గతంలో పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఉంటే మధ్యాహ్నం.. లేకపోతే సాయంత్రం పంచాయతీ కార్యదర్శిలు వచ్చి పింఛన్ సొమ్ము ఇచ్చేవాళ్లు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అలాంటి స్థితి మారింది. ఇల్లు కదలకుండా ఈ ఐదేళ్లు పింఛన్ సొమ్ము తీసుకున్నాం. వలంటీర్లు వేకువ జామునే వచ్చి పింఛన్ నగదు ఇచ్చివెళ్లేవారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడే సరికి చంద్రబాబు కుట్రపన్ని మమ్మల్ని ఈ విధంగా కష్టాలు పాలుచేశారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు.