ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య | family commits suicide in karnataka | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

Jul 16 2017 6:52 PM | Updated on Nov 6 2018 8:08 PM

ఒకే  కుటుంబంలో నలుగురు ఆత్మహత్య - Sakshi

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

తమ మృతదేహాలను వైద్యకళాశాలలకు దానమివ్వాలని డెత్‌నోట్‌ రాసి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.

సాక్షి, బెంగళూరు: తాము మరణించిన అనంతరం తమ మృతదేహాలను వైద్యకళాశాలలకు దానమివ్వాలని డెత్‌నోట్‌ రాసి దంపతులు, వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం అర్ధరాత్రి కలబురిగి నగరంలో చోటుచేసుకుంది. భూగర్భజల పరిశోధకుడిగా పని చేస్తున్న శ్రీకాంత్‌ కమలాపుర్కర్‌ (55) కుటుంబంతో కలసి 17 సంవత్సరాలుగా సరస్వతీ గోదాము లేఅవుట్‌లో నివసిస్తుండేవారు.

శనివారం ఉదయం పాలమనిషి పాలప్యాకెట్లను ఇంటి తలుపు వద్ద ఉంచి వెళ్లాడు. మధ్యాహ్నం అవుతున్నా ఇంటి ముందు పెట్టిన పాలప్యాకెట్లను తీయకపోవడాన్ని ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న శ్రీకాంత్‌ బంధువులు గమనించినించారు. తలుపులు పగలగొట్టి చూడగా శ్రీకాంత్‌తో పాటు ఆయన భార్య ధనుశ్రీ (50), కొడుకు చేతన్‌ (21), కూతురు సాక్షి (16)లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి,  శ్రీకాంత్‌ రాసిన డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, మృతదేహాలను  పరిశోధనల కోసం మెడికల్‌ కాలేజీకి ఇవ్వాలని అందులో రాసి ఉంది. ఆర్థిక సమస్యలే ఈ ఘోరానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement