రేగిడి : నిరుపేద.. అనారోగ్యం బారినపడింది.. ఏదో డాక్టర్ వద్దకు వెళ్లి మందులు వాడితే జబ్బు తగ్గిపోతుందని భావించారు.. ఎంత మంది వైద్యుల వద్దకు వెళ్లినా వ్యాధి తగ్గలేదు. చివరికి పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. అందుకోసం రూ.30 లక్షలు పైగా ఖర్చవుతుందని చెప్పడంతో హుతాశురాలయ్యారు. మరణశయ్యపై ఉన్న ఆమెను బతికించి పిల్లలను అనాథలు కాకుండా చేయాలని దాతలను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మండలంలోని వండానపేట గ్రామానికి చెందిన ముంజేటి సుధారాణి, బానోజీ భార్యాభర్తలు. బానోజీ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి దుర్గాప్రసాద్ (5), హేమ (4) పిల్లలు ఉన్నారు.
ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో కుదుపు వచ్చింది. గత నెల 25న ఆమెకు నీరసంగా ఉండడంతో రాజాం కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తోందని చెప్పారు. దీంతో రక్తపరీక్ష నిర్వహించిన వైద్యులు ఆమె ‘బోన్ నేరో విత్ లుకేమియా’ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో చికిత్స చేయించుకోవాలని, ఇక్కడ తామేం చేయలేమని చెప్పారు. విశాఖపట్నం వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. వ్యాధి నయం కావాలంటే సుమారు 30 నుంచి రూ. 35 లక్షలు వరకు ఖర్చు అవుతుందని, హైదరాబాద్లో మాత్రమే నయం అవుతుందని అక్కడ కూడా చెప్పారు. అసలే అంతంత మాత్రం ఆదాయంతో ఉన్న వారికి ఏం చేయాలో తోచలేదు.పదిహేను రోజుల నుంచి సుధారాణి నీరసించిపోతోంది.
పనులు చేయలేక మంచానికే పరిమితమైంది. భర్త బానోజీ తన పిల్లలను దగ్గర పెట్టుకొని బాధపడడమే తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. భార్య కోసం బానోజీ ఇంట్లోనే ఉండడంతో వీరికి పూటగడవడం కూడా కష్టంగా మారింది. లక్షలు వెచ్చించి వైద్యం చేయించలేని పరిస్థితిఉండడంతో తనకు ప్రాణబిక్ష పెట్టాలని సుధారాణి దాతలను వేడుకుంటుంది. సాయం చేయాలనుకున్న దాతలు 9000 049352 నంబరును సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రాణబిక్ష పెట్టండి.......
తన భార్యకు దాతలు ప్రాణబిక్ష పెట్టాలి. ట్రాక్టర్ డ్రైవర్గా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నా భార్య చికిత్సకు ఇప్పటికే రూ. 50 వేలు అప్పుచేశాను. రూ.లక్షల్లో ఖర్చు చేయలేను. దాతలు ఎవరైనా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి
లేవలేకపోతున్నాను......
వంట్లో పూర్తిగా శక్తి తగ్గిపోతుంది. పైకి లేవలేకపోతున్నాను. పిల్లలు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రోజు రోజుకూ నీరసం ఎక్కువ అయిపోతుంది. పిల్లలు, భర్త ఏమైపోతారోనని దిగులుగాఉంది. ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు.
ముంజేటి సుధారాణి, బాధితురాలు, వండానపేట.
మృత్యుపోరాటం
Published Wed, Aug 19 2015 1:19 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement