-
టీడీపీ నేతల ‘విష’ ప్రయోగం
పోలాకి: మండలంలోని బెలమర గ్రామానికి చెందిన చింతు అప్పన్న అనే ఆక్వా రైతుకు చెందిన రొయ్యల చెరువుల్లో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. దీంతో రొయ్యిలన్నీ చనిపోయాయి. బాధితుడు పోలాకి పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు వైఎస్సార్సీపీ సానుభుతిపరుడు కావడంతో ఎన్నికల నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నంగా దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. గొడవకు దిగిన కూటమి నేతలు ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచి పోలింగ్ బూత్ వద్ద స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బెందాళం ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు వైస్సార్సీపీ నాయకులతో సోమవారం బాహాబాహీకి దిగారు. అంతలో అక్కడకు వచ్చిన పీఏసీఎస్ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగించారు. -
కేఎస్సార్ పురం పీఓపై చర్యలకు డిమాండ్
● రీ ఓటింగ్ జరపాలంటూ ఆర్వోకు ఫిర్యాదు గజపతినగరం: గజపతినగరం మండలం కొత్తశ్రీరంగ రాజపురం గ్రామం 100వ పోలింగ్ స్టేషన్లో ఓట్ల రిగ్గింగ్కు పాల్పడిన పీఓ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ ఇజ్జిరోతు పైడిపునాయుడు, గ్రామ పెద్దలు గెద్ద సన్యాసప్పలనాయుడు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బూడి వెంకటరావు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎమ్.వి.సూర్యకళకు సోమవారం ఫిర్యాదు చేశారు. బొబ్బిలి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రాంబాబును కొత్త శ్రీరంగరాజపురంలో ఎన్నికల విధులకు వేశారు. ఆయన గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకుని టీడీపీ నేతలతో కుమ్మక్కై ఓటింగ్ రిగ్గింగ్కు పాల్పడినట్టు గ్రామస్తులు ఆర్వోకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే రీఓటింగ్ జరిపించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతయుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎం.దీపిక సోమ వారం స్వీయపర్యవేక్షణ చేశారు. పట్టణంలోని ఎమ్ఎస్ఎన్ కళాశాల, లంకాపట్నం, దాసన్నపేట, బీసీ కాలనీ, వి.టి.అగ్రహారం, నెల్లిమర్ల, గుర్ల మండలం గుజ్జంగివలస, గరివిడి, చీపురుపల్లి, పూసపాటిరేగ మండలం కుమిలి, భోగాపురం మండలం పోలిపల్లి, గుడివాడ, అప్పన్నపాలెం పోలింగ్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గత మూడు నెలలుగా పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామసందర్శనలు చేసి, ప్రజలతో మమేకమై, ఎలక్షన్ మీటింగులు నిర్వహించి, విభేదాలు లేకుండా చేయడం, సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా గుర్తించి బైండోవర్ చేయడం, బాండులు తీసుకోవడం, ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదుచేయడం ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సత్ఫలితాలినిచ్చాయి. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ అస్మాఫర్హీన్, ఇతర అసెంబ్లీ నియోజక వర్గాల్లో డీఎస్పీలు పర్యవేక్షించారు. ఓటు వేసిన ఎస్పీ... స్థానిక ఎమ్ఎస్ఎన్ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో సామాన్య ఓటర్లతో పాటూ క్యూలో నిలబడి ఎస్పీ ఎం.దీపిక తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు విజయనగరం అర్బన్: జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి స్థానిక కణపాక వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె స్వయంగా క్యూలో నిల్చొని, తమ వంతువచ్చాక ఓటు వేశారు. అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ కూడా అదే పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి కుటుంబ సమేతంగా ఎం.ఆర్.కళాశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కంటోన్మెం సెయింట్ మేరీస్ పాఠశాలలో ఓటు హక్కు వినియగించుకున్నారు. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చీపురుపల్లి మండలం బాలికల గురుకుల పాఠశాలలో ఓటు వేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జొన్నగుడ్డి పాఠశాలలో ఓటు హక్కును వినియగించుకున్నారు. -
20న పైడితల్లి దేవర మహోత్సవం
● 21 నుంచి చదురుగుడిలో పైడితల్లి దర్శనం ● చాటింపు వేసిన ఆలయ తలయారీలువిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తలయారులు సోమవారం చాటింపు వేశారు. ప్రతి ఏటా వైశాఖమాసంలో ఉత్సవ చాటింపు ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ మేరకు స్థానిక మూడు లాంతర్లు వద్దనున్న చదురుగుడి ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ తలయారులు డప్పు వాయిద్యాలతో అమ్మవారికి మనవి చెప్పారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు నేతృత్వంలో దేవర మహోత్సవం చాటింపు వేశారు. అలాగే చిన పైడిరాజు బృందం డప్పులతో ఆలయంలోను, కోట వద్దనున్న కోటశక్తి అమ్మవారికి మనవి చెప్పారు. అనంతరం ఈఓ ప్రసాదరావు మాట్లాడుతూ.. ఈ నెల 20న సోమవారం సాయంత్రం 4 గంటలకు రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అక్కడ నుంచి బాజా,భజంత్రీలు, మేళ తాళాలతో అమ్మవారిని రైల్వేస్టేషన్ నుంచి గాడీఖానా, సీఎంఆర్ జంక్షన్, ఎన్సీఎస్ రోడ్డు, కన్యకపరమేశ్వరి ఆలయం, న్యూపూర్ణ జంక్షన్ మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటివద్దకు తీసుకువెళ్తారన్నారు. అక్కడ అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మేళతాళాల నడుమ శివాలయం మీదుగా పెద్దచెరువు పశ్చిమభాగానికి చేరుకుని అక్కడ పెద్దచెరువులో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అక్కడ నుంచి వేకువజామున అమ్మవారిని మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారన్నారు. మంగళవారం వేకువజామున 6 గంటల నుంచి అమ్మవారు ఆరు నెలల పాటు చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, సూపర్వైజర్ ఏడుకొండలు, పైడిమాంబ కళాపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేతలు
● పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు హడావిడి ● సెల్ఫోన్లతో అనుచరుల ఓవరాక్షన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కూటమి అభ్యర్థి కె.రామ్మోహన్నాయుడు హడావిడి చేశారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లను ప్రలోభపెట్టేలా ఓటు వేయకముందే వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ప్రలోభపెట్టారు. తమ సిబ్బందితో ఫోటోలు దిగిన వారి వాట్సాప్ నంబర్లను తీసుకున్నారు. ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలకు సెల్ఫోన్ల అనుమతి లేదని స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితేనా రామ్మోహన్తోపాటు అనుచరులంతా సెల్ఫోన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద హంగామా సృష్టించడం విమర్శలకు తావిచ్చింది. స్థానిక టీడీపీ నాయకులు కూడా ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లింఘించారు. గుజరాతీపేటలోని వరం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ కేంద్రం వద్ద టీడీపీ నేతాలు ఓటర్లకు ప్రలోభపెట్టారు. ప్రధాన గేట్ వద్ద సైకిల్కు ఓటు వేయాలంటూ వరం కుమారులు, స్థానిక టీడీపీ నాయకులు చేసిన రచ్చ చేశారు. దీంతో ప్రత్యేక బెటాలియన్తోపాటు ఎస్పీ జీఆర్ రాధిక కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకుని శాంతిభద్రతలను స్వయంగా పర్యవేక్షించారు. స్థానిక నాయకులను అక్కడ నుంచి పంపించి వేశారు. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
విజయనగరం అర్బన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఇప్పటికే కేటాయించిన రిసెప్షన్ సెంటర్లకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన 1,874 పోలింగ్ కేంద్రాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లను తరలిస్తున్నారు. డెంకాడ మండలం లెండి ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్.కోట, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల ఈవీఎంలు, జేఎన్టీయూ జీవీ యూనివర్సిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్రూమ్లో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరుస్తున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
● కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించిన కలెక్టర్ నాగలక్ష్మి విజయనగరం అర్బన్: జిల్లాలో సాధారణ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అక్కడక్కడా ఈవీఎంల్లో స్వల్ప అవాంతరాలు తలెత్తగా వెంటనే అధికారులు స్పందించి సరిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,847 పోలింగ్ కేంద్రాల్లో తొలుత పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఆ తరువాత పుంజుకుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులుతీరారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకే చాలా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఎండను దృష్టిలో ఉంచుకొని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నీడ కోసం టెంట్లు వేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకోవడానికి ర్యాంపులు కూడా ఉండడంతో దివ్యాంగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అంధులకోసం అభ్యర్థుల జాబితాలను బ్రెయిలీ లిపిలో పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. జిల్లాలోని మొత్తం 11 మోడల్ పోలింగ్ కేంద్రాల్లో మరిన్ని అదనపు హంగులు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షణ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూం నుంచి పోలింగ్ ప్రక్రియను రోజంతా పర్యవేక్షించారు. ఆమె ఉదయం 4.30 గంటలకే కంట్రోల్ రూమ్కి చేరుకున్నారు. అప్పటి నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ఆర్ఓల ద్వారా పోలింగ్ బూత్ల్లో పరిస్థితి ఎప్పిటికప్పుడు పరిశీలిస్తూ వచ్చారు. అవసరమైన ఆదేశాలను జారీచేసి పోలింగ్ సిబ్బందిని ముందుకు నడిపించారు. ఉదయం 5.45 గంటలకల్లా మాక్ పోల్ పూర్తి చేసేలా పోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈవీఎంల్లో సమస్యలు తలెత్తిన చోట, వెంటనే సంబంధిత అధికారులను హెచ్చరించి, వాటిని సరిచేసి పోలింగ్ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై మరింత దృష్టి సారించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నడిపించారు. విస్తృతంగా పర్యటించిన ఎన్నికల పరిశీలకులు ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. పోలింగ్ తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. మైక్రో అబ్జర్వర్లు ద్వారా పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పోలీస్ పరిశీలకులు సచింద్ర పటేల్, జిల్లా వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రంజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ జిల్లాలో పర్యటించి, పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. -
ఓటేసిన కొద్ది సేపటికే మృత్యువాత
డెంకాడ: అంతవరకు బాగానే ఉన్నాడు. భార్యతో కలిసి ఓటు వేసి ఇంటికి వచ్చిన కాసేపటికి ఆ వృద్ధుడు మరణించాడు. ఈ విచారకర సంఘటన మండలంలోని డెంకాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. డెంకాడ గ్రామానికి చెందిన కోయనేని సత్యం (85) భార్య చంద్రమ్మతో కలిసి పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అక్కడకు కొద్దిసేపటి తర్వాత కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆటో ఢీకొని వ్యక్తి మృతి గజపతినగరం: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడకు చెందిన దుప్పాడ అసిరయ్య తన పనులు ముగించుకుని గ్రామానికి వస్తుండగా... గ్రామ సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అసిరయ్యను విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు కార్తీక్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన రామభద్రపురం: మండలంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఇక్బాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓలతో మాట్లాడుతూ, పోలింగ్ సరళిపై ఆరా తీశారు. పోలింగ్ బూత్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఓటర్లతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ సులోచనారాణి ఉన్నారు. కొత్తూరులో ఈదురుగాలుల బీభత్సం ● పోలింగ్ స్టేషన్ల వద్ద ఎగిరిపోయిన టెంట్లు ● నిలిచిన విద్యుత్ సరఫరా కొత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ కొత్తూరులో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు నేలకొరిగాయి. పలుచోట్లు చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద జనరేటర్లను సిద్ధం చేశారు. అవి కూడా సక్రమంగా పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారం అలముకుంది. విద్యుత్ సరఫర నిలిచిపోవడంతో పోలంగ్ స్టేషన్ వద్ద జనరేటర్లు సక్రమంగ పనిచేయక పోవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. కొత్తూరు, మెట్టూరులతో పాటు పలు గ్రామాల్లో గంటల తరబడి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కొత్తూరుతో పాటు పలు పోలింగ్స్టేషన్లను అడిషనల్ ఎస్పీ ప్రేమ్కాజల్ సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అంధవరంలో దాడి జలుమూరు: మండలంలోని అంధవరం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సవలాపురం రాముపై అదే గ్రామానికి చెందిన పల్లి శంకరరావు, తిరుమలరావులు సోమవారం దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు పడటంతో ఓర్వలేని టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే మాటలు ఆడుతూ ఓటు వేసి వచ్చిన రామును నేలపై దొర్లించి రాయితో కంటి కింద గాయం చేశారు. స్థానిక వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మధుసూదనరావు సిబ్బందితో వెళ్లి పరిస్థితి సద్దుమణిగించారు. -
అధికారుల అత్యుత్సాహం.. కూటమికి సహకారం
రణస్థలం: మండలంలోని రెండు చోట్ల బీజేపీ, టీడీపీకి అనుకూలంగా ఎన్నికల అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ విషయమై బంటుపల్లి, గిరివానిపాలెం బూత్ ఏజెంట్లు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తికి ఫిర్యాదులు చేశారు. గిరివానిపాలెం 142 పోలింగ్ కేంద్రంలో ఎన్నికల పోలింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు బీజేపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసిన సమయంలో వాళ్లకి సహాయంగా వచ్చిన వారిని ఈవీఎంల వద్దకు పంపకుండా నేరుగా వెళ్లి ఓట్లు వేశారని బూత్ ఏజెంట్లు ఆరోపించారు. ఇలోగా ఇప్పిలి చిన్న అనే వృద్ధుడు ఓటు తన కుమార్తె సమాయంతో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. బూత్ ఏజెంట్లు పరిశీలించి ఓటు వేయడానికి ఈవీఎంల దగ్గరకు వెళ్లినప్పుడు పీఓ కూడా వెళ్లారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వృద్ధుడు చెప్పగా పీవో సైకిల్పై బటన్ నొక్కడం, ఇది గమనించిన అతని కుమార్తె ఎందుకిలా చేశారని నిలదీశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఇలా అప్పటికే యాభై పైచిలుకు ఓట్లు వేశారని బూత్ ఏజెంట్లు ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎల్.రామారావు పోలింగ్ కేంద్రానికి వచ్చి వివాదం సద్దుమణించారు. బూత్ ఏజెంట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్వో కార్యాలయానికి పీవో తిరుపతిరావును సరెండర్ చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పీవోపై చర్యలు తీసుకుంటామని ఆర్వో లక్ష్మణమూర్తి తెలిపారు. బంటుపల్లి పోలింగ్ కేంద్రం 185, 186లో ఇజ్జు దుర్గా ప్రసాద్ రెండుసార్లు ఓట్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్నా వీఆర్వో చిన్నారావు నేరుగా ఓటు వేయించారని బూత్ ఏజెంట్లు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. -
● పోలీస్ సేవలు భేష్
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సేవలను పలువురు అభినందించారు. జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్, కణపాక, జొన్నగుడ్డి, సుంకరివీధి, ఆబాద్వీధి, కొత్త దేవరవీధి, తదితర ప్రాంతాల్లో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులకు సేవలందించారు. వీల్చైర్ల ద్వారా వృద్ధులను కేంద్రంలోకి తీసుకురావడం, ఓటు వేసిన తర్వాత బయటకు తీసుకెళ్లడం వంటి పనులతో పోలీసులు ప్రజల మన్ననలు అందుకున్నారు. అలాగే సత్య కళాశాల, ఎంఆర్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఓటర్లకు సహకరించారు. -
● గంగపుత్రులకు వరం ఫిషింగ్ జెట్టీ...
కడలిని నమ్ముకున్న గంగపుత్రులకు ఫిషింగ్ జెట్టీ అనే వరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో నిర్మాణానికి గత ఏడాది మే 3వ తేదీన భూమిపూజ చేశారు. టెండర్ల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తికావాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రావాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు. ● జెట్టీ నిర్మాణానికి అంచనా వ్యయం: రూ.23.74 కోట్లు ● ప్రభుత్వం కేటాయించిన నిధులు: రూ.25 కోట్లు ● నిర్మాణానికి కేటాయించిన భూమి: 6ఎకరాలు ● జెట్టీ వల్ల 5,053 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరో 4వేల కుటుంబాలకు పరోక్షంగా ప్రయోజనం ● 417 సంప్రదాయ పడవలకు, 711 మోటరైజ్డ్ బోట్లకు భద్రంగా లంగర్ వేసుకొనే సౌలభ్యం సీసీ రోడ్ల ఏర్పాటు ఇలా... -
నేడే పోలింగ్
● ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ● ఉదయం 5.30కే మాక్ పోలింగ్ ● జిల్లా వ్యాప్తంగా 1,847 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● 15,62,921 మంది ఓటర్లు ● పీఓ, ఏపీఓ, ఓపీఓలు 13,661 మంది ● 11 మోడల్ పోలింగ్ కేంద్రాల నిర్వహణ ● 226 రూట్లు.. 385 బస్సుల వినియోగం విజయనగరం అర్బన్: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓ పౌరుడా.. ఆలోచించు.. మనకు ఎవరు మంచి చేశారో.. చెప్పిన హామీలను ఎవరు మాట తప్పకుండా నెరవేరుస్తారో.. మన భవిష్యత్తుకు ఎవరు బాటలేస్తారో విజ్ఞతతో యోచించి ఓటు వేయు! నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజాసేవకు తపిస్తూ నిబద్ధత ఉండే నాయకుడి కోసం అన్వే షించు. నీ ఒక్క ఓటు నీ ఊరి గతిని.. నీ జిల్లా రూపురేఖల్ని మారుస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకో. ఈ రాష్ట్ర భవిష్యత్తును బాగుచేస్తుంది. పద.. పోలింగ్ బూత్కు... నీ ఆయుధంతో సుపరిపాలనకు ఓటెయ్! విశ్వసనీయతకు పట్టం కట్టు! ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పోలింగ్ ఏర్పాట్లను తనిఖీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు. ప్రతిపోలింగ్ కేంద్రంలో ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహిస్తారు. 1,847 పోలింగ్ కేంద్రాలు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 15,62,921 మంది ఓటర్ల ఓటింగ్ కోసం 1,847 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పా టు చేశారు. అసెంబ్లీలకు 77 మంది, పార్లమెంట్ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం ఓట్లలో 7,70,805 మంది పురుషులు, 7,92,038 మంది మహిళలు, 78 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రి రవాణా కోసం 226 రూట్లుగా విభజించారు. 226 సెక్టార్ అధికారులు పర్యవేక్షిస్తారు. అదనంగా 20 మంది రిజర్వులో ఉంచారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15,62,921 ఓటర్లలో 18,869 పోస్టల్ ఓటింగ్ పూర్తయింది. 11 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఓటర్లలో స్ఫూర్తి నింపేందుకు జిల్లాలో 11 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అదనపు హంగులు కల్పించారు. 2,290 మంది పీఓలు జిల్లాలోని 1,847 పోలింగ్ కేంద్రాలకు రిజర్వు సిబ్బందితో కలిపి 2,290 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 2,306 మంది ఏపీఓలు, 9,065 మంది అదనపు పోలింగ్ అధికారులు కలిపి 13,661 మందిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓతో పాటు ఐదు గురు సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. ఇంకా 225 మంది సెక్టార్ అధికారులు, 445 మంది మైక్రో అబ్జర్వర్లు, 1,847 మంది బీఎల్ఓలు, రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సుమారు 728 మంది సిబ్బంది, 362 మంది వీడియో గ్రాఫర్లు ఎన్నికలను నిర్వహిస్తు న్నారు. వీరు కాకుండా డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది, హమాలీలు వందల మంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధంగా జిల్లాలోని 1,847 పోలింగ్ కేంద్రాల్లోనూ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ లైటింగ్, ర్యాంపులు, ఫర్నీ చర్, టెంట్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు.ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత అంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. జిల్లాలో జరగనున్న ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాళాలను, ఎన్నికల సూక్ష్మ పరిశీలకులను, వీడియోగ్రాఫర్లను నియమించి సాఫీగా జరగడానికి పూర్తి ఏర్పాట్లు చేశాం. – నాగలక్ష్మి, జిల్లా ఎన్నికల అఽధికారి -
సంక్షేమంలో మేటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం
● పేదలందరికీ ఇళ్లు... మొత్తం మంజూరైన ఇళ్లు: 78,429 నిర్మాణం పూర్తి అయినవి: 38,161 ● గడప గడపకు మన ప్రభుత్వంలో పనులు ప్రతిపాదిత పనులు : 3,208 అంచనా వ్యయం: రూ.101.12 కోట్లు పూర్తి అయినవి: 773 పురోగతిలో ఉన్నవి: 1,670 ● ప్రాధాన్యతా భవనాల నిర్మాణం గ్రామ సచివాలయాలు: 530 రైతుభరోసా కేంద్రాలు: 496 వైఎస్సార్ హెల్త్ సెంటర్లు: 435 డిజిటల్ లైబ్రరీలు: 173 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు: 50 ● ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు: 50 అందుబాటులోనున్న వైద్యులు: 117 యూపీహెచ్సీలు: 18 అందుబాటులోనున్న వైద్యులు: 15 సీహెచ్సీలు: 5 108 వాహనాలు: 28 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లు: 22 104 వాహనాలు: 47 ఏఎన్ఎంలు: 640 బర్త్ వెయిటింగ్ హోమ్స్: 4 జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లు: 541 ప్రయోజనం పొందినవారు: 2,53,679 -
No Headline
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒకప్పుడు వలసలకు, వెనుకబాటుతనానికి విజయనగరం జిల్లా నిలువెత్తు సాక్ష్యం. దశాబ్దాల పాటు టీడీపీ నాయకులను భుజాలపై మోసిన ప్రజలకు కాళ్లుపీకులు తప్ప కష్టాలు తీరలేదు. ఇళ్ల దగ్గర పిల్లలను, వృద్ధులను వదిలిపెట్టి పొట్టచేతపట్టుకొని హైదరాబాద్, చైన్నె ఇలా ఉపాధి ఎక్కడ దొరికితే అక్కడికి మూటముల్లె సర్దుకొని వెళ్లిపోవడమే కనిపించేది. అలాంటి ఈ ప్రాంత దశాదిశా మారిపోతోంది. ఎక్కడి నుంచో ఇక్కడికే వలసలు వచ్చేలా భవిష్యత్తు కనిపిస్తోంది. ‘నాడు–నేడు’తో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్ముకోవడం వరకూ గత టీడీపీ పాలనలో రైతులు పడిన అష్టకష్టాలన్నీ రైతుభరోసా కేంద్రాలతో తీరిపోయాయి. రాష్ట్రానికి పరిపాలనా రాజధాని కానున్న విశాఖనగరానికి చేరువగా ఉండటం, భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరగడం, మరోవైపు విశాఖపట్నం–రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తికావడం విజయనగరానికి వరంలా మారాయి. అంతేకాదు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నడుంబిగించి విజయవంతంగా పూర్తి చేసిన జిల్లాల పునర్విభజనతో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యం ఉన్న జిల్లాగా రూపుదాల్చింది. రూ.500 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, 519 ఎకరాల సువిశాల సుందర ప్రదేశంలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయంగా మారిన జేఎన్టీయూ–జీవీ... ఇవన్నీ విజయనగరం జిల్లాకు కలికితురాయి కానున్నాయి. -
నవరత్నాలతో నేరుగా లబ్ధి రూ.18,591.32 కోట్లు
పథకం లబ్ధిదారుల సంఖ్య ఆర్థిక ప్రయోజనం డ్వాక్రా బ్యాంకు లింకేజీ రుణాలు 4,75,032 రూ.6,319.07 కోట్లు వైఎస్సార్ పింఛన్ కానుక 2,82,748 రూ.4,523.39 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా 2,63,394 రూ.1,879.19 కోట్లు జగనన్న అమ్మ ఒడి 6,76,226 రూ.1,263.61 కోట్లు సీ్త్రనిధి 43,243 రూ.825.71 కోట్లు వైఎస్సార్ ఆసరా 4,20,619 రూ.754.05 కోట్లు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ 2,53,720 రూ.587.49 కోట్లు వైఎస్సార్ చేయూత 1,77,530 రూ.534.19 కోట్లు వైఎస్సార్ సంపూర్ణ పోషణ 1,16,198 రూ.501.97 కోట్లు వైఎస్సార్ సున్నావడ్డీ 4,59,359 రూ.209.32 కోట్లు జగనన్న విద్యాకానుక 1,73,364 రూ.156.48 కోట్లు జగనన్న గోరుముద్ద 7,30,017 రూ.142.44 కోట్లు వైఎస్సార్ చేయూత (జగనన్న పాలవెల్లువ) 18,855 రూ.141.41 కోట్లు జగనన్న తోడు 1,11,345 రూ.127.48 కోట్లు జగనన్న చేదోడు 17,245 రూ.97.97 కోట్లు వైఎస్సార్ బీమా 4,846 రూ.80.87 కోట్లు వైఎస్సార్ వాహనమిత్ర 63,044 రూ.77.765 కోట్లు జగనన్న విద్యాదీవెన 17,996 రూ.74.81 కోట్లు వైఎస్సార్ కాపునేస్తం 5,905 రూ.41.52 కోట్లు ఉన్నతి (ఎస్సీఎస్పీ అండ్ టీఎస్పీ) 7,172 రూ.36.745 కోట్లు డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా 37,497 రూ.33.08 కోట్లు వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం 6,435 రూ.29.87 కోట్లు వైఎస్సార్ చేయూత (జగనన్న జీవక్రాంతి) 3,489 రూ.26.17 కోట్లు వైఎస్సార్ ఈబీసీ నేస్తం 5,738 రూ.24.77 కోట్లు వైఎస్సార్ యంత్రసేవ 2,550 రూ.18.88 కోట్లు వైఎస్సార్ మత్స్యకార భరోసా 14,218 రూ.17.72 కోట్లు సున్నా వడ్డీ పంటరుణాలు 1,14,999 రూ.17.13 కోట్లు జగనన్న వసతిదీవెన 15,897 రూ.12.90 కోట్లు పాస్టర్లకు గౌరవ భృతి 142 రూ.8.20 కోట్లు వైఎస్సార్ నేతన్న నేస్తం 754 రూ.6.80 కోట్లు టీఎంఆర్ (పశుగ్రాసం పంపిణీ) 14,798 రూ.5.04 కోట్లు ఇమామ్లకు గౌరవభృతి 94 రూ.4.64 కోట్లు జగనన్న తోడు (వడ్డీ మాపీ) 1,11,636 రూ.2.66 కోట్లు జననీసురక్ష యోజన 18,899 రూ.2.26 కోట్లు హెచ్ఎస్డీ ఆయిల్ సబ్సిడీ 1,634 రూ.1.814 కోట్లు వైఎస్సార్ పశు బీమా 8,826 రూ.1.47 కోట్లు గడ్డి విత్తనాల పంపిణీ 16,907 రూ.0.89 కోట్లు మత్స్యకారులకు ఎక్స్గ్రేషియా 8 రూ.0.50 కోట్లు పశుగ్రాస కత్తిరింపు యంత్రాలు 112 రూ.0.386 కోట్లు -
జగన్ పాలన ఐదేళ్లూ... జన సంక్షేమం
● జనం ఖాతాల్లోకి నేరుగా రూ.18,591 కోట్లు జమ ● గతమెన్నడూ లేనివిధంగా జిల్లాలో అభివృద్ధి పరుగు ● ‘నాడు–నేడు’తో బాగుపడిన బడులు, ఆస్పత్రులు ● రైతుభరోసా కేంద్రాలతో రైతుల అష్టకష్టాలకు చెక్ ● సచివాలయ వ్యవస్థతో మారిన ప్రభుత్వ సేవల చిత్రం ● వృద్ధులు, దివ్యాంగుల సహా ప్రజలకు వలంటీర్ల సేవలు ● మారుమూల పల్లెలకూ చేరిన ప్రభుత్వ వైద్యం ● సిద్ధమవుతోన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ● విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాకారం ● మన్యానికి మకుటంలా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం -
No Headline
విజయనగరం రూరల్ మండలంలోని గుంకలాం గ్రామంలోనున్న జెడ్పీ హైస్కూల్ ఇది. ఇప్పుడే కాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ పోలింగ్ కేంద్రం కూడా. అప్పుడు పోలింగ్ విధులకు వెళ్లడానికి సిబ్బంది వెనుకాడే పరిస్థితి. కారణం స్కూల్ బిల్డింగ్ సరిగాలేదు. ఉన్న మరుగుదొడ్లూ నిర్వహణ లేక, రన్నింగ్ వాటర్ లేక అడుగుపెట్టడానికే భయపడే పరిస్థితి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘నాడు–నేడు’ కార్యక్రమంతో ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. రన్నింగ్ వాటర్ సౌకర్యంతో అత్యాధునిక మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. పోలింగ్ నిర్వహణ ఇప్పుడు నల్లేరుపై నడకే! విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సిబ్బంది చక్కగా పనిచేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని స్కూళ్లల్లో ఏర్పాటుచేసిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో చక్కటి సౌకర్యాలు సమకూరాయి. ప్రతి గ్రామంలో ‘నాడు–నేడు’తో అభివృద్ధి చేసిన ప్రభుత్వ పాఠశాలతో పాటు వెల్నెస్ సెంటర్, రైతుభరోసా కేంద్రం, సచివాలయం కూడా సమకూరాయి. వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నామో అక్కడి ప్రజలకే తెలుసు! టీడీపీ నాయకుల ప్రలోభాలకు లోనుగాకుండా ‘పచ్చ’ కళ్లద్దాలను కాసేపు పక్కనబెట్టి కళ్లు తెరచి చూస్తే గ్రామ స్వరాజ్యం కనిపిస్తుంది. ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రావాలని, వై.ఎస్.జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రి కావాలని సంస్కరణవాదులు కోరుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం... ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటేస్తే మళ్లీ ఆ సంక్షేమ రాజ్యం వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే ఓటేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మా ఊరే మారిపోయింది... చిన్నప్పుడు నేను గుంకలాం పాఠశాలలోనే చదువుకున్నాను. ఐదేళ్ల క్రితం వరకూ చిన్న భవనాలే దిక్కు. ఐదేళ్లలో విశాల భవనాలు నిర్మించారు. మౌలిక వసతులు పెరిగాయి. పిల్లలకు బెంచీలు, ట్యాబ్లు, డిజిటల్ బోర్డులు... అన్నీ సమకూర్చడం బాగుంది. రన్నింగ్ వాటర్తో మరుగుదొడ్లు మంచి సౌకర్యం. దీనివల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఇదేగాక ఆర్బీకే, సచివాలయం, వెల్నెస్ సెంటర్తో మా ఊరే మారిపోయింది. – బలగం స్వామినాయుడు, షిప్యార్డు కాంట్రాక్టర్, విశాఖపట్నంసకల సౌకర్యాలతో ‘నాడు–నేడు’ ప్రభుత్వ పాఠశాలలు... తొలి విడతలో ఆధునికీకరించినవి 841 ప్రభుత్వం వెచ్చించిన నిధులు రూ.217 కోట్లు రెండో విడతలో ఎంపికై న స్కూళ్లు, అంగన్వాడీలు, జూనియర్ కాలేజీలు 738 ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రూ.232 కోట్లు -
డిజిటల్ విద్య
సర్కారు బడిలో.. పార్వతీపురంటౌన్: కాలం మారింది. విద్యారంగంలో సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతోంది. సాంకేతికతను సర్కారు బడుల పిల్లలకు చేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సఫలీకృతమైంది. డిజిటల్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. మొన్నటివరకు తరగతి గదిలో టీచర్లు కేవలం బ్లాక్, గ్రీన్ బోర్డులను ఉప యోగిస్తూ పాఠాలు చెప్పేవారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కార్పొరేట్ బడులకు దీటుగా, అంతకు మించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే సరైన మౌలిక వసతులు ఉండవనే పరిస్థితి నుంచి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ బడులంటేనే ప్రత్యేకంగా మాట్లాడుకునే రోజులు వచ్చాయి. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి మౌలిక వసతులు కల్పించడం, డిజిటల్ విద్యాబోధనే దీనికి కారణం. ప్రపంచస్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేందుకు అవసరమైన విద్యాబోధనకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేస్తోంది. పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్, బైజూస్ కంటెంట్తో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, స్మార్ట్ టీవీలను సమకూర్చింది. నిరంతరాయంగా డిజిటల్ విద్యాబోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవ గాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీనికోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తోంది. 557 స్కూళ్లకు 1801 స్మార్ట్ టీవీలు జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు పనులు చేపట్టిన 557 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు తొలి, రెండవ విడతల్లో 1801 స్మార్ట్టీవీలు, ఐఎఫ్పీ స్మార్ట్ టీవీలను ప్రభుత్వం అందజేసింది. తొలివిడతలో 221 ప్రాథ మిక పాఠశాలలకు 928 ఐఎఫ్పీ స్మార్ట్ టీవీలు వ చ్చాయి. రెండవ విడతలో 336 పాఠశాలలకు 873 ఐఎఫ్పీఎస్ స్మార్ట్ టీవీలను సమకూర్చింది. వీటిపైనే బోధన సాగుతోంది. బైజూస్ కంటెంట్తో ఇన్స్టాల్ చేసిన ట్యాబ్లు బైజూస్ కంటెంట్తో ఇన్స్టాల్ చేసిన ట్యాబ్లను ఎనిమిదో తరగతి విద్యార్థులకు, బోధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అందజేస్తోంది. గతేడాది జిల్లాలోని 8,183 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేసింది. దీనికోసం రూ.35.23 కోట్లు ఖర్చు చేసింది. 3, 4, 5 తరగతి విద్యార్థులకు ‘స్మార్ట్’ బోధన ఐఎఫ్పీఎస్ టీవీలతో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు విద్య 8వ తరగతి దాటిన విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు జిల్లాలో తొలివిడత 221 పాఠశాలలకు 928 ఐఎఫ్పీఎస్ స్మార్ట్టీవీలు రెండోవిడత 336 పాఠశాలలకు 873 ఐఎఫ్పీఎస్ స్మార్ట్టీవీలు 8వ తరగతి విద్యార్థులకు తొలివిడతలో 8,183, రెండో విడతలో 9,874 ట్యాబ్లు -
క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహం
● గ్రామస్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహం ● ఊరూరా ఆటల పండగ నిర్వహించిన ప్రభుత్వం ● మట్టిలో మాణిక్యాలను వెలికితీత అంతర్జాతీయ ఆటల పోటీల్లో అమెరికా, చైనా, జపాన్ తదితర దేశాలు దశాబ్దాలుగా పతకాల పట్టికలో ఆధిపత్యం సాధిస్తూ వస్తున్నాయి. దీనికి ఆయా దేశాలు అందిస్తున్న క్రీడా ప్రోత్సాహం.. క్రీడా అవకాశాలు.. క్రీడాకారుల కఠోర సాధనే కారణం. అదే స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం ఆటల యజ్ఞాన్ని గతేడాది డిసెంబర్లో ఆరంభించింది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 47 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించి.. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే క్రతువును నిర్విఘ్నంగా కొనసాగించింది. విజయనగరం: ఏదైనా ఒక రంగంలో రాణించాలంటే చక్కని ప్రణాళిక కావాలి. దాని అమలుకు అవసరమైన అవకాశాలు సృష్టించాలి. పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో... భవిష్యత్తును అంచనా వేస్తూ ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ దిశగానే పయనిస్తోంది. ఏ రంగాన్ని తీసుకున్నా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం, పర్యాటకం, క్రీడాలు ఇలా అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తోంది. దీనికోసం పటిష్ట్రపణాళికలు వేస్తూ నిరంతరం శ్రమిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయ విద్యా, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఒకటో తరగతి నుంచి ఆంగ్ల విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తోంది. సమస్తం సమకూర్చుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రభుత్వం తలపెట్టి నిర్విఘ్నంగా నిర్వహించింది. సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఐదు దశల్లో... ఐదు క్రీడాంశాల్లో 47 రోజుల పాటు సాగే ఆటల సంబరానికి క్రీడాకారుల పేర్లు నమోదు... రిఫరీల ఎంపిక... పీడీలు, పీఈటీల నియామకం.. మైదానాలు సిద్ధం చేయడం.. క్రీడాకారులకు కావాల్సిన సమస్త ఆటసామగ్రి సమకూర్చడం... విజేతలకు బహుమతుల ప్రదానం... ఇలా.. అన్నింటా ఎక్కడా రాజీపడకుండా పక్కాగా ఏర్పాట్లు చేసింది. దీనివెనుక ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే.... క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడం... వారి ప్రతి భకు పదును పెట్టడం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో మన రాష్ట్ర విద్యార్థులు పతకాల పంటపండిచేలా తీర్చిదిద్దడం... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా విషం కక్కుతున్నా లక్ష్యసాధన కో సం నిరంతరాయంగా శ్రమిస్తోంది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికార యంత్రాంగం క్రీడా యజ్ఞాన్ని ముందుకు సాగించింది. క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించింది బహుమతులతో అభినందించింది. విజేతలకు బహుమతుల ప్రదానం ఇలా... ఆడుదాం ఆంధ్రా పోటీల్లో క్రికెట్, వాలీబాల్, కబ డ్డీ, ఖోఖో విభాగాల్లోని విజేతలకు ప్రభుత్వం బహుమతులు అందజేసింది. నియోజకవర్గ స్థాయిలోని విజేతలకు వరుసగా రూ.35వేలు, రూ.15వేలు, రూ.5వేలు, జిల్లా స్థాయి విజేతలకు వరుసగా రూ. 60వేలు, రూ.30వేలు, రూ.10వేలు, రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.5లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు అందజేసింది. బ్యాడ్మింట్ విభాగంలో విజేతలకు నియోజకవర్గ స్థాయిలో మొదటి ముగ్గురికి రూ.20వేలు, రూ. 10వేలు, రూ.5వేలు, జిల్లా స్థాయి విజేతలకు రూ. 35వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రాష్ట్రస్థాయి విజేతలకు వరుసగా రూ.2లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేసింది. గతంలో ఏ ప్రభుత్వమూ తలపెట్టని విధంగా క్రీడల్లో ప్రోత్సహించింది. -
● ప్రాణం నిలబెట్టినవారిని మరచిపోతామా?
యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మనల్ని రెండేళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టింది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలబడింది. గ్రామ స్థాయిలో వైద్య పరీక్షలు, కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్లలో వసతి, సమస్య ఎక్కువైనవారికి ప్రతి ఆస్పత్రిలో వైద్యసేవలు అందించడమే గాక కోలుకున్న తర్వాత రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకూ ఆర్థిక సాయం అందించి మళ్లీ ఇంటికి క్షేమంగా పంపించిన ఘనత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. ఇక విజయనగరం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిందీ, భవనాల నిర్మాణం శరవేగంగా పూర్తిచేసి గత ఏడాది సెప్టెంబర్ 15న ప్రారంభించినదీ ఆయనే! దీంతో ప్రజలు అత్యవసర వైద్యానికి, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల సేవలకు విశాఖపట్నం వరకూ పరుగులుపెట్టాల్సిన పరిస్థితి తప్పింది. ఇప్పుడు 24 గంటలూ ఆ సేవలు విజయనగరంలోనే అందుబాటులోకి వచ్చాయి. వైద్యకళాశాల విస్తీర్ణం: 70 ఎకరాలు (గాజులరేగ సర్వే నెం. 1/89) భవనాల నిర్మిత ప్రాంతం : 13,99,879 చదరపు అడుగులు తొలి దశలో పూర్తి చేసిన విస్తీర్ణం : 1.50 లక్షల చదరపు అడుగులు నిర్మాణ వ్యయం : రూ.500 కోట్లు బోధనాసుపత్రి విస్తీర్ణం: 6,61,954 చదరపు అడుగులు సర్వీసు బ్లాక్: 26,376 చదరపు అడుగులు అందుబాటులోనున్న బెడ్స్ : 500 ఎంబీబీఎస్ సీట్లు : 150 బోధన, బోధనేతర సిబ్బంది : 222 -
ఉమ్మడి విజయనగరంలో.. పారిశ్రామిక ప్రగతి
● ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ● సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, రుణాలు, స్థలాల కేటాయింపు ● సింగిల్విండో విధానంలో అనుమతులు ● నాలుగేళ్లలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటు ● రూ.151.44 కోట్లతో 892 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ● 4,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విజయనగరం రూరల్: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు సహజవనరులకు ఆలవాలం. మానవ వనరులకు కొదవలేదు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవారిని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఐదేళ్లుగా రుణాలు, రాయితీలు అందిస్తూ, స్థలాలు కేటాయి స్తూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తోంది. సింగిల్ విండో పద్ధతిలో పారిశ్రామిక అనుమతులు మంజూరుచేస్తోంది. ప్రభుత్వ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. సూక్ష, చిన్నతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపాధి కల్పన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 2019 నుంచి 2023 మధ్య కాలంలో రూ.151.45 కోట్లతో 892 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాది 2019–20 మధ్య కాలంలో నే రూ.19.53 కోట్లతో 77 పరిశ్రమలు ఏర్పాటు కా గా, 2020–21 మధ్య కాలంలో రూ.10.40 కోట్లతో 41 యూనిట్లను మంజూరు చేశారు. అలాగే, 2021 –22 మధ్య కాలంలో రూ.37.50 కోట్లతో 81 యూ నిట్లు ఏర్పాటుకాగా, 2022–23 మధ్య కాలంలో అత్యధికంగా రూ.74.05 కోట్లతో 548 యూనిట్లను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేశారు. 2023–24 సెప్టెంబర్ నెల వరకు రూ.9.98 కోట్లతో 145 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిలో 4,700 మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధికి ప్రోత్సాహం మాది విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని పీఎస్ఆర్ కాలనీ. నేను ఎంబీఏ పూర్తి చేసి 2010–18 మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీలో మార్కెట్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేసిన అనుభవంతో సొంతంగా ఒక పరిశ్రమ నెలకొల్పాలన్న ఆలోచన కలిగింది. నాలాంటి వారికి ఉపాధి అందించగలనన్న నమ్మకం కలగడంతో ముందుగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తుందన్న ప్రోత్సాహకాలు, రాయితీలు విషయాన్ని తెలుసుకుని దరఖాస్తు చేశాను. ప్రభుత్వం రుణం మంజూరు చేయడంతో 2019లో పూసపాటిరేగ మండలంలో రూ.25 లక్షలతో ఆహార ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటు చేశాను. తొలుత నాతోపాటు కేవలం ఇద్దరు వ్యక్తులే పరిశ్రమలో పనిచేసేవారం. ప్రస్తుతం పరిశ్రమ టర్నోవర్ నెలకు రూ.2.4 కోట్లకు చేరుకుంది. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న ప్రోత్సాహం, రాయితీలు బాగున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పదుల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అందిస్తున్నానన్న ఆనందం కలుగుతోంది. – డి.ప్రసన్నకుమార్, ఔత్సాహిక పారిశ్రామివేత్త, ఇండియన్ గ్రాసరీస్ కంపెనీ, పూసపాటిరేగ మండలం ప్రభుత్వ సహకారం మరువలేనిది రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎస్ఈల ఏర్పాటుకు తక్కువ వడ్డీ, రాయితీ రుణాలను అందిస్తోంది. మిల్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సహాయంతో ప్రభుత్వమే రూ.4.06 కోట్లు గ్రాంట్గా మంజూరు చేసింది. దీంతో ఎల్.కోట మండలంలో మహిళా రైతులతోనే చిరుధాన్యాల పరిశ్రమను ఏర్పాటు చేశాం. పరిశ్రమలో 20 మందికి నేరుగా, మరో 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఏటా 7,600 టన్నుల సామర్థ్యంతో పరిశ్రమను నడుపుతున్నాం. వచ్చే లాభాలను డివిడెండ్ రూపంలో 1500 మంది సభ్యులకు సమానంగా ఇస్తాం. – కొమ్మోజుల సరస్వతి, సీఈఓ, ఆరోగ్య మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఎల్.కోట మండలం -
ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ కేంద్రాల వద్ద ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూ న్ చెప్పారు. జిల్లాలోని 2,358 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఓటర్లకు తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. ది వ్యాంగుల కోసం వీల్చైర్లు, ప్రత్యేక క్యూలు, రవాణా సౌకర్యం కోసం వాహనాలు, సీనియర్ సిటిజ న్లు, విజువల్, లోకోమోటివ్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు, బలహీనమైన కదలికతో బాధపడుతున్న ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్సీసీ/ఎన్ఎస్ఎస్ సహాయకులను అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పా టు చేసినట్లు తెలిపారు. పోలింగ్స్టేషన్ల వద్ద టెంట్లు, ఫ్యాన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య బృందాలు, పారా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండల్లో మహిళా ఓటర్లు తమతో పాటు పిల్లలను పోలింగ్ స్టేషన్లకు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత పోలింగ్ స్టేషన్కు ఓటు వేయాలని సూచించారు. -
No Headline
సచివాలయ వ్యవస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సిద్ధింపజేసింది. ఊరూరా సేవా నిలయాలను నిర్మించింది. ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనికి రామభద్రపురంలో ప్రజలకు అనునిత్యం కనిపిస్తున్న సేవా భవనాలే నిలువెత్తు నిదర్శనం. తహసీల్దార్, ఎంపీడీఓ, విద్యాశాఖ, వ్యవసాయశాఖ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, ఉపాధిహామీ, వైఎస్సార్ క్రాంతి పథం, భవిత కేంద్రం, పోస్టాఫీసు తదితర కార్యాలయాలన్నీ ఒకేచోట ఏర్పాటుచేయడంతో ప్రజలకు వ్యయప్రయాసలు తప్పుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సచివాయం–2,3, ఆర్బీకే–2,3 భవనాలు కూడా ఆ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడంతో మండల కేంద్రం ప్రజలకు పనులు మరింత సులభతరమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉండడంతో ప్రజలకు సమయం, ధనం ఆదా అవుతోంది. – రామభద్రపురం -
● ‘గిరి’జన చెంతన విద్యాదీపం....
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీయూఏపీ) సొంత భవనాల నిర్మాణ పనులకు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి గత ఏడాది ఆగస్టు 25న భూమిపూజ చేశారు. గిరిజన ప్రాంతానికి చేరువగా, గిరిజన ప్రగతికి దిక్సూచిగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెంటాడ మండలం చినమేడపల్లి, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాల సరిహద్దులో దీన్ని నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మంజూరు చేసిన ఈ కేంద్రీయ విద్యాసంస్థ కోసం 2019 ఏప్రిల్ వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విజయనగరం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీ క్యాంపస్ భవనంలో 2019 ఆగస్టు 5న సీటీయూఏపీ తరగతులు ప్రారంభమయ్యాయి. ● సీటీయూఏపీ కోసం ఏపీ బడ్జెట్లో కేటాయింపు: రూ.834.83 కోట్లు ● కేటాయించిన భూమి: 519.03 ఎకరాలు ● నిర్మాణం పూర్తి చేయడానికి లక్ష్యం: 42 నెలలు ● మౌలిక వసతుల కల్పనకు కేటాయింపు: రూ. 23.60 కోట్లు -
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్గున్ని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎన్నికల భద్రత ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో మమేకమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత రెండు నెలల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్త్రతంగా చర్యలు చేపట్టి, ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువగా నమోదుచేశామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో 47వేల లీటర్ల ఐడీ లిక్కర్, రూ.4.5 కోట్ల నగదు, 16 కిలోల బంగారం, 113 కిలోల వెండి, రూ.11.5 కోట్ల విలువైన గిఫ్ట్స్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రేంజ్ పరిధిలో ఎన్నికల్లో సమస్యలు సృష్టించే అవకాశమున్న ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్లను ముందుగా గుర్తించి, 18 వేల మందిని బైండోవర్ చేశామన్నారు. విశాఖ రేంజ్ పరిధిలో 1250 లొకేషన్స్ను క్రిటికల్గా పరిగణించి, ఎన్నిక కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర బలగాలు, ఇతర భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, కేంద్ర బలగాలు, హోంగార్డ్స్ను బందోబస్తు, రూట్ మొబైల్స్లో వినియోగిస్తున్నామని తెలిపారు. వీరితో పాటు ఎన్సీసీ, ఎక్స్ ఆర్మీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన యూనిఫాం ఉద్యోగుల సేవలను వలంటీర్లుగా వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గత మూడు నెలలుగా పోలీసుశాఖ చేస్తున్న కృషి, చర్యలు సత్ఫలితాలిస్తాయన్న నమ్మకం ఉందన్నారు. రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కును ఓటర్లు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అన్ని రకాలైన భద్రతా చర్యలను చేపట్టామని చెప్పారు. ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా, ఎటువంటి అల్లర్లు జరగకుండా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్, రెవెన్యూ, పోలీస్శాఖ సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ ఎం.దీపిక, ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు కేకేవీ విజయనాథ్, ఇ.నరసింహమూర్తి, వన్టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ కె.రామారావు, రూరల్ సీఐ ఎం.శ్రీనివాసరావు, డిఐజి లైజన్ ఆఫీసర్ పి.రమణయ్య, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన విజయనగరం పట్టణంలోని కణపాక యూత్ హాస్టల్లోని పోలింగ్ కేంద్రాన్ని, భాష్యం స్కూల్ దగ్గరలోని వినాయక నగర్ మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలను విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ, ఎస్పీ ఎం.దీపిక సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని -
పైడితల్లి దేవర ఉత్సవం చాటింపు నేడు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం చాటింపు ప్రక్రియను సోమవారం సాయంత్రం 5 గంటలకు మూడులాంతర్లు కూడలిలోని చదురుగుడి వద్ద నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ ప్రసాదరావు ఆదివా రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నిర్వహించబోయే ఉత్సవానికి సంబంధించి ఆలయ ఆవరణలో తలయారీలు చాటింపు వేస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారి చాటింపు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పోలింగ్ బూత్ల మార్పు పేరుతోఫేక్ ఎస్ఎంఎస్లు ● సచివాలయాల నుంచి వచ్చిన స్లిప్లే కరెక్ట్: డీఆర్ఓ అనిత విజయనగరం అర్బన్: ఓటర్లను గందరగోళానికి గురిచేసే చర్యలతో టీడీపీపై జనం దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటర్ పోలింగ్ బూత్ మారిపోయినట్లు ఫేక్ మెసేజ్ (ఎస్ఎంఎస్)లను పంపడంపై మండిపడుతున్నారు. ప్రదీప్నగర్ కాలనీకి చెందిన పలు కుటుంబాలకు పోలింగ్ కేంద్రం మారిందంటూ మెసేజ్లు వచ్చాయి. అంతకు ముందు సచివాలయాలు ఇచ్చిన అధికారిక స్లిప్లో స్థానిక ప్రదీప్నగర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంగా ఉంది. ఇంతలోనే పోలింగ్ బూత్ మార్పు ఎందుకు జరిగిందోనని ఆందోళన పడ్డారు. ఆదివారం సాయంత్రం ‘సీపీ–టీడీపీఎస్ఎంఎస్’ నుంచి అదే సీరియల్ నంబర్, బూత్ నంబర్తో గాజులరేగ హైస్కూల్ లోకేషన్గా మెసేజ్ వచ్చింది. ఓటర్ను కన్ఫ్యూజ్ చేసి ఓటు వేయనీయకుండా టీడీపీ పాల్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. బూత్ మార్చు చెందితే అధికారికంగా సచివాలయాల ద్వారానే మెజేస్ వస్తుందని, ఎన్నిక కమిషన్ ద్వారా ఎలాంటి ఎస్ఎంఎస్లు రావని డీఆర్ఓ ఎస్.డి.అనిత వివరణ ఇచ్చారు. సచివాలయాల ద్వారా వచ్చిన ఓటు స్లిప్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. అరసవల్లిలో ‘వైశాఖ’ సందడి అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో వైశాఖ మాసం సందడి ప్రారంభమైంది. తొలి ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కుటుంబాలతో తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయంగా వస్తున్న తొలి పంట ఫలాలను, మామిడి పండ్లు, చలిమిడి, బెల్లం, పెసల మొలకలు, గోధుమ ప్రసాదాలను ఆదిత్యునికి నివేదించి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనాలకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టగా.. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో ఎస్.చంద్రశేఖర్ చర్యలు చేపట్టారు. ఒక్కరోజులో వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,74,300, పూజలు, విరాళాల ద్వారా రూ.67,036, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.85 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement