రాష్ట్రపతి నిలయంలో పాము పట్టివేత | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి నిలయంలో పాము పట్టివేత

Published Tue, Jul 7 2015 6:07 AM

రాష్ట్రపతి నిలయంలో పాము పట్టివేత - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వా త విషపూరిత పామును పట్టుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిద్రిస్తున్న గది సమీపంలో నూనెకట్లపాము సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. పాములు పట్టడంలో అత్యంత నేర్పరి అయిన చిలకలగూడ కానిస్టేబుల్ వెంకటేశ్‌నాయక్ అక్కడే గేట్-2 వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని సమాచారం అందించారు.

సుమారు గంటపాటు శ్రమపడి పామును పట్టుకున్న వెంకటేశ్ దాన్ని సీసాలో బంధించి నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులకు అందజేశాడు. ఇక్కడ పాములు సంచరించడం సర్వసాధారణమేనని, అయితే రాష్ట్రపతి విడిది చేస్తున్న సమయంలో, నిద్రించే గదికి సమీపంలో కనిపించడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement