ఏలూరు :సమైక్యాంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలు (సీరియల్ నంబర్లు) మారారుు. ఓటర్ల నమోదు, ఓటర్ల గుర్తింపు, అధికారుల కేటాయింపు వంటి వ్యవహారాలు, ఎన్నికలకు సంబంధించి అధికారిక లావాదేవీలన్నీ ఈ నంబర్ల ఆధారంగా నడుస్తుం టారుు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను సైతం ఈ నంబర్ల ఆధారంగానే నియమించి, పలానా నంబర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అని పేర్కొంటారు. ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాను 5వ దానిగా తీసుకుని, నియోజకవర్గాల నంబర్లను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు 54 నుంచి 68వరకు నంబర్లు కేటారుుంచింది.