-
తెలంగాణలో పోలింగ్ టైం.. ఓటు వేసిన సినీ ప్రముఖలు
-
శిల్పా నా ఫ్రెండ్.. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
-
శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది: అల్లు అర్జున్
-
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
-
ఈసీ ద్వంద్వ వైఖరి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్రపూరితంగా ఎన్నికల కమిషన్ను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో మరోసారి రుజువైంది. అధికార పారీ్టపై ఫిర్యాదు చేయడమే ఆలస్యం తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటున్న ఈసీ, టీడీపీ కూటమి కార్యక్రమాలపై మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.శనివారం నంద్యాలలో స్టార్ హీరో అల్లు అర్జున్ పర్యటనలో భారీగా ప్రజలు పాల్గొన్నారంటూ జిల్లా ఎస్పీతోపాటు డీఎస్పీ, సీఐలకు చార్జ్ మెమోలు జారీ చేసిన ఎన్నికల కమిషన్ అదే రోజు పిఠాపురంలో హీరో రామ్ చరణ్ పర్యటనకు సంబంధించి మాత్రం నిర్లిప్తంగా వ్యవహరించడం ఈసీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కుట్ర రాజకీయాలు, ఢిల్లీ స్థాయిలో వ్యవస్థల మేనేజ్మెంట్కు ఈసీ తలొగ్గుతున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టంగా వెల్లడైంది. – సాక్షి, అమరావతిఇటు కఠిన చర్యలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చిరకాలంగా అల్లు అర్జున్కు స్నేహితుడు. శనివారం అల్లు అర్జున్ తన సతీమణితో కలసి నంద్యాలలోని శిల్పా రవిచంద్రారెడ్డి నివాసానికి వచ్చారు. ప్రజలకు సేవ చేస్తున్న తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని భారీ మెజార్థితో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయన పిలవకపోయినా తనంతట తానే స్వయంగా వచ్చి మద్దతు తెలియచేస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు. నిజానికి ఇది స్నేహపూర్వక వ్యక్తిగత పర్యటనే.ఎన్నికల ప్రచారం కాదు. అల్లు అర్జున్ పర్యటన సందర్భంగా ప్రచార సభ నిర్వహించాలని వైఎస్సార్సీపీ భావించలేదు. అందువల్ల రిటరి్నంగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. అయితే విశేష ప్రేక్షకాదరణ కలిగిన అల్లు అర్జున్ నంద్యాల వచ్చారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారంతా స్వచ్చందంగా వచి్చన వారే. వైఎస్సార్సీపీ ఎలాంటి జన సమీకరణ చేయలేదు. దీంతో పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం లేదు. శిల్పా రవిచంద్రారెడ్డి నివాసం బాల్కనీ నుంచి అల్లు అర్జున్ తన అభిమానులకు అభివాదం చేసి లోపలికి వెళ్లిపోయారు.వారిని ఉద్దేశించి ఎలాంటి ప్రసంగాలు చేయలేదు. ఇందులో పోలీసులు చేయగలిగింది కూడా ఏమీ లేదు. కట్టడి చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే అల్లు అర్జున్ రాకతో టీడీపీ బెంబేలెత్తింది. ఈ పర్యటనతో నంద్యాల నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులకు ఒక సందేశం వెళ్లిందని ఆందోళన చెందింది. దీంతో అల్లు అర్జున్ పర్యటనపై ఫిర్యాదు చేసింది.దీనిపై ఈసీ వెంటనే స్పందించింది. 144 సెక్షన్ ఉన్నా అల్లు అర్జున్ అభిమానులు అంత భారీగా ఎలా చేరుకోగలిగారంటూ నంద్యాల ఎస్పీ కె.రఘువీరారెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్రనాథ్ రెడ్డి, టూ టౌన్ సీఐ కె.రాజరెడ్డిలకు చార్జ్ మెమో జారీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల లోగా చార్జ్మెమో జారీ చేసి రాత్రి 8 గంటల లోపే ఈసీకి నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఆ ముగ్గురు అధికారులపై 60 రోజుల్లోగా శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలని పేర్కొంది ఈసీ అనుమతి లేకుండా శాఖాపరమైన విచారణను ముగించకూడదని స్పష్టం చేసింది. అసలు అది ఎన్నికల ప్రచార సభే కాదు. అది పూర్తిగా అల్లు అర్జున్ వ్యక్తిగత పర్యటన. సమాచారం తెలుసుకుని ఆయన అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తే ఎస్పీ, డీఎస్పీ, సీఐలు మాత్రం ఏం చేయగలరు? అందులో వారి వైఫల్యం ఏముంది? ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోయినా సరే ముగ్గురు అధికారులపై ఈసీ అంత కఠిన చర్యలకు ఆదేశించడం ఏమిటని పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు కుట్రలకు ఈసీ తలొగ్గుతోందని పేర్కొంటున్నారు.అటు ఉదాసీనత.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హీరో రామ్ చరణ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో శనివారమే పర్యటించారు. తన తల్లి కొణిదెల సురేఖ, మేనమామ అల్లు అరవింద్తో కలిసి పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి వెళ్లారు. అనంతరం పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా గుమిగూడారు.పవన్ కల్యాణ్ నివాసం బాల్కనీ నుంచి ఆయనతోపాటు రామ్చరణ్ కూడా అభిమానులకు అభివాదం చేశారు. ఆ ప్రాంతంలో కూడా 144 సెక్షన్ అమలులో ఉంది. మరి ఈ విషయాన్ని ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదు. కాకినాడ జిల్లా ఎస్పీ, పిఠాపురం డీఎస్పీ, సీఐలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారికి చార్జ్మెమో జారీ చేయలేదు. ఈసీ ఇలాంటి ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తోందని పరిశీలకులు ప్రశి్నస్తున్నారు. -
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
-
Allu Arjun Nandyala Photos: నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
శిల్పా రవిని గెలిపించండి
బొమ్మలసత్రం: నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డికి మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం నంద్యాల వచ్చారు. ఆయనకు పట్టణ శివారులోని ఆటోనగర్ వద్ద అభిమానులు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. నంద్యాలలోని శిల్పా రవి నివాసానికి చేరుకుని వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులకు చాలాసేపు అభివాదం చేశారు. శిల్పా రవి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ‘శిల్పా రవి నాకు మంచి మిత్రుడు. ఇన్నేళ్ల మా ఇద్దరి స్నేహంలో నన్ను ఎన్నికల ప్రచారం కోసం రావాలని ఏనాడూ రవి కోరలేదు. నేనే శిల్పా రవి కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. రవి మంచి మనసు, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యమే నన్ను ఇంత దూరం వచ్చేలా చేసింది. నా మనసుకు నచ్చిన స్నేహితులు ఏ ఫీల్డ్లో ఉన్నా వారి అభివృద్ధిని కోరుకుంటాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. శిల్పా రవి మంచి మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ శిల్పా రవికి ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను...’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తనను గుర్తుంచుకుని అల్లు అర్జున్ ఇంతదూరం రావడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్, శిల్పా రవిపై కేసు నమోదు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అల్లు అర్జున్, శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డిని కలిసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి శనివారం నంద్యాలకు వచ్చారు. ఆయన వస్తున్నాడని తెలిసి ప్రజలు భారీ సంఖ్యలో ఎమ్యెల్యే శిల్పా రవి నివాసం వద్దకు తరలివచ్చారు. జనం గూమికూడేందుకు అనుమతి తీసుకోలేదని ఎమ్యెల్యే శిల్పా రవి, అల్లు అర్జున్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి నంద్యాల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. -
నా స్నేహితుడు: అల్లు అర్జున్
-
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కి అల్లు అర్జున్ ప్రచారం!
-
నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం
-
Allu Arjun Nandyal Photos: అస్సలు తగ్గేదే లే.. నంద్యాలలో శిల్పాతో పుష్పరాజ్ (ఫొటోలు)
-
Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్మెట్స్ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.అల్లు అర్జున్ ఏమన్నారంటే..'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను. ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support pic.twitter.com/n34ra9qpMO— Allu Arjun (@alluarjun) May 11, 2024 -
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్ను మలుపు తిప్పిన క్షణం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్కు టాలీవుడ్ ప్రమఖులు హాజరయ్యారు.అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' ఓ రేంజ్లో అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్కు క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ పాటకు డ్యాన్స్ చేసిన అభినయశ్రీ అందరికీ గుండెల్లో చోటు దక్కించుకుంది. తాజా ఈవెంట్కు హాజరైన ఆమె మరోసారి తన స్టెప్పులను అందరికీ పరిచయం చేసింది. అ అంటే అమలాపురం అంటూ డ్యాన్స్తో అదరగొట్టింది. 20 ఏళ్లయినా అదే స్టైల్తో డ్యాన్స్ చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. #TFNExclusive: Talented Abinaya Satish Kumar grooves to ‘Aa Ante Amalapuram’ song at #20YearsForArya celebrations event!💃🔥#AlluArjun #Arya #TeluguFilmNagar pic.twitter.com/sPuRjK4wN5— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
‘‘హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘దిల్’ సినిమా ప్రీమియర్కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్ బ్లోయింగ్గా నచ్చింది. ‘ఇడియట్’ మూవీ చూసి ఇలాంటి యూత్ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్), నాతో మాట్లాడి.. సుకుమార్ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్ షూట్ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. ఇందుకు సుకుమార్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్ఫుల్గా టాప్ ΄÷జిషన్లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్ఫుల్గా ఉండటం అనేది గ్రేట్ మూమెంట్.. దీనికి కారణం సుకుమార్. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. -
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.20 ఏళ్ల సెలబ్రేషన్స్ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
పుష్ప స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రిప్లై అదిరిపోయింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్బస్టర్ పుష్పకు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసన మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను ఇటీవలే రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. పుష్ప.. పుష్ప.. పుష్ప.. అంటూ సాగే పాట ఆడియన్స్ను ఊర్రూతలూగిస్తోంది. అయితే ఈ సాంగ్లో బన్నీ చేసిన షూ డ్రాప్ స్టెప్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటోంది. ఈ స్టెప్ వేస్తున్న వీడియోను చూసిన పుష్ప వీరాభిమాని డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చారు. ఓ డియర్.. ఎంత బాగా చేశావ్.. ఇప్పుడు నేను కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ కోసం కొంత వర్క్ చేయాలి' అంటూ కామెంట్ చేశాడు.అయితే డేవిడ్ వార్నర్ కామెంట్కు బన్నీ కూడా రిప్లై ఇచ్చాడు. మనిద్దరం కలిసినప్పుడు తప్పకుండా హుక్ స్టెప్ నేర్పిస్తానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. 'ఇది చాలా సులభం...మనం కలిసినప్పుడు ఎలా చేయాలో నీకు చూపిస్తా' అని కామెంట్స్లో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ నెట్టింట తెగ వైరల్గా మారింది. కాగా.. పుష్ప సినిమా నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అల్లు అర్జున్కు నటనకు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి బన్నీకి వీరాభిమాని అయిపోయారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పుష్ప డైలాగ్స్తో అలరిస్తుంటారు. కాగా.. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
-
Pushpa 2: పుష్ప..పుష్ప.. పుష్ప.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.గతనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసిన మేకర్స్.. మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్ సింగిల్ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పెషల్ పోస్టర్ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement