Sakshi News home page

కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు

Published Wed, Nov 22 2023 1:32 AM

విలేకరులతో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి, పక్కన మోత్కుపల్లి, గోద శ్రీరాములు
 - Sakshi

సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్‌ఎస్‌ను గద్దె దించడం ఖాయమైందని భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భు వనగిరిలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఓటమి భయంతోనే కేటీఆర్‌ ఓపిక లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.వలిగొండ రోడ్‌ షోలో ఎన్‌ఎస్‌ యూఐ, యువజన కాంగ్రెస్‌ నాయకులు సమస్యలపై నిరసన వ్యక్తం చేయగా మంత్రి దూషించడం తగదన్నారు. వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పైళ్ల శేఖర్‌రెడ్డి తన నామినేషన్‌ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 75 సీట్లు గెలిచి రేవంత్‌రెడ్డి సీఎం కాబోతున్నారని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలోనూ భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి : మోత్కుపల్లి

రేవంత్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పదేళ్లలో ప్రజ లు అనేక బాధలు పడ్డారని, నిశ్చబ్ద విప్లవంలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందన్నారు. సెటిలర్లు కూడా కేసీఆర్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్‌ ఒక్కో నియోజకవర్గానికి రూ.100 కోట్ల చొప్పున పంపాడని ఆరోపించారు. అనిల్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేసి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, తంగెళ్లపల్లి రవికుమార్‌, జనగాం ఉపేందర్‌రెడ్డి, తుమ్మల యుగేందర్‌రెడ్డి, ఏశాల అశోక్‌, బీసుకుంట్ల సత్యనారాయణ, మజహార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ 75 సీట్లు గెలిచి రేవంత్‌ సీఎం అవుతారు

ఫ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Advertisement

What’s your opinion

Advertisement