Sakshi News home page

పవిత్ర అక్షింతల శోభాయాత్ర

Published Sat, Nov 11 2023 2:04 AM

పవిత్ర అక్షింతలకు స్వాగతం పలుకులుతున్న మహిళా శక్తి కార్యకర్తలు   - Sakshi

కర్నూలు కల్చరల్‌: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి కాబోతున్న సందర్భంగా భగవాన్‌ శ్రీరామ్‌ లల్లా విరాజ్‌ మాన్‌ వేద మంత్రాలతో పూజించిన పవిత్ర అక్షింతల శోభా యాత్రను కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓల్డ్‌సిటీ మెయిన్‌ బజార్‌లోని ఏకాంతరామాలయంలో పండితులు మామిళ్ల పల్లి రాజేశ్‌ శర్మ అక్షింతలకు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి అక్షంతలతో రెవెన్యూ కాలనీలోని భరత మాత ఆలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహ కార్యరద్శి ప్రాణేష్‌, ప్రాంత సహ కోశాధికారి గూడా సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, కోశాధికారి సందడి మహేష్‌, కార్యదర్శి భాను ప్రకాష్‌, సహ కార్యదర్శి గోవింద రాజులు, జిల్లా మాతృ శక్తి సంయోజిక సంపాల రాధిక, భజరంగ్‌ దల్‌ సంయోజక్‌ రాజేష్‌, వీహెచ్‌పీ నగర అధ్యక్షులు మద్దిలేటి, కార్యదర్శి నాగరాజు, మాతృ శక్తి నగర సంయోజిక పావని, దుర్గా వాహిని సంయోజిక సింధూర శ్రీవాణి పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement