breaking news
Endowment plans
-
టర్మ్ ప్లాన్స్.. అన్నీ ఒకటి కాదు!
జీవిత బీమాను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణిలో మార్పు వస్తోంది. అయినా, ఇప్పటికీ అధిక శాతం మంది బీమా ప్లాన్ను రాబడి కోణం నుంచే చూస్తుంటారు. చివరిలో ఎంతొస్తుందని అడుగుతారు. అందుకే బీమా ఏజెంట్లు ఎండోమెంట్ ప్లాన్లను ఎక్కువగా మార్కెటింగ్ చేస్తుంటారు. కానీ, బీమా అర్థం వేరు. ఒక వ్యక్తి మరణం కారణంగా కుటుంబం ఆరి్థకంగా కష్టాలు పడకుండా ఆదుకునే సాధనం ఇది. బీమా రక్షణను ఈ కోణంలోనే తీసుకోవాలి. అచ్చమైన బీమా కవరేజీ ఇచ్చేదే టర్మ్ ఇన్సూరెన్స్. కానీ, ఇందులోనూ పలు రకాలు ప్రవేశించాయి. నిక్షేపంగా జీవించి ఉంటే మాకేంటి..? అని ప్రశ్నించే వారి కోసం టర్మ్ ప్లాన్ను బీమా సంస్థలు వినూత్నంగా అందిస్తున్నాయి. కానీ, ఏది తీసుకోవాలి..? దీనికి సమాధానం కావాలంటే నిపుణుల విశ్లేషణ తెలుసుకోవాల్సిందే. తన కుటుంబ క్షేమం కోరేవారు తీసుకోవాల్సిన బీమా పాలసీ ఏదన్నా ఉందంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పాలి. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ ఇందులో లభిస్తుంది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు జీవించి ఉంటే ఇందులో చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు. దీంతో కట్టిన ప్రీమియం గంగపాలేనా? అని ఆలోచించే వారి కోసం బీమా సంస్థలు పరిష్కారాన్ని కనుగొన్నాయి. సగటు మనిషి ఆలోచనా తీరుకు అనుగుణంగా, చెల్లించిన ప్రీమియం చివర్లో వెనక్కి వచ్చే ఆప్షన్తోనూ టర్మ్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టాయి. అలాగే, పాలసీ గడువు ముగియకపోయినా కానీ, మధ్యలో వైదొలిగితే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చే రకాన్ని కూడా తీసుకొచ్చాయి. కానీ, పాలసీదారు తనకు నిజంగా ప్రయోజనకరమైన పాలసీ తీసుకున్నప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది. టర్మ్ పాలసీలో రకాలు టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది రెగ్యులర్ టర్మ్ ప్లాన్. దీన్నే లెవల్ టర్మ్ ప్లాన్ అని కూడా అంటారు. పాలసీదారులు తమ అభీష్టం మేరకు నిరీ్ణత వయసు వరకు (నిరీ్ణత కాలానికి) కవరేజీని తీసుకోవచ్చు. కొన్ని బీమా సంస్థలు నూరేళ్ల కాలానికీ కవరేజీని ఆఫర్ చేస్తుంటే, కొన్ని గరిష్టంగా 85 ఏళ్లకే రక్షణను పరిమితం చేస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్లో రెండో రకం టీఆర్వోపీ. అంటే టర్మ్ ప్లాన్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. గడువు తీరే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18 శాతం జీఎస్టీని మినహాయించి మిగిలినది వెనక్కిచేస్తాయి బీమా సంస్థలు. మూడో రకం జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్. ఇప్పుడు బీమా సంస్థలు దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. మిగిలిన రెండు రకాల కలయికగా ఇది ఉంటుంది. పాలసీ కాల వ్యవధిలోనే కట్టిన ప్రీమియంలు వెనక్కి ఇవ్వాలని కోరొచ్చు. వీటిల్లో మూడో రకం 2022 నుంచే అందుబాటులోకి వచి్చంది. మ్యాక్స్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ అలియాంజ్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తదితర సంస్థలు జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో రెగ్యులర్ టర్మ్ ప్లాన్ కాకుండా మిగిలిన రెండు రకాల పట్ల మొగ్గు చూపించేట్టు అయితే, ముందుగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయానికి రావాలి. వ్యత్యాసాలు... రెగ్యులర్ టర్మ్ ఇన్సూరెన్స్లో.. పాలసీ కాల వ్యవధి ముగిసేలోపు పాలసీదారు ఏ కారణంతో మరణించినా, పరిహారాన్ని నామినీకి చెల్లిస్తారు. పరిహారం మొత్తాన్ని ఒకే విడత లేదంటే, వాయిదాలుగానూ తీసుకోవచ్చు. కేవలం ఈ రిస్క్ వరకే ఈ పాలసీ పరిమితం. గడువు ముగిసేలోపు పాలసీదారు జీవించి ఉంటే ఏమీ తిరిగి రాదు. దీన్ని చౌక ప్లాన్గానూ చెబుతారు. కోటి రూపాయిల కవరేజీ సైతం 30 ఏళ్ల ఆరోగ్యకరమైన వ్యక్తికి రూ.12వేల కంటే తక్కువ వార్షిక ప్రీమియానికి వచ్చేస్తుంది. టీఆర్వోపీ (పాలసీ గడువు తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి వచ్చేవి) ప్లాన్లో పాలసీ గడువులోపు పాలసీదారు మరణించినట్టయితే నామినీకి పరిహారం వస్తుంది. పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి 18% జీఎస్టీని తగ్గించి ఇస్తారు. కానీ, రెగ్యులర్ టర్మ్ ప్లాన్లతో పోలిస్తే ఇవి ఖరీదుగా ఉంటాయి. రెగ్యులర్ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే 2 రెట్ల వరకు అధిక ప్రీమియం వీటి కోసం చెల్లించాల్సి వస్తుంది. ఇలా అదనంగా వసూలు చేసే ప్రీమియంను సంప్రదాయ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి, గడువు తీరిన తర్వాత పాలసీదారులకు బీమా కంపెనీలు చెల్లిస్తుంటాయి. అదనంగా చెల్లించే మొత్తం నుంచే తమ ప్రీమియం వెనక్కి వస్తుందన్న వాస్తవాన్ని పాలసీదారులు గుర్తించాలి. జీరో కాస్ట్ ప్లాన్లో పాలసీ గడువు కంటే ముందుగానే వైదొలగొచ్చు. ఒక వ్యక్తి తన ఆరి్థక బాధ్యతలు ముగిశాయని భావించినప్పుడు లేదంటే పదవీ విమరణ తర్వాత పాలసీ గడువు ఇంకా మిగిలి ఉన్నా వైదొలగడానికి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత ఇలా చేయవచ్చు. ఇలా ముందస్తుగానే తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తం నుంచి 18% జీఎస్టీని మినహాయించి బీమా సంస్థలు వెనక్కి ఇచ్చేస్తాయి. దీంతో పాలసీ రద్దయిపోతుంది. దీనివల్ల బీమా సంస్థలకు ప్రయోజనం.. వృద్ధాప్యానికి వచి్చన పాలసీదారు తప్పు కోవడం వల్ల వాటికి క్లెయిమ్ రిస్క్ తగ్గుతుంది. వాస్తవం ఏంటి? జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ అంటే, ఎలాంటి చార్జీలు ఉండవని, దీన్నే చౌక ప్లాన్ అని పొరబడే అవకాశం లేకపోలేదు. ‘‘కొన్ని ప్లాన్లకు జీరోకాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనే లేబుల్ వేయడం ఎందుకంటే.. ప్రత్యేకంగా వైదొలగడం, ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్ వల్లే. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అనుసరించే మార్కెటింగ్ ఎత్తుగడల్లో భాగమే ఇది’’ అని ప్రోబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ పేర్కొన్నారు. ప్రీమియం వెనక్కి వస్తుంది కనుక, జీరోకాస్ట్గా బీమా కంపెనీలు వీటిని వర్ణిస్తున్నాయి. అయినా, పాలసీదారు ఎప్పడంటే అప్పుడు పాలసీ నుంచి తప్పుకోవడం కుదరదని పాలసీబజార్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ రిషబ్ గార్గ్ స్పష్టం చేశారు. కనీస కాల వ్యవధి ముగిసి, ఆరి్థక బాధ్యతలు తీరిన తర్వాతే ఇందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ‘‘జీరో కాస్ట్ అనేది మైండ్ గేమ్. ఈ పాలసీ కోసం నేడు చెల్లించే ప్రీమియం విలువ, చివర్లో బీమా సంస్థ తిరిగిచ్చే ప్రీమియం కంటే చాలా ఎక్కువ’’అని వివరించారు. ఏమిటి మార్గం? టర్మ్ పాలసీ కాల వ్యవధి సాధారణంగా 30–40 ఏళ్లు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఉద్యోగం వచి్చన నాటి నుంచే జీవిత బీమా కవరేజీ ఉండాలన్నది నిపుణుల సూచన. కనుక రిటైర్మెంట్ వరకు తీసుకోవడం ఎంతో అవసరం. 60 ఏళ్ల నాటికి కూడా ఆరి్థక బాధ్యతలు తీరుతాయో, లేదో అన్న సందేహంతో 75 ఏళ్లు, 85 ఏళ్ల వరకు కూడా పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, కొన్ని పాలసీల్లో వయసు ఆధారంగా ఫీచర్లను బీమా సంస్థలు పరిమితం చేస్తుంటాయి. జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఆరి్థక బాధ్యతలు తీరిన వెంటనే పాలసీ నుంచి వైదొలగొచ్చు. దీనివల్ల ప్రీమియంలు వెనక్కి వస్తాయి. పాలసీ కాల వ్యవధి ముగియక ముందే ప్రీమియంల కోసం వైదొలగడం సరికాదు. దీనివల్ల జీవిత బీమా రక్షణను కోల్పోవాల్సి వస్తుంది. రెగ్యులర్ ప్లాన్లో రూ.50 లక్షల కవరేజీకి ప్రీమియం ఎంత? ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్లో ప్రీమియం ఎంత? ఈ రెండింటి మధ్య అంతరం చెప్పుకోదగినంత ఉంటుంది. కనుక చివర్లో ప్రీమియం వెనక్కి వచ్చే ప్లాన్ కాకుండా రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మేర మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే.. దీర్ఘకాలంలో భారీ మొత్తమే సమకూరుతుందని ఎన్నో నిదర్శనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఐప్రొటెక్ట్ స్మార్ట్ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్’ 60 ఏళ్ల వయసు వచ్చే వరకు రూ.కోటి కవరేజీ తీసుకునేట్టు అయితే ప్రీమియం రూ.16,287గా ఉంది. రెగ్యులర్ ప్లాన్లో ఇదే కవరేజీకి ప్రీమియం రూ.12,686. వ్యత్యాసం రూ.3,601. రెగ్యులర్ ప్లాన్ తీసుకుని, మిగిలే మొత్తాన్ని ప్రతి నెలా రూ.300 చొప్పున (ఏడాదికి రూ.3,600) ఈక్విటీ ఫండ్లో 30 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే 12 శాతం రాబడి అంచనా ప్రకారం 30 ఏళ్లకు రూ.10.5 లక్షలు సమకూరుతుంది. రిస్క్ తీసుకోని డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసుకున్నా రూ.4.5 లక్షలు సమకూరుతుంది. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ ప్లాన్ సైతం జీరోకాస్ట్గానే సమకూరుతుంది. ఇక్కడ చెప్పుకున్నట్టు జీరోకాస్ట్ టర్మ్ ప్లాన్ కోసం ఏటా రూ.16,287 చొప్పున 30 ఏళ్లలో రూ.4.89 లక్షలు చెల్లించుకోవాలి. చివరి వరకు జీవించి ఉంటే, చెల్లించిన మొత్తం నుంచి 18 శాతం జీఎస్టీ మినహాయిస్తారు. అప్పుడు చేతికి వచ్చేది రూ.4 లక్షలు. ఇక కనిపించని చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. జీవిత బీమా ప్రీమియంలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. మరి అవే ప్రీమియంలు వెనక్కి వచి్చనప్పుడు పన్ను వర్తించొచ్చు. ఇతర రకాలు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్.. ఏటా కవరేజీ పెరిగే ప్లాన్కు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా 60–65 ఏళ్లకు వచ్చే సరికి ఆరి్థక బాధ్యతలు తగ్గిపోతుంటాయి. అటువంటప్పుడు ఈ ఆప్షన్లో ఏటా నిరీ్ణత శాతం మేర సమ్ అష్యూరెన్స్ తగ్గుతూ వెళుతుంది. ఇందులోనూ ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. ఇతర ప్లాన్లతో పోలిస్తే ప్రీమియం తక్కువ. లమ్సమ్, పీరియాడిక్ పేమెంట్స్.. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత చెల్లించేవి లమ్సమ్. ఒకేసారి అంత మొత్తం చేతికి వస్తే, దాన్ని ఆదాయంగా మలుచుకోవడం సమస్యగా భావించేవారు, పీరియాడిక్ పేమెంట్స్ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీదారు కాల వ్యవధి ముగియక ముందే మరణించిన సందర్భంలో పరిహారాన్ని నెలవారీ చొప్పున పదేళ్ల పాటు చెల్లించేలా ఎంపిక చేసుకోవచ్చు. సగం పరిహారం ఏక మొత్తంలో చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్.. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంపిక చేసుకున్న కాలానికి అమల్లో ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల కాలానికి టర్మ్ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. 70 ఏళ్లకు వచ్చే సరికి టర్మ్ ప్లాన్ ముగిసిపోతుంది. అప్పుడు కావాలంటే దాన్ని మరింత కాలానికి బీమా పాలసీ కింద మార్చుకోవచ్చు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్.. చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్ తీసుకునే వారు ఈ ఆప్షన్ను ఎంపిక చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత నుంచి జీవితంలో పలు దశల్లో బాధ్యతలు పెరుగుతూ వెళతాయి. కనుక పెరిగే బాధ్యతలకు అనుగుణంగా బీమా కవరేజీ విస్తృతం చేసుకునేందుకు ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్ వీలు కల్పిస్తుంది. ఈ ప్లాన్లో ఏటా నిరీ్ణత శాతం మేర కవరేజీ పెరుగుతూ వెళుతుంది. అలాగే, ఐదేళ్లకోసారి సమ్ అష్యూర్డ్ పెరిగే పాలసీలు కూడా ఉన్నాయి. కవరేజీ పెరిగినప్పటికీ, పాలసీ కాల వ్యవధి అంతటా ప్రీమియం స్థిరంగానే ఉంటుంది. లిమిటెడ్ పే, సింగిల్ పే.. రెగ్యులర్ ప్లాన్లో ఎంపిక చేసుకున్న కాలం అంతటా నిరీ్ణత రోజులకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తుండాలి. అదే సింగిల్ ప్రీమియం పాలసీలో ఆరంభంలోనే ఒకసారి ప్రీమియం చెల్లించాలి. రెగ్యులర్గా ప్రీమియం కట్టే వెసులుబాటు లేని వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇక లిమిటెడ్ పే ప్రీమియం ప్లాన్లో.. పాలసీ కాల వ్యవధి అంతటా కాకుండా, కొన్నేళ్ల పాటు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్లు వచ్చే వరకు 50 ఏళ్ల కాలానికి టర్మ్ ప్లాన్ ఎంపిక చేసుకున్నాడని అనుకుందాం. 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా భావిస్తే లిమిటెడ్ పే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. 5–10–15 ఏళ్లు ఇలా లిమిటెడ్ పేలో ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధి ఉంటుంది. -
ఎండోమెంట్ ప్లాన్లు.. రెండూ కావాలంటే!
యూనిట్ లింక్డ్ పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్ పతనాల్లో చేతికి అందేదేమీ ఉండదు. టర్మ్ ప్లాన్లలో తక్కువకే ఎక్కువ పరిహారం వస్తున్నా... చెల్లించిన ప్రీమియం పాలసీదారులు జీవించి ఉంటే వెనక్కి రాదు. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో దురదృష్టవశాత్తూ మరణిస్తే పరిహారం రావాలి.. లేదా జీవించి ఉన్నా తాము చెల్లించిన మొత్తానికి హామీతో కూడిన రాబడి కలసి అందుకోవాలి. అందుకే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో అత్యధికులు ఎండోమెంట్ ప్లాన్లకు చోటిస్తుంటారు. ఆకర్షణీయమైన ఎండోమెంట్ ప్లాన్ల వివరాలు చూస్తే... హెచ్డీఎఫ్సీ సంచయ్ ప్లస్ పాలసీదారులకు హామీతో కూడిన (గ్యారంటీడ్) రాబడులను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీలో నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ.. అంటే కాల వ్యవధి ముగిసిన తర్వాత హామీ మేరకు చెల్లించేది. గ్యారంటీడ్ ఇన్కమ్, లైఫ్లాంగ్ ఇన్కమ్, లాంగ్టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఐదేళ్ల ప్రీమియం చెల్లించే వ్యవధి ఎంచుకున్న వారికి పదేళ్లకు.. ఆరేళ్లు ప్రీమియం చెల్లింపును ఎంచుకుంటే 12 ఏళ్లకు.. పదేళ్ల ప్రీమియం కాల వ్యవధిని ఎంచుకున్నవారికి 20 ఏళ్లకు హామీ ఇచ్చిన మేరకు ఏక మొత్తంలో కంపెనీ చెల్లిస్తుంది. గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్లో.. పాలసీ కాల వ్యవధి పూర్తయ్యే వరకు కంపెనీ నిర్ణీత మొత్తాన్ని చెల్లిస్తుంది. అలాగే, లైఫ్లాంగ్ ఇన్కమ్లో.. పాలసీదారునికి 99 ఏళ్లు వచ్చే వరకు చెల్లింపులు చేస్తుంది. లాంగ్టర్మ్ ఇన్కమ్ ఆప్షన్లో 25 ఏళ్ల పాటు చెల్లింపులు జరుగుతాయి. అన్ని ఆప్షన్లలోనూ పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత రెండేళ్ల నుంచి చెల్లింపులు మొదలవుతాయి. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే.. సమ్ ఇన్సూర్డ్ లేదా అప్పటి వరకు ప్రకటించిన గ్యారంటీడ్ అడిషన్స్తో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనాలను.. ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 40 ఏళ్ల వ్యక్తికి 5–5.5% మధ్య ప్రస్తుతం ఉంది. ప్రీమియం చెల్లింపు కాలం ఎక్కువ ఉంటే రాబడుల రేటూ ఎక్కువగా వస్తుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ఏఎస్ఐపీ ఇది హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ మాదిరి ప్లాన్. రెండు రకాల ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. పదేళ్ల ప్లాన్కు ఐదేళ్లు, 15 ఏళ్ల ప్లాన్కు ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 60 ఏళ్ల వయసు వరకు పాలసీని తీసుకోవచ్చు. గ్యారంటీడ్ అడిషన్స్, గ్యారంటీడ్ లంప్సమ్ మొత్తాన్ని చెల్లిస్తారు. గ్యారంటీడ్ అడిషన్స్ అన్నవి ఏడాదికోసారి పాలసీకి జోడించడం జరుగుతుంది. పాలసీ కాల వ్యవధిని అనుసరించి ఇది ఏటా 10–15% మధ్య ఉండొచ్చు. మరణ పరిహారం సమ్ అష్యూరెన్స్ లేదా గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనం ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. గడువు తీరిన తర్వాత ప్రయోజనం ఏకమొత్తంలో తీసుకునే ఆప్షన్ ఒక్కటే ఉంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకుంటే తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా అష్యూర్ 50 ఏళ్లు, ఆలోపు వయసున్న ఎవరైనా ఈ ప్లాన్ తీసుకునేందుకు అర్హులే. 12 ఏళ్లు, 15 ఏళ్ల కాల వ్యవధితో వస్తాయి. 12 ఏళ్ల పాలసీకి ఆరేళ్లు, 15 ఏళ్ల పాలసీకి ఏడేళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. త్రైమాసికం, అర్ధ సంవత్సరం ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు లేవు. అలాగే, ఈ పాలసీలో కనీస వార్షిక ప్రీమియం రూ.50,000. ఈ పాలసీలో ఇంటర్నల్ రేటు ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 5.5 శాతంగా ఉంది. ఐసీఐసీఐ లక్ష్య లైఫ్లాంగ్ ప్రీమియం చెల్లించిన ఐదేళ్ల తర్వాత నుంచి పాలసీదారులకు ఇందులో ఏటా ఆదాయం లభిస్తుంది. పాలసీదారు మరణించేంత వరకు లేదా 99 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ చెల్లింపులు కొనసాగుతాయి. ఎంత మేర ప్రీమియం చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న దాని ఆధారంగా పాలసీ జారీ చేసే సమయంలోనే గ్యారంటీడ్ చెల్లింపులు ఎంత మేర అన్నవి నిర్ణయమవుతాయి. 15 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో 50 ఏళ్ల వయసు వారి వరకే ఈ పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంది. 12 ఏళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లో ప్రవేశానికి గరిష్ట వయసు 53 ఏళ్లు. అదే విధంగా పదేళ్ల ప్రీమియం ఆప్షన్లో గరిష్ట ప్రవేశ వయసు 55 ఏళ్లు. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ ఇది కూడా హోల్లైఫ్ పాలసీయే. అంటే జీవితాంతం బీమా రక్షణ కల్పించే ఉత్పత్తి. 55–65 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎంచుకునే వ్యవధిపై ఇది ఆధారపడి ఉంటుంది. 100లో తమ వయసును తీసివేయగా మిగిలే కాలానికి పాలసీ వర్తిస్తుంది. లేదంటే 30 నుంచి 40 ఏళ్ల కాలానికీ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఆరు, ఎనిమిది, పది, పన్నేండేళ్ల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లలో అనుకూలమైనదానిని ఎంచుకోవచ్చు. తక్షణ ఆదాయం (ఇమీడియట్ ఇన్మక్), తర్వాత ఆదాయం (డిఫర్డ్ ఇన్కమ్) అనే ఆప్షన్లు ఉన్నాయి. తక్షణ ఆదాయ ఆప్షన్ ఎంచుకుంటే, ఏటా ప్రకటించే బోనస్ను చెల్లించడం జరుగుతుంది. గడువు తీరిన తర్వాత జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంకు సమాన మొత్తం ఒకే సారి చెల్లిస్తారు. అదే తర్వాత తీసుకునే ఆదాయ ఆప్షన్లో.. హామీతో కూడిన ఆదాయం, క్యాష్ బోనస్ను ప్రీమియం చెల్లింపు గడువు తీరిన ఏడాది తర్వాత నుంచి పాలసీ గడువు ముగిసే వరకు చెల్లించడం మొదలవుతుంది. ప్రీమియం చెల్లింపు గడువు తీరిన నాటి నుంచి పాలసీ ముగియడానికి వరకు ఉండే కాలం లేదా 25 ఏళ్లు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అప్పటి వరకు ఏటా ఈ చెల్లింపులు జరుగుతాయి. గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, టర్మినల్ బోనస్ చెల్లిస్తారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ 50 ఏళ్ల వయసు, ఆలోపున్న వారు పాలసీ తీసుకునేందుకు అర్హులు. కనీస పాలసీ కాల వ్యవధి 15 ఏళ్లు. గరిష్టంగా 35 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. పూర్తి పాలసీ కాలవ్యవధి వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాక్షిక కాలానికే ప్రీమియం ఆప్షన్ లేదు. పాలసీ అమల్లో ఉన్న కాలంలో మరణం చోటు చేసుకుంటే సమ్ అష్యూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. కాల వ్యవధి తీరే వరకు జీవించి ఉంటే అప్పటి వరకు సమకూరిన బోనస్లు అందుకోవచ్చు. అయితే, ఈ పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత కూడా పాలసీదారునికి జీవితాంతం బీమా రక్షణ కొనసాగుతుంది. అంటే కాల వ్యవధి తీరిన తర్వాత ఒకసారి ప్రయోజనం చెల్లించగా, తిరిగి పాలసీదారు మరణానంతరం నామినీలకు సమ్ అష్యూరెన్స్ను చెల్లిస్తారు. ప్రతీ రూ.1,000 సమ్ అష్యూరెన్స్ మొత్తంపై 15 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి 2018–19 సంవత్సరానికి జీవన్ ఆనంద్ పాలసీలో రూ.41ను బోనస్గా ప్రకటించారు. 16–20 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకున్న వారికి ప్రతీ రూ.1,000 బీమాపై ప్రకటించిన బోనస్ రూ.45. అదే 20 ఏళ్లకు పైగా కాల వ్యవధి కలిగిన పాలసీదారులకు రూ.1,000 బీమాపై రూ.49 బోనస్ అందుకున్నారు. వీటిని గుర్తుంచుకోవాలి.. ఎండోమెంట్ పాలసీల్లో సరెండర్ చార్జీలు అధికం. అంటే పాలసీదారులు గడువు తీరకుండానే పాలసీని స్వాధీనం చేయాలనుకుంటే నష్టపోయేది ఎక్కువ. అలాగే, పార్టిసిపేటింగ్ ప్లాన్లలో బోనస్లకు గ్యారంటీ లేదు. ఎండోమెంట్ ప్లాన్లలో రాబడులు నికర రాబడి రేటు తక్కువే. కానీ, ఇందులో మెచ్యూరిటీ తీరిన తర్వాత చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ఉండదు. మరణంపై వచ్చే పరిహారానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. కనుక పన్ను ఆదాను పరిగణనలోకి తీసుకుంటే రాబడి రేటు ఫిక్స్డ్ డిపాజిట్ల స్థాయిలో ఉంటుందని భావించొచ్చు. బీమా పాలసీలకు చేసే ప్రీమియంను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందొచ్చు. -
నిశ్చింతగా రిటైర్మెంట్ ఇలా..
ఉద్యోగం చేసినన్నాళ్లు కుటుంబానికి ఏ ఢోకా లేకుండా చూసుకునేందుకు, సౌకర్యంగా గడిపేందుకు ప్రాధాన్యతనిస్తుంటాం. అయితే ప్రస్తుత అవసరాలపై దృష్టి పెట్టే హడావుడిలో .. రిటైర్మెంట్ గురించి ప్లానింగ్ చేసుకోవడాన్ని మనలో చాలా మంది పట్టించుకోరు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి సంపన్న దేశాల్లో ప్రభుత్వం తమ పౌరులందరికీ రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కల్పిస్తుంటుంది. కానీ భారత్లో మాత్రం ఉద్యోగం చేసే జనాభాలో కేవలం 12 శాతం మందికి మాత్రమే పింఛను కవరేజి ఉంది. వారికి కూడా ప్రావిడెంట్ ఫండ్ ఏకమొత్తంగా లభించినా.. ధరల పెరుగుదల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. నెలవారీగా పింఛను వచ్చినా అదే పరిస్థితి. ప్రస్తుతం దాదాపు రూ. 15,000గా ఉన్న కుటుంబఖర్చులు.. పదేళ్లలో రూ. 35,000కి పెరిగిపోతాయన్న ద్రవ్యోల్బణ గణాంకాల్లో అతిశయోక్తి లేదు. అంటే మనం పొదుపు చేసే దానికి మించిన స్థాయిలో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇది రిటైర్మెంట్ తర్వాత గడిపే జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని పదవీ విరమణ తర్వాత కూడా నిశ్చింతగా జీవితం గడపాలంటే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. లక్ష్యాన్ని బట్టి ప్రణాళిక .. రిటైర్మెంట్ ప్లాన్ రూపొందించుకునేటప్పుడు ప్రధానంగా ఆర్థిక లక్ష్యాలు, మీరెంత రిస్కు తీసుకోగలరు, అలాగే ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవాలి. రిటైరయ్యాక జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? ప్రపంచాన్ని చుట్టి వద్దామనుకుంటున్నారా, ఏదైనా కన్సల్టెన్సీ లాంటిది ప్రారంభిస్తారా లేదా హాయిగా ఇంటిపట్టునే ఉండి మనవలు, మనవరాళ్లతో సరదాగా కాలం వెళ్లబుచ్చుదామనుకుంటున్నారా? ఇలా.. మీ రిటైర్మెంట్ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. దానికి అవసరమయ్యే నిధిని సమకూర్చుకునేందుకు అనువైన వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసం స్టాక్స్, బీమా, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్లు మొదలైన సాధనాలు ఉన్నాయి. మీరు ఏ దశలో ఉన్నారు, ఆర్థిక లక్ష్యాలేంటి, రిస్కు సామర్థ్యం ఎంత మొదలైన వాటి ఆధారంగా వీటన్నింటి మేళవింపుతో సమగ్రమైన పోర్ట్ఫోలియో రూపొందించుకోవాలి. రిటైర్మెంట్ లేదా పింఛను పథకాలు: బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తుంటాయి. ఇవి దీర్ఘకాలికమైనవి. బీమా కంపెనీలు అందించే పింఛను పథకాల్లో మెచ్యూరిటీ వేళ సమ్ అష్యూర్డ్లో 30 శాతం మొత్తాన్ని అందుకోవచ్చు. మిగతాది యాన్యుటీ రూపంలో అందుకోవచ్చు. ఆరోగ్య బీమా: వైద్యం ఖర్చులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండాలి. మెడిక్లెయిమ్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ ఆరోగ్యానికి బీమా రక్షణ పొందవచ్చు. ఎండోమెంట్ పథకాలు: బీమా సంస్థలు అందించే ఈ పథకాలు పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు వంటి నిర్దిష్ట లక్ష్యాలకు ఉపయోగపడతాయి. బీమాతో పాటు పెట్టుబడి పథకాలుగా ఇవి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా నిర్దిష్ట కాలానికి ప్రీమియం కడితే, గడువు తీరిన తర్వాత భారీ మొత్తాన్ని మెచ్యూరిటీ విలువ కింద అందుకోవచ్చు. ఒకవేళ పాలసీదారు ఆకస్మికంగా మరణించినా నామినీకి సమ్ అష్యూర్డ్ మొత్తం అందుతుంది. పెట్టుబడి, ఆర్థిక లక్ష్యాలకు ఎటువంటి విఘాతం కలగకపోవడం ప్రధాన ప్రయోజనం. వీటన్నింటితో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అనుభవాన్ని, రిస్కు సామర్థ్యాన్ని బట్టి స్టాక్స్లో నేరుగా లేదా యులిప్స్ లేదా ఫండ్స్ మార్గంలో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉంటుంటాయి కనుక వయసు పెరిగే కొద్దీ ఈక్విటీల్లో పెట్టుబడులను క్రమంగా తగ్గించుకోవడం మంచిది. రిటైర్మెంట్ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారన్న దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. పర్యాటక ప్రదేశాలు తిరిగి రావడం వంటి ఆలోచనలు ఉంటే కాస్త దూకుడుగా, ఈక్విటీ ఆధారిత ప్రణాళికలు, అలా కాకుండా ఇంటిపట్టునే ఉంటే డెట్ సాధనాల ఆధారిత ప్లాన్ వైపు మొగ్గు చూపవచ్చు. పిల్లల చదువు, పెళ్లిళ్లు మొదలైన వాటికి ముందునుంచే ప్లానింగ్ చేసుకుంటే నిశ్చింతగా రిటైర్ కావొచ్చు.