-
తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
తాడిపత్రి/తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలింగ్ నాడు మొదలైన పచ్చ ముఠా హింసాకాండ మంగళవారమూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా కొనసాగింది.. సోమవారం పోలింగ్ సందర్భంగా దాడులకు దిగిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు.. మంగళవారమూ తాడిపత్రిలో రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు దిగి ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ దాడిలో గాయపడిన కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై రాళ్ల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి రాళ్ల దాడి చేశారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులూ ప్రతిఘటనకు దిగాయి. రెండు పార్టీల కార్యకర్తలూ పరస్పరం రాళ్ల దాడికి పాల్పడడంతో తాడిపత్రి రణరంగాన్ని తలపించింది. అడ్డొచ్చిన పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. తాడిపత్రి అర్బన్ సీఐ మురళీకృష్ణ తలకు రాయి తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. బరి తెగించిన టీడీపీ కార్యకర్తలు తాడిపత్రి పట్టణంలోని గానుగవీధికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సంజీవ సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా 230వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున ఏజెంటుగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీడీపీ నాయకుడు సూర్యముని తన వర్గీయులు భాను, కిరణ్, అశోక్, వేణు మరికొందరితో కలిసి సంజీవపై దాడి చేశారు. అతని ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా అతని మిక్చర్ బండినీ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సంజీవ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద పెద్దఎత్తున గుమిగూడిన టీడీపీ అల్లరి మూకలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కాన్వాయ్పై దాడులకు పాల్పడ్డాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన టీడీపీ అల్లరి మూకలు పోలీసులపైనా రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తాడిపత్రి అర్బన్ సీఐ మురళీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ గూండాగిరి దాడి విషయం తెలుసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది తన అనుచరులతో టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి తన అనుచరులను వెంటేసుకుని సీబీ రోడ్డులో భయానక వాతావరణం సృష్టిస్తూ వస్తుండగా..పోలీసు బలగాలు అడ్డుకున్నా, ఫలితం లేకపోవడంతో పోలీసులు వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. ఆ తర్వాత ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో పుట్లూరు రోడ్డు గుండా సంజీవనగర్ మీదుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో తన ఇంటి ముందున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిద్ధంగా ఉంచుకున్న ట్రాక్టర్లలోని రాళ్లతో టీడీపీ వర్గీయులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపైకి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే నివాసాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. ఈ చర్యతో ఆ ప్రాంతంలోని వారందరూ ఇళ్లకు తలుపులేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఐదు వేల మందికి పైగా జేసీ అనుచరులు గుమిగూడి ఉండడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా వారు వినకుండా ఎస్పీ అమిత్ బర్దర్, డీఎస్పీ గంగయ్య, బీఎస్ఎఫ్ బలగాలపై ఊహించని రీతిలో ఒక్కసారిగా రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడి చేస్తూ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు సైతం పరుగెత్తాల్సివచ్చి0ది. చివరకు ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోగా.. జేసీ అనుచరులు ఒక్కసారిగా నాగాలాండ్ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ బలగాలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ జవానుల్లో ఒకరి కంటికి తీవ్ర గాయమైంది. జేసీ అనుచరులు విచక్షణ కోల్పోయి దాడులకు దిగడంతో ఎస్పీ అమిత్బర్దర్, డీఎస్పీ గంగయ్య, పోలీసులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతటితో ఆగని అల్లరి మూకలు మరింత రెచ్చిపోయి బాణా సంచాకు నిప్పు పెట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి వైపు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన ఎస్పీ పెద్దఎత్తున అదనపు పోలీసు బలగాలను రప్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ షేముíÙతో పాటు కర్నూలు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, ట్రైనీ ఎస్పీలు తాడిపత్రికి చేరుకుని భద్రతను సమీక్షించారు. ఆయా జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.పోలీసుల వైఫల్యమే కారణం రెండు రోజులుగా తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు పోలీసుల వైఫల్యమే కారణమని తెలుస్తోంది. తాడిపత్రి అసలే సమస్యాత్మక ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్నికల బందోబస్తు నిమిత్తం వచ్చిన బలగాలను మంగళవారం ఉదయమే పంపేశారు. దాడులు జరుగుతాయని ముందస్తుగా పసిగట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. పోలీసు బలగాలను పట్టణంలో అలాగే ఉంచి ఉంటే మంగళవారం ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. టీడీపీ వర్గీయుల పట్ల పోలీసులు అవలంబిస్తున్న మెతకవైఖరే అందుకు కారణమన్న బలమైన విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు
కంబదూరు/పెదవేగి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి వైఎస్సార్సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు. -
రెక్కమానులో రచ్చ
గాండ్లపెంట: కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం రెక్కమాను పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం మధ్యాహ్నం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 174వ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 1,445 మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 2 గంటల సమయానికి 600 ఓట్లు పోలయ్యాయి. అయితే వైఎస్సార్సీపీకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయనే ఉద్దేశంతో మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేశారు. సముదాయించబోయిన వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. దీంతో స్వీయ రక్షణలో భాగంగా ప్రతి దాడులు చోటు చేసుకున్నాయి. ఒకరికి రక్తగాయాలయ్యాయి. -
కోనుప్పలపాడులో రాళ్లతో దాడి
యాడికి: మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఉదయం నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఎక్కువగా ఓటింగ్కు వస్తుండడం గమనించిన టీడీపీ సర్పంచ్ లక్ష్మీదేవి భర్త రామాంజనేయులు కుట్రలకు తెరలేపాడు. అదే గ్రామానికి చెందిన జేసీ ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత చవ్వా గోపాల్రెడ్డి ద్వారా నంద్యాల జిల్లా బూరుగుల గ్రామానికి చెందిన పది మంది అనుచరులను ఆటోలో రప్పించుకుని రిగ్గింగ్కు ఎత్తుగడ వేశారు. విషయాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ నేత బాలగంగయ్య, తన అనుచరులతో కలసి వారిని అడ్డుకున్నారు. అప్పటికే రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉన్న చవ్వా గోపాల్రెడ్డి అనుచరులు 70 మంది ఒక్కసారిగా వైఎస్సార్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఘటనలో గంపిరెడ్డి, మంగల చంద్ర, బాలకృష్ణతో పాటు ఇంటి బయట కూర్చొని ఉన్న కోనా వెంకటశివారెడ్డి తల్లి కోనా వెంకటనారాయణమ్మపై రాళ్లు పడడంతో తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న జెడ్పీ మాజీ సభ్యుడు వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు బాలా రమేష్బాబు, భోగాతి బ్రహ్మానందారెడ్డి కోనుప్పలపాడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
తనకల్లులో మూకుమ్మడి దాడి
తనకల్లు: కదిరి నియోజకవర్గం తనకల్లు పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపల్లిలో 1,110 ఓటర్లు కలిగిన 255వ పోలింగ్ కేంద్రం వద్ద మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్రిక్తత నెలకొంది. రాచువారిపల్లికి చెందిన ఓటరు దేశాయి గౌతంరెడ్డి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. ఆ సమయంలో క్యూలైన్ అడ్డదిడ్డంగా ఉండడంతో సక్రమంగా వెళ్లాలని ఆయన సూచించారు. అయితే అప్పటికే ఓటమి భయంతో చిరాకుతో ఉన్న టీడీపీ నాయకులు... గౌతంరెడ్డిపై మూకుమ్మడిగా కలబడ్డారు. మా ఊళ్లోకి వచ్చి నీవెవరు చెప్పడానికంటూ చేతికి అందిన రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. దాడిలో గౌతంరెడ్డి కారు ధ్వంసమైంది.ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో ధ్వంసమైన కారు -
No Headline
ఉత్సాహంగా ఓటింగ్..ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు నెలలపాటు నిప్పులు కురిపించిన సూరీడు శాంతించాడు. వాతావరణం చల్లగా మారింది. ఐదేళ్లకొకసారి వచ్చే అతిపెద్ద ఎన్నికల పండుగకు ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం ఆరుగంటల నుంచే పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేశారు. ఈసారి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నూతన ఓటర్లు, సాధారణ ఓటర్లు అందరూ బాధ్యతగా కదిలారు. ఊతకర్ర చేతపట్టి కొందరు.. శక్తిని కూడదీసుకుని ఇతరుల సహాయంతో మరికొందరు.. వీల్చైర్లు.. మూడుచక్రాల సైకిళ్లపై ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కదిలొచ్చారు. ఓటు విలువను గుర్తెరిగి మన భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వారు ఎవరో నిర్ణయించుకుని ఓటు వేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తమ మదిలో ముద్రితమైన అభ్యర్థి–పార్టీకి ఈవీఎంపై బటన్ నొక్కారు. – సాక్షి బృందం -
కదిలొచ్చిన మహిళాలోకం...
●వృద్ధులు, యువత కూడా ●చల్లని ‘గాలి’కి సంకేతమే(నా)!సాక్షి,అనంతపురం: ఓటు హక్కు వినియోగించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గంటల తరబడి క్యూలలో ఓపిగ్గా వేచి ఉండి మరీ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. వృద్ధులు, యువత కూడా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం కనిపించింది. ‘గాలి’ ప్రచండమే(నా).. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. అన్ని పథకాల్ల్లోనూ అగ్ర తాంబూలం ఇచ్చారు. నామినేటెడ్ పదవులనూ అక్కచెల్లెమ్మలకే పెద్ద సంఖ్యలో కట్టబెట్టారు. వైఎస్సార్ చేయూత, అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా తదితర పథకాలతో అండగా నిలిచారు. దీంతో పాటు బ్యాంకుల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు అందేలా చర్యలు తీసుకుని చేయూత అందించారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని కుచ్చుటోపీ పెడితే, జగన్ అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ చేసి మాట నిలుపుకున్నారు. అక్కచెల్లెమ్మలకు సంతోషం పంచారు. మహిళా పక్షపాతిగా నిలిచి జేజేలు అందుకున్నారు. అలాగే, వృద్ధులకు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్ మొత్తాన్ని పెంచి, వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దకే వెళ్లి డబ్బు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జరిగిన ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకోవడం చూస్తే ‘ఫ్యాను’ గాలి బలంగా వీచే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
యర్రగుంటలో ఏజెంట్పై దాడి
కళ్యాణదుర్గం: కుందుర్పి మండలం యర్రగుంట పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీకి అత్యధికంగా ఓట్లు పోలవుతున్నాయన్న అక్కసుతో ఆ పార్టీ ఏజెంట్ కేవీ మంజునాథ్పై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఉదయం నుంచి వరుసగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఎక్కువగా ఓటింగ్కు వచ్చారు. విషయాన్ని గమనించిన టీడీపీ నేత ఆనంద్కుమార్ ఎలాంటి పాస్ లేకుండానే పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లాడు. ఆ సమయంలో అభ్యంతరం తెలిపిన మంజునాథ్ను దుర్భాషలాడుతూ కేంద్రం నుంచి బయటకు లాక్కొచ్చాడు. అనంతరం అక్కడే ఉన్న టీడీపీ నాయకులు యశోదప్ప, అజయ్, రఘు, గౌసి, లక్ష్మన్న, రంగస్వామి, రాజప్పతో కలసి మంజునాథ్పై మూకుమ్మడి దాడి చేశారు. రోడ్డు పక్కన ఉన్న డ్రెయినేజీలోకి పడేసి తొక్కారు. గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకునేసరికి పారిపోయారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ బి.శ్రీనివాసులు ప్రత్యేక పోలీసు బలగాలను పంపించారు. బాధితుడిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పరామర్శించారు. -
ఓట్ల పండుగ... రంగవల్లుల ముచ్చట
అనంతపురం అర్బన్: ఏడు నెలల ముందుగానే జిల్లాలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన జిల్లా వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణాలు, గ్రామాల్లో సందడి నెలకొంది. కనువిందు చేసే ముగ్గులతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ జిల్లా అధికారులు సైతం ఈ సారి వైవిధ్యాన్ని కనబరిచారు. ఇప్పటికే జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి ఆలోచనతో జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల మస్కట్ను రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వి.వినోద్కుమార్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణాన్ని కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద రంగవల్లులతో ఆకట్టుకున్నారు. నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం ప్రవేశ మార్గం వద్ద ‘ఓట్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అంటూ వేసిన రంగవల్లి చూపరులను ఆకట్టుకుంది. పలు మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వేసవితాపం బాగా తగ్గిపోయింది. రాయదుర్గం, గుడిబండ, కళ్యాణదుర్గం, మడకశిర, గుంతకల్లులో 30 నుంచి 40 మి.మీ, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, కంబదూరు, వజ్రకరూరు, కదిరిలో 20 నుంచి 25 మి.మీ, డి.హీరేహాల్, కణేకల్లు, యాడికి, ఆత్మకూరు, బుక్కపట్నం, తలుపుల, అమరాపురం, కనగానపల్లి, ముదిగుబ్బ తదితర మండలాల్లో 10 మి.మీ పైగా వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అస్మిత్ హౌస్ అరెస్ట్ తాడిపత్రి అర్బన్: పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు హర్షవర్దన్రెడ్డి, సాయిప్రతాపరెడ్డిని వారి నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు. అలాగే టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి, సోదరుడు జేసీ పవన్, ఎమ్మెల్సీ దీపక్రెడ్డిలనూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వీరిని విడిచిపెట్టారు. -
వ్యక్తి దుర్మరణం
రాయదుర్గం టౌన్: స్థానిక బీటీపీ రోడ్డు హౌసింగ్ లే అవుట్ సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో హోటల్ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన రాజు (35), హోట్ల్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గర్భణి అయిన భార్యకు రాయదుర్గంలో వైద్య పరీక్షలు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో పాటు నాలుగేళ్ల వయసున్న కుమారుడు చరణ్ను పిలుచుకుని ద్విచక్ర వాహనంపై సోమవారం ఉదయం రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి బయలుదేరాడు. హౌసింగ్ లే అవుట్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో తలకు బలమైన గాయమై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన భార్య, కుమారుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి చేర్చారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓటు వేసేందుకు వెళుతూ మృత్యు ఒడికి
గౌరిబిదనూరు: ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు... హిందూపురం తాలూకా సంతేబిదనూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేశు (35) బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన అర్ధరాత్రి గౌరిబిదనూరు తాలూకాలోని కామలాపురం సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఘటనలో వెంకటేశు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై మంచేనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పోలింగ్కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు
అనంతపురం అర్బన్: జిల్లాలో పోలింగ్ విజయవంతంగా ముగిసిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ అన్నారు. ఇందుకు సహకరించిన ఎన్నికల కమిషన్ పరిశీలకులు, అధికారులు, సిబ్బందికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. పోలింగ్ నిర్వహణలో భాగస్వాములైన రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఏఆర్ఓలు, ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలు, ఓపీఓలు, కేంద్ర బలగాలు, నిఘా స్క్వాడ్లు, రూట్ అధికారులు, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికులు, ఎన్సీసీ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. -
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు
అనంతపురం అర్బన్: పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. జేఎన్టీయూ కళాశాలలో అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచేందుకు నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈవీఎంలను పీఓ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు నియోజకవర్గానికి ఒక రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల పీఓలు నియోజకవర్గ రిసెప్షన్ కౌంటర్లో నిర్దేశించిన ఫారాలను భర్తీ చేసి ఈవీఎంలను అప్పగించారు. పోలింగ్ సిబ్బందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. అక్కడ విధులు నిర్వర్తించే అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలిచ్చారు. -
పెద్దారెడ్డి లక్ష్యంగానే దాడి!
● ముందస్తుగానే రాళ్లు సిద్ధంగా ఉంచుకున్న ‘పచ్చ’ మూక ● ఎమ్మెల్యే వెళ్లిన చోటల్లా రెచ్చిపోయిన వైనం తాడిపత్రి: తమ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేసి, ప్రజామద్దతుతో రోజురోజుకు బలపడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగానే జేసీ మూక దాడులకు పథకం రచించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే పచ్చ దండు రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాలు.. తాడిపత్రి పట్టణంలోని ఓంశాంతి నగర్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, పచ్చ బ్యాచ్తో కలిసి ఓంశాంతి నగర్ ముఖద్వారం వద్ద కాపు కాశారు. అయితే, వారిని గమనించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన వాహనాలను ముఖద్వారం వద్దనే ఆపి, నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వద్దకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పచ్చ బ్యాచ్లోని ఒకడు అస్మిత్ రెడ్డి కారులోని ఫుట్ మ్యాట్ తీసి ఎమ్మెల్యేపైకి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన వైఎస్సార్ సీపీ నాయకులు ఎమ్మెల్యేకు అడ్డుగా నిలవడంతో మ్యాట్ వారికి తగిలింది. అంతటితో చల్లారని పచ్చ గూండాలు ముందుగా రచించిన పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న రాళ్లను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైకి విసిరారు. తండ్రిపై దాడి జరుగుతోందన్న విషయం తెలుసుకున్న హర్షవర్ధన్రెడ్డి అక్కడికి రాగా, అతనిపై కూడా రాళ్లు రువ్వారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, హర్షవర్దన్ రెడ్డి వాహన అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమిత్ బర్దర్ సంఘటనా స్థలానికి చేరుకోగా, ఎస్పీ సాక్షిగానే మరింత రెచ్చిపోయారు. ఎస్పీ కూడా త్రుటిలో పచ్చ రౌడీల రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయనకు రక్షణగా నిలిచిన ఓ ఏఆర్ కానిస్టేబుల్కు రాళ్లు తగిలి గాయపడ్డాడు. కాగా, అంతకుముందు టైలర్స్ కాలనీలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్లతో పచ్చపార్టీ నాయకులు దాడులు చేశారు. మెయిన్ బజార్ వీధిలోనూ ఎమ్మెల్యే వాహనంపై రాళ్లదాడికి దిగారు. జరిగిన సంఘటనలను గమనిస్తే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా జేసీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి పచ్చ మూకతో కలసి ప్రణాళిక రచించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయా ఘటనలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంత దారుణంగా ఎమ్మెల్యేపైనే రాళ్ల దాడులకు దిగిన టీడీపీ నాయకుల వైఖరిపై పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. -
ఓటమి భయంతోనే నాపై రాళ్ల దాడి ● జేసీ ప్రభాకర్ రెడ్డికి సహకరించిన ఏఎస్పీ రామకృష్ణ
● ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడాన్ని ఓర్వలేకనే దుశ్చర్యలు ● ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజం తాడిపత్రి రూరల్: ఓటమి భయంతోనే జేసీ ప్రభాకర్రెడ్డి తనపై రాళ్ల దాడులు చేయించాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలింగ్ స్టేషన్ సమీపంలోని ఇళ్లపై నుంచి టీడీపీ గూండాలతో దాడులు చేయించారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తాడిపత్రి పట్టణంలో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమం, తాడిపత్రిలో జేసీల అరాచకాలను అరికట్టి ప్రశాంతతను నెలకొల్పినందుకు ఓటు ద్వారా ధన్యవాదాలు తెలిపేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారన్నారు. మహిళలు, వృద్ధులు, మైనార్టీలు ఎక్కువ శాతం ఓటు వేయడానికి రావడంతో ఓటమి తప్పదని జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రహించాడన్నారు. ఇన్నాళ్లు తాడిపత్రి ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్న జేసీ.. నేడు వారు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేస్తుండడం సహించలేకపోతున్నాడన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందేందుకు దాడులకు తెగబడ్డారన్నారు. వీరికి పోలీసు అధికారులు కూడా సహకరించారని ఆరోపించారు. ఏఎస్పీ రామకృష్ణ జేసీకి వత్తాసు పలికారని, దాడులు జరగడానికి ప్రధాన కారణంగా నిలిచారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో స్పెషల్ పార్టీ పోలీసు జమాల్బాషతో పాటు పలువురికి గాయాలయ్యాయన్నారు. దుశ్చర్యలకు పాల్పడింది కాక, ఎమ్మెల్యే వర్గీయులే దాడులు చేశారని చిత్రీకరిస్తున్నాడని విమర్శించారు. ‘జేసీ అరాచకాల గురించి నియోజకవర్గవాసులకే కాదు జిల్లాప్రజలందరికీ తెలుసు. దాడులకు తెగబడితే నా ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుందని భ్రమపడ్డాడు. నేను భయపడి ఇంట్లో పడుకుంటే పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడవచ్చనే దుష్ట పన్నాగం పన్నాడు. కానీ నేను భయపడతానో లేదో ప్రజలందరి కంటే జేసీ ప్రభాకర్కే బాగా తెలుసు. నేను ఏం చేస్తానో అని కలలో కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. జేసీ సోదరుల దాష్టీకాలతో అవస్థలు పడ్డారు కాబట్టే గతంలో ఎన్నడూ లేని విధంగా నాకు మద్దతు తెలిపేందుకు ఓటర్లు తరలివచ్చారు. నాకు దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. జూన్ 4న ఆ విషయం వెల్లడవుతుంది. ఎన్నికల ఫలితాల తరువాత అన్ని విషయాలు మాట్లాడుతా’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
నేడు వేతనంతో కూడిన సెలవు
అనంతపురం సిటీ: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అనంతపురం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇతర అన్ని రకాల కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఆయా సంస్థల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు, ఉద్యోగులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ తమ ప్రాంతాలకు వెళ్లి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. -
సీసీ టీవీల పర్యవేక్షణలో ఎన్నికలు
గుత్తి రూరల్: పోలింగ్ ప్రక్రియ మొత్తం సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం, సమస్యాత్మక గ్రామమైన తొండపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తి పనిచేయని పక్షంలో వాటి స్థానంలో 20 నిమిషాల్లో మరో ఈవీఎం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్లకు ఈవీఎంలను తరలించామన్నారు. డీటీ లలిత పాల్గొన్నారు. వజ్రకరూరులో పర్యటించిన ఏస్పీ వజ్రకరూరు: వజ్రకరూరులో ఆదివారం సాయంత్రం ఎస్పీ అమిత్ బర్దర్ పర్యటించారు. స్థానిక కేవీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఐ నరేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
స్టాఫ్నర్సుల సేవలు భేష్
అనంతపురం కార్పొరేషన్: కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో స్టాఫ్నర్సులు అందించిన సేవలు అనన్యమని జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, నర్సింగ్ సూపరింటెండెంట్ రజిని కొనియాడారు. ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆదివారం జీజీహెచ్లో నర్సింగ్ సూపరింటెండెంట్ రజిని ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లెక్చరర్స్ గ్యాలరీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి డిప్యూటీ సూపరింటెండెంట్, డిప్యూటీ ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కోవిడ్ సమయంలో రోగులకు వైద్యులు చికిత్సనందించిన అనంతరం వారిని కంటికి రెప్పలా కాపాడింది స్టాఫ్నర్సులేనన్నారు. కోవిడ్తో కుటుంబీకులు ఇబ్బందులు పడుతారని తెలిసినా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్టాఫ్నర్సులు సేవలందించారన్నారు. దీంతో అనంతపురం స్టాఫ్నర్సులకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరింత సేవలందించాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్, ఇందిరాగాంధీ, కిరణ్బేడీ, సరోజిని నాయుడు తదితరుల వేషధారణలో పలువురు నర్సులు ఆకట్టుకున్నారు. అనంతరం ఓ నర్సు యోగతో కలిగే ప్రయోజనాలను పాట పాడుతూ ఆసనాలు వేసి చూపించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఆర్ఎంఓ సునీత, హెడ్నర్సులు సైరాభాను, రాజన్లత, ఆదిలక్ష్మి, భానురేఖ, ఆశాలత, భానులత, ఐసీఎన్లు శోభ, ప్రసన్న, స్టాఫ్నర్సు అసోసియేషన్ ఆర్బీ పద్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆత్మారాం, నర్సింగ్ సూపరింటెండెంట్ రజిని -
జిల్లా అంతటా ఆదివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీచాయి.
గుమిగూడొద్దు.. ప్రలోభ పెట్టొద్దు అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్న రోజున ప్రవర్తన నియమావళిని ఎన్నికల కమిషన్ స్పష్టంగా తెలియజేసింది. రాజకీయ పక్షాలు, అభ్యర్థులు పోలింగ్ రోజున, పోలింగ్ బూత్ వద్ద పాటించాల్సిన నియమాలను భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. ● ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తి స్వేచ్ఛతో వినియోగించుకోవటానికి, ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు అభ్యర్థులు సహకరించాలి. ● తమ పార్టీ కార్యకర్తలకు తగిన బ్యాడ్జీలు లేదా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ● ఓటర్లకు ఇచ్చే గుర్తింపు స్లిప్పై అభ్యర్థి పేరు లేదా పార్టీ పేరు ఉండకుండా చూసుకోవాలి. ● అభ్యర్థి, పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరుల మధ్య కొట్లాటలు, ఆవేశాలకు గురిచేసేలా పోలింగ్ బూత్ల ముందు, తాము నిర్వహించే శిబిరాల వద్ద అనవసరంగా జనం గుమిగూడకుండా చూసుకోవాలి. ● అభ్యర్థి తన శిబిరం చాలా నిరాడంబరంగా ఉండేలా చూసుకోవాలి. శిబిరంలో ఎలాంటి పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, ప్రచార వస్తువులను ప్రదర్శించకూడదు. ఆహార పదార్థాలను శిబిరం వద్ద అందించకూడదు. గుంపులను అనుమతించకూడదు. ● పోలింగ్ రోజున తాము ప్రయాణించే వాహనాలపై కమిషన్ విధించిన నిబంధనలకు కట్టు బడి ఉండేలా పత్రాలు ఉండాలి. వాటి కోసం అనుమతులు పొందాలి. ఆ అనుమతులు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు తప్ప మరెవరూ ఎన్నికల సంఘం నుంచి తగిన పాసు లేకుండా పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశించరాదు. ● పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభ పెట్టకూడదు. ఓటర్లకు డబ్బు ఇవ్వడం, బెదిరించడం వంటివి చేయడం నియమావళిని ఉల్లంఘించడమే. ● రాజకీయ పక్షాలు ఎంపిక చేసి అనుమతి పొందిన పోలింగ్ ఏజెంట్లను మాత్రమే పోలింగ్ బూత్లోకి అనుమతిస్తారు. ఒకరి గుర్తింపు కార్డును మరొకరికి ఇచ్చి బూత్లోకి పంపకూడదు. ● ఎన్నికల నిర్వహణపై ఫిర్యాదు లేదా సమస్య ఉన్నా వాటిని ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల దృష్టికి అభ్యర్థులు, పార్టీ పోలింగ్ ఏజెంట్లు తీసుకురావాల్సి ఉంటుంది. -
పరిశ్రమలకు ఊతం
●మేమంతా సిద్ధం... మీదే ఆలస్యం ఎన్నికల పోలింగ్కు అధికారులంతా సిద్ధమయ్యారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ సామగ్రిని అందుకునేందుకు వచ్చిన ఎన్నికల అధికారులతో అనంతపురం జూనియర్ కళాశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం సందడిగా మారింది. సామగ్రిని సరిచూసుకోవడంలో కాస్త గందరగోళం నెలకొన్నా... చివరకు సజావుగా ఈ ప్రక్రియ ముగిసింది. ప్రశాంత ఎన్నికలకు మేమంతా సిద్ధం... ఇక ఓటు వేసే మీదే ఆలస్యమంటూ పీఓలు, ఏపీఓలు తమకు కేటాయించిన బస్సుల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు ప్రయాణమయ్యారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
సజావుగా ఎన్నికల సామగ్రి పంపిణీ
అనంతపురంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి సరి చూసుకుంటున్న పోలింగ్ సిబ్బంది● నేడే పోలింగ్ ● కేంద్రాలకు చేరిన ఈవీఎంలు ● ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రక్రియ ● అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ● ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పటిష్ట బందోబస్తు అనంతపురం అర్బన్: ఎన్నికల సమరంలో ముఖ్య ఘట్టమైన పోలింగ్ సోమవారం జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ సాగనుంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 21 మంది అభ్యర్థులు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలకు 113 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఆదివారం సాయంత్రానికే ఈవీఎంలు చేరాయి. పటిష్ట బందోబస్తు.. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తుకు 11 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. 16 వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 4 వేల మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ విధుల్లో ఉండే 22,274 మంది ఉద్యోగులు, పోలీసు సిబ్బంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెల్ఫోన్కు నో.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుని వెళ్లిపోవాలి. గుంపులుగా కేంద్రాల వద్ద ఉండకూడదు. కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించరు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్.. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 1,032 పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ చర్యలు చేపట్టారు. వీటిలో వెబ్కాస్టింగ్ మరింత పక్కాగా నిర్వహిస్తారు. ఆయా కేంద్రాల వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలు బందోబస్తు నిర్వహిస్తాయి. అంతే కాకుండా ఈ కేంద్రాల పర్యవేక్షణ కోసం 544 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రిసైడింగ్ అధికారులు ఉదయం 5.30 గంటలకు రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. వేసిన గుర్తుకే ఓటు పడుతోందా..? వీవీప్యాట్లో అదే గుర్తు చూపిస్తోందా..? అనేది రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే సంతృప్తి వ్యక్తం చేస్తూ వారు సంతకాలు చేస్తారు. అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారంభిస్తారు.ఎన్నికల సామగ్రి తీసుకెళ్తున్న ఉద్యోగినిపోలింగ్కు సంబంధించి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి పంపిణీ ఆదివారం సజావుగా నిర్వహించారు. అనంతపురం అర్బన్, శింగనమల, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను అనంతపురం నగరంలో ఏర్పాటు చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు. కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్ని కల అధికారి వి.వినోద్కుమార్, ఎన్నికల సాధారణ పరిశీలకులు మనీష్ సింగ్ సందర్శించారు. ఏర్పాట్లు, సామగ్రి పంపిణీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ సిబ్బందిని ఆరా తీశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, ఇతర ఏర్పాట్లను అనంతపురం, రాప్తాడు, శింగనమల రిటర్నింగ్ అధికారులు జి.వెంకటేష్, వసంతబాబు, వెన్నెల శ్రీను పర్యవేక్షించారు. -
ఓటేద్దాం రండి
● ప్రజలకు కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు అనంతపురం అర్బన్: ‘ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెద్ద పండుగ. ఈ వేడుకలో మనమందరం పాల్గొని ఓటు వేద్దాం. తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుని మన బాధ్యతను నిర్వర్తిద్దాం’ అంటూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరూ కదలివచ్చి ఓటు వేయాలన్నారు. ఎండలు అధికంగా ఉన్నందున వీలైనంత త్వరగా ఓటేసేలా చూసుకోవాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్రంలోకి సెల్ఫోన్లు అనుమతించరని, ఎవరూ వెంట తెచ్చుకోవద్దని సూచించారు. పోలింగ్ కేంద్రం లోపల, బయట వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వెబ్కాస్టింగ్లో నమోదవుతుందని చెప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
200 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ
అనంతపురం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల పరిధిలో ఏ పార్టీ అభ్యర్థినీ అనుమతించమన్నారు. ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో 2,3 పోలింగ్ బూత్లు ఉన్నప్పటికీ మొత్తం 200 మీటర్ల పరిధిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన చేసిన పరిశీలకులు, ఇతర అధికారులు, పోలీసులకు మాత్రమే సెల్ఫోన్లు ఉపయోగించడానికి 100 మీటర్ల పరిధి వరకు అనుమతి ఉంటుందన్నారు. ● ఒక్కో అభ్యర్థికి ఒక వాహనం, ఎన్నికల ఏజెంటు గానీ వర్కర్లు గానీ డ్రైవర్ సహా ఐదుగురి మాత్రమే ఆ వాహనంలో ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఓటర్లను తరలించడం చట్టరీత్యా నేరం. ● జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను వాహనం ముందు భాగంలో అతికించుకోవాలి. ● ఓటర్లను తరలించేందుకు ఉచిత ప్రయాణ వసతులు కల్పించడం నేరం. ● అనుమతించిన సెక్యూరిటీ అధికారులకు మాత్రమే 100 మీటర్ల పరిధిలోకి వచ్చేందుకు అనుమతి. ● పోలింగ్ లొకేషన్ పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్లు అమలు. ● సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషిద్ధం. గుంపులుగా, ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడితే చట్టపరంగా చర్యలు. ● ఓటరు కాని వారు పోలింగ్ రోజున ఆ గ్రామాల్లో ఉండకూడదు. ● పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్లలోపు ఎలాంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలు, టెంట్లు నిర్వహించరాదు. ● ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు. ● నీళ్ల బాటిళ్లు, ఇంకు సీసాలు, బాల్పెన్నులు, మొబైల్ ఫోన్లు, తదితర విలువైన వస్తువులేవీ పోలింగ్ కేంద్రాలోకి అనుమతి లేదు. ● ప్రజలు ఆయుధాలు, తుపాకులు, పదునైన వెపన్లు, లాఠీలు, కర్రలు , రాళ్లు వంటివి వెంట తీసుకెళ్లడం, ప్రదర్శించడం నిషిద్ధం. ● అభ్యర్థి గన్మెన్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లరాదు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే ఆగిపోవాలి. ● ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement