వైఎస్సార్‌ సీపీలోకి వలసల వెల్లువ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి వలసల వెల్లువ

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

కమలాపురం : కమలాపురం మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి 240 కుటుంబాలు చేరాయి. సోమవారం మండల పరిధిలోని టి.చదిపిరాళ్లలో నియోజకవర్గ నాయకుడు సాయినాథ శర్మ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, వెంకటేష్‌, టీడీపీ తరపున గెలిచిన ఒకే ఒక వార్డు మెంబర్‌ ఆంజనేయులు, భాస్కర్‌ తదితర 100 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. అలాగే సింగిల్‌ విండో అధ్యక్షుడు చల్లా మునీంద్రారెడ్డి, ఎంపీటీసీ జయ సుబ్బారెడి, సర్పంచ్‌ చిన్ని ఆధ్వర్యంలో సుబ్బరాయుడు, విజయ, స్టీవన్‌, మనోహర్‌, జాన్‌, ప్రసాద్‌, జార్జి తదితర 100 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. అలాగే కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని వికలాంగుల కాలనీలో వైఎస్సార్‌ సీపీ నాయకురాలు డి.సరోజమ్మ ఆధ్వర్యంలో ఉత్తమయ్య తదితరులు 40 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారందరికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి పార్టీ కండువాలు కప్పి 240 కుటుంబాలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సంక్షేమం కోసం జగనన్న ఇప్పటికి 130 సార్లు బటన్‌ నొక్కారని, మీరు కేవలం రెండు సార్లు ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కితే చాలన్నారు. సాయినాథ శర్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి శాంతి కోరుకునే వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్‌, నిఖిల్‌రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్‌, బాబు, సాదిక్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

మైదుకూరు : మండలంలోని పప్పనపల్లెకు చెందిన 40 కుటుంబాల వారు సోమవారం టీడీపీని వీడి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పప్పనపల్లెకు చెందిన పాలూరు ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఇల్లూరు యోహాన్‌, ఇల్లూరు పెద్ద వెంకటేష్‌, ఇల్లూరు వెంకటేష్‌, పసల యోహాన్‌, పసల పుల్లన్న, శ్రీపతి ఓబన్న, శ్రీపతి సుబ్బరాయుడు, పసల వరప్రసాద్‌, చిత్తరాల జార్జి, కామనూరు చిన్న వీరయ్య, పసల కమలాకర్‌, పిల్లి బాలయ్య, ప్రసన్న కుమార్‌, వెంకటయ్య, ప్రేమ్‌ కుమార్‌, రామయ్య, నవీన్‌, చంద్ర తదితర 40 కుటుంబాల వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పార్టీ కండువాలను వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ ప్రభుత్వ సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌ రెడ్డి పాల్గొన్నారు.

40 కుటుంబాలు చేరిక

జమ్మలమడుగు రూరల్‌ (మైలవరం) : మైలవరం మండలంలోని పలు గ్రామాల్లో 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. సోమవారం మైలవరం మండల కేంద్రంలో నక్కా శ్రీనివాసులు, తలారి గురప్ప, భార్గవ్‌, భీముడు నాయక్‌లతో కలపి 20 కుటుంబాలు చేరాయి. అలాగే చిన్న కొమెర్ల గ్రామంలో కె. భరత్‌రెడ్డి, కె, వెంకటసుబ్బారెడ్డి, కె. గోపాల్‌రెడ్డి, కె.బి. వెంకటసుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డి, జయరామిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, చిన్న కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డిలతో కలిపి 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరిని ఎమ్మెల్యే డాక్టర్‌ మూలే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ సంబటూర్‌ ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్‌ మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ నారపురెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, నాయకులు దొడియం విష్ణువర్దన్‌రెడ్డి, వినయ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో  
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
1/2

వైఎస్సార్‌సీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, 
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
2/2

పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

Advertisement
Advertisement