ఎయిర్‌ పోర్టు కారిడార్‌లో బ్యూటిఫికేషన్‌ పెంచండి | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ పోర్టు కారిడార్‌లో బ్యూటిఫికేషన్‌ పెంచండి

Published Wed, Nov 15 2023 12:52 AM

- - Sakshi

పటమట(విజయవాడతూర్పు): రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం వరకు జరుగుతున్న ఎయిర్‌ పోర్ట్‌ కారిడార్‌ పనులు మరింత ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అధికారులను రాష్ట్ర మునిసిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదేశించారు. నూతనంగా నిర్మించిన గ్రిల్స్‌ బ్యూటిఫికేషన్‌ను ఆమె మంగళవారం పరిశీలించారు. స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి శ్రీలక్ష్మి క్షేత్రస్థాయిలో కారిడార్‌ పనులను పరిశీలించారు. కారిడార్‌ వెంట ఉన్న ఎలక్ట్రికల్‌ పోల్స్‌పై ఆకర్షణీయ రంగు లతో పెయింటింగ్‌ వేయాలని సూచించారు. ఈ పర్యటనలో అడిషనల్‌ కమిషనర్‌ (ప్రాజెక్ట్స్‌) కె.వి.సత్యవతి, చీఫ్‌ ఇంజినీర్‌ ప్రభాకర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.రత్నావళి, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సురేష్‌, డెప్యూటీ సిటీ ప్లానర్‌ జుబిన్‌ సిరన్‌ రాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎ.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు

మునిసిపల్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి

Advertisement
Advertisement