సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోని గుంటూరు చానల్ ఆధునికీకరణకు ప్రభుత్వం ఒక్కసారిగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నది. దాదాపు 45 సంవత్సరాల నుంచి కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయని సాగునీటి శాఖ యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు అనేకసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ శాఖ ఆకస్మికంగా ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది.
విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటైతే తాగునీటి సమస్య తలెత్తకూడదని, కాలువ ఆయకట్టు పరిధిలోని 27 వేల ఎకరాలకు సాగునీటి సమస్య లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆధునికీకరణకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.1967లో ప్రారంభించిన ఈ చానల్ నిర్మాణం 1972లో పూర్తయింది.
పాకలపాడు రెగ్యులేటర్ నుంచి వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు రూరల్, చేబ్రోలు మండలాల పరిధిలోని పంట పొలాలకు సాగునీటిని సరఫరా చేయడమే కాకుండా తాడేపల్లి, మంగళ గిరి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాకు ఈ కాలువను నిర్మించారు.
నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాది పొడవునా కాలువకు నీటి సరఫరా జరుగుతుండటంతో మరమ్మతులకు అవకాశమే లేకుండా పోయింది. కాలువకు నీటి సరఫరా నిలిపి వేస్తే తాడేపల్లి, మంగళగిరితోపాటు గుంటూరు నగర ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వుంటుంది.
కాలువ ఆయకట్టు పరిధిలో 32 సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ద్వారా 27 గ్రామాలకు రక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోంది. సాగునీటి సరఫరాకు ఆటంకంగా నిలిచిన తూడు, గుర్రపు డెక్క నిర్మూలనకు మాత్రమే అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు. నీటి సరఫరాకు నిర్మితమైన కట్టడాలు పూర్తిగాశిథిలమయ్యాయి. అంతేకాక, రూ.440 కోట్లతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
కాలువను ఆధునీకరించినప్పుడే వీటిన్నింటికీ నీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు అంచనాలు తయారు చేశారు.నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ కాలువ ఆధునికీకరణకు రూ.122 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేయగా, కొత్త ఎస్ఎస్ఆర్ ప్రకారం రూ.300 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా చేశారు.
47 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ కాలువకు సిమెంట్తో లైనింగ్ చేయడమే కాకుండా రిటైనింగ్ వాల్స్ను ఇరువైపులా నిర్మించనున్నారు. నల్లరేగడి నేలతో కూడిన కాలువ గట్లు తరచూ జారిపోయే ప్రమాదం ఉండటంతో రిటైనింగ్ వాల్స్ నిర్మించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల స్వీకరణకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్
Published Wed, Aug 6 2014 12:32 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
ఈసీ నుంచి రాని అనుమతి.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement