breaking news
ballet paper
-
By Election Results: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీదే హవా
న్యూఢిల్లీ: దేశంలోని 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం(నవంబర్23) వెలువడ్డాయి. మహారాష్ట్రలో ఒక ఎంపీ సీటు, కేరళలోని వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగ్గా వయనాడ్ను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ 4లక్షలకుపైగా రికార్డు మెజారిటీ సాధించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరప్రదేశ్..48 సీట్లలో యూపీలో కీలకమైన 9 సీట్లున్నాయి. యూపీలో ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగా రెండు చోట్ల సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచింది. వెస్ట్బెంగాల్..వెస్ట్బెంగాల్లో ఆరు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ మళ్లీ సత్తా చాటింది. ఇక్కడ ఆరింటికి ఆరు స్థానాలను మమతా బెనర్జీ పార్టీ కైవసం చేసుకుంది. బీహార్..బీహార్లో నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసింది.ఇక్కడ తరారీ (బీజేపీ ), రామ్గఢ్ (బీజేపీ), బేలాగంజ్ (జేడీయూ), ఇమామ్గంజ్ (హెచ్ఏఎం(ఎస్))రాజస్థాన్..రాజస్థాన్లో ఉప ఎన్నికలు జరిగిన 7 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 5 గెలుచుకుంది. ఒక సీటులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా భారత్ ఆదివాసీ పార్టీ(బీఏడీవీపీ) ఒక సీటు గెలుచుకుంది. కర్ణాటక..కర్ణాటకలోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కర్ణాటకలోకి శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై ఓటమి13 వేలకుపైగా ఓట్లతో బొమ్మైపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్పంజాబ్.. పంజాబ్లో మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా మూడింటిలో ఆమ్ఆద్మీపార్టీ, ఒక సీటులో కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కేరళ..కేరళలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నకలు జరగగా ఒక చోట అధికార సీపీఎం మరొకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. 4 లక్షల రికార్డు మెజారిటీతో గెలిచిన ప్రియాంక గాంధీ 👉కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ మరోసారి భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4లక్షల 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో రాహుల్గాంధీ ఇదే స్థానం నుంచి 3,64,422 ఓట్ల ఆధిక్యత సాధించారు. 👉కేరళలోని పాలక్కాడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ మమ్కూతిల్ 18,840 ఓట్ల భారీ తేడాతో బీజేపీ అభ్యర్థి సి కృష్ణకుమార్పై విజయం సాధించారు.అస్సాం.. అస్సాంలోని నాలుగు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా నాలుగింటిలో రెండింటిని అధికార బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి ఏజీపీ గెలుచుకున్నాయి. సిక్కిం..సిక్కింలోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగగా రెండు సీట్లలో ఎస్కేఎం గెలుపొందింది. గుజరాత్..గుజరాత్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఒక్క సీటులో బీజేపీ గెలుపొందింది. చత్తీస్గఢ్..ఛత్తీస్గఢ్లో ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా దానిని బీజేపీ గెలుచుకుంది.ఉత్తరాఖండ్..ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగగా ఇక్కడ బీజేపీ గెలుపొందింది. మేఘాలయ..మేఘాలయాలోని ఒక అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరగగా ఈ సీటును ఎన్పీపీ పార్టీ తన ఖాతాలో వేసుకుంది.ఇది కూడా చదవండి: Jharkhand Election Result: ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలి: జేఎంఎం -
పాక్ ఎన్నికలకు 54 వేల చెట్ల నరికివేత!
ఇస్లామాబాద్: ఇదేందిది... ఎన్నికలకోసం చెట్లు నరకడం ఏమిటా అనుకుంటున్నారా? అవును ఇది ఇది నిజం.. పాక్ ఎన్నికల నిర్వహణకు 56 వేల చెట్లు నరికి వేయాల్సి వచ్చింది. పాక్లో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల కోసం మొత్తంగా 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 2,179 టన్నుల కాగితం అవసరమయ్యింది. కాగితాన్ని చెట్ల నుంచే తయారు చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఒక అంచనా ప్రకారం ఒక చెట్టు నుండి దాదాపు 16 రీమ్ల కాగితాన్ని తయారు చేయవచ్చు. అటువంటి స్థితిలో ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 25 చెట్లు అవసరం. దాని ప్రకారం మనం లెక్కలు వేస్తే ఎన్నికల కోసం పాకిస్తాన్లో దాదాపు 54 వేల చెట్లను నరికివేశారు. 2018 ఎన్నికల్లో 22 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. ఇందుకోసం 800 టన్నుల ప్రత్యేక సెక్యూరిటీ పేపర్ను ఉపయోగించారు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య పెరిగిన కారణంగానే బ్యాలెట్ పేపర్ల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఎన్నికల సంఘం పేర్కొంది. 2018 కంటే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరిగింది. ఎన్నికల సంఘం పేపర్ల ముద్రణను సకాలంలో పూర్తి చేసింది. సోమవారం నాటికి బ్యాలెట్ పత్రాల పంపిణీ పూర్తి కానుంది. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహించింది. ఈ మాక్ టెస్ట్ లో 859 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ను బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు. నవాజ్ మరోమారు ప్రధాని కాబోతున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) చెబుతోంది. -
బ్యాలెట్పై ముందే సిరా గుర్తు!
రాజేంద్రనగర్: బ్యాలెట్ పేపర్లో ఓ అభ్యర్థి గుర్తుపై ముందే సిరాగుర్తు ఉండటంతో వివాదాస్పదమైంది. బుధవారం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. మున్సిపల్ పరిధి 20వ డివిజన్కు చెందిన ఐశ్వర్య తొలిసారి ఓటు వేసేందుకు కుటుంబీకులతో కలిసి బండ్లగూడ సరస్వతీ విద్యాలయంలోని పోలింగ్ బూత్కు వచ్చింది. దీంతో అధికారులు ఆమెకు బ్యాలెట్ పేపర్ను ఇచ్చారు. బ్యాలెట్పై అప్పటికే కారు గుర్తుపై సిరాతో ముద్ర వేసి ఉంది. దీంతో ఐశ్వర్య అభ్యంతరం వ్యక్తం చేసి ప్రిసైడింగ్ అధికారికి విషయం తెలిపి మరో బ్యాలెట్ పేపర్ కావాలని చెప్పాడు. ఓ వృద్ధుడు పొరపాటున బ్యాలెట్ పేపర్పై వేలి ముద్ర వేశాడని సముదాయించి అదే బ్యాలెట్ పేపర్తో ఓటు వేయించారు. ఐశ్వర్య మాత్రం తనకు అన్యాయం జరిగిందని, తన ఓటు చెల్లకుండా పోయిందని ఆరోపిస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్ నాయక్, బండ్లగూడ ఆర్వో కృష్ణమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు ఆమెను సముదాయించి లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. వేసిన ఓటు తప్పకుండా చెల్లుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయమై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముందే ఓటేశారు.. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై ముందే సిరా గుర్తుతో ఓటు వేశారని 20వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అభిలాష్ ముదిరాజ్ ఆరోపించారు. తాను మొదటి నుంచే బ్యాలెట్ పేపర్లను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని, పోలీసులు తనను పోలింగ్ బూత్ వద్దకు రానివ్వలేదని మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్లలోని కారు గుర్తుపై మందే సిరా ముద్రలు ఉన్నాయని చాలామంది తనకు ఫిర్యాదు చేశారని అభిలాష్ తెలిపారు. ఓడిపోతామనే భయంతో పోలీసులు, పొలింగ్ సిబ్బందితో టీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై ఇలా చేశారన్నారు. ఐశ్వర్య ఫిర్యాదు తన ఆరోపణలకు బలం చేకూరిందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈసారి ఓటు ఎలా?
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నందున 2019 ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాలని కాంగ్రెస్, తృణమూల్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎం లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని, పైగా వీవీప్యాట్ (ఓటరు ఏ పార్టీకి ఓటు వేసిందీ తెలియపరుస్తూ రసీదు ఇచ్చే మిషన్)ల అనుసంధానంతో ఈవీఎంలు మరింత భద్రంగా, కచ్చితంగా పనిచేస్తాయని ఎన్నికల సంఘం పదే పదే స్పష్టం చేస్తున్నా విపక్షాలు నమ్మడం లేదు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతే డాది ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఈవీఎంలో ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడటాన్ని సాక్ష్యంగా చూపుతోంది. 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. ‘ఈవీఎంల స్థానం లో బ్యాలెట్ పేపర్లు పెట్టాలన్నది మా డిమాండ్. పార్టీలన్నీ ఒక్కటై దీన్ని సాధించాలి’అని తృణమూల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ప్లీనరీలో కాంగ్రెస్ తీర్మానం... ఈవీఎంలను తొలగించాలంటూ ఈ ఏడాది మార్చి లో జరిగిన 84వ ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. ఈవీఎంలను వాడు తున్నప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఇలా జరుగుతోందని ఆ పార్టీ వాదిస్తోంది. వచ్చే సోమవారం అన్ని పార్టీలు సమావేశమై దీనిపై చర్చిం చనున్నాయి. పార్లమెంటులో ఈవీఎంలపై చర్చకు డిమాండ్ చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలసి ఈవీఎంలపై వినతిపత్రం సమర్పించనున్నాయి. మరోవైపు అన్ని పార్టీలు కాదంటే ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపట్టే విషయం ఆలోచిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈవీఎంలతో లాభాలివీ... ♦ ఈవీఎంల వల్ల కాగితం ఆదా అవుతుంది. ♦ ఈవీఎంలను భద్రపరచడం, పంపిణీ చేయడంలోనూ సమస్యలను అధిగమించవచ్చు. ♦ ఈవీఎంల వాడకంతో చెల్లని ఓటంటూ ఉండదు. ♦ ఈవీఎంల ద్వారా గంటకు 240 ఓట్లు వేయొచ్చు. కానీ బ్యాలెట్ బాక్స్లలో ఇది సాధ్యం కాదు. ♦ కేవలం 6 వోల్ట్ల బ్యాటరీతోనే ఈవీఎంలు పనిచేస్తాయి కనుక మారుమూల గ్రామాల్లోనూ ఈవీఎంలను వాడటం తేలిక. బ్యాలెట్ పేపర్తో కష్టాలు... ♦ బ్యాలెట్ విధానంలో దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువ. రాజకీయ ప్రాబల్యంగల వారు రిగ్గింగ్కి పాల్పడటం, ప్రత్యర్థులకు ఓట్లు పడ్డాయనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఇంక్ పోయడం లాంటి వాటికి అవకాశం ఉంది. ♦ ఓటరు ఎంచుకున్న అభ్యర్థి గుర్తుపైన ముద్ర పడకున్నా, లేక పడిన ముద్ర పూర్తిగా కనిపించకపోయినా ఆ ఓటు చెల్లకపోవచ్చు. ♦ బ్యాలెట్ బాక్స్లను సురక్షిత ప్రదేశానికి తరలించడం కషం. దీనికి పెట్టాల్సిన ఖర్చు అధికం. ♦ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్కు ఈవీ ఎంలతో 2 నుంచి 3 గంటలు పడితే, బ్యాలెట్ పేపర్తో 30 నుంచి 40 గంటలు పడుతుంది. ♦ 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 9,30,000 పోలిం గ్ స్టేషన్లలో 14 లక్షల ఈవీఎంలను ఉపయోగించారు. 81.7 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019 ఎన్నికల్లో దాదాపు 87.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వినియోగించాలంటే బ్యాలెట్కన్నా ఈవీఎంలే నయమనే వాదనా ఉంది. మన బ్యాలెట్ కథా కమామిషు! ఎన్నికల నిర్వహణకు ఒక రూపు రేఖ తీసుకువచ్చిన ఘనత తొలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్సేన్ దే. ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. తొలి ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్ని కేటాయించారు. ఆ బాక్స్పై వారి పేరు, ఎన్నికల గుర్తును పెయింట్ చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారో, అన్ని బాక్స్లు ఉంచారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ను వారికి నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్లో వేస్తే సరిపోతుంది. 1957లో కూడా ఇదే ప్రక్రియను అనుసరించారు. 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఎన్నికల గుర్తులన్నీ ఒకే బ్యాలెట్ పేపర్పై ముద్రించి, తమకు నచ్చిన అభ్యర్థిపై ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలలపాటు జరిగింది. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం కూడా తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 62 కోట్ల బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. ఇక ప్రతి అభ్యర్థికి ఒక్కో బ్యాలెట్ బాక్స్ తయారీని ప్రఖ్యాత గోద్రేజ్ కంపెనీ చేపట్టింది. ముంబైలోని విఖ్రోలి సబర్బన్ ప్రాంతంలో వాటి తయారీ జరిగింది. రోజుకు 15 వేలకుపైగా బ్యాలెట్ బాక్స్ల చొప్పున 2.1 కోట్లకుపైగా స్టీల్ బ్యాలెట్ బాక్స్లను తయారు చేసి అనుకున్న సమయానికి అందించడంలో గోద్రేజ్ కంపెనీ సఫలమైంది. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్లో తొలి ఎన్నికల నిర్వహణను ప్రశంసించింది. ఇలా అభ్యర్థికొక బ్యాలెట్ బాక్స్లతో మొదలైన ప్రయాణం ఈవీఎంల వరకు చేరుకొని, ఇప్పుడు మళ్లీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న చర్చకు దారి తీస్తోంది. ఈవీఎంలపై అనుమానాలివీ.. ♦ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ (ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడేలా) చేయొచ్చన్న ఆరోపణ ఉంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ, ఆప్ పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపించాయి. ♦ ఈవీఎంలతో అవకతవకలకు అవకాశం లేదని కచ్చితంగా చెప్పడానికి లేదు. పూర్తిగా జోక్యానికి వీల్లేని యంత్రమనేది ప్రపంచంలో లేనేలేదనీ, మనం గమనించలేనంత చిన్న పరికరం సాయంతో ఈవీఎంల పనితీరును ప్రభావితం చేయవచ్చని శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త గౌతమ్ రజా పేర్కొన్నారు. ♦ ఈవీఎంల వాడకంలోనూ బూత్ల ఆక్రమణ జరిగే అవకాశం లేకపోలేదు. యంత్రాలతో చేసే తప్పుడు పనులకు కండబలం అవసరం లేదు. అది ఎవరి కంట్లో పడదు కాబట్టి మరింత ప్రమాదమనే అభిప్రాయం వినబడుతోంది. ♦ అర్హత లేని సిబ్బంది యంత్రాల నిర్వహణ బాధ్యతలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ ఎన్నికలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ♦ నెదర్లాండ్స్లో 2000 సంవత్సరంలో ఈవీఎంల వాడకంలో సమస్యలు ఎదురవడంతో తిరిగి బ్యాలెట్ ఓటింగ్నే అనుసరించారు. ♦ ఈవీఎంలతో ట్యాంపరింగ్కు అవకాశమున్నందున ప్రపంచ దేశాలు పేపర్ బ్యాలెట్ వైపునకు మళ్లుతున్నాయని, భారత్ కూడా దీన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ సూచిస్తున్నారు. బ్యాలెట్కు బ్లాక్చెయిన్..! ఈవీఎంల వాడకం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజ కీయ పార్టీలు, నిపుణులు చెబుతుండటంతో ఇకపై ఓటింగ్ కోసం బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగించాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఓటరు వివరాలు, ఓటింగ్ వివ రాలు సంకేతభాషలో నిక్షిప్తమవుతాయి కాబట్టి ఇతరులెవరూ వాటిని చూడటం లేదా మార్పుచేర్పులు చేయడం సాధ్యం కాదు. నెట్వర్క్లో ఉన్నవారిలో అంటే.. వ్యవహారం నడిపిన వారందరూ అంగీకరిస్తేనే మార్పులు సాధ్యమవుతాయి. బ్లాక్చెయిన్ టెక్నాలజీని సురక్షితమైన ఓటింగ్కు కొత్త మార్గంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. మీ వివరాలతో ఎన్నికల నిర్వహణ సంస్థ వద్ద పేరు నమోదు చేసుకోవాలి. తరువాతి దశలో ఈ వివరాలను గోప్యంగా ఉంచుతూనే మీకు ఓ డిజిటల్ గుర్తింపు సంఖ్య, పాస్వర్డ్ లభిస్తాయి. స్మార్ట్ఫోన్, కంప్యూటర్లతో డిజిటల్ బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయవచ్చు. ఓట్లు లెక్కకట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. బ్లాక్చెయిన్ టెక్నా లజీ వాడితే ఎవరికి ఓటు పడిందో తెలుస్తుందిగానీ.. ఓటేసిన వారి వివరాలు ఏమాత్రం తెలియవు. సియర్రా లియోన్ అనే చిన్న దేశం ఈ ఏడాది మార్చిలో బ్లాక్చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా త్వరలో ఈ టెక్నాలజీని వాడతామని ప్రకటించాయి. ఈవీఎంలను తీసేసే ప్రసక్తి లేదు: ఈసీ ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషనర్ రావత్ స్పష్టం చేశారు. వీవీప్యాట్లతో ఈవీఎంల పనితీరు మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈవీఎంలలో లోపాలు లేవని, దానిని ఉపయోగిస్తున్న తీరుపైనే ఓటర్లకు అనుమానాలున్నాయని, ఎన్నికల సంఘం వాటిని నివృత్తి చేయాల్సి ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి సంస్థల ప్రతినిధులు, నిపుణులు అంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్ల పనితీరుపైనా కొందరు ఓటర్లు అనుమానాలు వ్యక్తం చేశారని, ఎన్నికల సంఘం వారి అనుమానాలు తీరేలా యంత్రాలను మెరుగుపరచాలని వారు సూచిస్తున్నారు. -
బ్యాలెట్ పత్రంలో ‘నోటా’ చేర్చాం
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లతో పాటు ‘నోటా’ కూడా చేర్చామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. పట్టభద్ర నియోజవర్గం బ్యాలెట్ పత్రంలో 25 మంది అభ్యర్థులతో పాటు ‘నోటా’ క్రమ సంఖ్య 26గా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయ నియోజకవర్గం బ్యాలెట్ పత్రంలో 10 మంది అభ్యర్థులతో పాటు ‘నోటా’ క్రమ సంఖ్య 11గా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని తెలిపారు. 8, 9 తేదీల్లో సెలవు : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు దినాలుగా ప్రకటించామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు 125 కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 65 కేంద్రాలు, మొత్తం 190 పోలింగ్ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. వీటికి మాత్రమే సెలవు ఉంటుందన్నారు. అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 20న కౌంటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ విద్యా సంస్థకు కూడా సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలియజేశారు. -
బ్యాలెట్ పేపరివ్వరూ.. ఓటెయనివ్వరూ.. ఇదెక్కడి...