అత్తాపూర్ (హైదరాబాద్) : సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా తమ ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, ఇళ్లల్లో విలువైన వస్తువులను ఉంచవద్దని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అపార్టుమెంట్లలో ఉండేవారు ఊరెళ్లేటప్పుడు వాచ్మెన్కు చెప్పాలని, తమ ఫ్లాట్ కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్తీలు, కాలనీలలో పెరుగుతున్న దొంగతనాలు, చైన్స్నాచింగ్లను నిరోధించడానికి రాజేంద్రనగర్ ఏసీపీ డివిజన్ పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలను చేపట్టామన్నారు. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, మొయినాబాద్, నార్సింగ్ పోలీస్స్టేషన్ పరిధుల్లో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వరుస సెలవులు కావడంతో సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇళ్లలో పెట్టకపోవడం మంచిదన్నారు. తాము వెళుతున్న విషయాన్ని కాలనీ సంఘాలకు, పోలీసులకు తెలియజేస్తే మంచిదని.. దీనివల్ల పెట్రోలింగ్ పోలీసులు గస్తీ చేపట్టే వీలుంటుందని వివరించారు. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దొంగతనాల నిరోధానికి చర్యలు తీసుకున్నామన్నారు. బస్తీలలో గస్తీ ముమ్మరం చేయటంతోపాటు దొంగతనాలు, చోరీలు జరిగే ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ నివాస ప్రాంతాలు, కాలనీలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాల నంబర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు.
పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..!
Published Tue, Jan 12 2016 5:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement