పట్టుబడిన సొత్తు రూ.2 కోట్ల పైనే.. | Sakshi
Sakshi News home page

పట్టుబడిన సొత్తు రూ.2 కోట్ల పైనే..

Published Sat, Nov 18 2023 1:30 AM

ఆలేరు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్‌రెడ్డి
 - Sakshi

యాదగిరిగుట్ట : ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా అధికారులు తనిఖీలు ము మ్మరం చేశారు. హైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారిపై ఆలేరుతో పాటు బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, ఆత్మకూరు(ఎం), గుండాల, యాదగిరిగుట్ట, మోటకొండూర్‌ మండలాల శివారులో చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు తరలించే అవకాశం ఉన్న దృష్ట్యా చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, అధికారులు నిరంతర నిఘా పెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ ఏర్పడి తేదీ నుంచి శుక్రవారం వరకు ఆలేరు చెక్‌పోస్టు వద్ద రూ.2.89 కోట్ల నగదు, 325.8 గ్రాముల బంగారం పట్టుబడగా పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. వీటితో పాటు రూ.25,61,867 విలువ చేసే 1571.259 లీటర్ల మద్యం, 1.2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శివరాంరెడ్డి వెల్లడించారు. జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి వాహనాన్ని ఆలేరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఫ ఆలేరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు ముమ్మరం

ఫ రూ.25.61 లక్షల విలువ చేసే మద్యం, 325.8 గ్రాముల బంగారం స్వాధీనం

Advertisement

తప్పక చదవండి

Advertisement