జిప్సం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి | Sakshi
Sakshi News home page

జిప్సం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి

Published Sat, May 25 2024 5:10 PM

-

తాండూరు రూరల్‌: మండల పరిధిలోని గుంతబాసుపల్లి శివారులోని ఇండోస్‌ కెమికల్‌ జిప్సం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ స్తులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతు న్న దుర్వాసనతో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటితో పాటుగా వ్యవసాయ బోర్ల నుంచి సైతం కలుషితమైన నీరు వస్తోందని ఆందోళన వెల్లిబుచ్చారు. గతంలోనూ ఫిర్యాదు చేసినా అనుమతులిచ్చారని.. మరోసారి ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వకుండా రద్దు చేయాలని కోరారు. ఉదయం పీసీబీ డెరెక్టర్‌ గుంతబాసుపల్లి, మిట్టబాసుపల్లి గ్రామాల్లోని ఫ్యాక్టరీలను సందర్శించారు. ఆయన్ను గ్రామస్తు లు ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో జగదీశ్‌, గోవింద్‌, నగేశ్‌, దస్తయ్యగౌడ్‌ తదితరులున్నారు.

పీసీబీ కమిషనర్‌కు గుంతబాసుపల్లి వాసుల వినతి

Advertisement
 
Advertisement
 
Advertisement