మాట్లాడుతున్న చామల కిరణ్కుమార్రెడ్డి
భువనగిరిటౌన్ : రాష్ట్రలో ప్రజారంజక పాలన నడుస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలోని దీప్తి హోటల్ జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. పద్మశాలీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరపతి అనిల్, పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.
21న సీఎం సభకు తరలిరావాలి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి ఈనెల 21న భువనగిరికి రానున్నారని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి తెలిపారు. ర్యాలీ, కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడుతారని, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment