పోచారాన్ని నిలదీసిన ఎంపీటీసీలు | maptc's demands pocharam as proper partisipation in graamajyothi | Sakshi
Sakshi News home page

పోచారాన్ని నిలదీసిన ఎంపీటీసీలు

Aug 16 2015 5:16 PM | Updated on Sep 17 2018 8:21 PM

గ్రామజ్యోతి కార్యక్రమంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీలు నిలదీశారు.

నిజామాబాద్: గ్రామజ్యోతి కార్యక్రమంలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీలు నిలదీశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రామజ్యోతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీటీసీలు నిలదీశారు.

గ్రామ జ్యోతిలో ఎంపీటీసీలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గ్రామజ్యోతిలో ఎంపీటీసీలకు నిధులు, విధులు కల్పించాలని మంత్రిని కోరారు. దీంతో మంత్రి సీఎంతో మాట్లాడి ఆదుకుంటానని ఎంపీటీసీలకు హామినిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement