కొత్తూరు తహసీల్దార్‌పై కలెక్టర్‌ అసహనం | Sakshi
Sakshi News home page

కొత్తూరు తహసీల్దార్‌పై కలెక్టర్‌ అసహనం

Published Tue, Mar 26 2024 1:25 AM

కొత్తూరు తహసీల్దార్‌ ఎంవీపీ ప్రసాద్‌పై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్‌  - Sakshi

కొత్తూరు: స్థానిక తహసీల్దార్‌ ఎంవీవీ ప్రసాద్‌పై కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అసహనం వ్యక్తం చేశారు. మండలంలోని పోలింగ్‌ బూత్‌ల వివరాల అడగడంతో తహసీల్దార్‌ చెప్పడానికి తడబడ్డారు. దీంతో కలెక్టర్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పనితీరు మెరుగుపడకపోతే మరోచోటకు బదిలీ చేస్తానని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట ఉన్న స్థానిక ఎస్‌ఐ ఎంఏ అహ్మద్‌ ఎన్నికల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మండలంలోని ఎత్తైన తివ్వ కొండ శిఖరం మీద ఉన్న అడ్డంగి గిరిజన గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ను పరిశీలించారు. పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల జీవన విధానం గురించి ఆరా తీశారు. అనంతరం కొత్తూరు మండలం కర్లెమ్మ చెక్‌పోస్టును పరిశీలించారు.

కొత్తూరు మండలం అడ్డంగి పోలింగ్‌ బూత్‌ను పరిశీలించిన కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌
1/1

కొత్తూరు మండలం అడ్డంగి పోలింగ్‌ బూత్‌ను పరిశీలించిన కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

Advertisement
Advertisement