-
ఓట్ల పండుగలో ‘చల్లని’ పలకరింపు
కర్నూలు (అగ్రికల్చర్): ఓట్ల పండుగ వేళ జిల్లా ప్రజల కు వరుణుడు ‘చల్లని’ కబురు పంపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వా న పండింది. భారీ వర్షాలతో వంకలు, వాగుల్లోకి నీరు వచ్చి చేరింది. హంద్రీ నదిలో ప్రవాహం కనిపించింది. హొళగుంద మండలం మినహా జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షపాతంనమోదైంది. భారీ వర్షాలు పడడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఎండ వేడిమి తగ్గడం, వడగాడ్పులు లేకపోవడంతో సార్వత్రిక ఎన్నికలకు శుభసూచకంగా కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. జిల్లాలో అత్యధికంగా కృష్ణగిరిలో 105.6 మి.మీ, అత్యల్పంగా కల్లూరులో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 86.2, మద్దికెరలో 83.6, సి. బెళగల్లో 70.6, ఎమ్మిగనూరులో 68.8, మంత్రాలయంలో 59.4, గోనెగండ్లలో 56.4 మి.మీ, నందవరం 48.6, చిప్పగిరి 42.6 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తంగా సగటున 34.1 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలు కురవడంతో నీటి సమస్య తీరినట్లయ్యింది. -
కర్నూలు పార్లమెఓంట్ పరిధిలోని ఎన్నికల పోలింగ్ శాతం
కర్నూలులోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లుపోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తి కనిపించిన ఓటర్లు ● కంట్రోల్రూం నుంచి పోలింగ్ శైలిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ● ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పర్యవేక్షణ ● సాయంత్రం 5 గంటల వరకు 64.08శాతం పోలింగ్ ● అత్యధికంగా ఎమ్మిగనూరులో 68.48, అత్యల్పంగా కర్నూలులో 58. 15శాతం నమోదు ● గత ఎన్నికలతో పోలిస్తే తగ్గిన పోలింగ్ శాతం ● 2019 ప్రభంజనం పునరావృతమవుతోందంటున్న వైఎస్సార్సీపీపోలింగ్ శాతం, సరళిపై వైఎస్సార్సీపీలో ధీమా 2019 ఎన్నికల్లో 78.28 శాతం పోలింగ్ నమోదైంది. ఈ దఫా 75.83శాతం నమోదైంది. దీంతో పోలింగ్శాతం తగ్గింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. కర్నూలు అసెంబ్లీలో 2019లో 59.53 శాతం నమోదైతే, ఈ ఎన్నికల్లో 63.87శాతం నమోదైంది. అంటే 4.34శాతం పెరిగింది. కర్నూలులో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉండటం, మైనార్టీ అభ్యర్థి బరిలో ఉండటంతో ఓల్డ్సిటీతో పాటు సిటీ పరిధిలోని మైనార్టీలు అధికంగా పోలింగ్కు వచ్చారని, దాంతోనే పోలింగ్శాతం పెరిగిందని వైఎస్సార్సీపీ నేతలు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు, వృద్ధులు, రైతులు భారీగా తరలివచ్చారని వీరంతా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో పాటు పల్లెల్లో అభివృద్ధిని చూసి మరోసారి వైఎస్సార్సీపీకే ఓటు వేశారని భావిస్తున్నారు. ఓటేసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెతో పాటు సూదూరప్రాంతాల్లో ఉన్నవారు స్వప్రాంతాలకు వచ్చారు. జిల్లాలోని 7 అసెంబ్లీ, కర్నూలు పార్లమెంట్ స్థానానికి సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యంగా పొలింగ్ మొదలైంది. ఆ తర్వాత నుంచి ఓటర్లు జిల్లా వ్యాప్తంగా పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ భారీగా బారులుతీరారు. ఆ తర్వాత కూడా మహిళలు, వృద్ధుల సంఖ్య తగ్గకపోవడం విశేషం. ముఖ్యంగా పట్టణాల్లో పేదవర్గాల నుంచి పట్టణాల్లో రైతులు, పేదలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉదయం 7గంటల వరకూ కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడుతుందని భావించారు. అయితే 7 గంటలకు వర్షం తగ్గింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు వర్షాన్ని లెక్కచేయకుండా ఉదయాన్నే పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. గంట, గంటకూ భారీగా జనాలు సెంటర్లకు తరలివచ్చారు. దీంతో చాలా సెంటర్లలో భారీ క్యూలైన్లు కనిపించాయి. ఓటర్లు ఓపికగా క్యూలైన్లో నిల్చున్నారు. ఎండప్రభావం కూడా లేకపోవడంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగిసినా, అప్పటి వరకూ క్యూలైన్లలో ఉన్నవారితో రాత్రి వరకూ పోలింగ్ నిర్వహించారు. రాయలసీమ యూనివర్శిటీ స్ట్రాంగ్రూంలకు ఈవీఎంల తరలింపు పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు ఈవీఎంలకు సీల్ వేశారు. వాటిని పోలీస్బందోబస్తు మధ్య జిల్లా కేంద్రంలో రాయాలసీమ యూనివర్సిటీకి తీసుకొచ్చి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీలతో పాటు పాణ్యం అసెంబ్లీ ఈవీఎంలను కూడా ఆర్యూ స్ట్రాంగ్రూంకే తరలించారు. స్ట్రాంగ్రూంల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ఘటనలు ఇవే కర్నూలు ఉస్మానియా కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఒక సామాజికవర్గం వారు దొంగ ఓట్లు వేస్తున్నారని, ముఖ్యంగా మహిళా ఓటర్లను పరిశీలించలేదని టీడీపీ అభ్యర్థి భరత్ హల్చల్ చేశారు. అక్కడున్న మూడు కేంద్రాల్లోని ఏజెంట్లపై తిట్లదండకం అందుకున్నారు. అరగంట పాటు ఉన్న భరత్ ఒక్క ఆధారమూ చూపించకపోవడంతో అభాసుపాలై అక్కడి నుంచి వెనుదిరిగారు. టీడీపీకి సహకరించిన వన్టౌన్ సీఐపై ఎస్పీకి ఫిర్యాదు పాతబస్తీలోని 221, 225 పోలింగ్ స్టేషన్లలో టీడీపీ నాయకులు హంగామా సృష్టించారు. వన్టౌన్ సీఐతో పాటు 5గురు కానిస్టేబుళ్లు టీడీపీకి పూర్తి అనుకూలంగా పని చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అడుగడుగునా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందిపెట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటేయండిని ప్రచారం చేసిన ఎన్నికల అధికారి ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచిలో 223, 224లో కొందరు అధికారులు టీడీపీకి ఓటేయండని అక్కడి ఓటర్లకు చెప్పారు. ఇది గ్రహించిన వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఇతర ఓటర్లు అధికారిపై వాదనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపు చేశారు. చిప్పగిరి మండలం ఏరూరు లో 95, 96 పోలింగ్ బూత్లలో కూడా కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ రెండుచోట్ల వాగ్వాదంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పోలీసుల జోక్యంతో తిరిగి ప్రారంభమైంది. ● పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు అర్బన్లోని వీకర్సెక్షన్ కాలనీ(41వార్డు)లో నంద్యాల జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ తనయుడు శివ, టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి తనయుడు కాటసాని శివనరసింహారెడ్డి, పార్టీ శ్రేణులపై రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. దీంతో కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. పోలీసులు ఇరువురిని అదుపు చేశారు. ● మంత్రాలయం మండలం మాధవరం 53వ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలుగు ఈరన్న(60) అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డారు. కంట్రోల్రూం నుంచి పోలింగ్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెబ్కాస్ట్ ద్వారా అన్ని నియోజకవర్గాల పోలింగ్ సరళిని కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్, ట్రైనీ కలెక్టర్ కళ్యాణి పరిశీలించారు. ఓటర్లు ఎక్కువసేపు వేచి ఉండకుండా వేగవంతంగా పోలింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్లు, బీఎల్ఓల ద్వారా పోలింగ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 6గంటల తర్వాత క్యూలైన్లో ఉన్నవారికి స్లిప్పులు అందజేసి రాత్రి వరకూ వారు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించారు. వచ్చే నెల 4న కౌంటింగ్ మార్చి 16న షెడ్యూలు వెలువడింది. సుదీర్ఘ గడువు తర్వాత నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో ఫేజ్–1లో జరగడంతో పోలింగ్ తర్వాత 43 రోజులకు కౌంటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు 21 రోజుల తర్వాత కౌంటింగ్ జరగనుంది. అప్పటి వరకూ ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుంది. కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్రూంలు గట్టి బందోబస్తు పర్యవేక్షణలో ఉంటాయి. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సార్వత్రిక సమరం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల శైలిని కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ విడత పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం, సరళి తదితర అంశాలను రాజకీయ పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా విశ్లేషిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్నూలు జిల్లాలో ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని, 2019 ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలునియోజకవర్గం 2019 2024 పోలింగ్శాతం (అర్ధరాత్రి 12 గంటల వరకు) కర్నూలు 59.53 63.87 పత్తికొండ 83.97 84.14 కోడుమూరు 79.52 76.50 (ఎస్సీ) ఎమ్మిగనూరు 79.16 81.80 మంత్రాలయం 84.98 84.51 ఆదోని 65.31 63.51 ఆలూరు 79.71 82.77పోలింగ్ మొదలు నుంచి ముగిసే దాకా సమయం జిల్లాలోని అసెంబ్లీల పార్లమెంట్ పరిధిలోని పోలింగ్శాతం పోలింగ్శాతం (పాణ్యంతో కలిపి) ఉదయం 9గంటలకు 9.24 9.61 11గంటలకు 22.05 21.86 ఒంటిగంటకు 38.00 37.61 3గంటలకు 52.26 52.49 5గంటలకు 64.55 64.08 అర్ధరాత్రి 12 గంటలకు 75.83 76.17 -
రూ. 1.86 లక్షల నగదు సీజ్
ఎమ్మిగనూరురూరల్: పట్టణ సమీపంలోని అగ్నిమాపకం కేంద్రం దగ్గర గల చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో రూ. 1.86 లక్షల నగదును సీజ్ చేసినట్లు సెబ్ సీఐ భార్గవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడు తూ వెంకటాపురం కాలనీకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి ఎటువంటి ఆధారం లేకుండా తన దగ్గర కలిగిన రూ. 1,86,000 సీజ్ చేసినట్లు తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలను చూపనందున సీజ్ చేసినట్లు చెప్పారు. తనిఖీలో ఎస్ఎస్టీ టీం–1 మధుబాబు, ఎఫ్ఎస్టీ–టీం 1 వరప్రసాద్, సెబ్ ఎస్ఐ సత్యనారాయణ, హెచ్సీలు గౌస్ రబ్బానీ, పీసీలు భరత్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, జేసీ
కర్నూలు(సెంట్రల్): ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరిన కలెక్టర్ డాక్టర్ జి.సృజన తాను కూడా ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. కలెక్టరేట్ వెనుక ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. అలాగే సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో జాయింట్ కలెక్టర్, పాణ్యం ఆర్వో నారపురెడ్డి మౌర్య తన ఓటు హక్కును భర్తతో కలసి వినియోగించుకున్నారు. ఇక కర్నూలు ఆర్వో, మునిసిపల్ కమిషనర్ భార్గవ్తేజ తన భార్యతో కలసి కర్నూలు మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. కోడుమూరు నియోజకవర్గ ఆర్వో, కర్నూలు ఆర్డీఓ ఎం.శేషిరెడ్డి బాలాజీ నగర్ పరిధిలోని కేశవరెడ్డి స్కూలులో ఓటు వేశారు. ఓటేసిన డీఐజీ, ఎస్పీ దంపతులు కర్నూలు: కర్నూలులోని బి.క్యాంప్లో ఉన్న సిల్వర్జూబ్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు సతీమణితో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కర్నూలు కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎస్పీ కృష్ణకాంత్ సతీమణితో కలసి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యత ఉందని, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఓటర్లకు మర్యాదలే వేరప్పా!
● పెళ్లిళ్ల మాదిరిగా సదుపాయాలు కర్నూలు(సెంట్రల్): మోడల్ పోలింగ్ కేంద్రా ల్లో ఓటర్లకు భలే మర్యాదలు చేశారు. పెళ్లిళ్లకు వెళ్లిన అనుభూతిని కల్పించారు. కేంద్రాల ముందు పెళ్లి పందిళ్ల తలపిస్తూ తోరణాల నుంచి ప్రత్యేక స్వాగత తోరణాలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 40 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 26 మండలాల్లో 26, మహిళల ఆధ్వర్యంలో 8, యువత ఆధ్వర్యంలో 2, దివ్యాంగుల ఆధ్వర్యంలో మరో రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలోకి వెళ్లేముందు పూలు ఇచ్చి స్వాగతం పలకడం, పన్నీరుచల్లి ఆహ్వానించడం, క్యూలైన్ వరకు ఓటర్లను తీసుకొని వెళ్లడం వంటి మర్యాదలు చేయడంతో ఓటర్లు ప్రత్యేక అనుభూతిని పొందారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంకర్నూలు (సెంట్రల్): జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సిబ్బంది, రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహకరించడంతో పోలింగ్ సజావుగా సాగినట్లు పేర్కొన్నారు. పోలింగ్ అనంతర ఈవీఎంలను రాయలసీమ యూనివర్సిటీలోని స్ట్రాంగ్రూంలలో భద్రపరిచినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల సంఘం తరఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలించిన రామయ్య దేవనకొండ: స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య పరిశీలించారు. ఓటింగ్ వివరాలు, పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ ప్రశాంతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని, ధైర్యంగా ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. అధికారి అత్యుత్సాహం పాణ్యం: మండలంలోని కౌలూరు గ్రామంలో ని 294 పోలింగ్ కేంద్రంలో ఓ అధికారి అత్యుత్సాహం చూపారు. ఏకంగా ఓటర్లను పక్కదారి పట్టించి టీడీపీ ఓట్లు వేయించే ప్రయత్నం చేశాడు. వృద్ధుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులను కాదని ఆ ఆధికారి స్వయంగా ఈవీఎం వద్దకు వెళ్లి బటన్ నొక్కుతూ కనిపించాడు. అనుమానం వచ్చి వైఎస్సార్సీపీ ఏజెంట్లు నిలదీయడంతో అక్కడి టీడీపీ ఏజెంట్లు వారిని బెదిరించారు. దీంతో అక్కడి చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు పోలీసుల సమక్షంలో పోలింగ్ కేంద్రం అధికారి అనంత్ను నిలదీశారు. తాను తప్పు చేశానని, క్షమించమని కోరారు. -
పోలింగ్ రోజూ టీడీపీ ప్రలోభాలు
కర్నూలు: టీడీపీ నేతలు పోలింగ్ రోజు కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కర్నూలులోని ఖండేరి వీధిలోని సీరాక్ స్కూల్ దగ్గర ఓ కిరాణ షాపులో టీడీపీ అభ్యర్థి తరపున ఆయన శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పాతబస్టీ 6వ వార్డులోని గరీబ్ నగర్లో ఉన్న ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ శ్రేణులు కరపత్రాలతో ఉన్న డబ్బు కవర్లను పంపిణీ చేసి ఓటర్ల మద్దతును కోరారు. బిర్లా గడ్డ వద్ద పోలింగ్ కేంద్రం సమీపంలోనే టీడీపీ నగర పార్టీ ప్రధాన హోదాలో ఉన్న ఓ నాయకుడు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ హల్చల్ చేశాడు. కర్నూలు సి.క్యాంప్ సెంటర్లోని మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆల్కాలీస్ ఉద్యోగులు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతం ప్రజలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఆల్కాలీస్ ఉద్యోగులకు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఇవేకాదు.. టీడీపీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారడానికి ఇంకెన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిర్దేశిత ఓటర్లను ఎంచుకుని వారికి మాత్రమే డబ్బు పంపిణీ చేయడం కనిపించింది. వార్డుల్లో సక్రమంగా డబ్బులు పంపిణీ చేయలేదని తమ పట్ల వివక్ష చూపారని కొంతమంది మహిళల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలకు నిలదీతలు ఎదురయ్యాయి. కొంతమంది మహిళలకు అక్కడే డబ్బులు పంపిణీ చేసి దేవుడి మీద ఒట్టు వేయించుకోవడం కూడా పాతబస్తీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. పోలింగ్ ఏజెంట్లకు ప్రలోభాలు... ఎన్నికలు ప్రశాంతంగా నిస్పక్షపాతంగా జరిగేలా చూడటంలో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అభ్యర్థి తరఫు ఏజెంట్ల పాత్ర కీలకం. బోగస్ ఓట్ల గుర్తింపు, అవకతవకలు లేకుండా పోలింగ్ జరగడానికి నిబద్ధతతో పని చేయాలి. ఈవీఎంలు తెరిచే సమయంలో పర్యవేక్షించడంతో పాటు ఓటరు జాబితా ఆధారంగా ప్రతి ఓటరును నిశితంగా పరిశీలించి అనుమానాలు ఉంటే అభ్యంతరాలు లేవనెత్తాలి. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సీల్ వేసేవరకు అక్కడే ఉండి గమనించాలి. అన్ని పార్టీల అభ్యర్థుల పర్యవేక్షణలో పోలింగ్ జరిగితే అక్రమాలకు పాల్పడటానికి అవకాశం ఉండదని టీడీపీ అభ్యర్థి స్వతంత్రులతో పాటు ప్రతిపక్షాలకు చెందిన కొందరు ఏజెంట్లను డబ్బుతో ఎరవేసి ప్రలోభాలకు గురిచేసినట్లు ఆయన వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది. పోలింగ్ సిబ్బందికి ఎర... ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి కర్నూలులోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అఽధికారులు ప్రత్యేక మెనూ అమలు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ బిస్కట్లు అందజేశారు. అయితే వారికి కూడా టీడీపీ అభ్యర్థి ధన బలంతో ఎర వేసి వారి సహాయం తీసుకునేందుకు ప్రయత్నించారు. కర్నూలులోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో తన సిబ్బంది చేత టిఫిన్లు, భోజనాలు, వాటర్ బాటిళ్లు సరఫరా చేసి సహకారాన్ని కోరారన్న చర్చ జరిగింది. కొన్ని బూత్లలో రిలీవింగ్ పేరుతో టీడీపీ ఏజెంట్లు లోపలికి, బయటకు తిరుగుతూ అటు ఓటర్లను, ఇటు సిబ్బందిని ప్రలోభాలకు ప్రయత్నించారు. మరికొన్ని చోట్ల టిఫిన్లు, భోజనాల సరఫరా పేరుతో టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లడంతో పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బందికి తీవ్ర అంతరాయం కలిగింది. పాతబస్తీలోని మూడు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు సరఫరా చేసే భోజనాలు అవసరం లేదంటూ సిబ్బంది నిరాకరించి వెనక్కు పంపారు. పాతబస్లీ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు బహిరంగంగా టీడీపీ మద్దతుగా సమీపంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లపై ఒత్తిడి చేయడం అక్కడ చర్చనీయాంశమయ్యింది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న కొందరు ఓటర్లు ఆ శాఖలోని అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం కూడా చర్చనీయాంశమయ్యింది. కేంద్రాల వద్దే యథేచ్ఛగా కరపత్రాలు ఉన్న కవర్లతో డబ్బుల పంపిణీ దొంగ ఓట్లు వేసిన ఆల్కాలీస్ ఉద్యోగులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భోజనం, టిఫిన్లు, వాటర్ బాటిళ్లు సరఫరా చేసి పోలింగ్ సిబ్బందికి ఎర స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లకు డబ్బుతో ఎర కృతజ్ఞతతో సహకరించిన కొందరు ఏజెంట్లు -
పోలింగ్ బూత్లోనూ టీడీపీ ప్రచారం
● ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం ● వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి దేవనకొండ: టీడీపీ నేతలు బరితెగించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ పోలింగ్ రోజు కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రమైన దేవనకొండలోని 259 పోలింగ్ బూత్లో టీడీపీ వారు సూపర్ సిక్స్ పథకాల పేపర్లను చూపుతూ సైకి ల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేశారు. విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి దేవనకొండకు చేరుకుని పరిశీలించారు. టీడీపీ నాయకులు ఇలా చేయడం తప్పు అని, పోలింగ్ బూత్లో ప్రచారం చేయకూడదన్నారు. టీడీపీ వాళ్లు ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ వారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. -
అదే అతని ‘చివరి’ ఓటు
పగిడ్యాల: మండలంలోని బీరవోలు గ్రా మానికి చెందిన బోయ నరసింహుడు (65) సోమవారం సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కొద్ది నిమిషాల్లో మృతి చెందాడు. ఇతను జగనన్నకు వీరాభిమాని. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సోమవారం ఓటు వేయాలనే అతృతతో ఉదయాన్నే ఆటోలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. తనని కలసిన వారినందరికీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తానని చెప్పాడు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికెస్తుండగా మార్గమధ్యలోనే తుది శ్వాస విడిచాడు. బోయ నరసింహుడు మృతి సమాచారం తెలుసుకున్నా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్ పెరుమాళ్ల శేషన్న, వైఎస్సార్సీపీ నాయకులు పల్లె సత్యనారాయణరెడ్డి, భాస్కరరెడ్డి, భూషిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పల్లె బాటన ఓటర్లు
● కిక్కిరిసిన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్కర్నూలు సిటీ: ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పక్క రాష్ట్రాల్లోకి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన ప్రజలు భారీగా రావడంతో ఆదివారం కర్నూ లు ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసి పోయింది. ఎన్నికల కోసం ఈవీఎం మిషన్లను, ఇతర సా మాగ్రిని, ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు జిల్లాలోని వివిధ బస్ స్టేషన్లకు చెందిన 200 బస్సులను, కర్ణాటక రాష్ట్రం నుంచి 95 బస్సులను వినియోగిస్తున్నారు. హైదరాబాదు, బెంగళూరులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న జిల్లా వాసులు ఎన్నికల్లో ఓటును వినియోగించుకునేందుకు పల్లెబాట పట్టారు. సాధారణ రోజులకు మించి ప్రయాణికులు రావడంతో అందుబాటులో ఉన్న బస్సులన్నింటినీ నడుపుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అదనపు బస్సు సర్వీసుల ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతో పల్లెలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాల యజమానులు సాధారణ రోజుల కంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. -
ఓటుకు వేళాయె!
నేడే సార్వత్రిక సమరం ● కర్నూలు పార్లమెంటు బరిలో 19 మంది అభ్యర్థులు ● ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో 102 మంది అభ్యర్థుల పోటీ ● ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ● ఓటు హక్కును వినియోగించుకోనున్న 20.54 లక్షల మంది ఓటర్లు ● 2,204 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు ● సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ● అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు ● జిల్లాలో 40 మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఆదివారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన పోలింగ్ సామగ్రి, సిబ్బంది ● నేటి ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ ● జూన్ 4న కౌంటింగ్, ఫలితాల ప్రకటన కర్నూలు(సెంట్రల్): 2024 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఓటు హక్కు వినియోగంతో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కర్నూలు పార్లమెంట్ బరిలో 19 మంది అభ్యర్థులు, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 20.54 లక్షల మంది ఓటర్లు కర్నూలు జిల్లాలో మొత్తం 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 10,40,451మంది, పురుషులు 10,13,794మంది, ఇతరులు 318 మంది ఉన్నారు. 85ఏళ్లకు పైబడిన వారు 9,988 మంది, యువ ఓటర్లు 56,067మంది, వికలాంగ ఓటర్లు 23,940 మంది ఉన్నారు. వీరంతా 2,204 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ నిర్వహిస్తారు. అనంతరం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు వరుసలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి ఆ తరువాత కూడా ఓటు వేయిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, ఓటు వేసేందుకు వచ్చిన వారు ఓటరు ఎపిక్కార్డు లేదా ఆధార్కార్డుతో పాటు 12 రకాల కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకునే వీలుంది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, సామగ్రి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన డిశ్పాచ్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రి, సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. జిల్లాలో 14,561 మంది పొలింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి మూడుసార్లు పోలింగ్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. అలాగే 2,204 పోలింగ్ కేంద్రాల్లో అమర్చడానికి అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లను ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తీసుకెళ్లారు. కర్నూలు పార్లమెంట్కు సంబంధించి 4,366 బ్యాలెట్ యూనిట్లు, 2,203 కంట్రోల్ యూనిట్లు, 2,346 వీవీప్యాట్లను కేటాయించారు. అలాగే 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,912 బ్యాలెట్ యూనిట్లు, 2629 కంట్రోల్ యూనిట్లు, 2801 వీవీప్యాట్లు, సిబ్బందిని 805 వాహనాల్లో తరలించారు. ప్రతి వాహనానికి జీపీఎస్ అమర్చి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాట్లు ప్రశాంత, పారదర్శక ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లాలోని 2,204 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించగా.. ఈసారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్తోపాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రఫీ తీయించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులతో పాటు 10 కంపెనీల పారామిలటరీ బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి మండలంలో ఒక్క ప్రత్యేక సదుపాయాలు ఉన్న మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 40 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈ విడత మొదటిసారి ఏర్పాటు చేయడం విశేషం. ఆర్యూలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లకు తరలించాల్సి ఉంటుంది. పకడ్బందీ బందోబస్తు మధ్య జీపీఎస్తో అనుసంధానమైన వాహనాల్లో వీటిని రిసెప్షన్ సెంటర్లకు తరలించనున్నారు. ట్రాఫిక్ జామ్లో వాహనాలు ఇరుక్కోకుండా ముందుస్తుగా ఏ వాహనం ఏ గేటు ద్వారా ఎక్కడికి రావాలనే విషయమై ప్రణాళికలు రూపొందించారు. ఈవీఎంలు రిసెప్షన్ సెంటర్లకు చేరగానే స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. ఈ ప్రాంతంలో మూడంచెల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుంది.ఎండల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు ఎన్నికల నేపథ్యంలో ఎండలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారి కోసం ర్యాంపులను సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వెలుపల 100 మంది కూర్చునేలా షామీయాలు ఏర్పాటు చేశారు. ఇందులో 100 కుర్చీలు వేస్తారు. వర్షం పడే సూచనలు ఉండటంతో పోలింగ్ కేంద్రాల్లో గొడుగులను కూడా అందుబాటులో ఉంచారు. అనుకోకుండా కరెంట్ పోయినా రీచార్జబుల్ బ్యాటరీలను కూడా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. -
ఓటు పండుగకు సిద్ధం
ప్రజాస్వామ్యానికి ఊపిరిలా నిలిచిన ఓటింగ్ కు అధికారులు అంతా సిద్ధం చేశారు. పండుగ వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్చైర్లు అందుబాటులో ఉంచారు. ఎండల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఈవీఎంలు తీసుకుని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. –సాక్షినెట్వర్క్ -
వైభవంగా జయలక్ష్మి మాత జయంతి
కర్నూలు కల్చరల్: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాతృమూర్తి జయలక్ష్మి మాత జయంతిని ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక సూర్యనారాయణ స్వామి ఆలయంలో అనఘా దత్త జ్ఞాన బోధ సభా ట్రస్ట్ సభ్యులు, మాతృమండలి సభ్యులు జయలక్ష్మి అమ్మవారి పాదుకలకు శ్రీ సూక్త విధానంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్య జలాభిషేకం నిర్వహించారు. శ్రీ సూక్త దుర్గా సూక్త మేధా సూక్త, దేవీ భూసూక్తాలతో విశేషమైన హోమాలు జరిగాయి. అనంతరం పేదలకు గొడుగులు, పాదరక్షలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయం ట్రస్టీ సభ్యులు డాక్టర్ సి. అంజనేయులు, డాక్టర్ సీఏ నగేష్ వర్మ, టి.శివరామకృష్ణ, డాక్టర్ వై.కృష్ణమోహన్, సీఏ రమేష్ వర్మ, ప్రకాష్, కృష్ణమూర్తి, మాతృమండలి సభ్యులు శ్రీదేవి, రాజేశ్వరి, నాగజ్యోతి రమాదేవి, పద్మలత, అనంత లక్ష్మి, శైలజ, తదితరులు పాల్గొన్నారు. నేడు సీ.క్యాంపు రైతుబజారు బంద్ కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని సీ.క్యాంపు రైతు బజారును సోమవారం ఒక్కరోజు బంద్ చేస్తున్నట్లు రైతుబజారు ఎస్టేటు అధికారి హరీష్కుమార్, హార్టీకల్చర్ కన్సల్టెంటు శివకుమార్ తెలిపారు. రైతుబజారు పక్కనే పోలింగ్ కేంద్రం ఉండటం వల్ల ట్రాపిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయనే కారణంతో పోలీసు అధికారుల సూచనల మేరకు రైతుబజారును ఒక్కరోజు మూసి వేస్తున్నట్లు వారు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం నుంచి యథావిధిగా రైతుబజారు నిర్వహిస్తామని వారు తెలిపారు. నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలి కర్నూలు(హాస్పిటల్): రోగులకు వైద్యసేవలు అందించడంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ వైద్యరంగంలో నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. రోగులకు సేవ చేయడం నర్సులకు దేవుడు ప్రసాదించిన వరమని తెలిపారు. ఈ మేరకు నర్సులు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం మద్దూర్నగర్లోని అమ్మ అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్లు జి. నాగమణి, అనసూయ, రాజ్యలక్ష్మి, హెడ్ నర్సులు ఎం. లీలారాణి, జి.ఉమ, కె. ఉమ, స్టాఫ్నర్సులు డి. మంజులాదేవి, కళ్యాణి, విజయమ్మ, విమలమ్మ, రమణి, కాంట్రాక్టు స్టాఫ్నర్సులు పాల్గొన్నారు. -
టీడీపీలో డబ్బు పంపకాల లొల్లి
● నేతల మధ్య చిచ్చు రేపిన ఆర్థిక అంశాలు కర్నూలు: ఓటర్లకు డబ్బుల పంపిణీ విషయంలో కర్నూలు టీడీపీలో లొల్లి మొదలయ్యింది. ముట్టజెప్పి న డబ్బుకు, వార్డుల్లో చేపట్టిన పంపకాలకు లెక్క సరి పోకపోవడంతో అభ్యర్థి కలవరపడుతున్నట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. పాతబస్తీలోని 10, 12 వార్డుల్లోని ఉస్మానియా కళాశాల పెద్ద పడఖానా, పింజరి వీధి, మాసుం బాషా దర్గా ప్రాంతాల్లో కేవలం టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన ఓటర్లకు పంపిణీ చేయకుండా వెళ్లిపోతుండటంతో ఆయా వార్డుల్లో వాగ్వివాదం చోటు చేసుకుంది. కొందరు ఓటర్లు ‘మాకెందుకు ఇవ్వరు’ అంటూ నిలదీయడంతో ‘మీరు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు,ఇచ్చేది లేదు’ అంటూ అభ్యర్థి అనుచరులు తేల్చి చెప్పడంతో వాగ్వివాదానికి దారి తీసింది. మరికొన్ని వార్డుల్లో అంకితభావంతో పనిచేసిన పార్టీ నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు బంధువులు, అనుచరులతో పంపిణీ చేయించడం కార్యకర్తల్లో నైరాశ్యానికి గురిచేసి విభేదాలకు తావిచ్చింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారిని నమ్మకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి అభ్యర్థికి అనుచరవర్గంగా ఉంటున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా అలక వహించారు. ముట్టజెప్పిన డబ్బుల్లో సగం పంచి సగం నొక్కేసినట్లు అభ్యర్థికి సమాచారం చేరింది. డబ్బుల పంపిణీలో లెక్కలు తీయడం కంటే బాధ్యతలు అప్పగించిన వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారు? అప్పగించిన మొత్తాన్ని పంపిణీ చేశారా? అందులో ఏమైనా నొక్కేశారా అనేదానిపై సొంత వేగుల ద్వారా నిఘా పెట్టించారు. కొంతమంది అంకితభావంతో పంపిణీ చేయగా మరికొంతమంది వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తించేలా అభ్యర్థి దృష్టికి వెళ్లింది. అలాంటి వారితో ఎన్నికల తర్వాత మాట్లాడాలని నిర్ణయించి ప్రస్తుతం గెలుపు అంచనాలపై దృష్టి సారించా లని వేగులకు స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఓ టర్ల పంపిణీ కోసం అభ్యర్థి ఇచ్చిన డబ్బును వెనకేసుకున్న వారి పనితీరుపై అభ్యర్థే స్వయంగా విచారణ జరిపిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. తప్పు చేసినట్లు తేలితే డబ్బు వెనకేసుకున్న వారి నుంచి తిరి గి రాబట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందిన మొత్తంలో సగం పంపిణీ చేసి మిగిలిన మొత్తాన్ని కొందరు వెనకేసుకున్నారని అభ్యర్థికి నేరుగా కొన్ని కాలనీల ఓటర్లే ఫిర్యాదు చేయడం గమనార్హం. తక్కువలో తక్కువ కొందరు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు వెనకేసుకున్నట్లు అనుచరులే చర్చించుకుంటున్నారు. సొంత మనుషులు, ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులను పెట్టి పంపకాలు చేసినప్పటికీ కొన్ని వార్డుల్లో సగం మంది ఓటర్లకు చేరలేదన్న అభిప్రాయానికి అభ్యర్థి కూడా వచ్చారు. గత ఎన్నికల్లో అభ్యర్థికి బాగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో కూడా పూర్తి శాతం ఓటర్లకు డబ్బు చేరలేదు. ఆర్థికపరమైన అంశాల్లో అభ్యర్థి వ్యవహార శైలినచ్చక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు డ బ్బు పంపకాలకు కూడా అలకవహించడంతో తన గె లుపుపై ప్రభావం పడుతుందేమోనని అభ్యర్థి మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని వార్డుల్లో డబ్బుల పంపిణీ బాధ్యతను కేబుల్ ఆపరేటర్ల ద్వారా చేయించారు. ఆయా ప్రాంతాల్లో కూడా కొంత డబ్బును పంపకందారులు వెనకేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. -
ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయం
● బడుగు, బలహీన వర్గాలంతా జగనన్న వెంటే ● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం. సుభాష్ చంద్రబోస్ కర్నూలు(అర్బన్): సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం సుభాష్ చంద్రబోస్ అన్నారు. శనివారం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర బడుగు, బలహీన వర్గాలంతా వైఎస్ జగన్కు మద్దతుగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే తమకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆయా వర్గాల్లో గట్టి నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ జగనన్న సంక్షేమ పథకాలు అందాయని, ఆయా పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ను చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ఆశీస్సులతో గత ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించనున్నారన్నారు. చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన మోసపూరిత హామీలను ప్రజలెవరు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీతో కూడిన మతోన్మాద కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కూటమి ఎన్ని కుట్రలు చేసినా, ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి జూన్ 4వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తుల లక్ష్మికాంతయ్య, కే నాగేశ్వరమ్మ, చంద్రకళాబాయి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కర్నూలు: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో అక్రమంగా తరలిస్తు న్న మద్యం పట్టుబడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు సెబ్ స్టేషన్ సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రెహనా బేగం, మారుతీ ప్ర సాద్ తమ సిబ్బందితో శనివారం కల్లూ రు మండలం ఉలిందకొండ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. కర్నూలు వైపు నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఆపి తనిఖీ చేయగా 144 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన కేశల్ నా యుడు, సీఎం మధు, శ్రీరాముడులను అదుపులోకి తీసుకుని విచారించగా కర్నూలులోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి రామళ్లకోటకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి మద్యంతో పాటు వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కర్ణాటక మద్యం స్వాధీనం ఆలూరు రూరల్: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 9 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆలూరు సెబ్ సీఐ సోమశేఖర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చిన సమాచారం మేరకు ఆస్పరి మండలంలోని కర్నూలు–బళ్లారి రహదారిలో ఉన్న రైల్వే గేటు వద్ద వాహన తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన దశరథ రామయ్య, యువరాజులు బజాజ్ ఆటోలో 9 బాక్సులు కర్ణాటక మద్యం తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి ఆటో సీజ్ చేశామని చెప్పారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చగా న్యామమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు వెల్లడించారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాసులు, నాగరాజు పాల్గొన్నారు. -
బస్సు కింద నలిగిన మెకానిక్
కర్నూలు : కర్నూలు ఆర్టీసీ డిపో–2లో కాంట్రాక్ట్ పద్ధతిపై అసిస్టెంట్ మెకానిక్గా పనిచేస్తున్న పుల్లూరు రమేష్ (43) బస్సు కింద నలిగి మృతిచెందాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన రమేష్కు ఇంకా వివాహం కాలేదు. శనివారం మధ్యాహ్నం 2 డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లిఫ్ట్ చేసిన హైడ్రాలిక్ జాక్ జారింది. దీంతో బస్సు రమేష్పై పడి నలిగిపోయాడు. అతనిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. డిపోలో బస్సు రిపేర్ చేస్తుండగా హైడ్రాలిక్ జాక్ జారి తన తమ్ముడు చనిపోయినట్లు అన్న పుల్లూరు వెంకట నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
జనహోరుచివరి రోజు ప్రచారం ఊరూవాడా హోరెత్తింది. భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి అభ్యర్థులు ఓటు అభ్యర్థించారు. గెలిస్తే ఎలాంటి పనులు చేస్తామో స్పష్టంగా వివరించారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, అర్హతే ప్రామాణికంగా ఇంటింటికీ అందిన సంక్షేమాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. తమను గెలిపిస్తే ఇంతకంటే మిన్నగా సంక్షేమాన్ని అందిస్తామని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థుల ప్రచారానికి అన్ని చోట్లా విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ జెండాలతో కార్యకర్తలు కదంతొక్కారు. ఫ్యాన్ గుర్తును చూపిస్తూ పార్టీ నాయకులు ఓటు వేయాలని కోరారు. –సాక్షినెట్వర్క్ -
శుద్ధ జలాన్ని అందించి.. పల్లె దాహార్తి తీర్చి..
డోన్: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమై.. మౌలిక వసతులు లేక డోన్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో మగ్గిపోయారు. తాగు నీటి వనరులు లేకపోవడంతో ఏటా వేసవిలో పల్లెల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు మంత్రి బుగ్గన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టారు. ఇప్పటికే బేతంచెర్ల మండల పరిధిలోని అన్ని గ్రామాలకు గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా నీటిని బుగ్గానిపల్లె పంప్హౌస్కు మళ్లించి అక్కడ శుద్ధిచేసిన తర్వాత ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. మరో రెండు నెలల్లో డోన్, ప్యాపిలి మండలాల్లోని అన్ని గ్రామాలతో పాటు పట్టణాలకు వాటర్గ్రిడ్ నుంచి శుద్ధజలం అందే అవకాశం ఉంది. ఇప్పటికే నంద్యాల వాటర్ స్కీంను పునరుద్ధరించి ప్యాపిలి మండలంలోని అనేక గ్రామాలకు మంచినీరు అందిస్తున్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మంచినీటి ఎద్దడి ఎదురుకాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సహకారంతో ఆర్థిక మంత్రి బుగ్గన విశేష కృషి చేశారని చెప్పవచ్చు. బుగ్గానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన పంప్హౌస్ -
ఓంకారం గర్భాలయంలోకి నాగుపాము
మహానంది: బండిఆత్మకూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓంకారం గర్భాలయంలోకి నాగుపాము వెళ్లింది. సిద్ధేశ్వరస్వామి లింగాన్ని తాకి చుట్టేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రదోషకాలంలో ఈ సంఘటన జరగడం విశేషమని ఆలయ అర్చకుడు చక్రపాణి తెలిపారు. గంటలతో శబ్దం చేయగా బయటికి వెళ్లిందని, కోనేరు వైపు నుంచి గర్భాలయంలోకి వచ్చినట్లు చెప్పారు. పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు కర్నూలు(సెంట్రల్): రేపు పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్జి.సృజన ఆదేశించారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ఎంపీడీఓలు, నోడల్, సెక్టార్ అధికారులతో శనివారం ఉదయం ఆమె టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈవీఎంల ఫస్టు లెవల్ చెకింగ్తో పనిచేయని వాటిని కమిషనింగ్ చేసి తీసివేశామని, ఈసారి ఈవీఎంల మార్పులు ఉండకపోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయితే రీప్లేస్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డిస్పాచ్ సెంటర్ల దగ్గర ఈవీఎం మెషిన్ల డెమాన్స్ట్రేషన్కు సంబంధించిన కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు బెల్ ఇంజినీర్లను నియమించామని, ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే 15–20నిమిషాల మధ్యలో వారుపరిష్కరిస్తారన్నారు. కరెంట్పోతే వెలుతురు కోసం రీచార్జ్ బ్యాటరీలను అందుబాటులో ఉంచాలన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై దండోరాలు వేయించాలన్నారు. ఆర్వోలు, పోలీసులు.. శాంతి భద్రతలపై సమీక్షించుకొని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే వారిని వెంటనే అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో ఆర్వోలు నారపురెడ్డి మౌర్య, భార్గవ్తేజ, శివ్నారాయణ్ శర్మ, ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మీ, చిరంజీవి, మురళీ, రాము నాయక్ పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులకు వేసవి ఉపశమనం ● చలువ అద్దాలు, కూల్ వాటర్ బాటిల్స్, వైట్ హెల్మెట్లను అందజేసిన ఎస్పీ కర్నూలు: వేసవిలో ఉపశమనం కలిగించేందుకు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి చలువ అద్దాలు, కూల్ వాటర్ బాటిల్స్, వైట్ హెల్మెట్లను ఎస్పీ కృష్ణకాంత్ అందజేశారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ సీఐ గౌతమి, వివిధ హోదాల్లోని ట్రాఫిక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్ట ఏర్పాట్లు
కర్నూలు (అర్బన్): రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిసెప్షన్ సెంటర్లో సరిపడా కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లకు చేర్చేందుకు గాను అవసరమైన హమాలీలను 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 50 మందికి హమాలీలను ఇస్తామని, వారికి ప్రత్యేక టీ షర్ట్స్ అందజేయాలని, అవసరాన్ని బట్టి ఇంకొంత మందిని గుర్తించి ఇంకొక బ్యాచ్గా తయారు చేసి ప్రత్యామ్నాయంగా ఉండేలా చూడాలని సివిల్ సప్లయిస్ డీఎం, కార్మిక శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఇంజినీరింగ్ బ్లాక్కు హౌసింగ్ పీడీ, లైఫ్ సైన్సెస్ బ్లాక్స్కు మైనార్టీ అధికారి, లైబ్రరీ బ్లాక్కు మెప్మా పీడీని స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జిలుగా ఉంటూ వచ్చే ఈవీఎంలు అన్ని సరైన ప్రదేశంలో ఉంచారా లేదా? సరైన డాక్యుమెంటేషన్ ఉన్నాయా లేదా? సీల్ వేయాల్సిన చోట వేశారా లేదా అని పరిశీలిస్తూ ఆర్ఓలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలన్నారు. విద్యుత్ అంతరాయం ఉండకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్లో ఒక టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. రిసెప్షన్ సెంటర్కు వచ్చే బస్సులు మధ్యలో ఆగకుండా నేరుగా పార్కింగ్ దగ్గర నిలిచేలా చూడాలని ఆర్అండ్బీ ఎస్ఈ, అదనపు ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎక్కడైతే మైక్రో అబ్జర్వర్, ప్రెసిడింగ్ ఆఫీసర్స్ ఉంటారో అక్కడ పాటించాల్సిన నియమ నిబంధనలను పోలీసు అధికారులకు తెలియజేస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రిసెప్షన్ సెంటర్ వద్ద సరిపడా విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి బస్సులు వస్తాయి కాబట్టి ఒకవేళ వర్షం పడి బురదలో బస్సు ఇరుక్కున్నా తీసేందుకు జేసీబీని కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగరాజు, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, సీపీఓ హిమ ప్రభాకర్ రాజు, జిల్లాపరిషత్ సీఈఓ నాసరరెడ్డి, డీపీఓ నాగరాజు నాయుడు, సివిల్ సప్లయ్ డీఎం షర్మిల, డీఎస్ఓ మూర్తి, హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, డీటీసీ శ్రీధర్, ఎంప్లాయ్మెంట్ అధికారి దీప్తి, ఏపీఐఐసీ జడ్ఎం సోమశేఖర్రెడ్డి, మెప్మా పీడీ నాగశివలీల, మైనార్టీ సంక్షేమ అధికారి సునిల్ ఖన్నా, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆర్టీసీ అధికారి శ్రీనివాసులు, డీఈఓ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన -
అభివృద్ధికి ఓటు వేయండి
దేవనకొండ: వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ తెర్నేకల్ సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం తెర్నేకల్ గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన, జగనన్న చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాల దరికి చేర్చారన్నారు. సచివాలయ, వలంటరీ వ్యవస్థల ద్వారా ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారన్నారు. 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతానికి పైగా అమలు పరిచిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను మభ్య పెడుతున్నాడన్నారు. అబద్ధాల బాబును నమ్మొద్దని, ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి బి.విరూపాక్షిని, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో తెర్నేకల్ సర్పంచ్ అరుణ్కుమార్, నాయకులు లుమాంబ, చాప ఈరన్న తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నే సీఎం కావాలి వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ తెర్నేకల్ సురేంద్రరెడ్డి -
రేపు స్థానిక సెలవు
● జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు (సెంట్రల్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 13న జిల్లా వ్యాప్తంగా స్థానిక సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహణ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, స్థానిక సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలకు లోకల్ హాలిడేగా ప్రకటించడమైనదని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే అన్ని పబ్లిక్, ప్రైవేటు, ఫర్మ్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థలు, బ్యాంకులకు కూడా స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను సంబంధిత అధికారులు తు.చ. తప్పక అమలయ్యేలా చర్యలు చేపట్టి ఓటింగ్ ప్రక్రియను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. కార్మికులకు సెలవు కర్నూలు(అర్బన్): పోలింగ్ జరగనున్న మే 13వ తేదీన వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ కే వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చీఫ్ ఇన్ప్పెక్టర్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం మేరకు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 135బీ(1) ప్రకారం సెలవు మంజూరు చేసినందున ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల వేతనాల్లో కోత విధించరాదని తెలిపారు. జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వారి ఓటు తెలంగాణ రాష్ట్రంలో నమోదై ఉంటే వారికి కూడా వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన యజమానులు జరిమానాతో పాటు శిక్షకు గురి కావాల్సి వస్తుందన్నారు. -
పోలింగ్ వేళ.. నియమావళి ఇలా..
కర్నూలు(సెంట్రల్): సజావుగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. మరో 24 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాటించాల్సిన నియమావళిపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈ నియమావళిని విధిగా పాటించాలని సూచించింది. అలాగే పీఓ, ఏపీఓలు సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. ● పోలింగ్ సమయంలో ఏదైనా వివాదం తలెత్తితే అన్ని పక్షాలతో నిష్పాక్షికంగా, సమానంగా వ్యవహరించాలి. న్యాయాన్ని జరపాలి. కానీ, ఇతర ఏ అధికారి కానీ, ఏ ఒక్క అభ్యర్థి ఎన్నికకు సహాయం చేస్తున్న భావనను కలగనీయకూడదు. ● ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర అధికారులు హోదాకు తగ్గ హుందాతనాన్ని, గౌరవనీయమైన ప్రవర్తనను ప్రదర్శించాలి. వృత్తి ధర్మంలో ఉన్న అధికారి చేయకూడని పనులేవీ చేయకూడదు. ఎవరైనా ప్రముఖులు ఓటు వేయాటానికి వస్తే, వారితో కరచాలనం చేయటం, ఫొటోలు దిగటం వంటి పనులు చేయకూడదు. ఓటరుతో వ్యవహరించినట్టే, వీఐపీలతో కూడా అలాగే వ్యవహరించాలి. ప్రచార నిషేధాలు పోలింగ్ స్టేషన్కు వందమీటర్ల పరిధిలో ప్రచారం చేయడం చట్ట ప్రకారం నిషిద్ధం. ఎవరైనా ప్రచారం చేస్తుంటే వారిని వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని 130వ సెక్షన్ ప్రకారం వారిపై హైకోర్టులో కేసు వేయవచ్చు. అభ్యర్థుల ఎన్నికల బూత్ పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల దూరంలో అభ్యర్థులు తమ బూత్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ బూత్లలో ఓటర్లు, ఓటర్ల జాబితాలో తమ పేరు గుర్తించేందుకు సహాయం చేయవచ్చు. వారు ఒక టేబుల్, రెండు కుర్చీలను వేసుకుని ఓటర్లకు సహాయం చేయవచ్చు. పెద్ద గొడుగు, లేక టార్పాలిన్లతో డేరా వేసుకోవచ్చు. కానీ ఈ టేబుళ్ల చుట్టూ పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడనీయకూడదు. నిబంధనల ఉల్లంఘన దృష్టికి వస్తే, సెక్టర్ న్యాయమూర్తికి లేదా లా – ఆర్డర్ చూసే అధికారికి సమాచారాన్ని అందించాలి. వెంటనే న్యాయ వ్యవస్థకు బాధ్యత వహించే అధికారులు తగిన చర్యలు చేపడతారు. అల్లరి మూకలపై చర్యలు ● ఎవరైనా చట్టాన్ని ఉల్లఘించినా, నియమాలను పాటించకున్నా పోలింగ్ స్టేషన్ నుంచి పోలీసుల ద్వారా అటువంటి వారిని తొలగించే హక్కు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 లోని 132వ సెక్షన్ ద్వారా లభిస్తుంది. ఎలక్షన్ అధికారులు విధుల్లో విఫలమైతే.. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951, 134 సెక్షన్ ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ పోలింగ్ ఆఫీసర్ కానీ తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైతే అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. ఆయుధాలు ధరించి వచ్చినా, సంచరించినా జైలుశిక్ష రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951, 134బి సెక్షన్ ప్రకారం, రిటర్నింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలీసు ఆఫీసర్లు, శాంతి భద్రతలను కాపాడాల్సిన వారు తప్ప ఇతరులెవరూ ఆయుధాలతో పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు ఆర్మ్ఏక్ట్ 1959 ప్రకారం రాకూడదు. ఎవరైనా ఈ నియమావళిని ఉల్లంఘిస్తే వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించటం జరుగుతుంది. ఫోన్ల వాడకం నిషేధం కమిషన్ నిబంధనల ప్రకారం సెల్ఫోన్లు, కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లను పోలింగ్ స్టేషన్లలోనే కాదు, పోలింగ్స్టేషన్కు 100 మీటర్ల పరిధిలోకి తీసుకురాకూడదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అరెస్టు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని 131 సెక్షన్ ప్రకారం చట్టాన్ని అమలు పరచాలి. ఎవరైనా క్రమశిక్షణా రాహిత్యంతో ప్రవర్తిస్తే వారిని అరెస్టు చేసి చట్టబద్దమైన చర్యలు తీసుకునే అధికారం పోలీసులకుంటుంది. అవసరమైతే, క్రమశిక్షణను అమలు పరిచేందుకు పోలీసులు బలప్రయోగం చేయవచ్చు. అయితే బలప్రయోగం చేసే ముందు, నచ్చజెప్పటం, చర్చల వంటి చర్యల ద్వారా శాంతి నెలకొల్పే ప్రయత్నాలు చేయాలి. ఇవి విఫలమైతేనే బలప్రయోగం చేయాలి. మెగాఫోన్, లౌడ్స్వీకర్ల వాడకం ద్వారా పోలింగ్ స్టేషన్ పనికి ఇబ్బంది కలిగితే వాటి వాడకం ఆపేయాలి. లౌడ్ స్పీకర్లు ఎంత దూరంలో ఉండాలన్నది ప్రిసైడింగ్ ఆఫీసర్ విచక్షణను ఉపయోగించి నిర్ణయించాలి. సజావుగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చర్యలు పోలింగ్ రోజు పాటించాల్సిన నియమావలిపై మార్గదర్శకాలు జారీ పోలింగ్ స్టేషన్ లోపల, పరిసర ప్రాంతాల్లో పక్కాగా నిబంధనలు అమలు పీఓ, ఏపీఓలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశం అక్రమంగా వాహనాల్లో ఓటర్లను తరలించరాదు ఓటర్లను అక్రమంగా వాహనాల్లో పోలింగ్ స్టేషన్కు తీసుకువచ్చి..తీసుకెళ్లరాదు.దీనిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1953, 133వ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. లేదా, అభ్యర్థికి వ్యతిరేకంగా ఎలక్షన్ పిటీషన్ను నమోదు చేయవచ్చని తెలపండి. అలాగే పోలింగ్ స్టేషన్ నుంచి ఓటింగ్ యంత్రాన్ని తొలగించడం నేరం ఎవరైనా పోలింగ్ స్టేషన్ నుంచి అనుమతి లేకుండా, అక్రమంగా ఓటింగ్ యంత్రాన్ని తొలగించాలని ప్రయత్నించినా, అలా ప్రయత్నించే వారికి సహాయం చేసినా చట్టరీత్యా అది నేరం. అటువంటి వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, లేదా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
‘టీడీపీ దొంగ’ ప్లాన్
● సైక్లింగ్ పద్ధతిలో దొంగ ఓట్లకు స్కెచ్ ● ఇంకు సిరాను తుడిపేందుకు ‘టిన్నర్’ ● కాంట్రాక్టు వర్క్స్ బిల్లుల పేరుతో వారి ఖాతాలకు నగదు జమ ● కాంట్రాక్టర్ల చేతుల మీదుగా దొంగ ఓటర్లకు డబ్బు పంపిణీ ● కర్నూలులో కొనసాగుతున్న ప్రలోభాలు కర్నూలు: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో టీటీపీ అడ్డదారులు వెతుకుతోంది. ఓటరు తీర్పుకు కొన్ని గంటలే ఉండడంతో సమయం లేదు మిత్రమా.. పంపకాలను పూర్తి చేయండి.. దొంగ ఓట్లకు ప్లాన్ చేయండంటూ కర్నూలు టీడీపీ అభ్యర్థి వారి శ్రేణులను అలెర్ట్ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో తండ్రీ కొడుకులు బిజీబిజీగా ఉంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని గత ఎన్నికల్లో తనకు పోలైన ఓట్లు ఎన్ని? ఏ ప్రాంతంలో తగ్గాయో బేరీజు వేసుకుని అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా డబ్బుల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. ఎలా చేస్తే గెలుస్తాననే అంశాలపై కసరత్తు చేసి చివరి అంకం విజయవంతంగా పూర్తి చేసేందుకు శ్రేణులతో చర్చలు జరిపి ఓటు బ్యాంకును పదిలపరచుకునే విధంగా బీజేపీ నేత తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. ప్రచారానికి తెర పడడంతో మిగిలిన ఒక్క రోజును సద్వినియోగం చేసుకునేలా అసలైన మంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. అనుకూలమైన వార్డుల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా చూడడంతో పాటు వీలైనన్ని ఎక్కువ ఓట్లు తనకు పడేలా చూడాలని శ్రేణులకు ఆదేశాలు ఇస్తూ కొత్త ఓటర్లతో పాటు మహిళా ఓటర్లను సంపాదించేలా ఫ్యాక్టరీ ఉద్యోగులను వార్డుల వారీగా తిప్పుతున్నారు. చక్రం తిప్పుతున్న కాంట్రాక్టు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ అభ్యర్థి ఫ్యాక్టరీలో కాంట్రాక్టు డిపార్ట్మెంట్లో హెచ్ఓడీగా వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి దొంగ ఓటర్లకు నగదు పంపిణీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈయన కర్నూలులోనే నివాసముంటున్నాడు. అభ్యర్థికి చెందిన పరిశ్రమల్లో సుమారు 40 మందికి పైగా కాంట్రాక్టర్లు ఉన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రూమెంట్స్, కార్పెంటర్ తదితర విభాగాలకు చెందిన పనులను కూలీల ద్వారా ఆయా కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. వారి కింద బిహార్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిశ్రమలకు సమీప గ్రామాలకు చెందిన కూలీలు ఆయా కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారందరినీ కర్నూలులో దొంగ ఓటర్లుగా నమోదు చేయించి కాంట్రాక్టు వర్క్స్ బిల్లుల పేరుతో వారి ఖాతాలకు నగదు జమ చేశారు. కాంట్రాక్టర్ల ద్వారా దొంగ ఓటర్లకు డబ్బు పంపిణీ పూర్తి చేశారు. గొందిపర్ల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడుతో పాటు కర్నూలు చిరంజీవి పార్కు దగ్గర నివాసముంటున్న మరో కాంట్రాక్టర్ ఖాతాల్లో దొంగ ఓటర్ల డబ్బులు ఆన్లైన్లో జమ చేసినట్లు అభ్యర్థి అనుచరులు చర్చించుకుంటున్నారు. అన్ని దారులూ అన్వేషిస్తూ... ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ అభ్యర్థి అన్ని దారులు అన్వేషిస్తున్నారు. పోలింగ్ రోజు చేయాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించి బూత్ ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేసుకున్నాడు. పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గంలో ఓటు అడిగేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పోలింగ్ సరళిని గమనించేందుకు వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసుకుని పావులు కదుపుతున్నారు. సైక్లింగ్ పద్ధతిలో ఓటు వేయించేందుకు ప్రణాళిక దొంగ ఓటర్ల ద్వారా సైక్లింగ్ పద్ధతిలో ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ అభ్యర్థి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. కర్నూలు తుంగభద్ర నది తీర కాలనీల్లో పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది నివాసముంటున్నారు. సంకల్బాగ్తో పాటు ధర్మపేట, కొత్తపేట, బాలాజీ నగర్, సీతారాం నగర్ ప్రాంతాల్లో దొంగ ఓటర్లను నమోదు చేయించినట్లు అభ్యర్థి అనుచరులు చర్చించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సైక్లింగ్ పద్ధతిలో ఒక్కొక్కరూ రెండు మూడు ఓట్లు వేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దొంగ ఓట్లను నిరోధించేందుకు ఓటరు చూపుడు వేలుకు పోలింగ్ సిబ్బంది ఇంకు సిరా పూస్తారు. అయితే దానిని తుడిపేసుకుని పలుమార్లు ఓటు వేసే విధంగా లిక్విడ్ తరహాలో ఉన్న టిన్నర్ సీసాలను దొంగ ఓటర్లకు తర్ఫీదునిచ్చి పోలింగ్లో పాల్గొనేందుకు సిద్ధం చేసినట్లు ఆయన అనుచరులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉంటూ పోల్ మేనేజ్మెంట్ చేపట్టాలని అంతర్గత సమావేశంలో చర్చించినట్లు సమాచారం. -
వన్యప్రాణి మాంసం విక్రేతల అరెస్ట్
మహానంది: మహానంది సమీపంలోని నల్లమల అడవిలో ఇటీవల వన్యప్రాణి మాంసం తరలిస్తున్న ఐదుగురిని అటవీశాఖ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు. నిందితుల్లో మహానందికి చెందిన శ్రీకాంత్, గుంటన్న, బయ్యన్న, కార్తీక్, సిద్ధయ్య ఉన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు డీఆర్ఓ హైమావతి తెలిపారు. ఇదిలా ఉండగా తమను మాత్రమే అరెస్ట్ చేసి ఒకరిని వదిలేశారని, పట్టుబడిన వారు, వారి బంధువులు మహానందిలో ఆందోళనకు దిగారు. ఐదుగురిని తరలిస్తున్న అటవీశాఖ జీపును అడ్డుకుని నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులు, పట్టుబడిన వారి బంధువుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఎఫ్ఆర్ఓ దినేష్కుమార్రెడ్డి, సిబ్బంది విచారణ చేశారు. నేరానికి పాల్పడినవారిని మాత్రమే పట్టుకున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. ఒకరిని తప్పించారని పట్టుబడిన వారి బంధువుల ఆందోళన అటవీశాఖ అధికారుల జీపును అడ్డుకుని నిరసన
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement