సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే పోస్టులు పెట్టినందుకు 13 మందిని అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సోమవారం కాలేషావలి, గోపి ,రామకృష్ణా రెడ్డిలు బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఏ తప్పు చేయకుండానే తమపైన అక్రమంగా కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.