-
ఢిల్లీ జల్బోర్డు ఆఫీసు ధ్వంసం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం(జూన్16) ఛాతర్పూర్లోని ఢిల్లీ జల్బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందరవందరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఆరోపించింది. దాడి చేస్తున్న వారిలో ఒక వ్యక్తి కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.BJP के नेताओं और कार्यकर्ताओं की सरेआम गुंडागर्दी ‼️देखिए कैसे ‘BJP ज़िंदाबाद’ के नारे लगाते हुए दिल्ली जल बोर्ड के दफ़्तर को तोड़ रहे हैं बीजेपी के कार्यकर्ता👇एक तरफ़ हरियाणा की BJP सरकार दिल्ली के हक़ का पानी रोके हुए है तो वहीं दूसरी तरफ़ बीजेपी दिल्ली की जनता की संपत्ति… pic.twitter.com/nVEWLdDwGA— AAP (@AamAadmiParty) June 16, 2024 ‘బీజేపీ జిందాబాద్ అని నినాదాలు చేసుకుంటూ జలమండలి ఆఫీసును ఎలా పగులగొడుతున్నారో చూడండి. ఓ వైపేమో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తాగేందుకు నీళ్లివ్వకుండా ఆపుతుంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారు’అని ఆప్ ఎక్స్(ట్విటర్)లో దాడి వీడియోను పోస్టు చేసింది. -
నీటి సంక్షోభం: ఢిల్లీ ట్యాంకర్ మాఫియాపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాష్ట్రంలో నీటి సంక్షోభం నెలకొన్న సమయంలో ట్యాంకర్ మాఫీయాను అరికట్టకపోవటంపై సుప్రీకోర్టు ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నీటి వృధాపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని సీరియస్ అయింది. ట్యాంకర్ మాఫియా, నీటి వృధాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల రిపోర్టును తమకు అందజేయాలని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జిస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలే ఆదేశించారు. ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ప్రభుత్నానికి చేతకాకపోతే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘‘ కోర్టు ముందు నకిలీ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు?. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటర్ వస్తోంది. ఢిల్లీకి వచ్చిన నీరు ఎక్కడికి వెళ్లుతోంది?. ట్యాంకర్ మాఫియా విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాజేయాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. చర్యలకు సంబంధిచి పూర్తి నివేదిక గురువారం అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.హిమాచల్ ప్రదేశ్.. హర్యానాకు ఇస్తున్న మిగులు నీటిని ఇలాంటి సంక్షోభ సమయంలో తమకు తరలించాలని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రియించింది. దీంతో ఢిల్లీకి నీటిని అందించాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్కు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ నీటిని అందించిన హర్యానా తమ వాటాను తగ్గిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. -
స్వాతి మలివాల్ కేసు: బిభవ్పై 201 సెక్షన్ నమోదు
ఢిలీ: తనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ దాడి చేశారని గత నెలలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో బిభవ్ కుమార్పై కేసు నమోదు కాగా.. పోలీసులు మే 18 అరెస్ట్ చేశారు. అయితే తాజాగా బిభవ్కుమార్ నమోదైన కేసులో 201 సెక్షన్ను చేర్చారు. 201 సెక్షన్ అంటే.. ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం ఇవ్వటం. బిభవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి ఆధారాలు మాయం చేసి.. తప్పుడు సమాచారం అందించిస్తున్నట్లు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బిభవ్ కుమార్ను దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆయన తన ఫోన్ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. ఆయన ముంబైలో ఫోన్ ఫార్మాట్ చేసినట్లు అనుమానం రావటంతో ఇప్పటికే పోలీసులు రెండుసార్లు ముంబైకి తీసుకువెళ్లి దర్యాప్తు చేశారు. ముంబైలో ఏ ప్రాంతంలో ఫార్మాట్ చేశారు?. ఫోన్లోని డేటాను ఎవరికి షేర్ చేశారు? అన్న విషయాలు మాత్రం బిభవ్ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఇక.. కస్టడీలో ఉన్న ఆయన దర్యాప్తు సమయంలో అస్సలు సహకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి మూడు సీసీటీవీ కెమెరాల డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బిభవ్ సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేశారని పోలీసుల అనుమానం వ్యకం చేశారు. దీంతో డీవీఆర్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు ఇంకా వెల్లడికాలేదని తెలిపారు. మే 18 అరెస్ట్ అయిన బిభవ్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.మే 13న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లితే.. అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దారుణంగా దాడి చేశారని బయటపెట్టారు. అయితే వాటిని ఆప్.. బీజేపీ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ బిభవ్పై దాడి ఆరోపణలను చేస్తోందని విమర్శలు చేసింది. -
ఆప్ పార్టీకి సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: ఆప్ పార్టీ ఆఫీసు ఖాళీ చేసే గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే గడువును అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 10 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ పార్టీ ఆఫీసు జూన్ 15 లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా.. ఆప్ కార్యాలయం ఉన్న భూమిని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీ మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రానికి హైకోర్టు సూచించింది. జూన్ 15న ఆప్ ప్రస్తుత ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలిక ఆఫీసు కోసం కేటాయించాలని ఆప్ హైకోర్టును కోరింది. -
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
నీటి సంక్షోభం.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ సర్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కారు సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు శుక్రవారం(మే31) అత్యున్నత కోర్టులో ఢిల్లీ సర్కారు పిటిషన్ ఫైల్ చేసింది. హార్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఢిల్లీకి అదనపు నీళ్లు కేటాయించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ప్రభుత్వం కోర్టును కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నందున దేశ రాజధానికి నీళ్లివ్వడం అందరి బాధ్యత అని పిటిషన్లో తెలిపింది. కాగా, ఢిల్లీలో నీటి సంక్షోభంపై ప్రభుత్వం ఇప్పటికే వాటర్ ట్యాంకర్ వార్రూమ్ ఏర్పాటు చేసి యుద్ధ పప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరికి నీరు అందుబాటులో ఉండేలా చూస్తోంది. మరోపక్క తాగే నీటిని వృథా చేసి ఇతర అవసరాలకు వాడే వారిపై రూ.2వేల జరిమానా విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది. నీటి కొరతపై గురువారం ఢిల్లీ జల వనరుల మంత్రి ఆతిషి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. -
ఆప్ మంత్రి డర్టీ పిక్చర్
చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్మీడియాలో షేర్ చేయటంతో వైరల్గా మారింది. వీడియో కాల్లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు. -
కోర్టులో ఎంపీ కన్నీరు
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతీ మలివాల్ వాపోయారు. ఆమెపై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఉదంతంలో ఎంపీ కావాలనే సమస్యలు సృష్టించారని బిభవ్ న్యాయవాది వాదించారు. సీఎం నివాసంలో సీసీ కెమెరాలు లేనిచోట తనపై దాడి జరిగిందని ఆమె చెప్పడంలో దురుద్దేశం దాగుందన్నారు. దాంతో ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆప్ ట్రోల్ ఆర్మీ తనను తీవ్రంగా వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. బిభవ్కు బెయిలిస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదమని వాదించారు. ఈ ఉదంతంలో నిబంధనలను ఉల్లంఘించింది బిభవ్ కుమారేనని ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ ఈనెల 13న తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ కేసులో బిభవ్ అరెస్టయ్యారు. ఫోన్ను ఫార్మాట్ చేసి, సీసీటీవీ ఫుటేజిని తొలగించిన బిభవ్ అమాయకుడు కాదని స్వాతి తరఫు లాయర్ వాదించారు. అనంతరం బిభవ్కు బెయిల్ను నిరాకరిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సుశీల్ అనూజ్ త్యాగి పేర్కొన్నారు. -
చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
న్యూఢిల్లీ: చంపేస్తామని, అత్యాచారం చేస్తామని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. తన మీద సీఎం కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన దాడి ఘటనపై ఓ యూట్యూబ్ ఛానల్లో వన్సైడ్ వీడియో పెట్టారని, ఆ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆదివారం(మే26) ఎక్స్(ట్విటర్)లో ఆమె ఒక ట్వీట్ చేశారు. యూట్యూబ్ ఛానళ్లు నడిపే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ఆప్ అధికార ప్రతినిధుల అవతారమెత్తడం సరికాదన్నారు. దాడి ఘటనపై ఆ జర్నలిస్టులకు తన వెర్షన్ చెప్పుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదన్నారు. తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. -
మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై గతేడాది బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూరత్ కోర్టు దోషి తేల్చి.. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. తిరిగి జూన్లో తీహర్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఇన్కం టాక్స్ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సమయంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇండియాలో లేరని విమర్శలు వస్తున్నాయి. అయితే వాటిపై స్వాతి మలివాల్ స్పందించారు.‘‘ హార్వార్డ్ యూనివర్సిటీలో ఓ సెమినార్ పాల్గొనడానికి నేను మార్చిలో అమెరికా వెళ్లాను. ఆప్ వలంటీర్లు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా. నా సోదరికి కోవిడ్ సోకటం కారణంగా నేను ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. అమెరికాలో ఉన్న భారత్లోని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో టచ్ ఉన్నాను. ...ఆప్ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లడుతూ.. ట్వీట్లు చేస్తూ వచ్చాను. ఆ సమయంలో నేను చేయగలిగింది చేశాను. ఆ సమయంలో పార్టీ కోసం నేను పని చేయలేదనటం చాలా దురదృష్టకరం. మరో రాజ్యసభ ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను మాత్రమే ఎందుకు ఇలా ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావటం లేదు’’ అని పేర్కొన్నారు.ఇక కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారత్లో లేకపోటంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటి శస్త్రచికిత్సకు లండన్ వెళ్లి ఇటీవల భారత్ తిరిగి వచ్చారు. అనంతరం లోక్సభ ఎన్నికల ర్యాలీల్లో రాఘవ్ పాల్గొంటున్నారు. ఇటీవల (మే 13) సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కోనసాగుతోంది. ఆమెపై దాడి జరిగినట్లు చేస్తున్న ఆరోపణల వెనక బీజేపీ కుట్ర ఉందని ఆప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. -
ఈవీఎంను పరిశీలించిన ‘ఆప్’ నేత.. వీడియో వైరల్
దేశంలో లోక్సభ ఎన్నికల జరుగుతున్నాయి. వీటిలో భాగంగా నేడు(శనివారం) ఆరవ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ, భారత్ కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీకి దిగాయి. ఆప్, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.ఓటు వేసేందుకు వచ్చిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఈవీఎం యంత్రాన్ని పైనుంచి కింది వరకూ పరిశీలనగా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మద్యం పాలసీ అంశంలో ఒక్క ఆధారం కూడా దొరకలేదని ప్రధానే స్వయంగా అంగీకరించారు. ఇంతకంటే పెద్ద అంశం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. కాగా తూర్పు ఢిల్లీ నుంచి కుల్దీప్ కుమార్, పశ్చిమ ఢిల్లీ నుంచి మహాబల్ మిశ్రా, న్యూఢిల్లీ నుంచి సోమనాథ్ భారతి, దక్షిణ ఢిల్లీ నుంచి సాహి రామ్ పెహల్వాన్లను ‘ఆప్’ బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరపున చాందినీ చౌక్ నుంచి జేపీ అగర్వాల్, ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ బరిలో ఉన్నారు.ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీని బీజేపీ తమ అభ్యర్థిగా నిలిపింది. దక్షిణ ఢిల్లీ నుంచి రామ్వీర్ సింగ్ బిధూరి, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, తూర్పు ఢిల్లీ నుంచి హర్ష్ దీప్ మల్హోత్రా, వాయువ్య ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రావత్ బీజేపీ టిక్కెట్పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. #WATCH दिल्ली के मंत्री और AAP नेता सौरभ भारद्वाज ने दिल्ली के एक मतदान केंद्र पर #LokSabhaElections2024 के लिए अपना वोट डाला। pic.twitter.com/yzjq5pqPSR— ANI_HindiNews (@AHindinews) May 25, 2024 -
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఢిల్లీలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచారపర్వంలో అటు బీజేపీ ఇటు ఆప్, కాంగ్రెస్లు దూసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ప్రచారంలో పాల్గొన్న ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఢిల్లీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి కుటుంబం విద్యుత్, తాగునీరు, మందులు, పాఠశాల ఫీజులపై ప్రతి నెలా రూ. 18 వేలు ఆదా చేస్తున్నదని పేర్కొన్నారు.త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలోని మహిళలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అందజేయనుందని అన్నారు. తూర్పు ఢిల్లీ లోక్సభ స్థానం నుండి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరపున ప్రచారం చేపట్టిన ఆయన.. నిరాడంబరమైన నేపథ్యాలు కలిగిన వారు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులకు చేరుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.‘ఆప్’ ఎల్లప్పుడూ సాధారణ కుటుంబాలకు చెందిన వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిందని, కుల్దీప్ కుమార్, తాను దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. విద్యావంతులు, నిజాయితీ గల ప్రతినిధులను ఎన్నుకోవడానికి గల ప్రాముఖ్యతను రాఘవ్ చద్దా వివరించారు. -
Lok Sabha Election 2024: ఆరో విడత స్థానాల్లో... కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?
ఏడు విడతలుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఐదు దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 115 లోక్సభ స్థానాలకు మే 25న ఆరు, జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో 42 రోజుల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడతలో మొత్తం 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హరియాణాలోని మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలూ వీటిలో ఉన్నాయి. ఈ 58 స్థానాల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల బరిలో దిగినా కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం! అంతేగాక వాటిలో ఏకంగా 90 శాతం స్థానాల్లో 40 శాతం పై చిలుకు ఓట్లు సాధించింది! ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలనూ నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆప్తో జతకట్టిన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఏడో విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నా హరియాణా, ఢిల్లీల్లో మాత్రం ఇండియా కూటమి భాగస్వాములుగా బరిలో దిగాయి. హరియాణాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్ బీజేపీకి పెను సవాలు విసురుతున్నాయి. దీనికి తోడు హరియాణాలో రైతుల అసంతృప్తి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. 2019లో బీజేపీదే హవా! ఆరో విడతలో పోలింగ్ జరుగుతున్న 58 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీయే పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరు స్థానాల్లోనైతే ఏకంగా 35 శాతం పై చిలుకు మెజారిటీ సాధించడం విశేషం. అవి కర్నాల్ (6.6 లక్షల మెజారిటీ), ఫరీదాబాద్ (6.4 లక్షలు), వెస్ట్ ఢిల్లీ (5.8 లక్షలు), నార్త్ వెస్ట్ ఢిల్లీ (5.5 లక్షలు), ధన్బాద్ (4.9 లక్షలు), భివానీ (4.4 లక్షలు). ఏ స్థానంలో అయినా మూడు వరుస ఎన్నికల్లో కనీసం రెండుసార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టి పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ లెక్కన ఆరో విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్కు మాత్రం అలాంటి స్థానం కేవలం హరియాణాలోని రోహ్తక్ మాత్రమే. అక్కడ కూడా 2009, 2014ల్లో నెగ్గినా 2019లో మాత్రం వెంట్రుకవాసిలో బీజేపీకి కోల్పోవడం విశేషం! బీజేపీ కంచుకోటలు 5 ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 58 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పదగ్గ సీటు ఒక్కటీ లేకపోవడం విశేషం. బీజేపీకి ఐదున్నాయి. బీజేపీ జార్ఖండ్లో ధన్బాద్, జెంషెడ్పూర్; బిహార్లో పూర్వీ చంపారన్, పశి్చమ చంపారన్, శివోహర్ స్థానాలను చాలా ఏళ్లుగా గెలుచుకుంటూ వస్తోంది. ఒడిశాలోని కటక్, ధెంకెనాల్, కియోంఝర్, పూరి స్థానాల్లో బీజేడీకి ఎదురు లేదు. అలాగే పశి్చమ బెంగాల్లో కాంథీ, తామ్లుక్ లోక్సభ స్థానాలు తృణమూల్ కంచుకోటలు. ఆరో విడత స్థానాల్లో 2019లో 5 చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. అయితే వాట న్నింట్లోనూ బీజేపీయే విజేతగా నిలవడం విశేషం! మఛ్లీషహర్ (యూపీ) నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి భోలానాథ్ కేవలం 198 ఓట్ల (0.02 శాతం) మెజారిటీతో గట్టెక్కారు! శ్రావస్తి (యూపీ), రోహ్తక్ (హరియాణా), సంభాల్పూర్ (ఒడిశా), ఝార్గ్రాం (పశ్చిమ బెంగాల్) స్థానాలను కూడా బీజేపీ ఒక్క శాతం కంటే తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆరో విడత పోలింగ్ జరుగుతున్న 58 స్థానాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశముంది! వీటిలో మూడింట ఒక స్థానంలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ కొత్తవారిని గెలిపిస్తూ వస్తుండటం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వాతిమలివాల్పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్పై తన ఇంట్లో జరిగిన దాడి పట్ల పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో రెండు వెర్షన్లు ఉన్నాయని ఏది నిజమో తేలాలంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం కావాలన్నారు. ఈ విషయమై బుధవారం(మే22) కేజ్రీవాల్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాగా, మే13న ఎంపీ స్వాతిమలివాల్ సీఎం కేజ్రీవాల్ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని మలివాల్ తొలుత ఆరోపించారు. వివాదం పెద్దదైన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బిభవ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయంలో ఆప్ నేతలు, స్వాతిమలివాల్ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. -
‘‘ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర’’
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజుల గడువు ఉందనగా ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) బీజేపీపై మరో సంచలన ఆరోపణ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.‘లోక్సభ ఎన్నికలు ప్రకటించగానే మా పార్టీ చీఫ్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై రాగానే వెంటనే స్వాతిమలివాల్పై దాడి అనే కుట్రకు తెర తీశారు. ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయన్న పాత ఆరోపణలను మళ్లీ తవ్వారు. ఇప్పుడు తాజాగా హర్యానాలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారు’అని ఆతిషి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మే25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్: సాక్షితో ఎంపీ సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి ఫలితాలు సాధించబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షి టీవీతో మాట్లాడారు.‘‘ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి బీజేపీ హింసిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము జైలు అంశాన్ని ప్రచారం చేస్తున్నాం. ‘జైలు కా జవాబ్ ఓటు సే’అనే నినాదంతో ఎన్నికల్లో దిగాం. ఆప్కు ఓటేస్తే దేశవ్యాప్తంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రైతులకు స్వామినాథన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధర ఇస్తాం. పంజాబ్కు బీజేపీలో అవకాశం ఇవ్వకూడదని వ్యూహాత్మకంగా ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడతాం. బీజేపీకి చందాలు ఇచ్చిన వ్యక్తులు ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఈడీ బీజేపీ నాయకులపై ఎందుకు సోదాలు చేయడం లేదు. మమ్మల్ని బలవంతంగా జైల్లో పెట్టారు. ఇదే అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తే, సానుభూతి కోసమని ఎలా అంటారు?. కేజ్రీవాల్ దేశం కోసం పని చేస్తే, మోదీ తన దోస్తుల కోసం పనిచేస్తున్నారు. దేశంలో ఉన్న ఎయిర్పోర్టులు, పోర్టులు తన దోస్తులకు కట్టబెట్టారు’’ అని సంజయ సింగ్ మడ్డారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తీహర్ జైలులో కస్టడీలో ఉన్న సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
తెలుగు ఓటర్లు కీలకం
-
కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరిస్తూ ఢిల్లీ మెట్రో రైళ్లలో వెలిసిన బెదిరింపు రాతలు బీజేపీ పనేనని ఆప్ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లలో ఓడిపోతున్నామని తెలిసే బీజేపీ ఇలాంటి దిగజారుడు పనులు చేస్తోందని సోమవారం(మే20) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి ఆతిషి ఫైర్ అయ్యారు.‘తొలుత మా అధినేత కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. తర్వాత జైలులో ఆయనకు ఇన్సులిన్ను ఆపేశారు. మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ బయటికి వచ్చిన తర్వాత స్వాతి మలివాల్తో కలిసి ఆయనపై కుట్ర చేశారు. ఇప్పుడేమో ఆయన ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు’అని ఆతిషి అన్నారు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇస్తూ రాసిన రాతలు ఢిల్లీ మెట్రో రైలు బోగీల గోడలపై ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే వీటిని తొలుత ఎవరు షేర్ చేశారన్నది తెలియరాలేదు. బెదిరింపు రాతలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
ఢిల్లీ: ఆప్ రాజ్యసభ స్వాతి మలివాల్పై దాడి జరిగిన కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించి డిజిటల్ వీడియో రికార్డ్ (డీవీఆర్)లను పోలీసులు స్వాధీనం చేసకున్నారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కాగా.. లోక్సభ ఎన్నికల ముందు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని పోలిసులు ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపించింది. దర్యాప్తుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కట్టకథలు అల్లుతోందని ఆప్ ఆరోపణుల చేసింది. ఇక.. ఢిల్లీ పోలీసులు నుంచి ఎటువంటి సత్వరమైన స్పందన లేదని పేర్కొంది. ‘‘పోలీసులు శనివారమే కేజ్రీవాల్ నివాసంలోని సీసీటీవీ కెమెరాల డీవీఆర్లను స్వాధీనం చేసుకున్నారు. మళ్ల ఆదివారం కూడా సీఎం నివాసంలోని మిగతా చోట్ల ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ తొలగించారని పోలీసులు చెబుతున్నారు. కానీ, అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కావాలనే వాటిపై కట్టుకథలు అల్లుతున్నారు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అదే విధంగా సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణను పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ ఆధీనంలో ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.ఈ కేసుకు సంబంధించిన ఆయలు పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మే 13న స్వాతి మలివాల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది. అయితే కొద్దిసేటికే ఈ విషయం మీడియాకు వ్యాపించింది. సెక్షన్ 354(బీ)కి కేసు నమోదైంది. ఓ మహిళకు సంబంధించిన సున్నితమైన విషయం. కానీ, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. బిభవ్కుమార్ నిందితుడు అయితే ఆప్ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు’ అని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. -
ఢిల్లీలో తెలుగు ఓట్ల కోసం వేట!
ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు వారి పాత్ర తక్కువేం కాదు. దేశ రాజధానిలో కోటిన్నర ఓటర్లుంటే అందులో మనవారి వాటా అయిదున్నర శాతం. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మీట్ అండ్ గ్రీట్ పేరుతో బిజెపి దగ్గరయ్యే ప్రయత్నంచేస్తుండగా, తమ సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడ ఉంటున్న తెలుగువారికి ఢిల్లీ తమ ఇళ్లే అన్న భద్రత భరోసా ఇస్తామంటోంది ఆప్.దేశరాజధాని ఢిల్లీని మిని ఇండియాగా అభివర్ణిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 15 భాషల్లో ఎన్నికల ప్రచారం జరిగే చోటు ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే. చాలా ఏళ్ల కిందటే దేశం నలుమూలల నుంచి వచ్చి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఢిల్లీలో స్థిరపడిపోయినవాళ్లు కొందరైతే.. కేంద్ర ఉద్యోగులు, ప్రొఫెషనల్, నాన్ ఫ్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో సంఖ్యాపరంగా ఆధిపత్యం ఉత్తరాదివాళ్లదే అయినా.. 25 లక్షల పైచిలుకు ఓట్లతో దక్షిణాదిప్రజలు కూడా తమదైన ప్రభావం చూపిస్తున్నారు. కోటిన్నర ఓటర్లలో తెలుగువారు దాదాపు అయిదుశాతానికి పైనే ఉన్నారు. తెలుగువాళ్లు ప్రధానంగా ఢిల్లీలోని షాద్రా, మయూర్ విహార్, లజ్పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్ నివసిస్తుంటారు. పలు తెలుగు సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం అక్కడ సుమారు 9 లక్షల మంది తెలుగువాళ్లున్నారు. తెలుగువారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం ఇక్కడ లోటుగా కనిపిస్తోంది.తెలుగు ప్రజలను కలుస్తున్న పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సొంతూళ్లకు దూరంగా ఉంటున్న ఢిల్లీలోని తెలుగువారికి తగిన భద్రత, ప్రయోజనాలు ఇస్తామంటూ ఆప్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఢిల్లీలో తెలుగువారి సంక్షేమం కోసం పలు తెలుగుసంఘాలు పనిచేస్తున్నాయి. ఆంధ్రా అసోసియేషన్, ఢిల్లీ తెలుగు సంఘం, ఆదిలీలా ఫౌండేషన్ పేరుతో పండుగల సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. తెలుగువారిని ఒక వేదికపైకి తీసుకువస్తుంటాయి. అయితే తెలుగు ప్రజలు సైతం తమకంటూ కొంత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం చేసినా పెద్దగా ఎవరు సక్సెస్ కాలేదు.18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో మే 25వ తేదీ శనివారం నాడు ఢిల్లీ 7 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది:::సాక్షి, ఢిల్లీ ప్రతినిధి -
ఆప్ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేసిన ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ విఫల యత్నం చేసింది. బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా సీఎం కేజ్రీవాల్తో పాటు ఇతర నేతలను ఆప్ కార్యాలయం వద్దనే పోలీసులు నిలువరించారు. దీంతో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో నేతలంతా ఆప్ కార్యాలయం వద్దే బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు. ‘‘ఆప్ను అంతం చేయాలని బీజేపీ ఆపరేషన్ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రధాని మోదీ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆప్ నేతల అరెస్టుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని చూస్తున్నారు.నాకు బెయిల్ వచ్చిన దగ్గరి నుంచి మోదీ.. ఆప్పై విమర్శలు చేస్తున్నారు. ఆప్ దేశానికి మంచి పనులు చేస్తోంది. ఆప్ మంచి పనులపై దేశం మొత్తం చర్చించుకుటుంది. అయితే ఆప్కి బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉంది’’ అని కేజ్రీవాల్ మోదీ, బీజేపీపై మండిపడ్డారు.తమ పార్టీ నేతలను అరెస్ట్లతో బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ స్వాతి మలివాల్పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్కు పిలుపు నిచ్చారు. -
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై జరిగిన దాడి కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నిందితుడు బిభవ్ కుమార్ రిమాండ్ నోట్ను విడుదల చేశారు. ఈ కేసులో సాక్షాలు మాయమైట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన రోజు (మే13)న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీసీటీవీ ఫుటేజీని నిందితుడు బిభవ్కుమార్ ట్యాంపర్ చేశారని వెల్లడించారు. ‘‘విచారణకు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ సహకరించడం లేదు. బిభవ్ కుమార్ తన ఫోన్ పాస్ వర్డ్ చెప్పడం లేదు. ఆయన ఫోన్ను ముంబైలో ఫార్మాట్ చేశారు. కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీ బ్లాంక్గా ఉంది. దాడి జరిగిన వీడియోను తొలగించారు. సీసీటీవీ పుటేజీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ను ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు’’ అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.‘‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు బ్లాంక్గా ఉన్నాయి. మే 23( సోమవారం) రోజు సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసేందుకు వీలుగా డిజిటిల్ వీడియో రికార్డర్ను మాకు అందజేయలేదు.ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న సీసీటీవీ కెమెరాల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. ఆ విభాగానికి చెందని ఓ జూనియర్ ఇంజనీర్ ఇచ్చిన పెన్ డ్రైవ్ను పరిశీలించాము. కానీ అందులో ఒక వీడియో బ్లాంక్గా వస్తోంది. జూనియర్ ఇంజనీర్ వద్ద డీవీఆర్ యాక్సెస్ లేదు’ అని దర్యాపు చేసిన ఢిల్లీపోలీసులు రిమాండ్ నోట్లో వెల్లడించారు. ఇక.. స్వాతి మలివాల్పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి.. ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. -
Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలను అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సవాల్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి నిరసన మార్చ్ చేపట్టనున్నారు సీఎం కేజ్రీవాల్. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. తమ పార్టీ నేతలను అరెస్ట్లతో బీజేపీ టార్గెట్ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్ ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఎంపీ స్వాతి మలివాల్పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్కు పిలుపు నిచ్చారు.प्रधानमंत्री जी, ये एक-एक करके क्या आप हम लोगों को गिरफ़्तार कर रहे हैं? एक साथ सभी को गिरफ़्तार कर लीजिए - CM @ArvindKejriwal l LIVE https://t.co/0LIUQdK9PZ— AAP (@AamAadmiParty) May 18, 2024‘‘మా నేతలను ఒకరి తర్వాత ఒకరిని జైలులో పెడుతున్నారు. ప్రధాని మోదీకి నేను ఒకటి చెప్పదల్చుకున్నా. అరెస్ట్లను ఒక క్రీడా భావిస్తున్నారు. మా నేతలనంతా ఒకేసారి అరెస్ట్ చేయండి. అందుకే నేను, మా పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం. అప్పుడు మమల్ని ఒకేసారి జైలులో వేయండి’’ అని కేజ్రీవాల్ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.తమ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. వారిలో రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిశీ ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు.లోక్సభ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఎ బిభవ్ కుమార్ తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి చేశారని ఆరోపణలు చేయటం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బిభవ్కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం బిభవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ తనతో అమర్యాదగా ప్రవర్తించారని బిభవ్ కుమార్ సైతం ఆమెపై కేసు నమోదు చేశారు.స్వాతి మలివాల్పై అవినీతి అరోపణ కేసు ఉండటంలో బీజేపీ కుట్రతోనే తనపై దాడి జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.మరోవైపు.. స్వాతి మలివాల్ ఘటన విషయంలో బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్పై విమర్శలు చేస్తున్నారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనంగా ఉంటున్నారని మండిపడుతున్నారు. సీఎం కేజ్రీవాల్ పెదవి విప్పకపోవటంపై ఈ దాడి వెనక ఆయన హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. -
బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఉదంతం గుజరాత్లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని గుజరాత్కు చెందిన బీజేపీ ఎంపీ ఆరోపించిన నేపధ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.వీరిద్దరూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భరూచ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నర్మదా జిల్లాలోని దేడియాపాడలో బీజేపీకి చెందిన భరూచ్ ఎంపీ మన్సుఖ్ వాసవా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జనం మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరగడాన్ని వీడియోలో చూడవచ్చు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేష్ యాదవ్ తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించిన దరిమిలా ఈ వివాదం చోటుచేసుకుంది. મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા 1/2 pic.twitter.com/FRPFFmbRWN— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 18, 2024
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ వాసనకి.. పాములిక పరారే..!
రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య
అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్
మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్
వడదెబ్బకు 14 మంది హజ్యాత్రికులు మృతి
నీట్ పరీక్షలో అక్రమాలు.. ఎన్డీయే సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్
రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి
బెంగాల్ రైలు ప్రమాద దుర్ఘటన (ఫొటోలు)
Advertisement