పెళ్లి వాహనం బోల్తా | Sakshi
Sakshi News home page

పెళ్లి వాహనం బోల్తా

Published Fri, Mar 29 2024 12:25 AM

బోల్తాపడిన వాహనం  - Sakshi

లింగంపేట(ఎల్లారెడ్డి): పెళ్లి వేడుకలకు వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన లింగంపేట మండలం లింగంపల్లి (ఖుర్దూ) గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపల్లికి చెందిన కొత్త కిషన్‌ కుమారుడి వివాహం గ్రామ శివారులోని జీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగింది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు బంధువులు టాటా ఏస్‌ వాహనంలో బయల్దేరారు. ఈ క్రమంలో వాహనం గ్రామశివారులో అదుపుతప్పి బోల్తాపడింది. వాహన సామర్థ్యానికన్నా ఎక్కువ మందిని ఎక్కించుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కొత్త కిషన్‌, ఆదిత్య, రాములు, వర్ష, సత్యవతి, లక్ష్మి, రెడ్డిపేట గ్రామానికి చెందిన లక్ష్మి, గాంధారికి చెందిన అంజయ్య, ఊరంచ రాములు, అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన రాజేశ్వరికి తీవ్రగాయాలు కాగా, మరి కొంత మందికి స్వల్ప గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పలువురికి తీవ్రగాయాలు

లింగంపేట మండలం లింగంపల్లి శివారులో ఘటన

ఘటనాస్థలంలో క్షతగాత్రులు
1/1

ఘటనాస్థలంలో క్షతగాత్రులు

Advertisement

తప్పక చదవండి

Advertisement