సిక్కుల పవిత్ర గ్రంథం ‘గురుగ్రంథ సాహెబ్’ స్పష్టం చేస్తున్నది. కుల హోదాలతో సంబంధం లేకుండా మనుషులందరిలో భగవంతుని రూపం వెలుగుతుం టుందని చెబుతూనే, నీ మరణం తర్వాత కులం, అధికారం నీ వెంట రావని కూడా స్పష్టం చేసింది. మిగతా మతాల మాట ఎలా ఉన్నా అణచివేత, వెనుక బాటుతనం పునాదులను పెకిలించుకు వచ్చే ఏ నూతన భావజాలమైనా పురోగామిగా ఉంటుంది. హిందువుల కర్మకాండలను సిక్కుతత్వం ఎండగట్టింది. ‘నువ్వు అర్పి స్తున్న గంగాజలం స్వర్గంలో ఉన్న నీ పితృదేవతలకు చేరడం నిజమైతే ఈ భూమ్మీదనే పంజాబ్లోని నా పొలాలకు ఎందుకు చేరదో చెప్పాలి’ అంటూ సిక్కు గురువులు హిందూ సమాజాన్ని ప్రశ్నించారు. మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను అశక్తులుగా, సోమరులుగా తయారు చేస్తున్నారని, అంతి మంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు తయారు కావడం లేదని విమర్శించారు. బౌద్ధానికి ప్రతిబింబం దైవం ఎదుట ప్రజలంతా సమానమనే భావనకే సిక్కు మతం పరిమితం కాలేదు. కులమత భేదం లేకుండా అన్నార్తులకూ, పేదలకూ గురుద్వారాలు (సిక్కుల ప్రార్థనా మందిరాలు) ఆకలి తీర్చి, ఆశ్రయమిస్తా్తయి. దానినే లంగర్ అంటారు. అందుకే ఆ మతంలో యాచకులు ఉండరు. స్వశక్తితో జీవించే శక్తిని సిక్కు మతం కలిగిస్తున్నది. ఇదో సాంస్కృతిక విప్లవం. బహు దేవతారాధన లేదు. అందువల్ల హిందూమతంలో వలే యజ్ఞయాగాలు, జంతుబలులు నిషేధం. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం– పూజారి వ్యవస్థ లేకపోవడం. అందువలన గొప్ప, తక్కువ, జ్ఞాని, అజ్ఞాని అనే భేదాలు ఏర్పడే అవకాశం లేదు. ఒక వర్గం మొత్తం సమాజం మీద పెత్తనాన్ని కలిగి ఉండే అవకాశం కూడా అక్కడ కనిపించదు. గురుగ్రంథ సాహెబ్ తెలిసిన ఎవరైనా మత బోధనలు చేయవచ్చు. అంటే 2500 ఏళ్ల నాటి బౌద్ధం భావనలే సిక్కు మతంలోనూ ప్రతిబింబించినట్టు అర్థమవుతుంది. విదేశీదాడులను ఎదుర్కో వడానికీ, కుల అసమానతలను నిర్మూలించడానికీ ఆవిర్భవించిన సిక్కు మతం ఆర్థిక రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. దేశంలోని సంపన్న రాష్ట్రాలలో సిక్కులు ప్రధానంగా నివసించే పంజాబ్, çహరియాణాలే అభి వృద్ధిలో ముందు ఉండడం గమనించాలి. వ్యవసాయ రంగంలో అవి సాధించిన ప్రగతిని ఇప్పటికీ మిగతా రాష్ట్రాలు అందుకోలేకపోతున్నాయి. వ్యాపార వాణిజ్య రంగాల్లో కూడా వీరి పాత్ర తక్కువేం కాదు. వీటన్నింటితో పాటు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో సిక్కులు స్థిరపడ్డారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కెనడా లాంటి దేశాల్లో వీరు సాగిస్తున్న వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అబ్బురపరుస్తాయి. కెనడాలో హోటల్, రవాణా రంగాలలో వారే అగ్రస్థానంలో ఉన్నారు. కష్టించే తత్వం వారి సొంతం మూఢనమ్మకాలు లేకపోవడం వల్ల సిక్కులు స్వశక్తినే నమ్ముతారు. కష్టపడే తత్వం దేనినైనా సాధించగలిగే సత్తాను ఇస్తున్నది. వారి పోరాట పటిమకు అనుగుణంగానే క్రీడారంగంలోనూ, సైన్యంలోనూ సిక్కుల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తుంది. ప్రతివారూ అక్షరాస్యులు కావాలన్న గొప్ప ఆచారం కనిపిస్తుంది. పరాన్నజీవులుగా బతికే లక్షణం వీరికి లేదు. ఉపాధి కోసం ఏదో పనిచేసుకుంటూనే మత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేతప్ప మత బోధనల కోసం ప్రత్యేక వర్గం ఉండదు. గురుద్వారాలలో, వ్యాపార పారి శ్రామిక రంగాలలో, వ్యవసాయరంగంలో– ఎక్కడైనా అధికారి, ఆసామి అనే ఆధిపత్య సంకేతాలు మచ్చుకైనా కనిపించవు. యుద్ధ సంప్రదాయాల నుంచి ఉద్భవించిన సిక్కు మతం అనుయాయులకు బాల్యం నుంచే ఆరోగ్యవంత మైన అలవాట్లను నూరిపోస్తుంది. దేహదారు«ఢ్యం కోసం వ్యాయామం తప్పనిసరిగా చేసే మంచి ఆనవాయితీ ఆ మతంలో ఉంటుంది. కానీ కొన్ని అసమానతలు సిక్కుమతాన్ని వెన్నాడుతూనే ఉన్నాయని అంగీకరించాలి. వారిలో అంటరాని కులాలు మజబీ సిక్కులు వివక్షనెదుర్కొంటూనే ఉన్నారు. ఈ వర్గంలో జన్మించిన సంత్ రవిదాస్ వివక్షారహిత సమాజాన్ని కాంక్షించిన విషయాన్ని గమనించాలి. ఇలాంటి కొన్ని పరిమితులు ఉన్నా హిందూ మతంలోని వివక్ష, అసమానతలను రూపుమాపడం వల్ల ఒక సమాజం ఎట్లా ప్రగతి సా«ధించిందో సిక్కు మతం నిరూపించింది. (డిసెంబర్ 22వ తేదీ సిక్కుల పదవ గురువు గురు గోవింద్సింగ్ జయంతి) - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213