గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

Published Wed, Nov 25 2015 11:43 AM

5 womens arrested in kadiri due ganja smgguling

కదిరి: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని పార్థసారధి కాలనీలోని ఓ ఇంట్లో గంజాయిని దాచి ఉంచారనే సమాచారంతో బుధవారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, రూ.4 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తరలించి, విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన మహిళల్లో నలుగురు విశాఖకు చెందిన వారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement