మళ్లీ మళ్లీ ఇది రాని రోజు | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

Published Fri, Nov 24 2023 1:24 AM

కలుసుకున్న 1972–73 బ్యాచ్‌ భట్ట జ్ఞానకోటయ్య జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు  - Sakshi

పెడన: ఒకప్పటి విద్యార్థులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. విద్యార్థి దశలో జరిగిన సంఘటనలు, మధుర స్మృతులను నెమరువేసుకుంటూ గురువారం ఆత్మీయ కార్తిక వనసమారాధన నిర్వహించారు. 1972–73లో భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోను, వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, మనవళ్లతో కాలం గడుపుతున్న వారూ ఉన్నారు. ఇప్పుడు వారంతా కలిసి శ్రీగంగాపార్వతీ సమేత అగస్తేశ్వరస్వామి దేవస్థానంలో కార్తికవనసమానాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పూర్వ విద్యార్థులు వనసమారాధనకు హాజరై ఆత్మీయంగా కలుసుకుని ఒకరినొకరు యోగాక్షేమాలను అడిగి తెలుసుకుని సంతోషించారు. అనంతరం ఆనాడు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు పేరిశెట్టి తేజోవతి, బొమ్ము గోవర్థనరావు, జానకీబాయిలను ఘనంగా సత్కరించి సన్మానించి వారి ఆశీస్సులను పొందారు. కార్యక్రమంలో పేరిశెటి ఓంకారేశ్వరరావు, బళ్ల నాగేశ్వరరావు, శింగంశెట్టి ఆదినారాయణ, నందం చినబాబు, యోగానంద్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement