కుటుంబాన్ని మింగిన అప్పులు | Four of family commit suicide in karnataka | Sakshi
Sakshi News home page

కుటుంబాన్ని మింగిన అప్పులు

Jul 14 2017 8:59 AM | Updated on Nov 6 2018 8:08 PM

కుటుంబాన్ని మింగిన అప్పులు - Sakshi

కుటుంబాన్ని మింగిన అప్పులు

వ్యాపారంలో నష్టం రావడంతో రుణ దాతల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉడుపి జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది.

► ఉడుపిలో నగల వ్యాపారి, భార్య బిడ్డలు ఆత్మహత్య

బనశంకరి (కర్నాటక): వ్యాపారంలో నష్టం రావడంతో రుణ దాతల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉడుపి జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. తాలూకాలోని పడుబెళ్లికి చెందిన శంకర్‌ఆచార్య (50) చాలాకాలంగా పడుబెళ్లిలో శ్రేయాస్‌ జ్యువెల్లర్స్‌ పేరుతో ఆభరణాల వ్యాపారాన్ని నిర్వహిస్తుండేవారు. కొంతకాలంగా వ్యాపారంలో తీవ్రనష్టాలు రావడంతో పాటు వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోవడంతో రుణదాతల ఒత్తిళ్లు తీవ్రతరమయ్యాయి.

అప్పులు తీర్చే మార్గం కానరాక శంకర్‌ తన భార్య నిర్మల (45), కుమార్తెలు శ్రేయా (23), శృతి (22)లతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం రాత్రి సైనేడ్‌ కలిపిన ఆహారాన్ని తిని ప్రాణాలు వదిలారు. గురువారం బంధువులు శంకర్‌కు ఫోన్‌ చేయగా స్పందన లేకపోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా కుటుంబం మొత్తం విగతజీవులుగా కనిపించింది. బంధువుల ఫిర్యాదు మేరకు శిర్వ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement