దివ్యాంగుకుల న్యాయం చేయండన్నా! | Sakshi
Sakshi News home page

దివ్యాంగుకుల న్యాయం చేయండన్నా!

Published Thu, Feb 15 2018 7:13 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

కొండాపురం: టీడీపీ ప్రభుత్వంలో దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని, మీరైనా న్యాయం చేయాలని కొండాపురం మండలంలోని కోవివారిపల్లెకు చెందిన వి.బ్రహ్మయ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరాడు. ప్రజాసంకల్పయాత్రలో శెట్టిపాళెం వద్దకు వచ్చిన వైఎస్‌ జగన్‌కు దివ్యాంగుల సమస్యలను వివరించాడు. దివ్యాంగుల సర్టిఫికెట్లు అధికారులు సక్రమంగా మంజూరు చేయడం లేదని పేర్కొన్నాడు. పింఛన్ల మంజూరు విషయంలో కూడా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీసీ వారు రాయితీపై ఇచ్చే బస్సు పాసులను దివ్యాంగులందరికీ ఇప్పించాలని కోరాడు. స్పందించిన జననేత వైఎస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement